• Atlas Shrugged
  • Attagari Kadhalu

    Attagari Kadhalu

    ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన కధలు

     

    సాహిత్య అకాడమీ వారు ఆమె రచించిన “అత్తగారి కధలు”కు బహుమతి ఇచ్చారు.1994లో ఆమె రచన “నాలో నేను” పుస్తకానికి జాతీయ బహుమతి లభిస్తుంది.

     

    తెలుగు కాల్పనిక సాహిత్యంలో ఆద్యంతం ఉత్తమమైన హాస్యాన్ని చిందించే అపూర్వమైన కధలు బహుముఖ ప్రజ్ఞాశాలిని శ్రీమతి భానుమతి రామకృష్ణ రచించిన “అత్తగారి కధలు”. అత్తగారి అలవాట్లు ఇతరులను అక్షేపించేందుకు వాడె పదజాలం రచయిత్రి నిశిత పరిశీలనలోంచి జాలువారి ప్రవాహవేగంతో సాగే సరళ సుందరమైన ఆమె శైలిలో అత్తగారు ఎల్లప్పుడు సజీవమూర్తిగా దర్శనమిస్తుంది. అత్తగారి పాత్ర నిస్సందేహంగా తెలుగు సాహిత్యంలో ఆవిర్భవించిన ఉత్తమ ఏకైక తెలుగు హాస్య స్త్రీ పాత్ర.

     

    మన తెలుగు కుటుంబాలలో దాదాపుగా అంతరించి పోతున్న ఒక గొప్ప ఇనిస్టిట్యూషన్ కు అత్తగారి పాత్ర సాహిత్యంలో ఏకైక ప్రతినిధి. భానుమతి గారు వాక్యవిన్యాసం ఎంతో మనోహరము గా ఉంటుందో ప్రతి వాక్యం ఎంత హాస్య స్పోరకంగా ఉంటుందో “అత్తగారి కధలు” పుస్తకంలో యాధృచ్చికంగా ఏ పేజి చదివినా సుభోధకం అవుతుంది.

     

    300.00
    Add to cart
  • Balavyakaranam

    Balavyakaranam

    చిన్నయసూరి గొప్పపండితుడు. వ్యాకరణశాస్ర్తజ్ఞాడు. నేటికీ ప్రాచీన తెలుగు సాహిత్యభాషకు వచ్చిన వ్యాకరణాలలో బాలవ్యాకరణానికి బాలవ్యాకరణమే సాటి. ఇందులో సందేహం లేదు. పది పరిచ్చేదాలతో, 465 సూత్రాలతో కూడుకొని ఉన్న ఈ రచనలోని సూత్రాలను, ఉదాహరణలను గూర్చి ఇంతకుముందున్న వ్యాఖ్యాన  కారులు ఎన్నోరకాలుగా కీర్తించారు. అవి నూటికి నూరుపాళ్ళు యదార్ధమైన పొగడ్తలే. అయినా ఇన్నిసూత్రాల్లో ఎక్కడా లోపంలేదా అనే కాంక్షతో పరిశీలిస్తూ చదివితే ఏవో కొన్ని  చిన్నపాటివి లాభిస్తాయి. వంట రుచిగా ఉన్నదా! లేదా! అవి చెప్పటానికి వంటచేయటం రావాల్సిన అవసరం లేదుగదా! తినగలిగే ఆసక్తి ఉంటేచాలు. కాబట్టి ఈ వ్యాఖ్యానంలో వ్యాకర్త గొప్పదనాన్ని చూపిస్తూనే, ఎక్కడైనా లోపంగా నాకు అనిపిస్తే దాచకుండా ఆ లోపాన్ని చూపించే ధైర్యం చేశాను. అంతమాత్రాన నేను గోప్పపండితున్ననే భావం కాదు. ఆసక్తితో చదివిన పాఠకున్నని భావం. ఇరువై ఐదు సంవత్సరాలుగా తరగతిగదిలో ఈ వ్యాకరణాన్ని భోదించటం వల్ల – విద్యార్ధుల  ఆలోచనలు, వారి ప్రశ్నలు, వానికి సమాధానాలు, విటన్నింటినీ కలగలిపిన సారాంశం ఈ వ్యాఖ్యానం ప్రధానంగా విద్యార్ధులను ఉద్దేశించి ఇది వ్రాయటం జరిగింది. అందుకే “కరదీపికావ్యాఖ్యాన” మని నామకరణం చేశాను. కాబట్టి విద్యార్ధిలోకానికి ఏ మాత్రం ఉపయోగపడినా, నా శ్రమ ఫలించిందని భావిస్తాను.

