-
Ankena
₹100.00దేశ సామాజిక నిర్మాణంలో విముక్తిలేని చీకటి కోణం బడుగువర్గాలది. విషపరిణామాల బారినుండి వారిని కాపాడాలన్నదే ఈ నవల ఉద్దేశం.
“అంకేన ” అంటే ఒక ఫలవృక్షం. నీడనిచ్చి, ఆకలితీర్చి, సేదదీర్చేది. అదే ఇతివృత్తంతో నిగర్వి, అణుకువ, విజ్ఞానం, ఓర్పు, నేర్పులతో స్త్రీ తన చుట్టూవున్న సమాజాన్ని సేవాదృక్పధంతో ముందుకు నడిపించే తీరు ప్రశంసనీయం.
తాను అగ్రసరిగా, వినూత్నమైన భావాలుగా స్త్రీగా కథానాయిక ఈ నవల్లో కనిపిస్తారు. ఈ నవల ఒక నూతన దృకోణాన్ని ఆవిష్కరిస్తుంది.నేటి యువతీ యువకుల వ్యక్తిత్వానికి భిన్నంగా తన రచనలతో ఆలోచింప చేసి మార్పు, చైతన్యం తేవాలన్న రచయిత్రి కాంతి లిల్లీ పుష్పం గారి సంకల్పం ఎంతో ఆదర్శనీయమైనది.
-
Vismrutha Yatrikudu
₹280.00రాహుల్ సాంకృత్యాయన్ అంతర్జాతీయ విఖ్యాతి పొందిన పాళీ, సంస్కృత భాషా పండితుడు. గొప్ప చరిత్రకారుడు, కార్యశూరుడు, సుమారు 10 సంవత్సరాలు సుదీర్ఘ కాలాన్ని స్వాతంత్ర్య యోధులుగా కారాగారాల్లో గడిపిన త్యాగమూర్తి. లెనిన్ గ్రాడ్ విశ్వవిద్యాలయంలో ప్రాచ్య భాషా బోధకుడుగా పనిచేసి ఖ్యాతినొందిన సుప్రసిద్ధ భారతీయుడు. హిందూ సన్యాసిగా, ఆర్యసమాజకునిగా, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బౌద్ధబిక్షువుగా ఈయన పేరు పొందారు. వీరు చేసిన భాషాసేవకు కాశీ పండితులు వీరిని “మహాపండిత్” బిరుదుతో గౌరవించారు. బౌద్ధవేదములు మూడింటిలోను ఈయన నిధి.
అందువల్ల బౌద్ధ విజ్ఞానులు ఈయనకు “త్రిపీఠకాచార్య” బిరుదుని ఇచ్చారు. రాహుల్ జీ సాగించిన పరిశోధనలు భారత సంస్కృతిని 600 సంవత్సరాలు చరిత్రలో సుసంపన్నం చేశాయి. వీరి రచనలు హిందీ భాషకు 400 సంవత్సరాల చరిత్రను చేర్చాయి. వాటిలో హెచ్చువాటిని జైళ్ళలోను లేక నేపాల్. టిబెట్, సిలోన్ లలో రచించారు. వివిధ భాషలలో వీరి గ్రంథాలు 60కి పైగా ఉంటాయి. తెలుగు పాఠకులకు సుపరిచితమైన “విస్మృత యాత్రికుడు” రచనను 1953 సంవత్సరంలో రాశారు.
-
The Dairy Of Misses Sarada – ది డైరీ ఆఫ్ మిసెస్ శారద
₹100.00ఏమిట్రా అంత దీక్షగా చదువుతున్నావ్ ?’ గ్లాసులో మందుపోస్తూ ఒకడు రెండో వాడిని అడిగాడు. పచ్చి మిరపకాయల బజ్జీల పొట్లం విప్పి, బజ్జీల్ని ప్లేట్లో పడేసి, కాగితం పారెయ్యబోతూ ఆగి దాన్ని చదువుతున్న రెండో వాడు తలెత్తి ”ఇదేదో ఇంటరెస్టింగుగా వుందిరా, డైరీలో కాగితంలా వుంది’ అన్నాడు. ఎప్పటిదో పాత డైరీలో కాగితం. ‘ఇదేదో ఆడపిల్ల డైరీలో కాగితంలా వుంది. క్రింద శారద అని వుంది’. మూడోవాడు ఆ కాగితాన్ని లాక్కుని బిగ్గరగా చదవడం ప్రారంభించాడు.
