-
Palegadu – పాలెగాడు
0₹120.00‘పాలెగాడు’ అన్న పదానికి అర్థం – పాలించేవాడు, పరాక్రమవంతుడు, శౌర్యవంతుడని, ఇది రాయలసీమ మాండలిక పదం. విజయనగర రాజులు రాయలసీమ ప్రాంతానికిగానూ కొంతమంది సామంతరాజుల్ని ఏర్పరిచి వారి ఏలుబడిలో ఉండేందుకు వ్యక్తి పరిధిని బట్టి వంద, రెండు వందల గ్రామాలను ఇచ్చి పాలింపజేశారు. అయితే వారి పాలన సామంత పాలనగా కాకా స్వతంత్ర పాలనగా ఉండేది. అలాంటి పాలెగాళ్ళ సంతతికి చెందిన వ్యక్తి రాయలసీమలో ‘రేనాటి సింహం’ గా పిలువబడే వ్యక్తి, ఒక సామూహక శక్తి ఉయ్యాలవాడ నరసింహరెడ్డి.
కుంఫీణీ ప్రభుత్వం కుటిలనీతితో, తన రాక్షస కబంధ హస్తాలతో భారతదేశాన్ని వశం చేసుకొని కిరాతక రాజ్యపాలన సాగిస్తున్న కాలంలో వారిపై 1846 లోనే విప్లవ శంఖం పూరించి, వారి అధికారుల్ని చంపి, భయభ్రాంతుల్ని చేసి రేనాటి సీమలో సంచలనం రేకెత్తించాడు. చారిత్రక సంఘటనలను వస్తువుగా స్వీకరించి రాసిన నవలలు గతంలో అనేకం వచ్చాయి. కాని అజీజ్ చిత్రించిన చారిత్రక నవల పాలెగాడు – నరసింహరెడ్డి సహసగాథ మన హృదయాలను తాకుతుంది. పుస్తకం తెరిచిన తర్వాత మూసివేయకుండా పాఠకులను చదివిస్తుంది.
-
Raktasruvulu – రక్తాశ్రువులు
0₹180.00ప్రపంచ ప్రసిద్ధిగాంచిన విప్లవాలలో చైనా విప్లవం ఒకటి. సాయుధ ప్రజా విప్లవం ద్వారా ప్రజాతంత్ర చైనా ఆవిర్భవించింది. భూస్వామ్య విధానానికీ, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పాటు సాగిన చైనా సాయుధ పోరాటాన్ని ‘లాంగ్ మార్చ్’ గా ప్రపంచ చరిత్రపుటల్లో నిక్షిప్తం చేయబడింది. కష్టాలు, కన్నీళ్లు, రక్తతర్పణంతో నవ చైనా అవతరించింది. అందుకు ఆనాటి ప్రపంచ దేశాల్లోని పురోగామి శక్తులన్నీ తమ అండదండలు తెలియజేశాయి. భారతదేశాన్నుండి కొట్నీస్ వెళ్లి చైనా విముక్తి పోరాటానికి తన సాహసోపేతమైన సేవలందిస్తూ మరణించాడు. అదే కోవకు చెందినవారు నార్మన్ బెతూన్. తమ దేశాలను, కుటుంబాలను విడిచిపెట్టి మరో దేశం వెళ్లి ఆ ప్రజల కోసం నిస్వార్థ సేవలందిస్తూ ప్రాణత్యాగం చేసిన అమరవీరులు. చరిత్ర పుటల్లో, ప్రజల హృదయాల్లో ఆచంద్రతారార్కంగా వారు నిలిచిపోతారు.
నార్మన్ బెతూన్ కమ్యూనిస్టు. కమ్యూనిస్టు చైతన్యం ఆయన నరనరానా జీర్ణమైపోయింది. చైనా విముక్తి పోరాటంలో పాల్గొనడం తన అంతర్జాతీయ కర్తవ్యంగా భావించాడు. ఒకవైపున భీకరపోరాటం జరుగుతున్నా బాంబుల వర్హం కురుస్తున్నా, మొక్కవోని ధైర్యంతో ఒక అడుగు కూడా వెనక్కు వేయకుండా తనకు తానే నిర్దేశించుకున్న కర్తవ్య నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన మానవులలో మహోన్నతుడు నార్మన్ బెతూన్. ఆయన జీవిత అమరగాథే “రక్తాశ్రువులు” అనే నవలగా సిడ్నీ గోర్డన్, టెడ్ అలెన్ లు ఇంగ్లీషులో రాసిన నవలను సహవాసి తెలుగులో రచించారు.
