-
Velugu Vennela Deepalu – వెలుగు వెన్నెల దీపాలు
₹150.00”విజయానికి అయిదు మెట్లు” నుంచీ ”టీన్స్ పిల్లల పెంపకం” దాకా నా వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో, …. పాటూ నా అనుభవాలూ, కథలూ కూడా వ్రాస్తూ వచ్చాను. మిగతా రచయితల పుస్తకాలకీ, వీటికీ తేడా బహుశా ఇదే అనుకుంటాను.
దురదృష్టవశాత్తూ, ఇటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాలు పిల్లలు చదవరు. కానీ ఈ పుస్తకాల్లో కొన్ని కథలు పిల్లలకి ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ ఇస్తాయి. అన్నిటినీ క్రోడీకరించి ఒక చోట చేరిస్తే, వాటిని పిల్లలు తెలుసుకునే అవకాశం ఉంటుందనే ఆలోచనే ఈ పుస్తకం.
నా వివిధ వ్యక్తిత్వ పుస్తకాల్లో నుంచి ఏరి కూర్చిన కథల సమాహారం ఇది. ఇందులో కొన్ని విదేశాలకి సంబంధించిన పురాతన గాధలు, మరి కొన్ని బౌద్ధానికి సంబంధించిన పుస్తకాల్లోంచి, ఇంకా కొన్ని ఇంటర్నెట్ నుంచీ స్వీకరించినవి. చాలా వరకూ నావి.
పెద్దలు పిల్లలకి బెడ్రూం కథలు చెప్పటం తగ్గిపోయింది. ‘అసలు మాకు తెలిస్తే కదా చెప్పటానికి’ అంటున్నారు కొందరు. ఈ పుస్తకం ఆ లోటు తీరుస్తుంది. – యండమూరి వీరేంద్రనాథ్
పేజీలు : 232
-
Vijayamlo Bhagaswamyam – విజయంలో భాగస్వామ్యం
₹150.00భార్యా భర్తలు అన్యోన్యంగా వుంటూ పొరపొచ్చాలు లేకుండా కాపురం చేయాలంటే, దాంపత్య విజయంలో సమాన భాగస్వామ్యం పొందాలంటే ఎలా ప్రవర్తించాలో, పరస్పరం ఎలా సహకరించుకోవాలో ఆ విషయాలన్నింటినీ వివరంగా చర్చించారు రచయిత.
దాంపత్యాన్ని ఒక అందమైన కలగా మలచుకోవటానికి, సంసార సహజీవనం సజావుగా సాగటానికి వ్యక్తులు ముందుగా తమను తాము అర్థం చేసుకుని, ఒక అంచనా వేసుకుని పరస్పర సహకారంతో ముందుకు సాగాలంటే ఏం చేయాలో, ఎలా ప్రవర్తించాలో, శాస్త్రీయ దృక్పథంతో చక్కగా వివరించారు రచయిత.
పూర్వపు సమాజానికి ప్రస్తుత సమాజానికి చాలా తేడా ఉంది. వ్యక్తుల అభిప్రాయాలలో ఆలోచనలలో ఎన్నో మార్పులొచ్చాయి. ఆధునిక యోచనల ప్రభావం వల్ల మనుషులలో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఆ సందేహాలను నివృత్తి చేసుకుని ముందుకు సాగిపోవటానికి ఉపయుక్తమైన సమాచారం యీ పుస్తకంలో వుంది. భార్యా భర్తలు ఒకరి ఆలోచనా విధానాన్ని మరొకరు గౌరవిస్తూ, ఇద్దరికీ నష్టం కలగనంతవరకు ఒకరినొకరు అభిమానిస్తూ, గౌరవించుకుంటూ ప్రేమ ద్వారా ఒకరి ఆలోచనను మరొకరి వైపు తిప్పుకుంటూ దాంపత్యాన్ని కొనసాగించినప్పుడే ఆ సంసారం విజయవంతమవుతుంది అంటారు రచయిత. ”ప్రేమంటే రెండు గుండెలు ఒకే ట్యూన్లో శబ్దించటం కాదు. రెండు ఆలోచనలు భిన్నంగా శబ్దించి ఒకే ఆలోచనగా రూపుదిద్దుకోవడం, వంటి ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి.
రచయిత తన విశిష్ట వచనశైలిలో జీవితంలో మానవ సంబంధాల ప్రాముఖ్యతను బాగా వివరించారు. ప్రేమ తత్వానికి, ప్రేమైక జీవన సౌందర్య నిర్వచనానికి, అవినాభావ సంబంధ అనుబంధ బాంధవ్యాల విశ్లేషణకి, అనితర సాధ్యమైన భాష్యాన్ని చెప్పిన విలువైన పుస్తకం ”విజయంలో భాగస్వామ్యం’.