‘మనుష్యులు రెండు రకాలు. తెలివైనవాళ్ళు. తెలివితక్కువ వాళ్ళు – మనుష్యులు రెండు రకాలు. బలమున్న వాళ్ళు. బలం లేని వాళ్ళు – తెలివిగానీ బలముగానీ లేనివాళ్ళు సామాన్యులౌతారు – బలం వున్నవాడు నీతిని వదిలేస్తే పొలిటీషియన్ అవుతాడు – తెలివి వున్నవాడు నీతిని వదిలేస్తే కాపిటలిస్టు అవుతాడు – తెలివైన వాడు నీతిని వదిలెయ్యకపోతే టీచరో మేధావో అయిసంతృప్తి పడతాడు – బలమైన వాడు నీతిని వదిలెయ్యకపోతే శ్రామికుడై శక్తిని ధారపోస్తాడు – నా జీవితాన్ని దర్పణంగా చేసి, నలభై సంవత్సరాల చరిత్రని అందులో ప్రతిబింబంగా చేసి చూస్తే నాకు తెలిసిన సత్యం ఇది. ఎందుకో ఈ రాత్రి నా జీవితంలో ఆఖరిరోజు అనిపిస్తుంది. ఇదే నా డైరీలో ఆఖరిపేజీ అనిపిస్తుంది – శారద”.
రెండు విభిన్నలోకరీతుల్ని రెండు విభిన్న కోణాల్లో యండమూరి వీరేంద్రనాథ్ వివరించిన విలక్షణమైన నవల ‘ది డైరీ ఆఫ్ మిసెస్ శారద’.
-
Vijayam Vaipu Payanam – విజయం వైపు పయనం
₹60.00ఒక శుక్రవారం సాయంత్రం – లైబ్రరీలో కూర్చుని చదువుకుంటున్నాను. దూరంగా మైకులోంచి ద్వారం వెంకటస్వామి నాయుడుగారి వాయులీనం లీలగా వినిపించసాగింది. స్పష్టంగా వినడం కోసం, బయటికొచ్చాను. నాలాంటి మరికొంతమంది లైబ్రరీ బయట కనిపించారు. అందరమూ నిశ్శబ్దంగా ఆ ఫిడేలు మీద గమకాల్ని ఆస్వాదిస్తూ తాదాత్క్యంతో వింటున్నాం.
ఆ సమయంలో ఒక ముఫ్పై ఏళ్ళ వ్యక్తి ఇద్దరు పిల్లల్తో వచ్చి కూర్చున్నాడు. ఆ పిల్లలిద్దరూ ఒకర్నొకరు కొట్టుకుంటూ, అల్లరిచేస్తూ మా మధ్య తిరుగుతూ అల్లరి చెయ్యసాగారు.
అందరికీ అది చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఇక సహించలేక ‘ఇది లైబ్రరీ, మీ పిల్లల్ని గోల చెయ్యవద్దనండి’ అన్నాను కరుగ్గా. అతడు తన నిస్తేజమైన కళ్ళతో నావంక చూసాడు. ‘గోల చేస్తున్నారు కదూ, అవును. పిల్లలు… వాళ్ళ అమ్మ ఇప్పుడే చనిపోయింది. అరగంట తర్వాత ఇస్తామన్నారు. ఆస్పత్రిలో గొడవ చేస్తున్నారని ఇలా తీసుకు వచ్చాను’ అన్నాడు.
అతడి మీద అప్పటివరకూ ఉన్న కోపం జాలిగా మారింది. కోపం జాలిగా, అసూయ ప్రేమగా, ద్వేషం స్నేహంగా, పగ ప్రేమగా, అసమర్ధత సమర్ధతగా, ఆవేశం ఆలోచనగా మారవచ్చు.ఇవన్నీ మన బలహీనతల స్థాయి భావాలు.
