• Rich Dad Poor Dad

    Rich Dad Poor Dad

    0

    రిచ్ డాడ్ పూర్ డాడ్….

    * ధనికులు అవాలనుకునే వారు ఆదాయాన్ని అధికంగా సంపాదించాలి అనే కట్టుకధని పటాపంచలు చేస్తుంది.

    * మీ ఇంటిని మీరొక ఆస్తి అనుకునే నమ్మకాన్ని సవాలు చేస్తుంది.

    * తమ పిల్లలకి డబ్బు గురించి నేర్పించటానికి నేటి విద్యా విధానం మీద ఎందుకు ఆధారపడకూడదో తల్లిదండ్రులకు         తెలియజేస్తుంది.

    * ఆస్తి, అప్పులకు ఆర్ధికపరమైన శాశ్వత నిర్వచనాలను ఇస్తుంది.

    * మీ పిల్లలు భవిష్యత్తులో ఆర్ధికంగా విజయం సాధించటానికి, వాళ్ళకు ఏం నేర్పాలో మీకు బోధిస్తుంది.

                  రాబర్ట్ కియోసాకీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమంది జనానికి డబ్బు గురించి ఎలా ఆలోచించాలో నేర్పి, వాళ్ళ జీవితాలను సమూలంగా మార్చారు. సూటిగా మాట్లాడడం లోనూ, ధైర్యంగా మూసభావాలని ఎదుర్కోవడంలోనూ అతను పేరు పొందారు. తరచూ అతని వైఖరి సాంప్రదాయక వివేకాన్ని ధైర్యంగా ఖండిస్తూంటుంది. ఆర్దిక స్వాతంత్ర్యాన్ని ఆవేశపూరితంగా సమర్ధించే వ్యక్తీగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు.

                 రిచ్ డాడ్ పూర్ డాడ్ అత్యుత్తమ వ్యక్తిగత ఆర్ధిక గ్రంథం

               “భవిష్యత్తులో భాగ్యవంతులవాలనుకునేవాళ్ళు రిచ్ డాడ్ పూర్ డాడ్ తోనే మొదలుపెట్టాలి.”

    – యు.ఎస్.ఎ.టుడే

                “జనం డబ్బు కోసం కష్టాలు పడటానికి ముఖ్యకారణం, వాళ్ళు ఎన్నో ఏళ్ళు విద్యాలయాల్లో చదువుకున్నప్పటికీ, డబ్బు గురించి అక్కడ ఏమీ నేర్చుకొకపోవటమే! దాని ఫలితం – వాళ్ళు డబ్బు కోసం పనిచేయటం నేర్చుకుంటారు…. కాని, డబ్బు చేత పనిచేయించటం వాళ్ళెన్నడూ నేర్చుకోరు.”

     

    – రాబర్ట్ కియోసాకీ

    399.00
    Add to cart
  • Rich Dad's Retire Young Retire Rich

    Rich Dad’s Retire Young Retire Rich

    0

    శూన్యం నుండి ప్రారంభించి పది సంవత్సరాల కంటే తక్కువ సమయంలో ఎలా ఆర్థిక స్వాతంత్ర్యం పొందాలో చెప్పే పుస్తకం ఇది.

    మీరు కూడా ఎలా చేయగలరో తెలుసుకోండి.

    మీరు జీవితంలో అధిక శ్రమ చేయలేరనుకుంటే

    ఈ పుస్తకం మీకోసమే!
    యౌవనంలోనే ధనవంతులుగా ఎందుకు రిటైర్ కాకూడదు?
    రాబర్ట్ కియోసాకి ప్రపంచంలో కోట్లాది మందికి ధనం పట్ల ఉన్న సాంప్రదాయక ఆలోచనా విధానాన్ని ప్రశ్నించారు. అందులో మార్పు తెచ్చారు. పెర్సనల్ ఫైనాన్స్, బిజినెస్ ఎడ్యుకేషన్ రంగాల్లో పుస్తకాలు, వీడియోల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా శిక్షణ అందిస్తున్నారు. ఆయన రూపొందించిన క్యాష్ ఫ్లో బోర్డ్ గేమ్, సాఫ్ట్ వేర్ గేమ్స్ ఆర్థిక నైపుణ్యాలు పెంపొందించడంలో సరికొత్త దృష్టికోణాన్ని అందిస్తున్నాయి.

