• StuvartPuram Police Station
  • Swarabhetalam - స్వరబేతాళం

    Swarabhetalam – స్వరబేతాళం

    ‘మారా …. మరా….. బచావ్‌” (చంపుతున్నాడు – చంపుతున్నాడు – రక్షించండి)

    జనవరి 31, 1982 పొద్దున్న 7-50కి నాంపల్లి రైల్వేస్టేషను పక్కనున్న ఇంటినుంచి వినిపించిన కేకలవి.

    హోటల్లో టీ తాగుతున్న ఒకరిద్దరు. రాయల్‌ లాడ్జి బయటున్న ఆటోడ్రైవర్లు ముగ్గురు అటువైపు పరుగెత్తారు.

    కత్తి పట్టుకుని బయటకు వచ్చిన యువకుడిని చూసి అందరూ నిశ్చేష్టులై ఆగిపోయారు. సాహసవంతులైన నలుగురైదుగురు యువకులు మాత్రం అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. వాళ్ళను కూడా పొడిచి అతడు స్టేషనువైపుకు పరుగెత్తాడు.

    లోపల ఇంట్లో కత్తిపోట్లుకు గురి అయిన వ్యక్తి రక్తంలో గిల గిల కొట్టుకుంటూ మరణించాడు. ఆ వ్యక్తి పేరు మొహిసిన్‌. అతడొక పోలీసు. హంతకుడి పేరు ధర్మదాస్‌. ధర్మదాస్‌ పరుగెడుతూ అడ్డుగా వచ్చిన వాళ్ళను పొడవగా గాయపడిన వాళ్ళు మొయినుద్దీన్‌, సయ్యద్‌ బాషా, పద్మనాభం, అన్వర్‌, జబ్బర్‌ (చివరి ఇద్దరూ ఆటో డ్రయవర్లు). చివరికి జనం ఆ హంతకుడిని పట్టుకుని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. అతడి దగ్గర రక్తంతో తడిసిన పొడవాటి కత్తి లభించింది. అతడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు.

    అతడు హత్య చేసాడని అందరికీ తెలుసు. నలుగురూ చూస్తూ వుండగానే హత్య చేసాడు. లోయర్‌ కోర్టు అతడికి ఉరిశిక్ష వేసింది. కానీ హైకోర్టు అతడిని నిర్దోషిగా విడుదలచేసింది.

    కారణం ? ఐ.పి.సి. సెక్షన్‌ 84 నిచీశ్‌ీష్ట్రఱఅస్త్ర ఱర aఅ శీటటవఅషవ షష్ట్రఱషష్ట్ర ఱర సశీఅవ పవ a జూవతీరశీఅ, షష్ట్రశీ, a్‌ ్‌ష్ట్రవ ్‌ఱఎవ శీట సశీఱఅస్త్ర ఱ్‌, పవ బీతీవaరశీఅ శీట బఅరశీబఅసఅవరర శీట ఎఱఅస, ఱర ఱఅషaజూaపశ్రీవ శీట సఅశీషఱఅస్త్ర ్‌ష్ట్రవ అa్‌తీబవ శీట ్‌ష్ట్రవ ూష్‌కు. ూవష.84-Iఅసఱaఅ ూవఅaశ్రీ జశీసవ.

    ఉరితీత మీద ధ్వజమెత్తి ‘అభిలాష’ నవల ద్వారా పాఠకుల్ని ఉర్రూతలూపినరచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్‌ ఈసారి లాజిక్‌తో హారర్‌ కలిపి న్యాయశాస్త్రపు మరోకోణాన్ని స్పృశించటానికి చేసిన ప్రయత్నం ‘స్వరబేతాళం’.