-
Vijayaniki Aidu Metlu – విజయానికి అయిదు మెట్లు
₹300.00మిమ్మల్ని మీరు ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవటం కోసం, మీ మానసిక బలహీనతల్నీ, సమస్యల్నీ అధిగమించడం కోసం, మీ అంతర్గత శక్తులను పఠిష్టం చేసుకోవడం కోసం, మానవ సంబంధాలు మెరుగు పర్చుకోవడం కోసం టెన్షన్, బోర్, నిరాసక్తత పారద్రోలటం కోసం, ఆర్ధికంగా నిలదొక్కుకోవటం కోసం, అంతిమ విజయం సాధించటం కోసం, అందరికీ అర్ధమయ్యే రీతిలో రూపొందించబడిన వ్యక్తిత్వ వికాస పుస్తకం – యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ‘విజయానికి అయిదు మెట్లు’.
ఏదైనా సమస్య మనతోపాటే ఉంటుంది. అది మన హృదయపు గదిలోనే ఉంటుంది. ఆ గదికి తాళం వేసుంటుంది. దాన్ని పారద్రోలటానికి తాళం చెవి మాత్రం దొరకదు. అలాంటి తాళం చెవి ఎలా సంపాదించాలన్నదే ఈ పుస్తకం ముఖ్యోద్దేశం. మనసుగదిలోంచి సమస్యను పారదోలటమే ఈ పుస్తకపు ఆశయం.
మనోవిజ్ఞానానికి సంబంధించిన రచనలు తెలుగులో చాలా తక్కువగా ఉన్నాయి. ఆలోటును తీరుస్తూ, చక్కగా అందరికీ అర్ధమయ్యే భాషలోనే కాక ఒకసారి చదవడం ప్రారంభిస్తే మరి వదలకుండా పాఠకునిచేత చివరంటా చదివించే ఆకర్షణీయమైన శైలిలో, విషయం వివరించిన తీరు బాగుంది.
ప్రపంచం అంతా నిన్ను వదిలిపెట్టినప్పుడు నీతో వుండేవాడే మంచి స్నేహితుడు. పుస్తకం మంచి స్నేహితుడు. అది చెప్పేది వినగల్గితే ఆ స్నేహితుడి కన్నా గొప్ప తెలివైన వాడు ఇంకెవరూ వుండరు. ఎంతో మంది రచయితలు తమ జీవితపుటనుభవాల్నీ, విజ్ఞానాన్నీ కలబోసి అవతలివాళ్ళకు చెప్పటం కోసం అహోరాత్రులూ శ్రమించిన తపనా రూపమే పుస్తకమంటే. అదిగో అలాంటి మంచి స్నేహితుడిని మీకు పరిచయం చేస్తున్నందుకు ఆనందిస్తున్నాం.
-
-
A’nrutham
₹50.00“నువ్వు ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు శ్రీజ. మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. దానిని మనం నమ్మలేం.”
“మనసుని కాదు రాధిక, నన్ను చుట్టుకున్న పరిస్థితులను నమ్ము. పదమూడు ఏళ్ళకే అమ్మానాన్నలు దూరమైతే ఎలా ఉంటుందో తెలుసా? అప్పటివరకు వాళ్ళే నా ప్రపంచం… ఒక్కసారిగా ఆ ప్రపంచం కూలిపోయింది. చిన్నపిల్లని నేను… ఆ వయసులో నాకసలు ఏమీ తెలీదు. ఏదీ తెలీదు! మరో పదిహేను సంవత్సరాల తరువాత, ఇప్పుడు మళ్ళీ నా ప్రపంచం కూలిపోయింది. కానీ ఇప్పుడు నాకు ఏది తెలిసినా… తెలియకపోయినా ఒక్క విషయం మాత్రం బాగా తెలుసు… I can handle this అని.”
“చూడగలగాలే కానీ ప్రతి అబద్ధంలోనూ ఓ నిజం ఉంటుంది. ఆ నిజమే అబద్దానికి ఉనికి.” ఈ కథకు శీర్షిక అనృతం’. అనృతం అంటే అబద్దం. ఆ అనృతంలో కూడా ఓ నృతం (నిజం) ఉండకపోలేదు! ఆ “కొన్నిసార్లు మనం వెళ్ళాల్సిన మార్గమే మనకి తెలుస్తుంది. చేరుకోబోయే గమ్యం కాదు.” గమ్యం ఎలా ఉండబోతుందో, అసలు గమ్యమంటూ ఉంటుందో లేదో తెలియకుండానే కథ అనే గమనాన్ని ఎంచుకున్నాను, పయనించాను. ఫలితం ఈ అనృతం’.