-
Ramayana Vishavruksham – రామాయణ విషవృక్షం
0₹250.00రామాయణ విషవృక్షం – ఏడు ముద్రణలు పొందిన పుస్తకం – రంగనాయకమ్మ
రామాయణ విషవృక్షం మూడుభాగాలుగా వెలువడిన రచన. మొదటి భాగంలో – ఇదీ రామాయణం, చెప్పులు పాలైన సింహాసనం, ఇలాగే జరిగింది అనే మూడు కథలూ, కొనసాగింపుగా రాసిన రెండో భాగంలో అతనికంటె ఘనుడు ! రావొద్దంటే విన్నదా ?, కామశాస్త్రులు, తోడు దొంగలు (రాముడు – సుగ్రీవుడూ), స్నేహబండారం, సీతారావణులు, కాణీఖర్చులేని బహుమానం అనే ఏడు కథలూ, ఐదు లింకులూ – మూడోభాగంలో ఎంతో ఉత్తముణ్ణి! ఎన్ని కష్టాలో నాకు ! మూడో దొంగ (విభీషణుడు), రాముడు పోయాడా ?, పంచాయితీ, చెప్పుల చోట్లో రాముడు, రామరాజ్యం సొగసు అనే ఆరు కథలూ, అట్లాగే రామాయణం చదివితే లాభమేమిటి ? కవిగా వాల్మీకి, కొందరు రామయణ విమర్శకులు, రామాయణ సంస్కృతిని ఎందుకు తిరస్కరించాలి ? అన్న వ్యాసాలూ – ఉన్నాయి.
ఈ పుస్తకంలో మార్క్సిజాన్నీ, ఆంత్రపాలజీని పదునైన శైలిలో తేలికైన మాటలతో పరిచయం చేసారు రచయిత్రి రంగనాయకమ్మ. శాస్త్రీయ దృక్పధం అంటే ఏమిటి ? కల్పనలో స్ఫురించే వాస్తవికత, ప్రక్షిప్తాల ఘోష, పవిత్ర రామాయణం (చిన్నకథ) కొన్ని ప్రశ్నలూ కొన్ని సందేహాలూ, కొన్ని వ్యతిరేక విమర్శలూ, కొన్ని అనుకూల విమర్శలూ శీర్షికల కింద రామాయణానికి సంబంధించిన అంశాలను చర్చిస్తారు రంగనాయకమ్మ, అంతేకాదు –
”ఈ పుస్తకం మొహం చూసిన తర్వాతో, నాలుగు ముక్కలు చదివింతర్వాతో, ఒక అగ్గిపుల్ల గీసి అంటించాలని బుద్ధి పుట్టవచ్చు ధర్మాత్ములకు, అంటిస్తే తగలబడేవి కాగితాలే కాని ఆలోచనలు కావు” అంటున్న రంగనాయకమ్మగారి ఈ పుస్తకం, తెలుగు నాట అనేక వాద వివాదాలకు కేంద్రమైంది. రామాయణాన్ని కొత్తకోణం నుంచి చూపించే సంచలనాత్మక రచన రామాయణవిషవృక్షం. -
Rangula Cheekati Kathalu – రంగుల చీకటి కథలు
0₹100.00ఈ కధల్ని నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఇండ్ల చంద్రశేఖర్ అనే రచయితని నేను ఎరగను. అతడి కధల్ని నేను చదవలేదు. కొన్ని అంతర్జాల పత్రికల్లోనూ, రెండో మూడో ఆదివారం దిన పత్రికల్లోనూ వచ్చినట్లుంది. అతడు ఎలా ఉంటాడో తెలీదు. ఎక్కడి వాడో తెలీదు. ఏ ప్రాంతాన్ని పరిచయం చేస్తున్నాడో తెలీదు. ఏ జీవితాన్ని తెలుగు పాఠకుల కళ్ళ ముందు బొమ్మ కటిస్తున్నాడో తెలీదు. మొత్తం మీద పన్నెండు కధలు నా చేతిలోకొచ్చి చేరేయి. ఆఫీసు పని వత్తిది, ఇటీవల కాలపు సమస్యలు – కధల్ని ఒక్కొక్కటి చదివేసరికి నెల – ఈ నాలుగు మాటలు రాయడానికి మరికాసిన రోజులు –
చంద్రశేఖర్ ది ఒంగోలు పక్కనుండే కందులూరు పల్లె నుంచి వచ్చిన వాడు. హైదరాబాద్ లో స్థిరపడినట్టుంది. ఈ కధల్లో చిత్రించిన వాతావరంణం, జీవితం, నా ముందు రూపు కట్టిన అనేక పాత్రలు, జీవితం చుట్టూ అల్లుకున్న సమస్త భావోద్రేకాలు – ఈ కధలు నవ్విస్తాయి, ఏడిపిస్తాయి కలల్లో నడిపిస్తాయి, సెంటిమెంటుని పండిస్తాయి, వీర ఆగ్రహాన్ని, ఆవేశాన్ని రగిలిస్తాయి.