కావలసినదల్లా పరిస్థితిని పై స్థాయిలోంచి పరిశీలించగల్గడమే. సమస్యని అవతలి కోణంలోంచి చూడగల్గడమే.
అప్పుడు మనకెవరూ శత్రువులుండరు. మనకి సమస్యలుండవు. ఉన్నా, వాటిని నవ్వుతూనే పరిష్కరించుకోగల స్థిరత్వం మనకి అలవడుతుంది. అదే యండమూరి వీరేంద్రనాథ్ చెపుతున్న ‘విజయం వైపు పయనం’
-
Aakhari Poratam – ఆఖరి పోరాటం
₹100.00‘కృతజ్ఞత అంటే ఏమిటి ? కనుకొలుకుల్లో అశ్రువై నిలిచేది. మాటల్లో లాంఛన రూపం దాల్చేది. అదే కదూ, అందుకే కదూ, మాటలు అందని చోటుకు వెళ్ళిపోయావు. మంచులో తడి వున్న పుష్పాన్ని నా కంటి చివరి బాష్పం చేసి, మేఘరాగం తడి చినుకు పాటచేసి, మౌనరాగం గుండె తూట్లుగా పొడిచేసి మమ్మల్నొదిలేసి అందుకే వెళ్ళిపోయావా ? నిశ్శబ్దంలో కూడా నిన్ను వినగలిగినవాడే నిజమైన స్నేహితుడట. నిజమేనేమో! ఈ నిశ్శబ్దం మరొకరి కోసం చెదరటానికి ఎంత సమయం పడుతుందో. ఇక నుంచీ నేను మాట్లాడే ప్రతి మాటల వెనుక, చదివే పుస్తకాల పుటల – వాక్యాల, శబ్దాల, అక్షరాల మధ్యంతా లీలగా విషాదమే కనపడుతుందేమో”.
స్పర్శకు ఆలోచన తెగింది
సునాదమాల –
మగవాడు పొరపాటున చెయ్యితాకితే ముందు ఇటుక పొడితో, తరువాత కొబ్బరి పీచుతో కడుక్కునే సునాదమాల అనే సనాతనాచారాల అమ్మాయిని, నికుంజ్ విహారి అనే అబ్బాయి ఒక ప్రమాదం నుంచి రక్షిస్తాడు. ఆ రాత్రినుంచీ ఒక అమ్మాయి అతడితో ఫోన్లో రొమాన్స్ చేయటం మొదలు పెడుతుంది. పైకి తులసి మొక్క టైపులా కనపడే సునాదమాలే ఈ విధంగా ఫోన్ చేసి ఏడిపిస్తోంది అని విహారి అనుకుంటాడు. ఫోన్ చేస్తున్నదెవరు ?
ఈ విషయం తెలుసుకోవటానికి ప్రయత్నించిన విహారి అనుకోని పరిస్థితులలో ఒక సి.బి.ఐ. ఆఫీసరును కలుసుకుంటాడు ఆ ఆఫీసర్ ఎవరు ?
సరదాగా సాగిపోతూ అనుకోకుండా అనూహ్యమైన సస్పెన్సుతో మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసే యండమూరి వీరేంద్రనాథ్ నవల ‘ఆఖరిపోరాటం’.
-
Aathade Ame Sinyam
₹100.00‘మీరంతా అలా ఎందుకున్నారు ? నా గురించి ఎవరూ రాలేదేమిటి ?” చుట్టూ చూస్తూ అడిగాడు.
” మీ గురించి ఎవరొస్తారని మీరనుకుంటున్నారు ?”
”ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్లు, నన్ను మీరెవరూ గుర్తు పట్టలేదా ? నేనూ చైతన్యని.”
”అంటే ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచంలో టాప్ స్టార్స్లో ఒకరైన చైతన్య మీరని మీ ఉద్దేశ్యమా ?”
”ఉద్దేశ్యమేమిటి ? నాన్సెన్స్-నేనే చైతన్యని.”
ఒక నర్స్ నవ్వాపుకోలేక మొహం పక్కకి తిప్పుకుంది. కానీ అనుభవజ్ఞుడైన డాక్టర్ ముఖంలో విషాదం తొంగిచూసింది. సానునయంగా అన్నాడు. ”చూడు బాబూ! నీ పేరు సుబ్బారావు. బయట నీ భార్యా కూతురూ ఉన్నారు. నీ బ్రెయిన్ సెల్స్ పూర్తిగా చచ్చిపోక ముందే ఆక్టివేట్ చేయడానికి ప్రయత్నించు….”