    499.00
    Add to cart
  • Rugvedha Aryulu

    Rugvedha Aryulu

    0

    మనం – మన పూర్వీకులు

    నేడు మనదేశంలో మానవుని చూస్తున్నాం. అతని సాంఘిక, రాజకీయ, మున జీవితాన్ని ఎరుగుదుం, అతని ఆహారం, వేషభాషలు, నిత్యావసరాలు ఏమిటో మనకు తెలుసు. “మనకు సంబంధించిన ప్రతి విషయంలోనూ మార్పు జరుగుతూ వుంది. ఈ సంగతిని ఎవరూ కాదనలేరు. కాని ఆ మార్పు ఎంత తీవ్రంగా జరిగిందో తెలుసుకొనుట కషం. ఇందుకు నూరు సంవత్సరాల తేడాతో చారిత్రక కాలాన్ని, అంతకంటే ఎక్కువ తేడాతో చరిత్రకు పూర్వమున్న కాలాన్ని, సాంఘిక, ఆర్థిక, మతదృష్టితో పరిశీలిస్తే, మార్పు నమ్మకంగా తెలుస్తుంది. మనం క్రీ|| శ|| 1956 నుండి కాకుండా క్రీ॥ ఈ 1950 నుండి వెనక్కు పయనించుదాము. ఇక్కడ 1857 ను గురించి ఒకమాట చెప్పాలి.. 1857 లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. 1757 లో ప్లాసీ యుద్ధంలో విజయులైనందున మనదేశంలో ఆంగ్లరాజ్య స్థాపన జరిగింది. కాబట్టి చాలామంది మేధావులు •57ను చాలా చెడుగా భావిస్తారు. కాని 1657, 1557, 1457 మొదలైన సంవత్సరాల్లో అటువంటి అనిష్టాలు మనదేశంలో ఏమీ కానరావు. | క్రీశ 1950 1ఇప్పుడు మనం రాతియుగం, రాగియుగం, యినుపయుగం. తుపాకిమందు.

    ఆవిరి యుగాలను దాటి పరమాణుయుగంలో ఉన్నాం. 2 వాయు మండలంపై మనకు అధికారముంది. గంటకు 500 మైళు వేగంతో పోయే విమానాలు ఆకాశంలో పరుగులు తీస్తున్నాయి. ఇక రైళ్ళు, మోటారు వాహనాల సంగతి చెప్పేదేముంది?

    మనది ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ. 4మన గణరాజ్యానికి రాష్ట్రపతి డా|| రాజేంద్రప్రసాదు. ఆయన మనదేశ రాజధాని

    ఢిల్లీలో వుంటారు. మనకు ముఖ్యమైన సమన్వయ భాష హింది. దేశంలోని వివిధ రాష్ట్రాలలో అస్సామీ, బెంగాలీ, ఒరియా, తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం, మరాఠీ, గుజరాతీ

    మొదలైన సాహిత్య భాషలున్నాయి. ఇవే కాకుండా మైథిలీ, మాగధీ, భోజపురి, ప్రజ, మాళవీ, రాజస్థానీ, కౌరవీ, పహాడీ మొదలైనవి కూడా సాహిత్య భాషలే.

    (అవికూడా సాహిత్య భాషలవుతున్నాయి.) 6. మనం పెట్టుబడిదారీ వర్గ వ్యవస్థలో వున్నాం. 7. మనచేతిలో రాజ్యాధికారాన్ని అట్టి పెట్టుకొనుటకు యుద్ధ విమానాలు, అణు

    బాంబులు పరమాస్త్రాలుగా వున్నాయి. భీషణ ఫిరంగులు, మెషినుగన్నుల సంగతి

    చెప్పనవసరం లేదు. 8. మనదేశంలో హిందూ మతం, ఇస్లాం మతం ముఖ్య మతాలు. కాని

    విద్యావంతులకు ఆ మతాలపై పూర్వంవలె విశ్వాసం లేదు. 9. చదువుకొన్నవారు ఆహార పానీయాల్లో అంటును పాటించరు. వివాహాదుల్లో

    కూడా కులగోత్రాలు కూలుతున్నాయి. 10. సాహిత్యాకాశంలో రవీంద్రుడు,

    జయశంకరప్రసాదు అస్తమించారు. హిందీలో నిరాలా, సుమిత్రానంద పంతు యిప్పుడు కూడా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నారు.