    80.00
    Add to cart
  • thirteen fourteen fifteen

    thirteen fourteen fifteen

    హృదయం గది నిండా బాధ బురద పేరుకు పోకుండా నిరంతరం ప్రక్షాళన చేయడానికి కన్నీటిని ఇచ్చాడు భగవంతుడు. ఈ పెళ్ళి అనే వ్యవస్థలో ఏదో లోపం వుంది కాబట్టే చాలా మంది స్త్రీలు రాజీపడటాన్నీ, చాలా మంది పురుషులు ఎస్కేపిజాన్నీ తమ జీవితంగా మార్చుకుని బ్రతుకుతున్నారు. దేహావసరాలు తీర్చుకోవటమే జీవితం అనే అభిప్రాయానికి మనిద్దరం బలవంతంగా తోయబడ్డాం. ఒకరికొకరు ఏమీ కాకుండా …. కేవలం భార్యాభర్తలమయి…. ఇలా అసంతృప్తితో వేగిపోతున్న ఆమె – భర్తని ఒక అర్ధరాత్రి హోటల్‌ గదిలో ఒకమ్మాయితో చూసిన ఆమె, అదే ఆవేశంతో వెళ్ళి తనని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే యువకుడి ఇంటి తలుపు తట్టింది. పురుషుడికొక న్యాయం స్త్రీకో న్యాయం ఎందునుకుంది.

    అదొక తాత్కాలికమైన అసంకల్పిత ప్రతీకార చర్య, పర్యవసానం ? బ్లాక్‌ మెయిలింగ్‌, మానసిక సంఘర్షణ, ఊపిరి సలుపనివ్వని క్లైమాక్స్‌.

    నకిలీ హిప్నటిజాల మాఫియా, కృత్రిమ సంతానోత్పత్తి కేంద్రాల మోసాల నేపధ్యంలో ఒక జర్నలిస్టు, ఒక రచయిత్రి, ఒక వ్యాపార వేత్త, భారతదేశపు నెంబర్‌వన్‌ టెన్నిస్‌ ప్లేయరు ఒకరు –

    నాలుగువిభిన్న మనస్తత్వాలతో రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ ఆడుకున్న గేమ్‌ ’13-14-15′.

    100.00
    Add to cart
  • Tulasi Dalam - తులసి దళం

    Tulasi Dalam – తులసి దళం

    ‘ముగ్గు మధ్యలో కాద్రా కూర్చుని ఉన్నాడు. అతడి ప్రక్కన పాత్రలో మైదాపిండి ఉంది. తులసి చేతి కర్చీఫ్‌ ఉంది. తులసి తొక్కిన కాలిమట్టి ఉంది.

    ముగ్గుకి ఎనిమిది వైపులా చిన్న చిన్న గొబ్బిళ్ళలాంటి మాంసపు ముద్దలు ఉన్నాయి…..

    ముగ్గు మధ్యలో హ్రీం-క్రీం అన్న అక్షరాలు వ్రాయబడి ఉన్నాయి. సాంబ్రాణి పొగ దట్టంగా అలుముకొని వుంది. అతడు మైదాపిండితో బొమ్మను తయారు చేశాడు. తులసి తాలూకు చేతి గుడ్డ దానికి కట్టేడు. తులసి తొక్కిన మట్టిని ఆ బొమ్మ కాలికి అద్దేడు. బొమ్మ నెదురుగా పెట్టుకొని మంత్రం చదవటం మొదలుపెట్టాడు. అతడి పెదవులు కదులుతున్నాయి….”

    తులసి అనే పదేళ్ళ చిన్నారిని చంపటానికి ముగ్గురు కిరాతకులు కాద్రా అనే మహామాంత్రికుడిని ఆశ్రయించారు. ‘కాష్మోరా’ అనే అతిభయంకరమైన క్షుద్రదేవతను ప్రయోగించి 21 రోజుల్లో పాపని చంపుతానని వాగ్దానం చేశాడు కాద్రా. రోజు రోజుకి తులసి క్షీణించిపోసాగింది. ఒక హిప్నటిస్టు, ఒక డాక్టరు కలసి ఆ చిన్నారిని కాపాడటానికి రంగంలో దిగారు.

