-
-
Spoorthi
₹100.00మధ్యతరగతి కుటుంబ జీవనం చుట్టూ నడిచిన కథ. కుటుంబ జీవనంలో ఉండే ఆటుపోట్లు, అత్తగారి అసహనాలు, అన్నదమ్ముల ఆప్యాయతలు, రాగానురాగాలు, అక్కడక్కడ ప్రేమమైకాలు, ఊహాచిత్రాలతో పాఠకులను ఆకట్టుకుంటుంది ఈ నవల. హద్దుల్లో ఉండే భార్యభర్తల “శృంగారం” అక్కడక్కడ ఆనందాన్ని కలిగిస్తుంది. మనస్సును ఆహ్లాద పరుస్తుంది. వారి మధ్య తియ్యని జ్ఞాపకాల నెమరులతో వివాహబంధం ఇంకా దృఢమవుతుంది. ఉన్నత వర్గాల జీవనాన్ని అనుకరించే పాత్రలున్న కుటుంబంలో పక్కదారేపట్టే వ్యక్తులనూ, ప్రత్యేకించి యువతీ, యువకులనూ సరిదిద్దడంలో పరిణతిచెందిన ఒక యువతి పాత్ర చిత్రణ ఆమోద యోగ్యంగా ఉంది. స్త్రీ కేంద్రంగా కథ నడుస్తుంది.
భార్యాభర్తల వ్యక్తిగత జీవితంలోకి అన్ని కోణాలనూ ఈ నవలలో రమాదేవిగారు చిత్రించారు. కుటుంబ వ్యవస్థలో భార్యగా, కోడలిగా, వదినగా, సోదరిగా ఒక స్త్రీ తన పాత్రను ఎట్లా నిర్వహించాలో ఈ నవలలో ఆమె చిత్రించ ప్రయత్నించారు. తనకంటే చిన్నవారిని, పెద్దలను సహితం దారిలో పెట్టడానికి ఒక స్త్రీ పడే తపనను మన కళ్ళముందుంచారు.
-
Tappu Cheddam Randi – తప్పు చేద్దాం రండి
₹225.00వ్యక్తిత్వ వికాసాన్ని మొదటిసారిగా సస్పెన్స్ కథా రూపంలో చెపుతున్న సరికొత్త సంచలన ప్రయోగం ఈ పుస్తకం. ఆ ప్రయోగాన్ని చేసింది ప్రముఖ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్. తెలుగులోనే ఇది అపూర్వం. ఛేంజ్ మేనేజ్మెంట్ పై తొలి పుస్తకమిది.
ఈ పుస్తకం రాజకీయాల గురించి కాదు. ఎత్తులు పై ఎత్తులు గురించి అసలే కాదు. మనిషి గురించి. తాను మరింత బాగా బ్రతకటం కోసం. వ్యక్తిగతంగానూ, సమాజాన్ని మార్చటం కోసమూ ఏం చెయ్యాలో ఆలోచించవలసిన కర్తవ్యం ప్రతి మనిషి మీదా ఉన్నది. తాను మరింత బావుండాలంటే తన విలువల్ని ఏ విధంగా మార్చుకోవాలన్నది ఎవరికి వారే ఆలోచించుకోవాలి కదా! అయితే.. కేవలం ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. కొంతైనా ఆచరించాలి.
ఈ పుస్తకం చివర్లో మంత్రి కొడుకు కథ ఒకటున్నది. మంచినీతి వున్న జానపద కథ. ”సూక్తులు వినటమే కాదు. ఆచరించాలి కూడా’ అని చెప్పే అద్భుతమైన నీతి ఉన్న కథ.
అయితే ప్రతి మార్పు మంచికి దోహదం చేయకపోవచ్చు. అంతెందుకు? ఈ పుస్తకంలో కొన్ని భావాలు మీకు నచ్చకపోవచ్చు. అంత మాత్రాన అసలు మార్పే వద్దనలేం కదా! అదే ఛేంజ్ మేనేజ్మెంట్.
