-
Sri Datta Puranam
0₹450.00ఇది శ్రీ దత్తపురాణమను మహాగ్రంథము, సంస్కృతమున పరమహంస పరివ్రాజకాచార్య శ్రీవాసుదేవానందసరస్వతీ స్వామి రచించినది, తెలుగులో టీకతో సమర్పింపబడుచున్నది. ఇది ఎన్మిది అష్టకములుగను, ఒక్కొక్క అష్టకము ఎన్మిది అద్యాయముల గుచ్చముగను రూపము దాల్చినది. ఇందు మొత్తము 3500 శోకములున్నవి.
ఈ అష్టాష్టక అష్టాధ్యాయ విషయములు సూచికలో చూడవచ్చును. సంస్కృత వ్యాఖ్యతో కూడిన నాగరిలిపి ప్రతి నాకు లభించినది. దానిని పరిశీలించి తెలుగులో ప్రతిపదార్థతాత్పర్యములను కూర్చినాను. పాఠకమహోదారులకు ఇది ప్రయోజనకారి కాగలదని నమ్మిక.
సర్దము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశ్యానుచరితము అను ఈ అయిదు లక్షణములున్నది పురాణము, అని లక్షణము చెప్పబడినది. ఈ గ్రంథమునందు ఈ లక్షణములున్నవా? అను ప్రశ్నకు శ్రీవాసుదేవానందసరస్వతీ స్వామి వారి సమాధానము : ఈ గ్రంథమున ప్రకరణవశాత్తు ప్రథమకాండమున సర్గము, అంతిమకాండమున ప్రతిసర్గము, మధ్యలో వంశము, మన్వంతరము, వంశ్యానుచరితము వర్ణింపబడినవి కావున దీనిని పురాణమనుట సార్థకమే.
ఇందు ఉపాసనాకర్మజ్ఞానకాండల విషయములను సమాచరించు భక్తుల అనుభవము ప్రతిపాదింపబడినది. తెలుగువారికీ గ్రంథవిషయము నందించుట కర్తవ్యముగా నెంచి మిత్రులు రావి మోహనరావుగారు ప్రోత్సహించగా నే నీ పనికి పూనుకొని యథాశక్తి శ్రమించినాను. నా శ్రమ ఫలవంతమైనదను నమ్మికతో దీనిని మీ ముందు ఉంచుచున్నాను. ఈ కృషిలో నా ప్రతిభావ్యుత్మతులు చాలినవో లేదఆశ్రీ దత్తునకే ఎఱుక. ఎఱుక గల పాఠకులు దతస్వరూపులై మన్నింప ప్రార్థన.
-
-
-
-
Sri Lekha
0₹275.00“ఖారమేలా! నీకు మనిషంటే భయం. నీ నీడంటేనే నీకు భయం. అందుకే నిరంతరం అప్రమత్తతో నిద్రలేకుండా బ్రతుకుతుంటావు. ఇనుప కవచాల కటకటాల మధ్య నిన్ను నీవే బంధించుకుంటూ, చుట్టూ వందలాది సైనికులను నీకు నీవే కాపలా పెట్టుకుని స్వేచ్ఛలేని జీవంలా అరుస్తూ, రోదిస్తూ జీవిస్తున్నావు. ఖారమేలా! ఇదీ ఒక జీవితమేనా? నీవు నిజంగా వీరుడవైతే ఈ పావురం కాలికి దెబ్బ తగిలింది. దీని కంటినీరు తుడవగలవా?” అని ప్రశ్నించింది. శ్రీలేఖ.
“ఏమే సీతలా, సావిత్రిలా ధర్మోపదేశాలు చేస్తున్నావు?”
“అనవసరంగా పౌరాణికపు పోలికలు వద్దు. నేను సీతనైతే, నీవు రావుణుడివి కావలసివస్తుంది.”
