-
Lenin Kadha
0₹50.00లెనిన్ జీవిత కధను ప్రముఖ రచయిత్రి నన్నపనేని మంగా దేవి గారు పిల్లలకు అర్ధమయ్యే విధంగా చక్కని కధను అందించారు.
వీరు బాల సాహిత్యం లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును, భారతీయ విద్యాభవన్ వారి “సర్వోత్తమాచార్య” జాతీయ పురస్కారాన్ని, విశిష్ట విద్యావేత్తగా పలు అవార్డు లను అందుకున్నారు.
-
-10%
Maha Prasthanam – మహా ప్రస్థానం
0Original price was: ₹80.00.₹72.00Current price is: ₹72.00.”మీ కోసం కలం పట్టి ఆకాశపు దారులంట అడావుడిగ వెళ్ళిపోయే అరచుకుంటు వెళ్ళిపోయే జగన్నాధుని రథచక్రాల్, భూ మార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను ….” అని ప్రకటించినవాడు శ్రీశ్రీ. ఓ వ్యధావశిస్టులారా ! ఏడవకండి, ఏడవకండి, వస్తున్నాయొస్తున్నాయి, జగన్నాధుని రథచక్రాల్ వస్తున్నాయని ఆశ్వాసమందించినవాడు శ్రీశ్రీ. 40 కవితలతో వెలువడిన ‘మహాప్రస్థానం’ తెలుగు సాహిత్యంలో ఓ మైలు రాయి. ఓ మలుపు. ఓ డైనమేటు. ఇప్పటికి 26 ముద్రణలు పూర్తి చేసుకోవటమే దీని విశేష ఆదరణకు నిదర్శనం. 98 పుటల ఈ పేపర్బ్యాక్ పుస్తకానికి ‘మా గోఖలే’ కవర్ డిజైన్ అందించారు.
-
Maha Vishnu Puranam
0₹400.00బ్రహ్మ మానసపుత్రుడైన వశిష్టుని పుత్రుడు శక్తీ. శక్తీ భార్య గర్భవతిగా వుండగా అతడిని, అతడి నూర్గురు సోదరులని బ్రహ్మ రాక్షసుడి చేత చంపించాడు విశ్వామిత్రుడు.
తల్లి గర్భాన్నించి పుడుతూనే ‘ఓం నమో నారాయణాయ…’ నామ స్మరణతో జన్మించాడు శక్తీ కుమారుడు పరాశరుడు. పుట్టిన నాటినించి నిరంతర నారాయణ తపోదీక్షలో మునిగిపోయిన కన్నకొడుకుని చూసి ఆ తల్లి ఆవేశంతో రగిలిపోయింది. నీ తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకో…” అంటూ కొడుకుని రెచ్చగొట్టింది తల్లి. ప్రతీకారేచ్చతో రగిలిపోయిన పరాశరుడు అధర్వణ మంత్ర ప్రయోగంతో సుదీర్ఘ సత్రయాగం ఆరంభించాడు. ఆ యాగ ప్రభావం చేత మహామహులైన దానవులేందరో శలభాల్లా ఎగిరివచ్చి యాగాకుండలంలో పది మలమల మాడిపోయారు.
‘దానవజాతిని సమూలంగా నాశనం చెయ్యవద్దు’ అన్న తాత వశిష్టుడు కోరిక మన్నించి యాగాన్ని విరమించాడు పరాశరుడు. దానవజాతికి మూలపురుషుడైన పులస్త్య బ్రహ్మ సంతసించి “నా జాతి నాశనం కాకుండా కాపాడావు. నీకేం కావాలో కోరుకో…”అన్నాడు.
” మహావిష్ణు పురాణమును సంస్మరణ మాత్రానే గ్రహించవలసిన భవ్య జ్ఞానాన్ని అనుగ్రహించండి.” అని వరం కోరుకున్నాడు పరాశరుడు. అలా భూలోకానికి చేరువైంది ‘మహావిష్ణు పురాణము’. యుగయుగాలుగా మానవజాతిని మాధవ భక్తి పరులుగా, మర్చి మోక్ష మార్గాన్ని చూపుతోంది ‘మహావిష్ణు పురాణము’ ఇంటింటా ఉండదగ్గ పురాణగ్రంధ రాజం ‘మహావిష్ణు పురాణము’.