ఏ మార్పైనా ముందు హేళన చేయబడుతుంది. తరువాత ప్రశ్నింపబడుతుంది. ఆపైన విమర్శించబడుతుంది. వేగంగా తిరస్కరింపబడుతుంది. చివరగా – ఒప్పుకోబడుతుంది. మార్పు అంటే కొత్తని నిర్భీతిగా ఆహ్వానించగలగటం! మంచి మార్పుకి భయపడని అలాంటివారికి ఈ పుస్తకం అంకితం అంటున్నారు రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్.
-
Teens Pillala Pempakam Oka Kala – టీన్స్ పిల్లల పెంపకం ఒక కళ
₹180.00టీన్స్ పెంపకంపై తెలుగులో తొలి పుస్తకం.
వీడియో గేమ్స్, ఛాటింగ్, సెట్, టీవిల పై పిల్లల అనారోగ్య ఆసక్తిని తగ్గించటం ఎలా?
అల్లరికి మొండితనానికి తేడా ఏమిటి?
పిల్లలు బాగా చదవాలంటే పెద్దలు ఏం చెయ్యాలి?
టీన్స్ ఎందుకు పెద్దలతో ఎక్కువ మాట్లాడరు?
కొందరు టీన్స్ అద్భుతాలు సాధిస్తూంటే, మరి కొందరు ఎందుకు అల్లరిగా తయారవుతారు?
తాము అనుకన్నట్టే ఉండాలని పెద్దలు పిల్లల్ని ఎందుకు బలవంత పెడతారు?
పదవ తరగతి పాస్ అవ్వాలన్నా, చివరికి చిన్న బండి నడపాలన్నా, పరీక్ష/లైసెన్స్ ఉంటుంది గానీ, పేరెంట్ అవటానికీ, పిల్లల్ని పెంచటానికీ ఏ లైసెన్సూ అవసరం లేదు. ‘పిల్లలు న్యాచురల్ గానే పెరుగుతారు. దానికి పుస్తకాలూ, పరీక్షలూ ఎందుకు? గతంలో పెద్దలు ఏ గైడ్ చదివి పెంచారు?’ అనేది ఒకప్పటి వాదన. అయితే, ఇప్పుడున్న పోటీతత్వం అప్పట్లో లేదు. ఇంట్లో తాతయ్యలూ మావయ్యలూ లేరు. ఇటువంటి పరిస్థితుల్లో, ”ఆకర్షించే అనారోగ్య అభిరుచులూ, అయిస్కాతించే టెక్నాలజీ” నుంచి టీన్స్ని, వ్యక్తిత్వంతో పెంటచలానికి కావలసిన గైడ్-లైన్స్పై సంపూర్ణమైన పుస్తకం.
పేజీలు : 240
-
Telugu Paryayapada Nighntuvu – తెలుగు పర్యాయ పద నిఘంటువు
₹300.00చిత్తూరు జిల్లా మహాసముద్రం గ్రామంలో జన్మించిన ఆచార్య జి.ఎన్.రెడ్డి మద్రాసులో విద్యాభ్యాసం చేశారు. ”తెలుగు సాహిత్యంపై ఆంగ్ల ప్రభావం” అన్న అంశం మీద పరిశోధించిన వీరికి 1955లో యం.లిట్. పట్టా వచ్చింది. తెలుగు సెమాంటిక్స్ మీద వీరు చేసిన కూలంష పరిశోధనకు 1962లో మద్రాసు విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టా ప్రదానం చేసింది. భాషాశాస్త్రానికి సంబంధించిన అనేక ప్రసిద్ధ సంస్థలలో వివిధ బాధ్యతలు నిర్వహించారు. రాక్ ఫెల్లర్ పరిశోధకులుగా పూనాలో కొంతకాలం పనిచేశారు. లెక్చరర్ పదవి నుండి విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుల స్థాయి వరకు ఎదిగిన సాహిత్యమూర్తి వీరు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా (1984-1987) పదవీ విరమణచేసిన తర్వాత యు.జి.సి. వీరిని ఎమిరిటస్ ప్రొఫెసర్గా (1988-1989) నియమించింది. అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్రాలను సమర్పించారు. అమెరికాలోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్గా కొంతకాలం పనిచేశారు. వివిధ దేశాలు పర్యటించారు. వీరి పర్యవేక్షణలో సుమారు 40 మంది పరిశోధకులకు డాక్టరేట్, యం.ఫిల్. డిగ్రీలొచ్చాయి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీలలో చాలాకాలం సభ్యులుగా ఉన్నారు. వీరు తెలుగు నిఘంటువు (1973), ఇంగ్లీషు తెలుగు నిఘంటువు (1978), మాండలిక వృత్తి పదకోశం (కుమ్మరం, వడ్రంగం) వంటి ప్రామాణిక గ్రంథాలకు సంపాదకులుగా ఉన్నారు. భాషాశాస్త్రం, సాహిత్యం, సంస్క ృతులపై వివిధ మౌలిక రచనలు చేశారు.