    1981లో వెలువడిన ఈ నవల – తెలుగు పాపులర్‌ నవలా సాహిత్యాన్ని ఒక మలుపు తిప్పింది. సంచలనం సృష్టించింది. అనేక వాద వివాదాలకు కేంద్రబిందువయింది. అఖిలాంధ్ర పాఠకలోకాన్ని అలరించిన ఈ నవల ఇప్పటికీ బెస్ట్‌ సెల్లర్స్‌లో ఒకటిగా నిలిచింది.

    100.00
    Add to cart
  • Yevaree Chatrapati Sivaji - ఎవరీ ఛత్రపతి శివాజి

    Yevaree Chatrapati Sivaji – ఎవరీ ఛత్రపతి శివాజి

    భారతావనిలో యెంతమంది రాజులు లేరు? ఎంతమంది స్వతంత్రంగా పాలించలేదు. ముస్లిం పాలకులు, హిందూ పాలకులు సమాంతరంగా పరిపాలించిన దశలూ ఉన్నాయి. ముస్లిం పాలకులకి వ్యతిరేకంగా హిందూ పాలకులు కత్తిగట్టారనీ, హిందూ ధర్మస్థాపన కోసం కంకణబద్దులయ్యారనీ కొంతమంది చరిత్రకారులు వక్రీకరించి చెపుతూ వుంటారు. ”వక్రీకరించి” అనడం ఎందుకంటే వాళ్ళు ముస్లింలు కాబట్టే హిందువులు కత్తిగట్టనూలేదు. ముస్లిం రాజులు సాటి ముస్లింరాజుల మీద దాడులు చెయ్యకపోనూలేదు. ఇక్కడ సమస్య అల్లా మతంకాదు. పాలకుల నైజం, వ్యవహారశైలి, పాలితులపట్ల వాళ్ళ వైఖరి. హిందువు అయినా, ముస్లిం అయినా క్రూర చక్రవర్తిని ప్రజలు అసహ్యించుకున్నారు, ఎదిరించారు. దయగల ప్రభువుల్ని ఆదరించారు – వాళ్లు ముస్లింలు అయినా, హిందువులు అయినా, అలా ప్రజాదరణ పొందినవాడు శివాజి.

    శివాజి దండయాత్రలు, దుర్గాల ముట్టడి, శత్రు శిబిరాల్లో పరాక్రమ ప్రదర్శన లాంటి వీరోచిత కృత్యాలన్నీ జనం నోళ్ళల్లో కథలు, గాథలుగా అల్లుకుపోయాయి.

    ‘రాయఘడ్‌’ రాజధానిగా ఆయన స్థాపించిన సామ్రాజ్యంలో ఎన్నో సంస్కరణలు కార్యరూపం ధరించాయి. ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం, వాళ్ళని పెత్తందారుల ఆగడాల నుంచి బయటపడెయ్యడం కోసం ఆయన ఎన్నో ఘనకార్యాలు నిర్వహించాడు. సైన్యాన్ని, నావికదళాన్ని నిర్మించాడు. దుర్గాలని పటిష్ట పరిచాడు. అక్షరాస్యత వ్యాప్తికి నడుంకట్టాడు. పరిపాలనా భాష సంస్కరించాడు. రాజ వ్యవహారం కోశం అనే నిఘంటువును తయారు చేయించాడు. శిక్ష్మాస్మృతి సమన్యాయంతో అమలుచేశాడు. మొత్తం మీద ”ప్రజల మనిషి” అని ప్రజల మన్నన పొందాడు.

    శివాజికి ముస్లింమత విద్వేషం యేమాత్రం లేదు. ఔరంగజేబ్‌తో పోరాడినా తన కొలువులో, సైన్యంలో ముస్లింలని యే శంకలూ లేకుండా నియమించాడు. ఆయన విశాలదృక్పథం, ఏ ఒక్క మతానికి సంకుచితం కాకుండా ఆయన్ని మహనీయుణ్ణి చేసింది.