“ఓరోరి! ధాన్యకటకపు వన్నెల చిలక కూనిరాగాలు పాడుతుందిరా! దీనిని కట్టేసి మనం జరపబోయే సింహక్రీడలో ఆహారంగా పడేయండి”
“రసవత్తరమైన ఇటువంటి సంభాషణలతో నిండిన ఈ చారిత్రక నవల క్రీ.పూ.200సంవత్సరాలకు పూర్వం నేటి గుంటూరు జిల్లాలోని అమరావతి (ధాన్యకటకము) రాజధానిగా చేసుకుని పరిపాలించిన ఆంధ్ర శాతవాహనుల గాధ.
– ముదిగొండ శివప్రసాద్
-
-
Sri Purnima
0₹430.00మంగళకరమైన ఐశ్వర్యమే …. ‘ శ్రీపూర్ణిమ ‘
ఆచార్యుని అనుశాసనంలాంటి అపూర్వ గ్రంధాలను అందిస్తూ, అద్భుతాలను
సృజియిస్తూ, అఖండ జెండాగా ఎగురుతూ, భక్త పాఠకులపై ఆనందరస వర్షాన్ని
కురిపిస్తున్న మనోహర రచనల రచయిత, సర్వాంతర్యామిత్వాల సంకలనకర్త పురాణపండ
శ్రీనివాస్ లోకకళ్యాణకారకంగా అందించిన మంగళ గ్రంధం ‘ శ్రీపూర్ణిమ’ గ్రంధం .
తెలుగునాట వండర్ ఫుల్ వర్కోహాలిక్ గా పేరుపొందిన శ్రీనివాస్ రమణీయ
సౌందర్యాల రచనాశైలికి, పుస్తక నిర్మాణ చాతుర్యానికి, సంకలనాల
నైపుణ్యానికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ.తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు, సీనియర్ ఐఏఎస్ అధికారి
కె.వి.రమణాచారి సమర్పణలో ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ
ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ పరమ రమణీయ శోభలతో ,
సుసంపన్నంగా అందించిన ఈ మంచి పవిత్ర గ్రంధాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం
కళ్యాణమండపంలో మహాపండితోత్తములు చాగంటి కోటేశ్వరరావు ఆవిష్కరించి
మంగళాశాసనాలు చెయ్యడం ఒక అపూర్వ సన్నివేశమైతే … ఇప్పటికి ఈ శ్రీపూర్ణిమ
సుమారు ఇరవై ఐదు ప్రచురణలు నోచుకోవడం ఒక పవిత్ర సంచలనమని చెప్పక తప్పదు.సుమారు ఏడువందల యాభైపేజీలలో , వేదవిహితమైన మంత్ర భాగాలతో , స్తోత్ర
వైభవాలతో, వాటికి పురాణపండ శ్రీనివాస్ ప్రామాణికమైన వ్యాఖ్యానాలతో ఈ
శ్రీపూర్ణిమ గ్రంధం రూపుదిద్దుకోవడంతో చాలామందితో కూడుకున్న భక్త సమాజం
తమ పూజాపీఠాలలో ఈ శ్రీపూర్ణిమను ఒక అఖండ శక్తిగా ఉంచుతున్నారు.ఒక భౌతిక సాధనంతో కొలవలేని అప్రమేయ అంశాలెన్నో ఈ ‘ శ్రీపూర్ణిమ’ లో చోటు
చేసుకోవడం వల్లనే , ధర్మభావన వాళ్ళ ప్రేరేపితమైన పారమార్ధిక శక్తులుండటం
వల్లనే, వేంకటాచల క్షేత్ర అతీంద్రియ మహనీయతల్ని అద్భుతంగా వర్ణించడం
వల్లనే, సమస్త బ్ర హ్మాండం లోని ప్రతి అణువూ నారసింహుని విరాట్రూపంలోని
అభిన్నరూపమని చక్కని కథతో నిరూపించడం వల్లనే … తేజస్వుల వర్చస్సుగా ఈ
బుక్ సంచలనమై విశేషంగా ఆకర్షిస్తోంది. కేవలం స్తోత్ర భాగాలే కాకుండా
పురాణపండ శ్రీనివాస్ మధ్యలో ఇఛ్చిన స్క్రిప్ట్ సూపర్బ్.ముఖపత్రంపై తిరుచానూరు అలమేలుమంగమ్మ దివ్యతేజస్సుల శోభతో ఈ పుస్తకం నిస్సందేహంగా ఒక అఖండ ప్రకాశంగా భక్త పాఠకులకు షోడశకళాప్రపూర్ణంగా అందిందనేది సత్యం.