-
The 5 Steps to Success
₹250.00The world ‘Satagopam’ emereged from the original Sanskrit phrase ‘shat (six) gopyam (secrets). The devotees are blessed on their head with the silver crown twice, once to pull ;out 6 evils : Kama (lust), Krodha, Lobha, Moha, Mada (pride), Matsarya (jealousy). The second touch is to infuse six riches : health, wisdom, prosperity, love, fame, and the ultimate satisfaction.
Five steps to success envisages exactly the same principle. It helps to identify and fish out your weaknesses, and to instil the six Aiswaryas. Unlike other foreign P.D.Books, this motivational book exemplifies the Indian traditions and culture based on self-experiences. It emphasises victory at personal level as a basis for the rest to be built upon. Ascend these five steps to experience the real bliss of success ….!
Yandamoori Veerendranath is a rare come-together of an acomplieshed Charted Accountant, a popular writer, a successful film technician, a motivatonal speaker, and a motivating conlumnist for The Hindu. -
The Best Of Yandamuri Veerendranath – ది బెస్ట్
₹120.00అత్యుత్తమమైన పాతిక కథల సంకలనం – యండమూరి వీరేంద్రనాథ్
జడివానలో ఓ రాత్రి ఇరవై రెండేళ్ల అమ్మాయి అతడి అరుగు మీద నిలబడింది. అతడు యువకుడు. లోపలికి రమ్మన్నాడు. ఆ రాత్రి ఆ అమ్మాయి అతడింట్లోనే ఉండిపోయింది. వాళ్లిద్దరి మధ్యా ఏమీ జరగలేదు. అతడి స్నేహితుడొకడు అతడ్ని వెక్కిరించాడు. ఆ అమ్మాయి కచ్చితంగా నిన్ను ఇంపోటెంట్ అనుకుని వుంటుందన్నాడు. మళ్లీ ఒకసారి ఆ అమ్మయి తారస పడింది. అతడు ఆమెను ఇంటికి ఆహ్వానించాడు. ప్లాను వేసి మరీ కరెంటు పోగొట్టాడు. ఒక్క ఉదుటన ఆ అమ్మాయిని తన బిగి కౌగిలిలో బిగించాడు. అప్పుడే జరిగింది ?
1969లో యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ‘అబద్ధం లాంటి నిజం’ మానవ మనస్తత్వంలోని ఓ అట్టడుగు కోణాన్ని చిత్రిస్తుంది. ఈ కథతో పాటు యండమూరి వీరేంద్రనాథ్వారి పాతికేళ్ళ రచనా వ్యాసంగంలో అత్యుత్తమమైన 25 కథలను ఎంపిక చేసి ”ది బెస్ట్” ఆఫ్ యండమూరి వీరేంద్రనాథ్ సంకలనాన్ని వెలువరించారు. 1969-94 సం||ల నడుమ యండమూరి వీరేంద్రనాథ్ రాసిన మంచి కథలు ఇందులో ఉన్నాయి.
ఫేర్వెల్ రాజేశ్వరి, ఆ ఒక్కటి అడక్కు, పురుషోత్తముడి ఫోటో, పట్నం బస్సు, అమ్మాయిలకి మాత్రమే, స్త్రీ / స్త్రీ, చదరంగంలో చచ్చేది, టాన్, వరండా కుర్రాడు, నవ్వే కన్నీళ్ళు, ఉల్లిపాయ, బ్రహ్మర్షి అన్నవి ఈ సంకలనంలో చోటు చేసుకున్న కొన్ని కథల పేర్లు. -