    40.00
    Add to cart
  • Avanism

    Avanism

     చరిత్రను శోధించి సత్యాన్ని సాధించాలి. వాస్తవికత ఇచ్చే తృప్తి, ఆనందం మారేది ఇవ్వలేదు. ఈ “అవనిజం” పుస్తకంలో కూడా కొన్ని పరిశోధనలను గురించి రాస్తున్నప్పుడు ఎదో సంతోషం. ఎందుకంటే మన బాధ్యతగా కొన్ని నిజాలను ఆవిష్కరిస్తున్నామని.  ప్రతి మనిషికి విశ్వం  ఒక అంతుబట్టని రహస్యం. ఎంత తెలుసుకున్నామనే దానికంటే మనకు అందిన విషయం సముద్రంలో ఒక నీటి బొట్టు మాత్రమే. అయినా అది సాధించిన విజయం తక్కువదేం కాదు. ఎన్నో మూఢనమ్మకాల పొరలు ఛేదించి విజ్ఞానం వైపు ఆధునిక సమాజాన్ని నడిపిస్తున్న శాస్త్రీయతను ప్రాచీన అర్వాచీన విజ్ఞానం ద్వారా అందించాలనే చిన్న ప్రయత్నమే ఈ “అవనిజం”.

    200.00
    Add to cart
  • Divodasu Lokasanchari

    Divodasu Lokasanchari

     “మానవజాతి ప్రగతి పథంవైపు సాగించిన ప్రతి అడుగూ రక్తతర్పణంతోనే సాగింది. నర రక్తం ఇంతగా ప్రవహించడానికి అన్ని మతాల ధర్మచార్యులే కారణం; వారే బాధ్యులు, ఏ ఒక్క మతము, ఏ ఒక్క మతాచార్యుడు గర్వించవల్సింది ఏమీలేదు” అని చారిత్రిక ఆధారాల రీత్యా తన రచనల ద్వారా ఆయన రుజువు చేశాడు. ప్రస్తుత రాజకీయ, సామాజిక వాతావరణంలో రాహుల్జీ పుస్తకాల పఠనం అత్యంత అవశకం. ఆ మహాపండితుని రచనలన్నింటినీ తిరిగి ముద్రించి తెలుగు పాఠకుల ముందుంచుతున్నందుకు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ గర్వపడుతున్నది.

                                              – గడ్డం కోటేశ్వరరావు 

    200.00
    Add to cart
  • Nobel Kathalu - నోబెల్‌ కథలు

    Nobel Kathalu – నోబెల్‌ కథలు

    ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రచయితలకే నోబుల్‌ బహుమతి దక్కుతుంది. ఆ బహుమతి దక్కినవారిలో కొంతమంది రచనల నుండి మేలిమి కథలను స్వీకరించి, కథా సంకలన రూపంలో తెలుగు పాఠకులకు అందించారు రచయిత్రి శ్రీమతి జి.లక్ష్మి.

    ఆమె ఎంచుకున్న రచయితలు, రచయిత్రులు ప్రపంచం నలుమూలలకు చెందినవారు. అందులో థామస్‌ మాన్‌, పెరల్‌ ఎస్‌ బక్‌, టాగోర్‌, సింక్లెయిర్‌, నైపాల్‌, లెస్సింగ్‌, రెమాంట్‌ లాంటివారు మన దేశ పాఠకులకు కూడా బాగా పరిచితులే. ఇరవై మంది రచనల నుండి ఇరవై కథలు అనువదించి ‘నోబెల్‌ కథలు’గా అందించారు లక్ష్మి.