    180.00
    Add to cart
  • Russian Classics

    Russian Classics

    0

     రష్యన్ విప్లవం జరిగిన వంద సంవత్సరాలు గడిపోయాయి. ఈ విప్లవానికి ముందే “జార్” రాజు పరిపాలించే రష్యాలో నూతన ఆలోచనా ధోరణుల పెల్లుబికాయి. పట్టణాలలో డిసెంబరీష్ట్ తిరుగుబాటు, గ్రామాలలో రాచరిక భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, బానిసల, అర్ధబానిస రైతులలో అసంతృప్తి జ్వాలలు పెల్లుబికాయి. వాటి ప్రభావం వల్ల మేధో, మధ్యతరగతి వర్గాలలో ఓ చైతన్యపూరితమైన కదలిక ప్రాభవం అయ్యింది. దీని ప్రబింబమే రష్యన్ మహారచయితల ఆవిర్భావం.

                           రష్యన్ ఆకాశం పై వెలిసిన వేగుచుక్కలు, పుష్కిన్ , గోగోల్, తుర్గెనోవ్,, కుప్రిస్, చేవోహ్, గోర్కీలు . వీరి రచనలు అనువాదాలు కొన్ని తెలుగులో వచ్చినప్పటికీ, రెండో ప్రపంచ యుద్ధం తరువాత అప్పటి సోవియట్ ప్రభుత్వం సాహిత్యాన్ని చాలా ప్రపంచ బాషలలో అనువదించి ప్రపంచమంతా పంచింది. 1945 నుంచి 1985 వరకు అనేక తెలుగు ప్రజలకు పరిచయం అయ్యాయి. సోవియట్ పతనం అనంతరం ఈ సాహితిధార ఆగిపోయింది.

    225.00
    Add to cart
  • Saanukula Aalochana Sakthi - The Power of Positive Thinking

    Saanukula Aalochana Sakthi – The Power of Positive Thinking

    0

    ఇంటర్ నేషనల్ బెస్ట్ సెల్లర్

    ప్రపంచ ప్రసిద్ది పొందిన The Power of Positive Thinking పుస్తకమును ‘సానుకూల ఆలోచన శక్తి’ గా తెలుగులోకి తీసుకువచ్చారు.

    లక్షలాది స్త్రీ పురుషులు వాళ్ళ జీవితాలను విజయవంతం చేసుకోవడానికి సహాయపడింది ది పవర్ అఫ్ పాజిటివ్ థింకింగ్. అనూహ్యమైన అమ్మకాలు సాధించిన ఇందులో డాక్టర్ పీల్ ఆచరణలో విశ్వాసం యొక్క  శక్తిని నిరూపిస్తారు. ఈ పుస్తకంలో వివరించిన ఆచరణీయ కిటుకులతో మీరు మీ జీవితంలో బలం పుంజుకోవచ్చు. పైగా మీ కోరికలను, ఆశలను నేరవేర్చుకోవటానికి అవసరమైన ఉపదేశాన్ని పొందవచ్చు. మీరు నేర్చుకోనేవి :

    . మీ మీద ,మీరు చేసే ప్రతిదాని మీద నమ్మకం పెంచుకుంటారు.

    . గొప్ప శక్తిని, పట్టుదలని పెంచుకుంటారు.

    . మీ లక్ష్యాలను చేరుకోవటానికి అవసరమైన శక్తి పెంచుకుంటారు

    . చింతపడే లక్షణాన్ని పోగొట్టుకుని విశ్రాంతికరమైన జీవనాన్ని సాధిస్తారు.

    . మీ వ్యక్తిగత, వృత్తిపర సంబంధ బాందవ్యాలని మేరుగుపరుచుకుంటారు.

    . మీ పరిస్థితుల మీద అధికారం పొందుతారు.

    . మీ మీద మీరు దయగా ఉంటారు.

     

    పాఠకుడు ఆనందమైన, తృప్తికరమైన,ప్రయోజనకరమైన జీవితాన్ని సాధించడానికి తోడ్పడాలన్న ఏకైక లక్ష్యంతో రాయబడింది ఈ పుస్తకం.

     

    ……. నార్మన్ విన్సెంట్ పీల్

    200.00
    Add to cart
  • Sagara Ghosha

    Sagara Ghosha

    0

     ఇది విశ్వకావ్యం. భూమి చరిత్రే ఈ కావ్యంలోని ఇతివృత్తం. మానవుడే దీంట్లో నాయకుడు. ఇది మనిషి కథ. కోట్ల ఏళ్లనాటి భూమి పుట్టుక నుండి నిన్న మొన్నటి ఘట్టాల వరకు ఇంచుమించుగా మానవుని మహాప్రస్థానంలోని అన్ని సంఘటనలు ఈ కావ్యంలో చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఇది పర్యావరణ పద్య కావ్యం. మనిషి భౌతిక పరిసరాలు అందంగానూ, ఆనందాయకంగాను ఆలోచించాలని తెలియజెప్పే కావ్యం ఇది. ఆదిశంకరాచార్యుని అద్వైత సిద్ధాంత నేపథ్యంలో అన్ని దేశాల సాంస్కృతిక చరిత్రని పరిశీలించి, విశ్లేషించిన  కావ్యం.

                   ఇది 1116 పద్యాలతో నిండిన కావ్యం. ఒక ఆశ్వాసానికి 108 చొప్పున 10 ఆశ్వాసాలు ఉన్నాయి. అవతారికలో 36 పద్యాలు ఉన్నాయి. వృత్తాలు పాతవే అయితే ఇతివృత్తం కొత్తది. ఒకానొక ప్రౌడవయస్కుడైన కవి సాగరతీరంలో కూర్చొని, సముద్రాన్ని వర్ణిస్తూ, తన్మయస్థితిలో ఉంటాడు. ఇంతలో ఒక పిల్ల కెరటం ఒడ్డుకు వచ్చి, ఆ కవి ఒళ్ళో వాలుతుంది. ఒక పసిపాప తన ఒడిలోకి వచ్చినట్లుగా భావించి, ఆ కవి ఆ కెరటాన్ని ప్రేమగా చేరదీస్తాడు. లాలిస్తూ దాని ఒళ్ళంతా నిమురుతూ ఉంటే, దాని వీపంతా జిడ్డు జిడ్డుగా, మడ్డిగా కనబడుతుంది.

    “స్వచ్చంగా ఉండవలసిన నీటికెరటానివి, ఇలా ఉన్నావేమిటి”? అని ప్రశ్నిస్తాడు. తాను ఇరాక్ తీరం నుంచి కొట్టుకు వస్తున్నానని, సద్దాం హుస్సేన్ సముద్రంలో ఆయిల్ పారబోసినప్పటి నుండి తన పరిస్థితి ఇలా అయిందని కెరటం వాపోతుంది. తాను కొద్ది రోజులు కవి ఒడిలోనే విశ్రాంతి తీసుకు వెళతానని ఆర్థిస్తుంది. గుండె కరిగిన కవి ఆ తరంగ బాలికకు కవిత్వంతోనే అతిథి మర్యాదలు చేసి, జోలపాడి నిద్రపుచ్చుతాడు. తరంగం మేల్కొన్న తరువాత అది తిరిగి వచ్చిన తీరాలలోని విశేషాలను చెప్పమని ఆర్థిస్తాడు. అప్పుడా కెరటం చెప్పిన మానవుని జీవిత కథే ఈ సాగరఘోష.

    440.00
    Add to cart
  • Sai Geethamritha Sa(Ga) Ram

    Sai Geethamritha Sa(Ga) Ram

    0

      కె. వివేకానంద రెడ్డి గారు నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం, అలాగే “సాయి కీర్తన” గారు కూడా ఫోన్ ద్వారా పరిచయం .