బాహ్య ఆవరణలనుండి మనల్ని భగవంతుని వైపు నడిపించిన శ్రీపూర్ణిమ
పుస్తకాన్ని అందుకున్న వారెంత ధన్యులో. మహా మహా తలలు తిరిగిన,
నోరుతిరిగిన వేద పండితులు, పీఠాధిపతులు సైతం శ్రీనివాస్ కృషిని
అభినందించి ఆశీర్బలాలు అందించడం ఒక మంచి మంగళ పరిణామం.శ్రీపూర్ణిమ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మంగళకరమైన ఐశ్వర్యమే !
ఈరోజుల్లో ఒక పుస్తకం రెండేళ్లలో ఇరవైఐదు ప్రచురణలకు నోచుకోవడమంటే ఆ
రచయిత తాలూకు తపస్సు ఫలించినట్లే.అందువల్లనే ఈ రచయిత మరొక అమోఘ రచనా సంకలనం ‘ నన్నేలు నాస్వామి ‘ ఆంజనేయ
ఉపాస్య గ్రంధాన్ని అమిత్ షా వంటి రాజకీయ దిగ్గజం, ఈ దేశహోమ్ శాఖామంత్రి
ఆవిష్కరించారంటే ఇదేమీ మామూలు విషయం కాదు. -
-
Sri Sri Suktulu (Samajikam) 2nd Part
0₹125.00అతని పేరు కొంచెం అతని ఊరు ప్రపంచం
అతడే శ్రీశ్రీ
జాజికం
001
ఢంకాని జోకొట్టాలనీ,
అలల్ని అరికట్టాలనీ, గాలిని ఉరి తియ్యాలనీ ఇదివరకెన్నో ప్రయత్నాలు
జరిగాయి. ఇక ముందు కూడా జరుగుతాయి.
కాని అవి ఎన్నడూ ఫలించలేదు.
ఇకముందు కూడా
ఫలించబోవు.
-
Sri Varaha Maha Puranam
0₹700.00Sri Varaha Maha Puranam
భారతీయ వాజ్మయంలో పురాణాలు అత్యంత విశిష్టమైనవి. అవి లోకానికి మిత్రులవలె హితాన్ని ఉపదేశిస్తాయి. కాబట్టి “మిత్రసమ్మితములు” గా ప్రఖ్యాతి వహించాయి. పురాణాలు ప్రాచీనమైనవైనా ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ప్రకాశిస్తూ ఉంటాయి. అవి మన పురాతన విజ్ఞాన సర్వస్వాలు ( Encyclopaedias ) అటువంటి పదునెనిమిది పురాణాల్లో అగ్రగణ్యమైనది “శ్రీ వరాహ మహాపురణం”.
శ్రీ మహావిష్ణువు వరాహరూపమును ధరించి పాతాళ లోకము నుంచి భూమిని ఉద్దరించిన వృత్తాంతము ముఖ్య సంబంధము కలది, అయినందున ఈ పురాణమునకు వరాహపురాణము అనే పేరు వచ్చింది.
వరాహ పురాణానికి సౌకర పురాణం అని, ఆదివరాహ పురాణం అని పేర్లు కూడా ఉన్నాయి. శ్రీ మహావిష్ణు అవతారపు పేర్లతో ఉన్న మత్స్య, కూర్మ, వరాహ, వామన పురాణాలలో ఇది మూడవది. పురాణపురుషుడగు శ్రీ మహా విష్ణువు యొక్క ‘ఎడమ చీలమండలం’ గా ఈ పురాణం తెలుపబడినది. ఈ పురాణంలో విష్ణు సంబంధమైన అనేక వ్రతాలు, వాని మహత్యం, వివరణ కూడా లభ్యమవుతున్నది.