అతడొక సినిమా హీరో. సినిమా షూటింగ్ జరుగుతూ వుండగా ఏక్సిడెంటయి స్పృహ తప్పింది. స్పృహ వచ్చేసరికి అతడు ఆసుపత్రిలో ఉన్నాడు. డాక్టర్లు, నర్సులు అందరూ అతడిని సెక్రటేరియట్ గుమాస్తాగా గుర్తించారు. తాను సినిమా హీరోనని నిరూపించుకోవటానికి అతడు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరికి కన్న తల్లి కూడా అతడిని కొడుకుగా గుర్తించటానికి నిరాకరించింది. కారణం ?…..
అడుగడుగునా సస్పెన్స్తో ఆద్యంతమూ ఉత్కంఠతో నిండి ఉక్కిరిబిక్కిరి చేసే సస్పెన్స్ థ్రిల్లర్. అతడే ఆమె సైన్యం.
-
Abhilasha – అభిలాష
₹90.00‘మనిషి మనసంత కుత్సితమైనదీ, అనూహ్యమైనదీ. మరొకటి లేదని నా ఉద్దేశ్యం. పాతిక సంవత్సరాలు క్రిమినల్ లాయరుగా పనిచేసి నేను కనుక్కున్న దేమిటంటే, ఈ ప్రపంచంలో ప్రతి మనిషీ క్రిమినలే. కొందరు చట్టపరిధిలోకి వస్తారు, కొందరు రారు. నేను రెండో రకానికి చెందినవాణ్ని అని నాకు తెలుసు. అయినా మనసుని అదుపులో పెట్టుకోలేక పోయేవాణ్ణి. పొద్దున్నే దేవుడి పూజ చేసి బెడ్రూమ్లోకి వచ్చి పధ్నాలుగేళ్ళ అమ్మాయిని నిద్రలేపటం చిత్రమైన సంతృప్తినిచ్చేది – లేపేముందు మోకాళ్ళమీద గౌనుసర్దటం, ఇంకో రెండు మూడేళ్ళు పోయాక తొలగిన పైట సర్దకుండా లేపటానికి ప్రయత్నించటం అలవాటయింది. నేను కొద్ది కొద్దిగా ఫెటసిస్ట్గా మారసాగేను. ఒకరోజు బాత్రూమ్లో నాకంటిని పుల్లతో పొడిచావుకూడా”.
వింటున్న అర్చన శిలే అయింది. ఇంత నిజాన్ని ఆస్వాదించే శక్తి ఆమెకు లేకపోయింది. ప్రొద్దున్నే పూజగదినుంచి సరాసరి తన గదికి వచ్చి ‘లే అమ్మా లే, ఎనిమిదవుతుంది’ అనితట్టి లేపే మావయ్య తన స్వంతమావయ్య మనసులోనూ, చర్యవెనుక ఇంత ఘాతుకమైన ఆలోచన వుందా ?
ఆమె సిగ్గుతో కుదించుకుపోయింది. ఆయన తనగదిలో ఉన్నప్పుడు స్వంతతండ్రే ఉన్నట్టు ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించేది! అనుక్షణమూ తన కదలికల్నీ ఒంపుల్నీ పరిశీలిస్తూ ఉండేవాడన్నమాట. ఇంత కాలం బైరాగే ఫెటసిస్ట్ అనుకుంటూ వచ్చింది. తెలివి తక్కువవాడు కాబట్టి వాడు బైటపడేవాడు. అయినా ఇంత చిన్న విషయం కనుక్కోలేకపోయిందంటే ఏమైనవి తన తెలివితేటలన్నీ ?