    డా” ఆలేటి మోహన్ రెడ్డి

    300.00
    Add to cart
  • Balavyakaranam Gantapadham

    Balavyakaranam Gantapadham

    ఎం.ఎ. తెలుగు, సాహితి విద్యార్థులకు ఉపయోగపడే వ్యాకరణ గ్రంథం. ఈ సంపుటం మార్పులు చేర్పులు జరిగి కొత్తగా ముద్రితమైనది.

    -పరవస్తు చిన్నయసూరి.

    350.00
    Add to cart
  • Balipeetam

    Balipeetam

    60.00
    Add to cart
  • Bangaru Kalalu
  • Barrister Parvateesam

    Barrister Parvateesam

    ఎన్ని సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపించే రచన ”బారిష్టర్ పార్వతీశం”. ఇది హాస్య రచన. ఎప్పుడూ దూరప్రయాణం చేసి ఎరుగని పార్వతీశం ఒక్కసారిగా 1913వ సంవత్సరంలో నరసింహ శాస్త్రి ఇంట్లో అమ్మ నాన్నలకు చెప్పకుండా స్నేహితుల ప్రేరణతో ఇంగ్లండ్ వెళ్ళాడు. నిడదవోలులో రైలు ఎక్కడం మొదలుకొని స్టీమర్ లో ఇంగ్లండ్ చేరేవరకు పార్వతీశం చేసిన ప్రయాణాన్ని ఉత్తమ పురుష కధనంలో రకరకాల అనుభవాల్ని రచయత మొక్కపాటి నరసింహ శాస్త్రి ఈ నవలలో చిత్రించాడు.

    ఎప్పుడూ పట్టణాలు,నగరాల మొహం ఎరుగని పార్వతీశం ప్రవర్తన, వేషధారణ హస్యస్పోరకంగా ఉంటాయి.ఇందులో చాల విషయాలు ఇప్పటివారికి చాలా మాములుగా అనిపించవచ్చు. కానీ ఆ కాలంలో అదొక వింత.

    828.00
    Add to cart
  • Bava Bava Panneru

    Bava Bava Panneru

     “హలో…” అన్నారు ఫోన్ యెత్తి. నవల మంచి రసపట్టులో ఉంది. “హలో అర్చన! నేను శ్రీధర్ని. నువ్వు వెంటనే ట్యాంకుబండ్ కు వచ్చేయి. నీతో అర్జoటు గా మాట్లాడాలి” అన్నాడు బావ.

               నాకు నవ్వు వచ్చింది.

               “మరో పెళ్లి చూపుల తంతా బావా? ” అన్నాను నవ్వుతు.

                 “అలాగే అనుకో. వెంటనే వచ్చేయి. శైలుకు చెప్పవలసిన అవసరం లేదు” అన్నాడు.

            “జి హుజూర్!” అని ఫోన్ పెట్టేశాను. అలాగే ఆలోచిస్తూ నిలబడిపోయాను. అయితే నిన్నటి సంబంధం బావకు నచ్చలేదు? వరుడు ఆరడుగుల యెత్తు, అందగాడు కాకపోయినా, ఫర్వాలేదు. తెలుపు, నలుపుగాని రంగుతో ఆకర్షణీయంగానే ఉన్నాడు. అతను బ్యాంక్  లో పనిచేస్తున్నడట. తండ్రికి మెడికల్ షాపుంది. ఇద్దరే కొడుకులట. అదికాక శారదత్త కొడుకు అన్ని విధాల తగినవాడు, అనిల్ కుమార్. తరువాత ఏం  జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

                                                                                                               -“మాదిరెడ్డి సులోచన.”

    70.00
    Add to cart
  • Bhaarya Kopavati

    Bhaarya Kopavati

    కాఫీ గ్లాసుల్లో పోస్తున్న ఉమకు కాలింగ్ బెల్ అదే పనిగా వినిపించడంతో, అవి అక్కడ వదిలి తలుపు తీయక తప్పలేదు.