“ఓదార్చే తోడు లేదనిపిస్తే బాధ కూడా మాయమైపోతుంది.” ఈ వాక్యం నేను చూసిన సంఘటనల్లో నుండి రాశాను. తుడిచే చెయ్యే లేదనిపిస్తే కన్నీళ్ళు మాత్రం ఎందుకొస్తాయి? ప్రతి చర్యా, ప్రతిచర్యను కోరే జరుగుతుందేమో!
-
Aagamanam – ఆగమనం
₹70.00మరింత శ్రద్దగా వింటే ఆ మూలుగు మూసివున్న ఆ గది తలుపుల వెనుక నుంచి వస్తున్నట్టు తెలుస్తోంది. అద్దాల తలుపుల వెనుక కర్టేన్స్ వున్నాయి.
లోపల ప్రసన్న కుర్చీని కట్టేసి వున్నాడు. చేతులు – పెడరెక్కలు విరిచి కట్టేసి వున్నాయి. నోటికి గుడ్డ బిగించి వుంది. ఆ మూలుగు వస్తున్నది అతని దగ్గి నుంచే అతడు కట్లు విదిపిమ్చ్కోవటానికి పెనుగులాడుతున్నాడు…
జమున గబ గబా గది తలుపులు తెరిచింది.
ప్రసన్నా ! ప్రసన్నా ! అంటూ పరుగెత్తుకెళ్ళి అతడి చేతులకి కట్టిన కట్లు విప్పింది. అతని నోటికి కట్టేసిన బట్ట లాగేసింది.
నేను రాకపోతే ఎంత ప్రమాదం జరిఎది ? ఆ పని కుర్రాడు, ఆ రాస్కెల్ – ఆవేశంగా అంటోంది.
కట్లు ఊడిపోగానే ప్రసన్న కుర్చీలో నుంచి లేచాడు. అతని శరీరం నిటారుగా అయింది.జమునని చూడగానే అతడు పళ్ళు బిగించాడు. అతని చేతులు వచ్చి జమున భుజాల్ని గట్టిగా పట్టుకున్నాయి….
ప్రసన్న గతం అతణ్ణి వెన్నాడింది. ఇష్టపడి చేసుకున్న శోభ తన అనైతిక ప్రవర్తనతో ప్రసన్నకు మనశాంతి లేకుండా చేసింది. అయితే జమున అతడికి చేరువ అవుతుంది. ఆమె అందరిలాంటిది కాదు ఆమె వ్యక్తిత్వం ప్రసన్నను ఆకర్షిం చింది .
కొందరి ఆగమనం ఆనంద శిఖరాలకి చేరిస్తే, మరికొందరి ఆగమనం పతనపు లోయలలోకి తోసేస్తుంది. జమున ఆగమనం ప్రసన్న జీవితాన్ని ఏ మలుపు తిప్పింది? యద్దనపూడి సులోచనా రాణి అధ్బుత పరిశీలనాత్మక నవల. -
Aalochinchu – ఆలోచించు
₹50.00‘ఆలోచించుకో, నిన్ను నువ్వు తరచి ప్రశ్నించుకో, భగవంతుడు ఉన్నాడూ లేడు, అతనిలో నమ్మకం ఉంది, లేదు – ఇదికాదు ముఖ్యం. నీకు మంచితనంలో నమ్మకం ఉందా?”
‘భగవంతుని ప్రతీక మంచితనం. అయితే మంచి అనే దాని నిర్వచనం ఏమిటి? నీకు మంచిది అనిపించిది యితరులకు మంచి కాకపోవచ్చు. అది వారికి చెడుగా పరిణమించవచ్చు.”
”అందుకనే ప్రతీదానికీ కారణం వెతకమంటాను. ప్రతి పనికీ వెనుక కారణం ఉంటుంది. ప్రతి బాధకూ, ప్రతి దు:ఖానికీ ఎక్కడో ఒకచోట కారణం ఉంటుంది. ప్రతి రుగ్మతకీ కారణం వెదకి మందువేసినట్లే మన బాధలు ఏ కారణం వల్ల మొలకెత్తాయో – ఎక్కడ పుట్టాయో తెలుసుకోవాలి., అందుకనే ఆలోచించమంటున్నాను’ స్వామీజీ లలితతో అన్న మాటలివి.
ఏమని ఆలోచించాలి? ఏం అర్ధం చేసుకోవాలి? తనే ఇటువంటి పనిచేస్తే అతను అర్ధం చేసుకుంటాడా? ఏ భర్తా ఇటువంటి సందర్భాల్లో భార్యని అర్థం చేసుకున్నట్లు తను వినలేదు. అన్ని కావ్యాల్లో, అన్ని నవలల్లో – పురుషుడు స్త్రీని అర్ధం చేసుకోమని, మరో స్త్రీతో తనని పంచుకొమ్మని భార్యని కోరాడే తప్ప ఇటువంటి కోర్కె ఏ భార్యా భర్తని కోరలేదు.