-
-
Maharani Rudramadevi
0₹125.00గణపతి
ఏ జాతి వర్తనమ్మీ విశ్వవసుధైక
కల్యాణ లబ్ధికి కల్పవల్లి ఏ జాతి శేముషి యెల్ల తంత్రజ్ఞుల
పల్లటీల్ గొట్టించు పని న జేయ ఏ జాతి కీర్తివాహిని కవేరసుతా సు రాపగాదులకు సఖ్యప్రదాయి ఏ జాతి దుర్వార తేజమ్ము శాత్రవ రాజన్యకోటి కారటముగూర్చు ఆ మహాజాతి స్తవనీయ మనుపమాన మప్రతి ద్వంద్వ మకలంక మాంధ్రజాతి అట్టి తెల్గుల కాణాచి యగుచు వెలసె ప్రాజ్యకాకతి పూజ్య సామ్రాజ్యలక్ష్మి
జినదాసాచ్ఛదనాగ్రగణ్యు డొగి శాసించెన్ త్రిలింగమ్ము పెం పునకై కట్టగ పత్తన; మ్మెఱుక దేవుండాన పాలించి పు ‘ణ్యనిధుల్ పుత్రుల పేరుపై ననుమ కొండన్ గట్టి, వారాహ కే తన మెత్తించెను భావి కాకతి ప్రభుత్వ స్థాపనా రంభుడై.
-
Mahathmudu Aayana Sidhantaalu
0₹90.00బ్రిటీషు సామ్రాజ్యవాదానికి అర్జీలు దాఖలా చేసుకుని తన దేశప్రజల్ని విముక్తుల్ని గావించాలనుకున్న మోహన్ దాస్ కరం చంద్ గాంధీ విజయమో, వీరస్వర్గమో నినాదాన్ని ఏ విధంగా ఇవ్వగలిగాడు? ఆ పరిస్థితులకు ఆయన ఎందుకు నెట్టబడ్డాడు? కొల్లాయిగట్టి, సామాన్యజనాన్ని సహాయనిరాకరణోద్యమానికి ఏ విధంగా పురికొల్ప గలిగాడు? “అహింసా” మార్గంలో ప్రజలను కార్యోన్ముఖులను చేసి పాశవికమైన బ్రిటీషు దమనకాండ నెదిరించి కోట్లాది మంది ప్రజలు పాల్గొనే రీతిలో ఉప్పు సత్యాగ్రహానికి ఎట్లా నాయకత్వం వహించాడు?.
ప్రభుభక్తీ పారాయణ కుటుంబంలో జన్మించి, ఆ ప్రభువులనే ఎదిరించగలిగిన శక్తి ఆయనకెట్లా వచ్చింది? ఉద్యమం తీవ్రరూపం దాల్చినపుడు, తన సన్నిహిత స్నేహితులూ, శిష్యులూ నిరసించినప్పటికీ ఉద్యమాన్ని ఎందుకు వెనక్కులాగాడు? బహుశ సంస్కృతుల దేశంలో పుట్టి, ఆ దేశంలోని మతోన్మాదులను తనదైన మార్గంలో వ్యతిరేకించి హిందూ – ముస్లిం ఐక్యతకోసం తన ప్రాణాన్ని ఏ విధంగా వడాడు? కరం చంద్ గాంధీ “బాపూజీగా, జాతిపితగా” ప్రజలచేత ఏ విధంగా కొనియాడబడ్డాడు? రాజకీయాల్లో ఆయన వారసత్వం ఎవరికీ దక్కాలి?.
ఈ ప్రశ్నలన్నింటికీ కామ్రేడ్ నంబూద్రిపాద్ అద్భుతమైన రీతిలో ఈ పుస్తకంలో జవాబులిచ్చాడు. రాహకీయాల్లో ఉన్నవారేగాక, నేటితరం యువకులు సహితం ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయాలి.