-
-
Janglee – జంగ్లీ
₹150.00కిషన్చందర్ రాసిన ”జంగ్లీ” (నవల) ఒకనాటి బొంబాయ్ నగర జీవితాన్నీ, మహానగరంగా పెరుగుతున్న ఆ నగర వైరుధ్యాలనూ ప్రత్యేకించి కూటికీ, గుడ్డకూ, గూడుకూ కరువైన సాదాసీదా జనజీవనాన్ని గురించి అత్యంత అద్భుతంగా మన కళ్ల ముందు ఆవిష్కరింపజేస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ పెరుగుదలతోపాటు దాన్ని అంటిపెట్టుకుని ఉండే దారిద్య్రం, సంపన్నతలను మనం ఈ నవల ద్వారా గమనించవచ్చు. జీవిత వైవిధ్యాన్ని, మానసిక అంతర్మథనాన్ని కిషన్చందర్ గొప్పగా చిత్రించాడు. అనామకులైన ఇద్దరు పేద యువతీయువకుల ప్రేమగాథను కష్టాలకూ, కన్నీళ్ళకూ వేదికైన బొంబాయ్ నగర ”ఫుట్పాత్” అలగాజన’ జీవనస్రవంతిలో ఆ ప్రేమజంట ఏ విధంగా జీవనాన్ని సాగిస్తూ కలలు కన్న విషయాన్ని కిషన్చందర్ సాహితీలోకానికి అందిస్తాడు. అందుకే ఆయన భారతీయ సాహిత్య శిఖరంలో నిలవగలిగిన కొద్దిమందిలో ఒకరైనారు.
పేజీలు :186
-
Kale neta
₹500.00మనకు తెలియని మహిళల ఆత్మకథ
పాశికంటి (బల్ల) సరస్వతిగారు తన 69వ యేట (2012) మొదలు పెట్టి తన 76వ యేటకు (2019) పూర్తి చేసిన ఆత్మకత ‘కలెనేత’. ఒక బహుజన (పద్మశాలి), తెలంగాణ ఉపాధ్యాయురాలు రాసిన రెండవ ఆత్మకథ. సుమారు అటుయిటుగా నూటా ఇరువై సంవత్సరాలు ఏడుతరాల నేతపనివారి గెలుపోటముల విషాద విధ్వంసక పోరాట చరిత్ర… ‘కలెనేత’లో సరస్వతిగారు నాలుగోతరం ప్రతినిధి. భారతదేశంలో జాతీయోద్యమ పోరాటం, తెలంగాణాలో రైతాంగ సాయుధ పోరాటం రూపుదిద్దుకుంటున్న కాలంలో సరస్వతిగారు నడక నేర్చుకున్నారు. అక్కడి నుండి ఒక మహిళగా, ఉపాధ్యాయురాలిగా తన జీవితాన్ని, తన బతుకు చుట్టూ విస్తరించి యున్న గ్రామీణ జీవితాన్ని తార్కికంగా అర్థం చేసుకున్నారు… మూడు తరాలు వెనక్కి తన తల్లిదండ్రులైన పాశికంటి రామదాసు, లక్ష్మమ్మలను – తాత వీరయ్య – అతని తండ్రి ధర్మయ్యదాకా లోపలికి వెళ్లారు. అక్కడి నుండి 2019 దాకా తను, సాగిన జీవనయానం – దాని చుట్టూ విస్తరించి ఉన్న జీవితాన్ని అంటే మరో మూడు తరాల సమకాలీన జీవితాన్ని ఆత్మకథలో చిత్రించారు. తెలంగాణా సాయుధ పోరాటం ఉధృతంగా నడిచిన ఆలేరు, జనగామ, వరంగల్లు, నల్గొండ ప్రాంతాలు – అక్కడి గ్రామాలు, చిన్న పట్టణాలు ఈ ఆత్మకథలో కన్పిస్తాయి.