    “యెవరు?” విసుగ్గా అడిగింది.

    “నేను కస్తూరి గారింటినుండి వచ్చాను. వారి తమ్ముడు బాబ్జిని ఒక్కసారి పిలుస్తారా?” అన్నాడు ఆదుర్దాగా.

    ఆడబడుచు పేరు వింటూనే ముడుచుకుపోయింది ఉమ.

    “యెందుకు?” ముఖం చిట్లించింది.

    “అరగంట క్రితం కస్తూరిగారి భర్త పోయారండి…”

    అతని మాట పూర్తికాకముందే బాబ్జి వచ్చాడు. విషయం విని నోట మాటరానట్టు క్షణం నిలబడిపోయాడు.

    “ఇక్కడ ఆటోలు దొరకవని ఆటోరిక్షా తెచ్చానండి.” ఆ వచ్చిన కుర్రాడు చెప్పాడు. బాబ్జి యాంత్రికంగా వెళ్ళి ఆటోలో కూర్చున్నాడు. తరువుత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

    60.00
    Add to cart
  • Bhagavathamlo Manipusalu

    Bhagavathamlo Manipusalu

    “భాగవత” మంటే భగవత్తత్వాన్ని తెలియచేసేదని అర్ధం. ఈ భాగవత్తత్వాన్ని తెలియచేసేవారిని “భాగవతు”లంటారు. వాళ్ళు పరమ భగవతోత్తములై తాము దర్శించిన దానిని –

    ఇతరులు ధన్యత చెందాలనే వుద్దేశంతో, తమలోని భక్తీ, ఆనందం, చైతన్యం, బ్రహ్మానందం కలిపి అందిస్తారు. అది విన్న, చదివిన వారలందరు భాగవతులై, భగవత్తత్వానందుకోవాలనే సత్సంకల్పమే వారి లక్ష్యం.

    అటువంటి దివ్యలక్షణాని కనుగుణంగా ఇటు భక్తీ – వేదాంత ఆధ్యాత్మిక దృష్టి, అటు వ్యాపారదృష్టి అంటే సద్గ్రంధాలను, సర్వభక్త జనానీకానికి అందించాలనే సదాశయంతో – నాతో –

    “స్వామీ! కొన్ని క్రొత్త ప్రచురణలు తిసుకోవద్డామనుకుంటున్నా” నని చెప్పి – నన్ను –

    1. సంక్షిప్త భాగవతం

    2. సంక్షిప్త భారతం

    3. సంక్షిప్త శ్రీమద్రామాయణం

    చిన్న చిన్న సంపుటాలుగా వ్రాయమని కోరారు. ఆ ఆలోచనా దివ్య సరళికి – ఈ గ్రంధమొక మచ్చుతునక. అనకూడదు కాని, ఈ కధలన్నీ చదివితే (కృష్ణ) భాగవతాన్ని చదివిన “తృప్తి” – తప్పక కల్గుతుంది. కారణం –

    ఆ భగవంతుడు నాకిచ్చిన “ఆవేశ – ఆదేశాలలో కొన్ని కొన్ని సమయాలలో – ఆ పాత్రలలో పాత్రనై పోయాను. బ్రహ్మానందమను భవించాను. ఆ సందర్భాలు, సంఘటనలు తప్పక, పఠీతులను భక్తులను చేస్తాయి. భక్తులను భగవంతుని చేరువ చేస్తాయి.

    – రామకృష్ణ ప్రసాద్

    100.00
    Add to cart
  • Bhagyalakshmi

    Bhagyalakshmi

     ప్రతి మనిషికి యిల్లుంటుంది. ఆయింటిని తీర్చిదిద్దుకోవడమే ప్రతిభ. ప్రతి వారికి బుర్ర వుంటుంది. ఆ బుర్రను సక్రమంగా ఉపయోగించుకోవడం ప్రతిభ. ప్రతివారికి లేకపోయినా కొందరికయినా డబ్బుంటుంది. దానివల్ల నలుగురికి ఉపయోగం మాటెలావున్న హాని చేయకపోవడం ప్రతిభ…

                        తెలుగు జీవితాన్ని కలంపట్టి భూమార్గం పట్టించిన మాదిరెడ్డి సులోచన జీవిత పద చిత్రణలివి!

    70.00
    Add to cart
  • Bharatha Dharshanamu

    Bharatha Dharshanamu

    జవహర్ లాల్ నెహ్రు రచన

    భారత దర్శనము

    The Discovery of India కి తెలుగు అనువాద గ్రంధం.

    నేనీ పుస్తకాన్ని అహ్మమద్ నగర్ కోటలో ఉండగా 1944 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు అయిదు నెలల్లో వ్రాసాను. నాతో పాటు ఖైదులో ఉన్న సహచరులలో కొందరు సహృదయత తో దీని వ్రాతప్రతిని చదివి, అనేక అమూల్య సుచానలిచ్చారు. దేనిని ఖైడులోనే సరి చేసేటప్పుడు ఆ సూచనల నుపయోగించికుని. కొన్ని చేర్పులు కూర్చాను. అయితే, నా ఈ రచనలోని భావాలకు ఏ ఒక్కరు భాధ్యులు కారని , లేక వారామోదిస్తారని బావించ నవసరం లేదని నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటాను. కానీ, వారితో కలసి, అనేక సమాలొచనలూ, చర్చలూ జరపడంవల్ల భారతీయ చరిత్ర, సంస్కృతుల వివిధ దృక్పధాలను గురించి నా మనసులో మసకగా ఉన్న భావాలూ విశిష్ట  రూపం దాల్చాయి.అందుకు వారికీ నా హృదయ పూర్వక కృతజ్ఞత తెలుపుకొకతప్పదు.

    అహ్మమద్ నగర్ కోటలో నా సహచరులుగా ఉన్న పదకొండు మంది బారత దెస వైవిధ్యాన్ని ప్రదర్శించే ముచ్చటయిన వ్యక్తులు. వారనేక విధాలుగా భారత రాజకేయలకే గాక , అధునాతన పాండిత్యా లకు , వర్తమాన  భారతదేశ వివిధ ద్రుక్పధాలకు ప్రతినిధులు. భారత దేశ ప్రధాన సజీవ భాషల్లో దాదాపు అన్నిటికి భారత దేశాన్ని గతంలోనూ వర్తమానంలో కూడా గాడంగా ప్రభావితం చేసిన పరచెన భాషలకు ప్రాతినిధ్యం లభించింది.

    నేను కొన్నాళ్ళ క్రితం వ్రాసినదాన్ని, కొంతకాలానికి మల్లి చదువుతూవుంటే, ఒకవిధమైన విచిత్రనుభూతి ఇబ్బడిముబ్బడి గా ఉంటుంది. నాకు సంహితుడైన బిన్నమైన మరో వ్యక్తి రచించిన గ్రంధాన్ని చదువుతున్నట్లు తోస్తుంది. ఇది బహుశా, నాలో జరిగిన మార్పు ఒక్క పరిమాణం కావచ్చు.

    ……………   జవహర్ లాల్ నెహ్రు

    గొప్ప ప్రజాస్వామ్యవాది అయిన నెహ్రు ఆంగ్లం లో అనేక గ్రంధాలను రచించారు. తను రాసిన ‘స్వీయచరిత్ర’ కు కొనసాగింపుగా మరో రచనకు సంసిద్ధమైనారు . తనకు మహా ప్రేతిపాత్రమైన — తను ప్రగాడంగా ప్రేమించే భారత మాతను గురించి రాస్తే బాగుంటుందని ‘ ది డిస్కవరీ అఫ్ ఇండియా ” గ్రంధ రచనకు పూనుకున్నారు. ఈ గ్రంధ రచనలో అబ్దుల్ కలాం ఆజాద్,గోవింద వల్లబ్ పంత్ వంటి స్వాతంత్ర సమరయోధులు తమ తోడ్పాటు అందించారు. ఈ పుస్తకం తెలుగులో ‘భారత దర్శనం ‘ అన్న పేరుతో వెలువడింది. వీరి రచనలలో “సోవియట్ రష్యా”, గిమ్ప్లేస్ అఫ్ వరల్డ్ హిస్టరీ” ” ది డిస్కవరీ అఫ్  ఇండియా ” అన్నవి ప్రసిద్ధ రచనలు.

    400.00
    Add to cart