-
-
Kosaru Kommachi
0₹250.00“…తన ఆత్మ కథను మూడు భాగాలుగా గ్రంధస్తం చేసిన రమణగారు చాలా సంగతులు చెప్పలేదు. సినిమాలు తగ్గినా స్థితిలో సాహితి సర్వస్వం మార్కెట్లోకి వచ్చి అదరగోట్టింది. “భాగవతం” టివి సీరియల్ వచ్చి బాపు-రమణలు ఏ మాత్రం పట్టు కోల్పోలేదని నిరూపించింది. ఆఖరి శ్వాస విడిచేదాకా అయన క్రియేటివిటి తగ్గలేదని “శ్రీరామరాజ్యం” నిరూపించింది. ఇవన్ని చెప్తేనే చరిత్రకు న్యాయం జరుగుతుందనిపించి “కోతికొమ్మచ్చి”లో అయన వదిలేసిన విషయాలతో “కొసరు కొమ్మచ్చి” తయారు చేశాం.
ఆయన కుటుంబ విషయాల గురించి వారి శ్రీమతి శ్రీదేవి, కుమారుడు శ్రీ వరా ముళ్ళపూడి, కుమార్తె శ్రీమతి అనురాధ ముళ్ళపూడి రాయగా……సాహిత్యం గురించి “సాహితి సర్వస్వం” సంకలనకర్త శ్రీ ఏమ్బియస్ రాయగా….
సినిమాల గురించి, టీవీ సీరియల్స్ గురించి శ్రీ బివియస్ రామారావు (సీతారాముడు) రాశారు. అయన రమణగారికి హైస్కూల్ నుండి స్నేహితుడు. దాదాపు వారి సినిమాలన్నిటిలోనూ పాలుపంచుకున్నారు. మంచి రచయిత; సినిమా కళపై అవగాహనా కలిగినవారు. ఆయన బాపు-రమణల సొంత సినిమాల గురించే కాకా రమణ చేసిన సినిమాలన్నిటిని చూసి, వాటి కథాసంగ్రహాలు, ఎంపిక చేసిన సంభాషణలు, తెరవెనుక విశేషాలు-తన జ్ఞాపకాలతో, అనుభవాలతో రంగరించి మరీ అందించారు.
అనేక అరుదైన ఫోటోలతో అచ్చమైన ‘బాపురమణీయంగా’ రూపొందింది……ఈ “కోసరు కోమ్మచ్చి”.
-వరప్రసాద్
-
Kothi Kommacchi
0₹225.00“కోతి కొమ్మచ్చి” పుస్తకం పాటకులనే కాదు, సమీక్షకులను మెప్పించింది. బతుకుపోరాటంలో ఎటువంటి కష్టాలు ఎదురైనా నవ్వుతూ బతకాలని భోదించిన జీవనవేదంగా – మొక్కవోని దైర్యాన్ని,ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని నురిపోసిన వ్యక్తిత్వ వికాస పాట్య పుస్తకంగా – తెలుగునాట వెలసిన, మసలిన ఆనాటి మహానుభావులతో వ్యక్తిగత అనుభవాలను ఆవిష్కరించిన జ్ఞాపకాల మాలికగా – అడుగడుగునా తెలుగు పలుకుబళ్ళను, భాషాప్రయోగాలను వెదజల్లిన చమత్కార మంజరిగా – ఒక శకానికి ఆద్యులైన భావుకద్వయం ఎలా రుపుదిద్దుకున్నారో వివరించే చారిత్రక గ్రంధంగా – రకరకాలుగా వర్ణించారు “కోతికొమ్మచ్చి”ని.
