-
Achanta Sarada Devi Kathalu – ఆచంట శారదా దేవి కథలు
₹280.00శారదాదేవి తనకు తెలియని జీవితాన్ని అసలు ముట్టుకోరు. తన అనుభవ పరిధిలో వున్నా మనుషుల్ని, సన్నివేశాల్ని, జీవన వాతావరణాన్ని తన కథలకు ఇతి వృత్తాలుగా చేసుకున్నారు. వాటికీ నిసర్గ కోమలమైన తన భావగంధం పూసి గాఢమైన అనుభూతులుగా మలచి, పాఠకుల ముందు పరిచారు. వారి కథలు సహజంగా, స్వచ్చంగా, నిరాడంబరంగా, సరళంగా, అందంగా, మనసులోంచి అలవోకగా పుట్టినట్టు ఉంటాయి. ఎదుటి వారి మనసులను సుతారంగా తాకుతూ ఉంటాయి. ఈ కథలు చదువుతుంటే నిర్మలమైన నదిలో స్నానం చేసినట్లు ఉంటుంది. -ఎస్వి.భుజంగరాయశర్మ.
“జీవితం అనే తోటలో ఏరిన వివిధ పుష్పాలు, తెలుగు భారతికి పగడాలమాల ఈ కథానికలు”.
-రాజమన్నారు.
“వికాసోన్ముఖమైనఅనుభవ పరిణితి చాలని సీమంతిని హృదయంలోని వేదన ఇది. ‘ఇంతేనేమో’ అనికాని’ఇంతే’ అని ధైర్యంతో చెప్పలేని హృదయ దైన్యం, ధైర్యంగా వేషం వేసుకోవడానికి ముందు జీవిత నేపథ్యంలో చూపే అవ్యవస్థ, తొందర- ఈ వేదన. దాన్ని ఎంతో సహనుభూతితో ఈ ప్రబంద సంగ్రహంలోని ఒక్కొక్క ఖండికలోనూ చల్లగా సన్నని కంఠంతో చిత్రించారు. శ్రీమతి అచంట శారదాదేవి”.
-రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ.
“ఏ ఉత్తమ రచనకైనా అనుభవం అతి ముఖ్యం. ఈ అనుభవం వల్లనేనిజాయితి కలుగుతుంది. అతి ప్రధానమైన ఈ నిజాయితీకి అందము, అలంకరణ కోసమూ ఊహా, కల్పనా సాయపడతాయి. నిజమైన అనుభవము ఈ ఊహా, కల్పనలతో ఎంతో ఆకర్షవంతంగా అమరుతుంది అది సాధించినవారు మనకు సన్నిహితులవుతారు. శారదాదేవి ఇట్లాంటి రచయిత్రి.” -బుచ్చిబాబు. -
Addala Meda – అద్దాల మేడ
₹80.00ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి.
అద్దాల మేడ
”పద్మినీ… పద్మినీ…” ఎవరో తలుపులు బాదుతున్నారు. ఒళ్ళు విరుచుకుని లేచింది పద్మిని. గడియారం వంక చూచింది. అయిదు కావస్తూంది. పనిమనిషైనా టీ తెచ్చి లేపలేదు.
”పద్మినీ! అబ్బ కాలింగ్ బెల్ పెట్టించవమ్మా అంటే వినదుకదా.” బయట గొణుగుడు వినిపించింది. త్వరగా వెళ్ళి తలుపులు తీసింది. నిండుగా వేడిదుస్తులు వేసుకున్న స్త్రీతోపాటు చల్లని ఈదరగాలి లోపలికి వచ్చింది. వెంటనే తులుపులు మూసింది పద్మిని.
”మీరా కోమలగారూ! మీవారేరీ?”
”రామేశ్వరము వెళ్ళినా శనేశ్వరము తప్పదని, సముద్రాలు దాటివచ్చినా పేకాటరాయుళ్ళకు కరువులేదు. ఈ రోజు శనివారము బడి లేదుగా పారాయణము జరుగుతూంది. నువ్వు వస్తే అలా పోస్టాఫీసువైపు వెళ్ళి ఉత్తరాలు వచ్చాయేమో చూద్దామని వచ్చాను.”