                 వివేకానంద రెడ్డి గారు చాలాకాలంగా వేలాది ఆధ్యాత్మిక గ్రంధాలని చదువుతున్న వ్యక్తి. నా ఆధ్యాత్మిక నవల “జయం” చదవం ద్వారా వారు నాకు పరిచయమయ్యారు. అయన తరచూ షిర్డీ వెళ్తూ, దారిలో హైద్రాబాద్ లోని మా ఇంటికి వస్తుంటారు. ఆయనది భక్తి మార్గం.

                   పుట్టుకతో అన్యమతస్తురాలైన కుమారి సాయి కీర్తన వారి మతాన్నే కాక హిందూమతాన్ని కూడా లోతుగా అధ్యయనం చేసారు. వీరిద్దరూ సాయి భక్తులే. కుమారి “సాయి కీర్తన”, “సాయి సచ్చరిత్ర” ని చదివి దాని గూడార్ధాన్ని గురించి వివేకానంద రెడ్డి గారితో చర్చించాక, ఈ పుస్తకానికి అంకురార్పణ జరిగింది. వీరు పరస్పర సహాకారంతో ఈ పుస్తకాన్ని రాసారు.

                     ఈ పుస్తకం షిర్డీ సాయి భక్తులకే కాక , ఆధ్యాత్మిక ఆసక్తి గల అందరికి నచ్చుతుందని ఆశిస్తూ.

    230.00
    Add to cart
  • Sakthi Yokka 48 Sutralu
  • Samakalina Bharatiya Kathalu

    Samakalina Bharatiya Kathalu

    0

    ఉర్దూ కథ : శిరీస్ నియాజి

    చిన్నచేప-పెద్దచేప

    అదొక చీకటి రాత్రి! ప్రకృతి నలువైపులా నల్లటి దుప్పటి కప్పుకుంది. దూరాన ఉత్తర దిక్కులోని ఓ మూలలో మాత్రం రక్తం గడ్డకట్టినట్టు ఎర్రబడింది. ఆకాశం,

    పగలంతా తమ కువకువలతో సందడి చేసిన పక్షులు అలసిపోయి తమ గూళ్ళలో దూరి నిశ్శబ్దంగా నిద్రిస్తున్నాయి. కుక్కలు మొరగటం, ఏడ్వటం మానేసి రోడ్లు, సందుల్లో తమ కడుపుల్లో తలలు దూర్చుకుని నిద్రకు ఉపక్రమించాయి.

    ఇలాంటి భయానకమైన రాత్రి ఓ నీడ తూలుతూ నది వైపు వేగంగా కదులుతోంది. అతని భుజాలు ముందుకు వంగి ఉన్నాయి. చిరిగిన దుస్తులు, అరిగిన చెప్పులతో అతను నడుస్తున్న తీరు చూస్తే అతనొక ముసలివాడని, బలహీనమైన వ్యక్తి అని ఇట్టే చెప్పొచ్చు. కాకపోతే కటిక పేదరికమే అతన్ని వయస్సుకన్నా ముందే ముసలివాడిగా మార్చేసింది. అయితే అలాంటి బలహీనమైన వ్యక్తి అర్ధరాత్రి పూట నది దగ్గరికి ఎందుకు వెళుతున్నాడు?

    పైగా ఈ రోజు సాయంత్రమే రేడియోలో ఒక హెచ్చరిక వెలువడింది- “ఈ రోజు రాత్రి భయంకరమైన తుఫాను వచ్చే అవకాశముంది. అందువల్ల చేపలు పట్టే జాలరులు ఎవరూ నదిలోకి వెళ్ళకూడదు” అని. ఆ వార్త అనగానే ఆ జాలరి వెంటనే చేపల కాంట్రాక్టర్ దగ్గరికి ‘ఈ రోజు చేపలు పట్టలేనని చెప్పడానికి’ వెళ్ళాడు. ఆ మాట వినగానే కాంట్రాక్టర్ మండిపడ్డాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ చేపలు పట్టాల్సిందేనన్నాడు. దాంతో తుఫాను రాత్రి అయినా చేపల కోసం నదిలోకి వెళ్ళక తప్పదనుకున్నాడు జాలరి. వెళ్ళకపోతే మరుసటి రోజు కాంట్రాక్టర్ తనకు డబ్బులు ఇవ్వడు. డబ్బు లేకపోతే ఇంట్లో పొయ్యి వెలగదు. తిండిలేక పిల్లలు విలవిల్లాడతారు. ఆకలిని తట్టుకునే వయసు వాళ్ళకింకా రాలేదు.