-
Kovvali Navalalu Konni
0₹280.00సామాన్య జనాన్ని రంజింప చేసిన 1000 నవలలను రూపొందించిన ప్రముఖ రచయిత, కర్మయోగి, నిరాడంబరుడు, సాహితీ తపస్వి శ్రీ కొవ్వలి లక్ష్మీనరసింహారావు 1912లో పశ్చమ గోదావరి జిల్లా తణుకులో జన్మించారు. తండ్రి లక్ష్మీనారాయణ, తల్లి కాంతమ్మ, తండ్రి ప్లీడరు గుమాస్తా వృతిని అవలంబించి రాజమహేంద్రవరానికి నివాసం మార్చుకున్నందున లక్ష్మీనరసింహారావుకు కూడా అదే స్వస్థలం అయింది. తల్లి చిన్నప్పుడే గతించడంవల్ల తండ్రే తక్కిన సోదరులతో పాటుగా ఆయనను పెంచి పోషించారు. 14 సంవత్సరాలు నిండేసరికి స్కూల్ ఫైనల్ పరీక్ష రాశారు. స్థానిక గ్రంధాలయంలోని పుస్తకాలన్నింటినీ చదివారు. కొంతకాలం దేశ సంచారం చేశారు.
ఆనాటి సామాజిక, సాహిత్య పరిస్థితులను తీసుకొని శృంగారము, ప్రేమ మొదలగు వానిని జోడించి వ్యావహారిక భాషలో 2, 3 గంటల్లో చదవడానికి అనువైన నవలలను ముఖ్యంగా ‘కాలక్షేపపు నవలలు’ 1000 రాసి ‘వేయి నవలల కొవ్వలి’ అయ్యారు.
కొవ్వలి రచనలలో పైకి ప్రేమ, శృంగారం ఎక్కువగా కనబడినా సాంఘిక దురాచారాల నిర్మూలన, వితంతు వివాహోద్యమం, బాల్య వివాహ నిరసన, వృద్ధ వివాహాల అవహేళన, స్త్త్రి విద్య, కులమత విభేద నిర్మూలన ఇతివృత్తాలుగా వుండి సముచిత ఆదరణ పొందగలిగాయి. అంతేకాక అందరినీ ఆకట్టుకునే రీతిలో రసవత్తరంగా ముఖ్యంగా మధ్య తరగతి స్త్రీలకు ఆమోదకరంగా తన రచనలను రూపొందించారు. ఆ రోజుల్లో (1940 లలో) ఆంద్ర సాహిత్య చదువరులకు చలువ పందిళ్లు కప్పించిన మహా రచయిత శ్రీ కొవ్వలి.
1940లలో శ్రీ కొవ్వలి పేరు ఊరూరా, వాడవాడలా చదువరులున్న ప్రతి ఇంటా జపించబడింది. ఆబాలగోపాలాన్ని ఆనంద డోలికల్లో ముంచి తేల్చింది.
యావత్ ప్రపంచంలోనూ 1000 నవలలు రచించిన ఖ్యాతి శ్రీ కొవ్వలికే దక్కింది.ఆయన రచనలను ఆదరించినంతగా ఆనాడు మరొకరి నవలలను ప్రజలు ఆదరించలేదు. చదువులను ఎగ్గొట్టి వారి నవలలు విస్తారంగా చదివిన ఆనాటి పసివాళ్ళల్లో ఈనాటి పెద్దలెందరో ఉన్నారు.
కొవ్వలికి మద్రాసు, ఉస్మానియా, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ తెలుగు శాఖలు మాన్యతా పత్రాలు (సర్టిఫికెట్స్ ఆఫ్ ఆనర్ ) ఇచ్చి గౌరవించింది.భారత ప్రభుత్వ విద్యాశాఖ కూడా వీరిని సముచితంగా గౌరవించింది.
“తెలుగు నవలా రచనా పధశోధకులు
తెలుగు ప్రజల పట్టనాభిలాష పోషకులు
వెయ్యి నవలలు వేవేగ వ్రాయసములు” ఐన
శ్రీ కొవ్వలి 1975 జూన్ 8న మహాప్రస్థానమొందారు.