”నేను పడుకోందే పిల్లలు పడుకోరని, అలా నడుము వాల్చాను. నిదుర పట్టేసింది. కూర్చోండి. ఆంచీ! (అమ్మాయీ)” అని పిలిచింది. ఓ పదహారేళ్ళ కన్య చక్కని సిల్కు పువ్వుల గౌను వేసుకుని, కాల్ళకు బోటు ఆకారములో నున్న బూట్లు ధరించి తలకు చుక్కల బట్ట కట్టుకుని వచ్చింది.
”తరాల్లే మెహెతే! (పిలిచారా అమ్మగారూ?)”
”ఉలత్యినా ఆంచి. (రెండు కాఫీలు తే)” అన్నది. అమ్మాయి వెళ్ళిపోయింది…..
పేజీలు : 187
-
Adhiguruvu Acharya Chandala
₹100.00ఇది భారత భూమి నడిబొడ్డున హైందవ పుణ్యభూమిగా భావించబడే కాశీనగరంలో జరిగిన యథార్థ సంఘటన. భారత తాత్విక మేథోరంగాన్ని ఒక కుదుపు కుదిపిన చారిత్రక సంఘటన. హైందవ చరిత్రకారుల ప్రకారం శంకరా చార్యులు సాక్షాత్ శివ స్వరూపం. అతనికి ఒక సందర్భంలో ‘చండాలుడు’ ఎదురొచ్చి తత్వాన్ని బోధించి జ్ఞానోదయం కలిగిస్తాడు. ‘శివుడు చండాలుని రూపంలో వచ్చారు’ అనేది హైందవ చరిత్రకారుల అభిప్రాయం. ఒక శివునికి మరొక శివుడు ఎదురొచ్చి జ్ఞానోదయం కల్పించి నట్లుగా చరిత్రను వక్రీకరించారు. ఇది ఎలా సాధ్యం?
భారతదేశపు తాత్వికరంగంలో హైందవ, బౌద్ధ వాజ్ఞ్మయాలను ఔపోసన పట్టిన మహా తాత్వికులు, మహా విజ్ఞాని ‘ఆచార్య చండాలుడు’. ఒకే దేశంలో ఒకే సమయంలో, ఒకే ప్రదేశంలో శంకరా చార్యులు, ఛండాలుడు లాంటి ఇద్దరు తాత్వికులు వుండడం తప్పు కాదు గదా! ఇద్దరు హైందవులైతే వారిని గురించి వ్రాసేవారు. కాని ‘ఛండాలుడు’ అంటరాని కులంలో పుట్టిన వ్యక్తి. అందుకే హైందవ చరిత్రకారులు అతని గురించి వ్రాయలేదు. వాస్తవ చరిత్ర ఏమిటో తెలియజేయాలని నేను ఈ గ్రంథాన్ని వ్రాయాల్సి వచ్చినది.
– బొనిగల రామారావు
-
Adhikarulu Asrita Janulu – అధికారులు ఆశ్రితజనులు
₹100.00తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు.
అధికారులు ఆశ్రితజనులు
బ్రతక నేర్చిన వాడికి యీ లోకం పచ్చల పల్లకి. నోట్లో నాలుకలేని వాడికి యిదే లోకం గచ్చపొదలా కనిపిస్తుంది. నాగరాజుకు మేడలు, మిద్దెలు లేవు కాని, మేడలు, మిద్దెలు గల మోతుబరులతో పరిచయం వుంది.
నాగరాజుకి ఏ అధికారమూ లేదు, కాని అధికారులందరినీ అతను తన యింటికి ఆహ్వానిస్తాడు. కలెక్టర్లు మొదలుకుని, సాధారణ అధికారులవరకూ అతని చమత్కారాలకీ, చాకచక్యాలకీ లొంగని వారుండరు.