    Pages : 158
    120.00
    Add to cart
  • Raktasruvulu - రక్తాశ్రువులు

    Raktasruvulu – రక్తాశ్రువులు

    ప్రపంచ ప్రసిద్ధిగాంచిన విప్లవాలలో చైనా విప్లవం ఒకటి. సాయుధ ప్రజా విప్లవం ద్వారా ప్రజాతంత్ర చైనా ఆవిర్భవించింది. భూస్వామ్య విధానానికీ, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పాటు సాగిన చైనా సాయుధ పోరాటాన్ని ‘లాంగ్ మార్చ్’ గా ప్రపంచ చరిత్రపుటల్లో నిక్షిప్తం చేయబడింది. కష్టాలు, కన్నీళ్లు, రక్తతర్పణంతో నవ చైనా అవతరించింది. అందుకు ఆనాటి ప్రపంచ దేశాల్లోని పురోగామి శక్తులన్నీ తమ అండదండలు తెలియజేశాయి. భారతదేశాన్నుండి కొట్నీస్ వెళ్లి చైనా విముక్తి పోరాటానికి తన సాహసోపేతమైన సేవలందిస్తూ మరణించాడు. అదే కోవకు చెందినవారు నార్మన్ బెతూన్. తమ దేశాలను, కుటుంబాలను విడిచిపెట్టి మరో దేశం వెళ్లి ఆ ప్రజల కోసం నిస్వార్థ సేవలందిస్తూ ప్రాణత్యాగం చేసిన అమరవీరులు. చరిత్ర పుటల్లో, ప్రజల హృదయాల్లో ఆచంద్రతారార్కంగా వారు నిలిచిపోతారు.

    నార్మన్ బెతూన్ కమ్యూనిస్టు. కమ్యూనిస్టు చైతన్యం ఆయన నరనరానా జీర్ణమైపోయింది. చైనా విముక్తి పోరాటంలో పాల్గొనడం తన అంతర్జాతీయ కర్తవ్యంగా భావించాడు. ఒకవైపున భీకరపోరాటం జరుగుతున్నా బాంబుల వర్హం కురుస్తున్నా, మొక్కవోని ధైర్యంతో ఒక అడుగు కూడా వెనక్కు వేయకుండా తనకు తానే నిర్దేశించుకున్న కర్తవ్య నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన మానవులలో మహోన్నతుడు నార్మన్ బెతూన్. ఆయన జీవిత అమరగాథే “రక్తాశ్రువులు” అనే నవలగా సిడ్నీ గోర్డన్, టెడ్ అలెన్ లు ఇంగ్లీషులో రాసిన నవలను సహవాసి తెలుగులో రచించారు.

    180.00
    Add to cart
  • Swamuloru - స్వాములోరు

    Swamuloru – స్వాములోరు

    అతడో చిల్లర దొంగ. హీనుడు. స్త్రీలోలుడు. క్రూరుడు. డబ్బు వ్యామోహపరుడు. సర్వదుర్గుణాలపుట్ట. తేలికగా డబ్బు సంపాదించాలని స్వామి అవతారం ఎత్తాడు. ఆశ్రమం నిర్మించాడు. భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తా అన్నాడు. రోగాల్ని తగ్గిస్తానన్నాడు. పిల్లలు లేని దంపతులకి పిల్లలు పుట్టిస్తానన్నాడు. మాయలూ మంత్రాలూ చేసాడు. జనాన్ని నమ్మించాడు. వంచించాడు. వక్రబుద్ధులు చూపెట్టాడు. అంతులేని సంపద పోగేసుకున్నాడు. ఆశ్రమంలో అత్యాచారాలు జరిగాయి. హత్యలు జరిగాయి. పెద్ద పెద్ద అధికార్లూ, పోలీసులూ, మంత్రులూ స్వామి పాదాక్రాంతులయ్యారు.

    నేటి మన సమాజంలో స్వాములుగానూ, బాబాలుగానూ చలామణి అవుతూ పూజలందుకుంటున్న అనేకమంది దగుల్బాజీల కోవలోని వాడే ఈ స్వామికూడా! స్వామి క్రూరత్వానికి ఒక అబల గురైంది. భర్తని పోగొట్టుకుంది. స్వామి స్వరూపాన్ని గ్రహించింది. స్వామిని కటకటాల వెనక్కి పంపిస్తానని ప్రతిన బూనింది.