– కొవ్వలి లక్ష్మీనరసింహారావు
-
Krishna Sastry Sahityam Modati Samputam (Krishna Paksham) – కృష్ణశాస్త్రి సాహిత్యం – 1 – కృష్ణపక్షము
0₹50.00ఒకసారి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు బెజవాడ నుండి బళ్లారి వెళ్తుండగా రైలు నడకలోని సమాన లయకు స్పందించి…. చుట్టూ వున్న నల్లమల అడవుల సోయగానికి పరవశించి ఆకులో ఆకునై పూవులో పూవునై అంటూ పలవరించారట. భావకవిత్వానికి అది మొదటి శృతి. అక్కడి నుంచీ కృష్ణపక్షం కవితలు ఆవిర్భవించడం మొదలయింది.
ఊహా ప్రేయసి, ఆత్మాశ్రయత్వం, వేదన, ప్రకృతి, విరహం, పదాల పోహళింపు, లయ…. వీటన్నిటి కలగలుపే ”కృష్ణపక్షము’. ఇదంతా 1921లో ప్రారంభమయి 1925లో పూర్తయింది. 1922లో కృష్ణశాస్త్రి భార్యా వియాగంతో కన్నీరు ఖండకావ్యం వచ్చింది. ఆ తర్వాత 1926లో ప్రవాసము, 1928లో ఊర్వశి వెలువడ్డాయి. కృష్ణపక్షము తెలుగు కవితా ప్రపంచంలో ఓ పెను సంచలనాన్ని రేపింది. భావకవిత్వం గొంతు సవరించు కుంది కృష్ణపక్షంతోటే. కృష్ణపక్షాన్ని వెక్కిరిస్తూ శుక్లపక్షం వంటి కొక్కిరింత రచనలు వచ్చినా అవి నిలువలేదు. కృష్ణపక్షం మాత్రం నేటికీ వెన్నెలలు కురిపిస్తూనే వుంది. అలా మిన్నెల్ల విహరించి మెరుపై మెరిసిన కృష్ణపక్షముతో పాటు ఈ సంకలనంలో ప్రవాసము, ఊర్వశి కూడా ఉన్నాయి.
నాకుగాదులు లేవు. నాకుషస్సులు లేవు అంటూ నిర్వేదం ప్రకటించి. ఏననంత శోకభీకర తిమిర లోకైకపతిని! అంటూ ప్రకటించుకుంటారు ఇందులో కృష్ణశాస్త్రిగారు. అంతేనా…. తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ జతగూడి దోబూచి సరసాలనాడి దిగిరాను దిగిరాను దివి నుండి భువికి అంటూ భీష్మించుకు కూచుంటారు. -
-
Kunalamma Padalu – కూనలమ్మ పదాలు
0₹30.00కూనలమ్మ పదాలు – ఆరుద్ర
సాహిత్యం అర్ణవమైతే ….. ఆరుద్ర మధించని లోతుల్లేవు. సాహిత్యం అంబరమైతే …. ఆరుద్ర విహరించని ఎత్లుల్లేవు. అతడు పట్టి బంగారం చెయ్యని సాహిత్య శాఖలేదు, ఆ శాఖపై అతడు పూయించని పువ్వుల్లేవు.
కేవలం కవిత్వాన్నే తీసుకున్నా అతడు చేసినన్ని ప్రయోగాలు, అంత అందంగా చేసినవారు ఆధునిక కవుల్లో మరొకరు లేరేమో! కవిత్వం కాక, కథలు, నవలలు, నాటకాలు, పత్రికా వ్యాసాలు, పరిశోధనలు – ఇలాగ అతని రచనా వ్యాసంగం బహుముఖంగా జరిగింది.
అతని ”కూనలమ్మ పదాలు” ప్రతిపద రమణీయం, పదపద చమత్కారకం. సమకాలిక జీవితం మీద చురుకైన విసుర్లతో, కరుకైన కసుర్లతో ఈ పదాలు రసప్రదాలు.