అధికారుల్ని అయిన విధానా, కాని విధానా, ఆశ్రయించి – తన యింట్లో చిల్లిగవ్వ లేకపోయినా, వారి హోదాలనే, అంగళ్ళలో ధనంగా పణం పెట్టి, తను కుహనా పరువు ప్రతిష్ఠలను మెట్టుమెట్టుగా పెంచుకో గలిగిన నాగరాజు వంటి పరాన్నభుక్కులు, నిత్యం ఏదో రూపంలో మీ చుట్టూ తిరుగుతూనే వుంటారు.
నాగరాజుల స్వభావాలలాగే, రోజులన్నీ ఇటువంటి వారి పాలిట ఒక్కలాగ వుండవు. జీవిత నాగుపాము కుచ్చిత అనుభవాల విషం కక్కినపుడు ఎంతమూలగా నక్కి వందామనుకున్నా, వారి బ్రతుకులు వికృతరూపాలలో బయటపడక తప్పదు.
అప్పుడు – వారి వ్యక్తిత్వాలలో, బ్రతుకు తెరువులో, బూలతనం మీయెదుట నిలుస్తుంది.
ఈ నాగరాజు లాంటివారే మీ దృష్టికి తగలకపోవచ్చు. కాని సంఘంలో ఇటువంటి వ్యక్తుల కార్యకలాపాల స్వభావం యీ నవల విప్పి చెపుతుంది. తస్మాత్ జాగ్రత్త!
పేజీలు : 251
-
Agni Pareeksha – అగ్ని పరీక్ష
₹70.00ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడిదినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి. మా సంస్థ 50 సంవత్సరాలలోకి అడుగుపెట్టిన తరుణంలో వుత్తమ విలువలను ప్రోది చేసిన మాదిరెడ్డి నవలలను పునర్ముద్రించడం మాకెంతో ఆనందంగా వుంది. – నవోదయ పబ్లిషర్స్,
Pages : 211 -
Amrutha Kalasam
₹90.00“విజయలక్ష్మి గారు”!
“ఉ ……… ఎవరు?” తలయెత్తి చూచింది విజయలక్ష్మి. ఎదురుగా వనజ నిలబడి వుంది. వనజకుడా విజయలక్ష్మిలాగే రవీంద్రా ట్యుటోరియల్ కాలేజీలో ట్యూటరుగా పనిచేస్తోంది.
“ఎం చేస్తున్నారు” వచ్చి అక్కడున్న కుర్చీలో కూర్చుంది.
“ఇప్పుడే ఈ పుస్తకాలు ముందేసుకుని దిద్దటానికి కూర్చున్నాను” అన్నది చేతిలోవున్న ఎఱ్ఱ పెన్సిల్ ప్రక్కన పడేసి.
“జీవితమంటే విసుగు పుట్టిందండి….”
“అబ్బా? అంత విసుగు ఎందుకమ్మా చిట్టితల్లి.”
“ఛి….. ఛి……. మంద……బట్టి పల్లెటూరి రకం” విసుక్కుంది వనజ.
“ఏమిటి వనజ! అసలేం జరిగిందో చెప్పు”.
“మా అత్తగారి జనమంతా ఇంటి నిండా పడి ఏడుస్తున్నారు” అన్నది కసిగా.
-మాద్దిరెడ్డి సులోచన.
-
Andagadu
₹120.00ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు ఎన్ని తరాలు గడిచినా చలనం ఉండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే ఉంటాయి. మాదిరెడ్డి సులోచన సమగ్ర సాహిత్యం ఈ తరం పాఠకులకు అందచేయ్యాలనీ, ఈ నవలల్ని పాఠకులు ఆదరిస్తారనీ మా ఆలోచనలకు మిత్రులనుండి, పాఠకుల నుండి సోదర ప్రచురణ కర్తల నుండి ఎంతో ప్రోత్సాహం వచ్చింది. వారికి మా ధన్యవాదాలు.
– నవోదయ రామమోహనరావు
-
Andamaina Jeevitam – అందమైన జీవితం
₹220.00సృష్టిలోని అలౌకికమైన తీయదనాలలో ముఖ్యమైంది స్నేహం. దానిని అనుభవించ గలిగినవారికే దాని ప్రాముఖ్యత అర్ధమవుతుంది.