ఇదే ప్రాంతం నుండి ఇంతకన్నా ముందు ముదిగంటి సుజాతరెడ్డిగారు ‘ముసురు’ అనే పేరుతో ఆత్మకథగా రాశారు. సుజాతారెడ్డిగారు ఉపాధ్యాయురాలే. నకిరేకల్ (నల్గొండ) నుండి కరీంనగర్ దాకా అదే పోరాటకాలంలో దొరల జీవన నేపథ్యంలో రాశారు. తెలంగాణాలో బహుజన మహిళ సంఘం లక్ష్మీబాయమ్మ రాసిన మొట్టమొదటి
ఆత్మకథ ‘నా అనుభవములు’. ఈ ఆత్మకథను కాంగ్రెస్ రాజకీయాల నేపథ్యంలో రాసారు. తెలంగాణాలో పురుషులు రాసిన ఆత్మకథలు… సామల సదాశివ ‘యాది’, దాశరథి రంగాచార్య ‘జీవన యానం’, దాశరథి కృష్ణమాచార్య ‘యాత్రాస్మృతి’, కాళోజీ ‘నా గొడవ’, బోయి భీమన్న ‘పాలేరు నుండి పద్మశ్రీ వరకు’, పి.వి. నర్సింహారావు ‘లోపలి మనిషి’, రావినారాయణరెడ్డి స్వీయచరిత్రము’ రాశారు.
ఈ మూడు మహిళల ఆత్మకథలు తెలంగాణా మహిళా సాహిత్యంలో (సుమారుగా ఏడువందల నవలలు వచ్చినా కూడా) ప్రామాణికంగా నిలుస్తాయి………….
బల్ల సరస్వతి – in
-
KarunaKumara Kathalu
₹150.00గ్రామజీవనమే కథా వస్తువుగా తీసుకుని మోతుబరీ భూస్వాముల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయి పూటకు గతిలేని కష్టజీవుల దయనీయ జీవిత గాధలను కండ్లకు కట్టినట్లు చిత్రీకరిస్తూ బలవంతులు బలహీనులపై చూపే పాశవిక ప్రవృత్తినీ, కర్కశ కఠిన మనస్తత్వాలను తూర్పారపట్టి, ఎంతో రసభరితంగా బహిర్గతం చేసిన పరమ కరుణారస హృదయులు శ్రీ కరుణ కుమార. అయన గతించగా ఇక ఆంధ్ర కథా సాహిత్యానికి మిగిలినవి ఆయన కథలే. అప్పుడీ కథలు ఉదయిని, భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, కిన్నెర, స్వతంత్ర మొదలైన పత్రికలలో ప్రచురితమైనాయి. అప్రకటితములుగా కూడా మిగిలిపోయాయి కొన్ని.
ఆంధ్రదేశంలో అడుగునపడియున్న ఉత్తమ సాహిత్యాన్ని అచ్చోత్తించి పాఠక లోకానికి అందించడం వారి ఉన్నతాశయం. ముందు కూడా తెలుగు సాహిత్య లోకాన్ని మరింత సుసంపన్నం చేయగలరని విశ్వసిస్తున్నాను.
– ఇవటూరి కామేశ్వరరావు
-
Kasibhatla Venugopal- 3 Novels (Nenu Chikati, Thapana, Digantham)
₹300.00గత దశాబ్ద కాలంలో “నేను – చీకటి” తెలుగు నవలా సాహిత్యంలో ఒక ప్రభంజనమైతే “తపన” ఒక ఘంఘా మారుతం అయింది. “రాళ్ళెత్తిన కూలి” కథ సాహిత్యంకి పచ్చ బొట్టయింది. స్వతహాగా కవి. వీరి రచనల్లో కవిత్వపు వాసనలు గుబాళిస్తుంటాయన్నది కాదనలేని సత్యం. అది ఆయా రచనలకు అలంకార ప్రాయమే అవుతోంది.