-చంద్రశేఖర్ ఇండ్ల.
-
Ratnamma Gaari Kodalu Subbamma Gaari Allullu
0₹80.00“ఏం వినాలి? అన్నీ వింటున్నాం . ఈ కేసు ఆగక పోతే, మళ్ళీ ఎప్పుడో వస్తుందట. ఇక భయంతో బతకటమేనా మేము? ‘పెళ్ళి’ అంటే, కాస్త బుద్ధిమంతురాలో కాదో సరిగా చూసుకోనక్కర్లేదా? అది సిగరెట్లు కాల్చినా నచ్చింది. ఎవడి తోటో సినిమాలకు పోయినా నచ్చింది. ‘అందం, అందం’ అని పిచ్చిగా ప్రవర్తించావు. ఇప్పుడు అందంగా లేదా? ఆ దేశం కల్చర్, ఈ దేశం కల్చర్ అంటారు. ఇక్కడి వుద్యోగాలు చాలవా – అంటే, అమెరికాలో కాలు పెట్టడమే ‘గొప్ప’ అనుకున్నావు. అలాగైతే, ఆ దేశపు కల్చర్ ప్రకారమే నడువూ. అది నచ్చదా? తీరా చేస్తే, తిరుగుబోతు కల్చర్ ముండని నెత్తికెక్కించుకున్నావు. ఏం జరిగింది? మాకు జైలు అప్పగించావు.”
“నా భర్తగా, ఒకర్ని కులాలతో సంబంధం లేకుండా ఎంచుకున్నానంటే, ఆ అన్యాయాన్ని నేను వదిలేసినట్టే! ఆ తేడాని నేను పోగొట్టుకున్నట్టే. ఒక మనిషి, ఒక చెత్త గుణాన్ని వొదులుకుంటే, సమాజాన్నంతా మారమని చెప్పినట్టే.”
“ఒక్క మాట చెప్పండి! మీది పెద్ద కులం అనుకుంటారు. మీ ఒంటి మీద పెద్ద కులం ఎక్కడుందో చెప్పండి! “
-
Simhaavalokanam – సింహావలోకనం
0₹120.00సింహావలోకనం – మూలం : యశ్పాల్, అనువాదం : ఆలూరి భుజంగరావు
సింహావలోకనం …. ఈ దేశ ప్రజలకు మానవోచితమైన జీవితాన్ని – జీవనాన్ని, స్వేచ్ఛా – స్వాతంత్య్రాలనూ సమకూర్చడం కోసం నిరంతరం సంఘర్షపథంలో రక్తతర్పణం గావిస్తూ విప్లవాన్ని ఆవాహనం చేస్తున్నాం! – యశ్పాల్
ప్రజల జీవితాన్ని, జీవనాన్ని – కలుషితం చేస్తూ, పాలకవర్గాలు, వారి తొత్తులూ దోపిడి, అణచివేతల్నూ, నిరంతర హత్యల్నూ, దొంగ ఎదురు కాల్పుల్నూ సాగిస్తూ విప్లవ పోరాటాల్ను రక్తపుటేరుల్లో ముంచడంతోపాటు వంచనా శిల్పంతో ప్రజల మేధస్సులు విభ్రమింప చేయ ప్రయత్నిస్తున్నంత కాలం ఈ దేశానికి – సింహావలోకనం – ప్రాసంగికమే. – ఆలూరి భుజంగరావు
-
Swamuloru – స్వాములోరు
0₹120.00అతడో చిల్లర దొంగ. హీనుడు. స్త్రీలోలుడు. క్రూరుడు. డబ్బు వ్యామోహపరుడు. సర్వదుర్గుణాలపుట్ట. తేలికగా డబ్బు సంపాదించాలని స్వామి అవతారం ఎత్తాడు. ఆశ్రమం నిర్మించాడు. భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తా అన్నాడు. రోగాల్ని తగ్గిస్తానన్నాడు. పిల్లలు లేని దంపతులకి పిల్లలు పుట్టిస్తానన్నాడు. మాయలూ మంత్రాలూ చేసాడు. జనాన్ని నమ్మించాడు. వంచించాడు. వక్రబుద్ధులు చూపెట్టాడు. అంతులేని సంపద పోగేసుకున్నాడు. ఆశ్రమంలో అత్యాచారాలు జరిగాయి. హత్యలు జరిగాయి. పెద్ద పెద్ద అధికార్లూ, పోలీసులూ, మంత్రులూ స్వామి పాదాక్రాంతులయ్యారు.