అది ఇద్దరు మగవాళ్ళ మధ్య కావచ్చు. ఇద్దరు ఆడవాళ్ళ మధ్య కావచ్చు. లేక అరుదుగా ఓ మగ, ఓ ఆడ మధ్య కావచ్చు. అంతేకాదు వివాహితులైన ఆడ, మగ మధ్య కూడా కావచ్చు. స్నేహం విషయంలో వాళ్ళు ఆడ, మగ అవడం యాదృచ్ఛికం అవుతుంది.
శృంగారపరమయిన భావాలకి లోను కాకుండా స్నేహం చేయగలగడం ఆడ, మగలకి సాధ్యం కాదా ? ఆ స్నేహంలోని మాధుర్యాన్ని నిష్కల్మషంగా చవి చూడగలగడం అనుభవం లోకిరాకూడదా ?
పై బెర్త్లోంచి వినపడుతున్న భర్త గురక. రైలు ఏదో స్టేషనులో ఆగింది. బయట ఆరి వెలుగుతూ ఎగిరే మిణుగురు పురుగులు. శాంతి చేతిని బయటి పెట్టి ఎగురుతున్న మిణుగురు పురుగులను పట్టుకుని తన జుట్టు మీద ఉంచుకోసాగింది. చిన్నప్పుడు రాత్రిళ్ళు దొడ్లొకి వెళ్ళి మిణుగురు పురుగులని గ్లాసులో పట్టుకున్న సంఘటన గుర్తుకు వచ్చింది శాంతికి.
సిగ్నల్ ఇవ్వడంతో రైలు మళ్ళీ బయలుదేరింది. శాంతి తన పెట్టె అందులోంచి తనడైరీ తీసి, అందులోంచి రెండు తెల్లకాగితాలని తీసి ఓ ఉత్తరం రాయడం మొదలుపెట్టింది.
‘డియర్ ప్రియతమ్,
మీరు ఉత్తరం రాసి నాకు మీ చిరునామా తెలియగానే దానికి జవాబు రాయబోయే ముందు ఈలెటర్ మీకు పోస్ట్ చేస్తాను……..
తన భర్త ‘ఇంక పడుకోరాదు’ అని పై బెర్త్లోంచి అరిచేదాకా శాంతి కిటికీకి ఆనుకుని కూర్చుని, కిటికిలోంచి పడే వెన్నెల వెలుగులో ప్రియతమ్కి తన మొదటి ఉత్తరం రాస్తూనే ఉంది – అంటూ ముగించారు శ్రీమల్లాది వెంకట కృష్ణమూర్తి గారు తమ అందమైన జీవితం నవలని.
స్త్రీ పురుషుల మధ్య సెక్స్కి దారితీయని సుగంధ స్నేహసుధ సాధ్యమని నిరూపించే నవల ‘అందమైన జీవితం’.
-
Andani Pilupu
₹80.00“చిన్నా!” నన్ను ఆ పేరుతో పిలిచి ప్రలోభపెట్టకు, చెప్పు – నా తండ్రెవరు? నిజం చెప్పు. అనుకోని ఈ ప్రశ్నకు అంజనీదేవి తెల్లబోయింది. ముఖం పాలిపోయింది. తనను సంబాలించుకుంది. ఏమిట్రా పిచ్చిపట్టిందా? నీ తండ్రెవరో నీకు తెలియదా? పిచ్చి భ్రమలో పెంచావు. ఇప్పుడైనా నిజం చెప్పకపోతే పిచ్చిపడుతుంది. “మీ తండ్రి శ్రీహరిగారు.” కాదు అబద్దం అతను రామస్వామిగారి ఇల్లరికపు అల్లుడు. నీ అందానికి దాసుడై భార్యబిడ్డలను అనాధలను చేసి వచ్చిన ఘనుడు. కన్న కొడుకుకు సంజాయిషీగా ఆ తల్లి చెప్పిన కన్నీటికథే “అందని పిలుపు.”
-