“సర్టిఫికెట్స్ చదువుకి కొలబద్దలైతే నాకు చదువు రాదన్నమాటే! నా దగ్గర ఒక సర్టిఫికెట్ కూడా లేదు మరి! చదువంటే నలభై అయిదేళ్ళ జీవితమే నాకు. భుక్తికి ఇన్సూరెన్సమ్మాకల్తో పాటు ఒ రెండు చిన్న వ్యాపార లావాదేవీల్లో ఇంకింత చిన్న వాటాలు, అంతే!” అంటారు శ్రీ వేణు గోపాల్.
ఇంకా-
“బ్రహ్మచారిని. మంచి పద్యమూ, పద్యమూ – రెండు నాకు ప్రీతి . అమ్మ కి||శే|| మనుమాంబ చిన్నప్పుడే పల్లె వేయించిన “అమరకోశము” చదివించిన “రఘు వంశము” ఈ రోజుకి నాకు ఉపయోగపడుతున్నాయి” అని గురువుని స్మరిస్తుంటారు.
-
Kasyapa Yodhudu – కశ్యప యోధుడు
₹200.00మాతృభూమి రక్షణకై యోధుడుగా మారిన ఒక బ్రాహ్మణ యువకుని కథ. మహారాజు క్షమాపణలు చెప్పటాన్ని అక్కడి ప్రజలు ఊహించలేదు. వారందరూ అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటూ మౌనంగా ఉన్నారు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సముద్రఘోషగా ఖాసి సైన్యం సూర్యదేవాలయాన్ని చేరుకుంది. నిరాయుధులైన అందరినీ వధించిన తరువాత నిశ్ఛేష్టులై విగ్రహాల్లా నిల్చొని ఉన్న రాజును, రాజగురువును ఖాసిం స్వయంగా తన ఖడ్గంతో వధించాడు. అద్భుతమైన సౌందర్యం, ఆధ్యాత్మికత వెల్లివిరిసిన దేవాలయ ప్రాంగణం రక్తసిక్తమై ఒక్కసారిగా భయానకంగా తయారైంది. సూర్యుడు కూడా ఈ ఘోరాన్ని చూడలేనట్టు మబ్బుల వెనకాల దాక్కున్నాడు. కొద్దిసేపటికే వర్షం ముంచెత్తి ఆకాశం తన బాధను తీర్చుకుంది. ఎంతో పవిత్రమైనదిగా చెప్పుకునే మాతృభూమి ముస్లింల వశమైంది.
కశ్యపాపుర మహాసామ్రాజ్యానికి రాజు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన పరిస్తితి ఎందుకొచ్చింది? యోధానుయోధులను కన్న భరతభూమి పోరాటపటిమ లేకుండా ఖాసిం సైన్యానికి ఎందుకు దాసోహమైంది? కట్టుబాట్లు, సాంప్రదాయాలు అంటూ వేదమంత్రాలు వల్లెవేసుకునే సౌమ్యుడైన బ్రాహ్మణ యువకుడు యుద్ధమే ఊపిరిగా బ్రతికే ఖాసింని ఎదుర్కొనే యోధుడుగా ఎలా మారాడు..? ”మాతృభూమిని రక్షించటం అంటే పరాయి దాస్య శృంఖలాల నుండి విముక్తి చేయటమేనా? తరతరాలుగా దేశాన్ని పట్టిపీడిస్తున్న అతి ముఖ్యమైన సమస్యకు పరిష్కారం కనుగొనగలిగాడా?”… తెలుసుకోవాలంటే ఈ నవల చదవక తప్పదు.
-
Katha 2021
₹140.00కల్లోల వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయా?
వాసిరెడ్డి నవీన్
కథారచనకు స్వేచ్ఛావ్యవస్థ తప్పనిసరి.