    | ఓ పడవ నిండా పట్టిన చేపలకి కాంట్రాక్టర్ ఇరవై రూపాయలిస్తాడు. దాంతోనే అతను తనతోపాటు భార్య, ముగ్గురు కూతుళ్ళ కడుపులు నింపుతాడు. నిజానికి అతను పడే కష్టానికి ఇరవై రూపాయలు చాలా తక్కువ. కష్టం తనది, సుఖమూ, సొమ్మూ కాంట్రాక్టర్ ని అతనికి తెలుసు. చలిలో, వర్షంలో అవస్థలుపడి నదిలో చేపలు పట్టి నిజాయితీగా చేపలన్ని కాంట్రాక్టర్ కి చేరుస్తాడు. తన పిల్లల కోసం ఒక్క చేప కూడా తీసుకెళ్ళడు. అయినా కాంట్రాక్టర్ ఎన్నడూ అతనిపట్ల సానుభూతి చూపలేదు..

    160.00
    Add to cart
  • Samaya Yajamanyam

    Samaya Yajamanyam

    0

    పరిచయం

    ఒక ఎగ్జిక్యూటివ్ గా మీ వృత్తిలో మీ సమయ యాజమాన్య సామర్థ్యమే మీ విజయాన్ని లేదా అపజయాన్ని నిర్ణయిస్తుంది. ఒక విషయాన్ని సాధించడానికి సమయం తప్పించరాని, మరో ప్రత్యామ్నాయం లేని వనరు. అది మీ అమూల్యమైన ఆస్తి. దాన్ని ఆదా చేయడమో, ఒకసారి చేజారినట్టయితే తిరిగి రాబట్టుకోవడమో సాధ్యం కాదు. మీరు చేయ వలసిన ప్రతి పనికి సమయం కావాలి. మీరు సమయాన్ని మెరుగ్గా ఉపయోగించే కొద్దీ మీరు మరింత ఎక్కువ సాధించగలుగుతారు. ఫలితాలు మెరుగ్గానూ, మరింత గొప్పగానూ ఉంటాయి.

    చక్కని ఆరోగ్యానికీ, శక్తివంతమైన వ్యక్తిత్వానికి సమయ యాజమాన్యం అత్యంత అవసరం. మీ జీవితం మీద, సమయం మీద మీకున్న నియంత్రణా శక్తిస్థాయి భావన – మీ అంతరంగిక శాంతి, సమన్వయం, మానసిక ఆరోగ్యం స్థాయిని ప్రధానంగా నిర్ణయిస్తుంది. మీ సమయం మీద మీకు నియంత్రణ లకపోతోందన్న మీ భావమే మీ ఒత్తిడికీ, ఆందోళనకూ, కుంగుబాటుకూ ప్రధాన వనరు. మీ జీవితంలోని క్రిటికల్ ఈవెంట్ను మెరుగ్గా ఆర్గనైజ్

    కుంటూ నియంత్రించగలిగినట్టయితే క్షణం క్షణం మీరు మెరుగైన నిహంతో మరింత శక్తివంతంగా పనులు చేసుకుంటూ, మెరుగ్గా నిద్రపోగలుగుతూ మరింత ఎక్కువగా సాధించగలుగుతారు.