నేటి మన సమాజంలో స్వాములుగానూ, బాబాలుగానూ చలామణి అవుతూ పూజలందుకుంటున్న అనేకమంది దగుల్బాజీల కోవలోని వాడే ఈ స్వామికూడా! స్వామి క్రూరత్వానికి ఒక అబల గురైంది. భర్తని పోగొట్టుకుంది. స్వామి స్వరూపాన్ని గ్రహించింది. స్వామిని కటకటాల వెనక్కి పంపిస్తానని ప్రతిన బూనింది.
ఆ అబల ఆవేదననీ, ఆరాటాన్నీ, పోరాటాన్నీ, ఉద్యమాన్నీ ఉత్తేజపూరితంగానూ, స్వాముల బతుకుల్నీ, బండారాల్నీ, దుష్టత్వాల్నీ, కపటత్వాల్నీ, దుర్మార్గాల్నీ మోసాల్నీ, ధనకాంక్షల్నీ ఆసక్తికరంగానూ, ఉత్కంఠ భరితంగానూ అక్షరీకరించిన నవల ‘స్వాములోరు’.
పేజీలు : 159
-
Telugu Bhashaa Charitra – తెలుగు భాషా చరిత్ర
0₹600.00తెలుగుభాషకు సంబంధించిన ముఖ్యమైన అనేక అంశాలు ఇందులో చోటుచేసుకున్నాయి. గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ”తెలుగు భాషా చారిత్ర’ ను విద్యార్ధులకు బోధించిన అనుభవంతో ఈ గ్రంథం పాఠకుల ముందుకు తెచ్చారు రచయిత ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న.
”తెలుగు భాషా చరిత్ర” ఏడో ముద్రణ ఇది. ఇందులో మరికొన్ని కొత్త అంశాలు చోటు చేసుకున్నాయి. విద్యార్ధులకు, పరిశోధకులకు, ఉపాధ్యాయులకు, భాషాభిమానులకు ఈ గ్రంథం ఎంతగానో వుపయోగపడుతుంది.
విద్యార్ధుల విజయాన్ని కోరుకుంటూ ….- సిమ్మన్న
-
Vidhatha
0₹100.00ప్రజాస్వామ్యం వచ్చినా బానిసత్వం పోలేదు! ఎన్ని రాజకీయ పార్టీలు మారినా రాజరికం మారలేదు! కార్ల్ మార్క్స్ కోరుకున్న సమసమాజం ఎక్కడ? రవీంద్రుడు కలలుగన్న స్వేచ్ఛా స్వాతంత్ర్యం ఏమయ్యింది?
ఈ కర్మభూమిలో ఎంతమంది మహానుభావులు మట్టినా ఇంకా మన జీవితాలు ఇలాగే ఎందుకున్నాయి?మరి దీనికి శాశ్వత పరిష్కారమేమిటి? ప్రజలా? ప్రభుత్వాలా? వ్యవస్థలా? భావవిప్లవమా?వెదకగలిగితే ఈ నవలలో పరిష్కారం కనపడుతుంది!
ఈ నవలలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడం జరిగింది. ఇప్పుడున్న మానవ సంబంధాలలో, అలాంటి ప్రపంచం ఒకటి ఎంతయినా అవసరమని, నిజంగా నమ్మి రాసిన పుస్తకం ఇది. వందమంది నిజాయితీపరులు ఉంటే ఈ ప్రపంచాన్నే మార్చివేస్తానన్న ‘శ్రీ స్వామీ వివేకానందు’ని వాక్యమే ఈ నవలకి ప్రేరణ!
-
Viswa Kathaa Satakam – విశ్వ కథా శతకం
0₹400.00వంద కథల విందు
”రచయిత లక్ష్యం కథ చెప్పటమూ, పాఠకులకు వినోదం కలిగించటమూ కాదు. లోకం కప్పుకున్న ముసుగుల్ని తొలగించి చూడగలగాలి రచయిత. తప్పనిసరిగా ఇది వయ్యక్తికానుభవమే. వ్యక్తులు, పరిస్థితులు, సంఘటనలు అన్నీ రచయిత తను అర్థం చేసుకున్న దృష్టికోణం నుండి మాత్రమే రాయగలడు. తనలో కలిగిన స్పందననే పాఠకులకూ కలుగచేయటానికి ప్రయత్నిస్తాడు. అప్రయత్నంగా కబుర్లు చెప్పినట్టుగా వుంటే కథ పండిందన్నమాట” అంటాడు కథకులందరికీ ప్రాత:స్మరణీయుడు మపాసా.
ఇందులోని ప్రతి కథనూ మపాసా సూచించిన గీటురాయితో పరీక్షించి చూడండి. మీకే తెలుస్తుంది. ఒక్కొక్క కథా సానపట్టిన వజ్రమని.
దేశ సరిహద్దులు దాటి, ఖండాంతరాలను అధిగమించి, శతాబ్దాలకు వారధికట్టి, లోకం చుట్టివచ్చిన కథలివి.
Pages : 462