ఆమాటకొస్తే ఏ రచనకైనా అది అవసరమే. ఇప్పుడు ఆ వ్యవస్థ బలహీన పడుతోంది. అంటే రచయితలకు స్వేచ్ఛ లేదని కాదు. (అప్పుడప్పుడు ప్రభుత్వాలు ఆ స్వేచ్ఛను హరించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అది వేరు.) కానీ కనపడని ఇనుపతెరలు దానికి అడ్డుగా వేలాడుతున్నాయి. రచయిత తన అభిప్రాయాలను, భావావేశాలను, దృక్పథాన్ని, తనకు తెలిసిన జ్ఞానాన్ని, తెలివిడిని తన చుట్టూ ఉన్న ప్రపంచంతో పంచుకోవాలని తపన పడతాడు. రచనకున్న ఈ ప్రాథమిక ఉద్దేశానికి ఆటంకాలు ఏర్పడుతున్న దశ ఇది. మరీ ముఖ్యంగా సృజనాత్మక రచనలకు.
కథలకు కానికాలం వచ్చేసింది.
ఇటీవల కాలంలో కథల నిడివి రానురాను కుంచించుకుపోతోంది. ఎంచు కున్న కథావస్తువుకు అవసరమనిపించినంత, రాయవలసిన అవసరం ఉండి, రాయగలిగి కూడా రచయిత రాయలేకపోవడం విషాదం కదా! పత్రికల్లో సాహిత్యానికి జాగా తగ్గిపోవడము, కథలను ప్రచురించే పత్రికలు కనుమరుగైపోవడము, తెలుగు సాహిత్యాన్ని వారసత్వ సంపదగా
-
Katha Sravanthi (Set of Ten books)
₹670.00కనపర్తి వరలక్ష్మమ్మ కథలు, తల్లూరి నాగేశ్వరరావు కథలు, కరుణ కుమర కతలు, బలివాడ కాంతరావు కథలు, – శశిశ్రీ కాఠ్ఠలు, సంతి నారాయణ కథలు, – సతీశ్ చంద్ర కాఠ్ఠలు, పెద్దింటి అశోక్ కుమార్ కథలు, వి. ఆర్. రసాని కథలు, సన్నాపురెడ్డీ వేంకటరామిరెడ్డి కథలు,
-
KGH Kathalu
₹150.00మనసులో మాట
మనసులోంచి తన్నుకొచ్చే ఆలోచనలన్నీ బిగబట్టి భద్రంగా దాచి ముప్ఫై ఏళ్ళ పైగా చదువులో మునిగి తేలి, ఇన్నాళ్లకు ఈ చదువిక అవ్వదని తెలుసుకుని, ఆ ఆలోచనలకి ఒక స్వేచ్ఛనిచ్చి మళ్ళీ పుస్తక రూపంలో బంధిస్తే వచ్చినవే ఈ కథలు.
మనసు మాతృభాషలోనే ఆలోచిస్తుంది. అందుకని తెలుగులో కాకుండా మరే భాషలోనూ నా ఆలోచనలని నిజాయితీగా రాయడం కుదరని పని. నిరంతర పోటీ పరిశ్రమలో బట్టీలు పట్టి వైద్యుడినైపోయిన నేను, ఎక్కడో ఏ మూలో నేను విన్న కథలు నాలో నన్ను అనే ఒకడ్ని సృష్టించి, ఆ భావం నిద్రాణమైపోకుండా నన్నెప్పుడూ మేల్కొల్పుతూ ఉండి చివరికి ఒక సృజనగా ఈ కథాసంపుటంగా ఇన్నాళ్లకు బయటకు వచ్చింది. – నేనొక మానసిక వైద్యుడిని. ఎందరివో బాధలు, గాధలు వింటాను; అయినప్పటికీ ఈ కథల్లో వారెవరి వివరాలు గానీ, అనుభవాలు గానీ లేకుండా జాగ్రత్త తీసుకుని కేవలం నా అనుభవాలు లేదా పరిశీలనలు మాత్రమే రాశాను. ఈ కథలన్నీ కూర్చొని ఆలోచించి పథకం ప్రకారం రాసినవి కావు, అన్నీ ఆశువుగా ఒక సాయంత్రం సోఫాలో కూర్చునో, ఏ రైలు ప్రయాణంలో తూర్పుకనుమలు చూస్తూనో రాసేసినవి. కాబట్టి నిడివి, లోతు, కథావస్తువు మొదలైన వాటిల్లో తారతమ్యం ఉంటుంది…………..