    పుస్తకంలో విపులీకరించిన ఆలోచనలనూ, పద్ధతులనూ గించడం ద్వారా మీరు ప్రతిరోజూ రెండు అదనపు ఉత్పాదక గంటలు
    ఉపయోగించడం ద్వారా…………

    150.00
    Add to cart
  • Samkshipta Brahmana Charitra

    Samkshipta Brahmana Charitra

    0

    తెలుగు బ్రాహ్మణుల విస్తృతి, వైవిద్యం జగద్విదితం.

    మూలాలన్ని ఒక్కటే అయినా వీరిలో శాఖలు అనేకం.

    బ్రాహ్మణుల శాఖలు, గోత్రాలు, ప్రవరలు,ఋషులు

    గోత్రపురుషుల గాధలు వీటన్నిటి సంక్షిప్త రూపం – ఈ పుస్తకం.

     

    అక్షరక్రమంలో

    గోత్రాలు, ప్రవరల పట్టిక, ఈపుస్తకంలో ఒక అనుబంధం.

    బ్రాహ్మణులందరికీ ఇది అవస్యపటనీయం.

    250.00
    Add to cart
  • Sampada Srustinche Rahasyam

    Sampada Srustinche Rahasyam

    0

    ధనవంతులయ్యేందుకు ఓ శాస్త్రం ఉంది.

    ధనవంతులు కావడానికి ఓ శాస్త్రం ఉంది. అది.. బీజ గణితం లేదా అంకగణితం వంటి కచ్చితమైన శాస్త్రం. సంపదను సంపాదించే ప్రక్రియను నియంత్రించే కొన్ని చట్టాలున్నాయి. ఈ చట్టాలను నేర్చుకుని, పాలించిన తర్వాత ఎవరైనా నిశ్చయంగా సంపన్నుడు కాగలడు. ఒక నిర్దిష్ట మార్గంలో పనిచేయడం వలన డబ్బు మరియు ఆస్తి యాజమాన్యం లభిస్తుంది. ఉద్దేశపూర్వకంగా గానీ లేదంటే అనుకోకుండా కానీ ఈ నిర్దిష్ట మార్గంలో పనిచేసిన వారు సంపన్నులు అవుతారు. ఈ నిర్దిష్ట మార్గంలో పనులు చేయనివారు ఎంత కష్టపడినా, ఎంత సామర్థ్యం ఉన్నా ‘పేదలుగానే మిగిలిపోతారు. ఇది నిజమని ఈ క్రింది విషయాలు నిర్ధారిస్తాయి.

    ధనవంతులు కావడమనేది పర్యావరణానికి సంబంధించిన అంశం కాదు. ఒకవేళ అదే గనుక నిజమైతే నిరిష పరిసరాలలోని వారంతా సంపన్నులు అవుతారు. ఒక పట్టణంలోని వారో లేదంటే ఒక రాష్ట్రంలోని వారో మాత్రమే ధనవంతులుగా ఉంటారు. ఇతర పట్టణాలు, ఇతర రాష్ట్రాల్లోని వారంతా పేదలుగానే మిగిలిపోతారు. కానీ.. ప్రతిచోటా ధనవంతులు, పేదలు పక్కపక్కనే ఒకే వాతావరణంలో నివసిస్తుంటారు. వారిలో చాలామంది ఒకే వృత్తిలో కొనసాగడం కూడా మనం చూసే ఉంటాం. ఇద్దరు వ్యక్తులు ఒకే ప్రాంతంలో, ఒకే వ్యాపారంలో ఉన్నప్పుడు వారిలో ఒకరు ధనవంతులుగా మరొకరు పేదలుగా ఉన్నప్పుడు.. సంపన్నులు కావడమనేది ప్రధానంగా పర్యావరణానికి సంబంధించిన అంశం కాదన్న విషయం ఇక్కడ అర్థమవుతుంది.

    కొన్ని వాతావరణాలు ఇతరులకన్నా మరింత ఎక్కువ అనుకూలంగా ఉండొచ్చు. | … ఒకే వ్యాపారంలో ఉన్న ఇదరు వ్యక్తులు ఒకే పరిసరాల్లో ఉన్నప్పుడు వారిలో – విఫలమై.. మరొకరు ధనవంతులు కావడం అనేది ఒక నిర్దిష్ట మార్గంలో ……..

    175.00
    Add to cart