    ఆ అబల ఆవేదననీ, ఆరాటాన్నీ, పోరాటాన్నీ, ఉద్యమాన్నీ ఉత్తేజపూరితంగానూ, స్వాముల బతుకుల్నీ, బండారాల్నీ, దుష్టత్వాల్నీ, కపటత్వాల్నీ, దుర్మార్గాల్నీ మోసాల్నీ, ధనకాంక్షల్నీ ఆసక్తికరంగానూ, ఉత్కంఠ భరితంగానూ అక్షరీకరించిన నవల ‘స్వాములోరు’.

    పేజీలు : 159

    120.00
    Add to cart
  • Vidhatha

    Vidhatha

     ప్రజాస్వామ్యం వచ్చినా బానిసత్వం పోలేదు! ఎన్ని రాజకీయ పార్టీలు మారినా రాజరికం మారలేదు! కార్ల్ మార్క్స్ కోరుకున్న సమసమాజం ఎక్కడ? రవీంద్రుడు కలలుగన్న స్వేచ్ఛా స్వాతంత్ర్యం ఏమయ్యింది?

    ఈ కర్మభూమిలో ఎంతమంది మహానుభావులు మట్టినా ఇంకా మన జీవితాలు ఇలాగే ఎందుకున్నాయి?మరి దీనికి శాశ్వత పరిష్కారమేమిటి? ప్రజలా? ప్రభుత్వాలా? వ్యవస్థలా? భావవిప్లవమా?వెదకగలిగితే ఈ నవలలో పరిష్కారం కనపడుతుంది!

    ఈ నవలలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడం జరిగింది. ఇప్పుడున్న మానవ సంబంధాలలో, అలాంటి ప్రపంచం ఒకటి ఎంతయినా అవసరమని, నిజంగా నమ్మి రాసిన పుస్తకం ఇది. వందమంది నిజాయితీపరులు ఉంటే ఈ ప్రపంచాన్నే మార్చివేస్తానన్న ‘శ్రీ స్వామీ వివేకానందు’ని వాక్యమే ఈ నవలకి ప్రేరణ!

    100.00
    Add to cart
  • Viswambhara - విశ్వంభర

    Viswambhara – విశ్వంభర

    భారతీయ జ్ఞానపీఠ పురస్కారం పొందిన కావ్యం.

    ఈ కావ్యానికి నాయకుడు మానవుడు. రంగస్థలం విశాల విశ్వంభర.

    ఇతివృత్తం – తేదీలతో నిమిత్తంలేని, పేర్లతో అగత్యం లేని మనషి కథ.

    ఈ కథకు నేపథ్యం ప్రకృతి.

    మనిషి ధరించే వివిధ భూమికలకు మూలధాతువులు మనశ్శక్తులు.

    అలాగ్జాండర్‌, క్రీస్తు, అశోకుడు, సోక్రటీస్‌, బుద్ధుడు, లింకన్‌, లెనిన్‌, మార్క్స్‌, గాంధీ – ఇలా ఇలా ఎన్నెన్ని రూపాలో మనిషికి!

    కామం, క్రోధం, లోభం, మదం, ఆత్మశోధనం, ప్రకృతిశక్తుల వశీకరణం – ఇలా ఇలా ఎన్నెన్ని విభిన్న ప్రవృత్తులో మనిషికి!

    ఆదిమదశనుంచీ ఆధునికదశవరకు మనిషి చేసిన ప్రస్థానాలు ఈ కావ్యంలో ప్రకరణాలు.

    మనిషి సాధన త్రిముఖం – కళాత్మకం, వైజ్ఞానికం, ఆధ్యాత్మికం. ఈ సాధనలో అడుగడుగున ఎదురుదెబ్బలు. క్షతుడైనా మనిషి తిరోగతుడు కాలేదు. ‘విశ్వంభర’ కావ్య రచనకు పూర్వం నాలో గీసుకున్న రేఖాచిత్రమిది.

    75.00
    Add to cart
HIDE FILTER
Shopping cart close