స్త్రీ అబల! ఎందుకని? పవిత్రత, పాతివ్రత్యం, ప్రకృతి – యిలా ఎన్నో కారణాలు చెబుతారు. ప్రతీసారీ స్త్రీని సహించు. సహనం కోల్పోకు, అర్ధం చేసుకో అంటూ అడుగుతారు. తానెందుకు అర్ధం చేసుకోవాలి?
స్త్రీ పురుష ప్రకృతులను ఢీకొని చేసి మిమ్ములను ఆలోచింప చేసే నవల. ప్రతి స్త్రీ తప్పక చదవాలి. ఇది మాలతీచందూర్ అపూర్వసృష్టి.
-
Aasayala Aakharimettu – ఆశయాల ఆఖరిమెట్టు
₹70.00తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు.
ఆశయాల ఆఖరిమెట్టు
మనిషి ఆశాజీవి!
అడుగు అడుగుకీ ఓటమివున్నా – అడుగడుగునా ఆశని వెతుక్కోడం అలవాటు చేసుకున్నాడు. ఎక్కడో దూరాన తళుక్కుమని మెరిసే లక్ష్యాన్ని చేరుకోడానికి అతను ఆరాటపడుతున్నాడు. అతని లక్ష్యసిద్ధికి అనంత అవాంతరాలు.
అతని పేరు యాదగిరి. అందరూ గిరి అని పిలుస్తుంటారు. తక్కువకులంలో పుట్టడం అతని పాపం కాదు, కానీ, అతను కులమతాల ప్రసక్తిలో కొన్నేళ్ళు నలిగిపోయేడు. తక్కువ ఎక్కువలు కులాల్లో వుండవు. గుణాల్లో వుంటాయని అతని నమ్మిక. శ్రద్ధగా చదివేడు, తన లక్ష్యాన్ని డాక్టరై చేరుకున్నాడు. కానీ… ప్రేమలు పగలు, ఈర్ష్య అసూయలు, దగా మోసాలు, పచ్చి స్వార్థం అతని మీద విలయతాండవం చేసేయి. విసిగి పోయేడు. ఓడిపోయేడు. కట్టుకున్న భార్యనే హత్యచేసేడు.
అతని ఆశయాలకు ఆఖరిమెట్టు ఇదేనా?
మాదిరెడ్డి సులోచనగారు మీ ఆలోచనలకు వదిలిన విలువైన ప్రశ్న.
పేజీలు : 150
-
Abhinetri – అభినేత్రి
₹70.00ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి.
అభినేత్రి
”రాజేశ్వరీ ఆర్ట్స్” నాట్యమండలి వారు నిర్వహించే నాటకం చూడటానికి జనం తండోప తండాలుగా రాకపోయినా నాట్యమండలి నడవడానికి డబ్బు వస్తుంది.
దాని మేనేజర్ సభాపతి బయటికి వచ్చి ఒకసారి ఆదుర్దాగా జనాన్ని చూసి వెళ్ళబోయాడు. పరుగెత్తుకుంటూ వచ్చే తబలిస్టు సాయినాథ్ కనిపించాడు.
”రాణి బస్సుస్టాండులో లేదు గురూ!” ఒగరుస్తూ చెప్పాడు.
సభాపతికి ముచ్చెమటలు పోశాయి. ”కనకతార” ఆడతామని టిక్కట్లు అమ్మారు. మధ్యాహ్నం కథానాయికగా వేసే అమ్మాయి రాణి సభాపతితో పోట్లాడింది. అంతమాత్రానికే చెప్పకుండా పోతుందనుకోలేదు.
”ఇప్పుడెలా?”
”పోనీ, దమయంతిని వేషం వెయ్యమనండి.”
”నీకు బుర్రుందా సాయీ! ”కనకతార” కథ కోసం వస్తారటోయ్ జనం. ఆ రాణిది పిటపిటలాడే వయసు, మత్తెకించే అందం, దానికోసం వస్తారు.”
”పోనీ, అనివార్యకారణాల వల్ల నాటకం వెయ్యటం లేదని ప్రకటిద్దాం.”
”ఈ నాటకాల కోసం బంగారం లాంటి పొలం, మేడ అమ్మాను. ఇక కాళ్ళు చేతులే మిగిలాయి. అవి విరగకొట్టుకోమంటావా?”
”మరేం చేద్దాం? అరగంటే వుంది సమయం.”
ఇద్దరూ ఆలోచనలో పడిపోయారు. సభాపతి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తలపంకించాడు….
పేజీలు :159