సరికొత్త టెక్నిక్తో తెలుగు నవలను కొత్తదారికి మళ్ళించి పాఠకలోకాన్ని సస్పెన్సుతో పరవళ్ళు తొక్కించిన యండమూరి వీరేంద్రనాథ్ నవల ‘అభిలాష’ ఉరిశిక్షకు దగ్గరవుతున్న కొద్దీ, చిక్కనవుతున్న సస్పెన్స్ ఉరిత్రాడులా చిరంజీవి మెడకు చుట్టుకోకముందే – ఆంధ్రజ్యోతి వారపత్రిక పాఠకుల తాపత్రయాన్ని ఆకాశమంత ఎత్తుకు, నక్షత్ర సీమలపైకి, గెలాక్సీలను దాటించి, సంభ్రమాశ్చార్యానందాలలో పడగొట్టి పరవశింపచేసిన ఫెంటాస్టిక్ నవల ‘అభిలాష’.
-
Agni Pravesam – అగ్ని ప్రవేశం
₹90.00ప్రేమలో పడటాన్నీ, ప్రేమించటాన్నీ, ప్రేమించబడటాన్నీ ఒకటేలా భావిస్తారు చాలామంది. ఇద్దరు వ్యక్తులు కలుసుకుని, ఒకర్నొకరు అద్భుతమైన వ్యక్తులుగా గుర్తించుకోవటంతో మొదలైన ఈ ప్రేమ, తన అద్భుతాన్ని కోల్పోకుండా వుండాలంటే యిద్దరికి బేసిక్గా కొన్ని అర్హతలు వుండాలి.
ప్రేమించటానికి ముఖ్యమైన అర్హత వ్యక్తిత్వం. ప్రేమించటానికి ముఖ్యమైన అనర్హత ఆధారపడటము.
ఒక పసివాడు ఎదుగుతుంటే, అతడి వ్యక్తిత్వాన్ని నిర్దేశించేవి అతడి తల్లిదండ్రుల తెలివితేటలు, వారసత్వం, జీన్స్, డబ్బు-ఇవేవి కావు. అతడి చుట్టూ వున్న పరిసరాలు. అందులో అన్నిటికన్నా దగ్గరయిన, అతి ముఖ్యమయిన పరిసరం తల్లి.
తల్లికడుపులోంచి బయటి కొచ్చి మొట్టమొదటిసారి స్వతంత్రంగా ఊపిరి పీల్చుకునే శిశువులాగానే, తల్లిదండ్రుల ప్రభావం నుంచి బయటికొచ్చి స్వతంత్రంగా, జీవిత సవాళ్ళను ఎదుర్కోవటం ప్రారంభించిన మనిషి, ఆ పరీక్షలో ఓడిపోతే మాడి మసైపోతాడు. గెలిస్తే పునీతుడవుతాడు, స్త్రీకయినా పురుషుడికయినా ఈ పరీక్ష జీవితంలో ఏదో ఒక స్టేజిలో తప్పదు. ఇదే అగ్ని ప్రవేశం.
భిన్నమైన కథతో, విభిన్నమైన పాత్రలతో, స్త్రీ సమస్య గురించి ఇంతకు ముందు ఏ రచయిత్రీ వ్రాయనంత సూటిగా తనదైన శైలిలో, సస్పెన్సు, టెన్షన్ మేళవించి యండమూరి వీరేంద్రనాథ్ వ్రాసిన ప్రయోజనాత్మక నవల ‘అగ్నిప్రవేశం’.
-
Anamakudu – అనామకుడు
₹15.00ధనస్వామ్య దుర్గమైన అమెరికాలో 1876లో ఓ కటిక నిరుపేద కుటుంబంలో పుట్టాడు జాక్లండన్. అతని జీవితం ఒక అనుభవాల గని. అదే అతణ్ణి రచయితగా చేసింది. రచయిత కావాలనేది అతని జీవితాశయం.
జీవితం మధించి అజరామర కావ్యాలు, కథలు, నవలలు సృజించిన శిల్ప సామ్రాట్టుల్ని ఆపోశన పట్టాడు. మానవ పురోగమన మార్గాలు తెరచిన మార్క్స్ ప్రభృత ప్రవక్తల రచనలు జీర్ణించుకున్నాడు. వికసించిన శాస్త్రీయ దృష్టితో, తన బాల్య కౌమారాలలో చెరగని పదచిహ్నాలకి అద్భుతంగా అక్షరరూపం ఇచ్చాడు. ‘జీవితం, మేధస్సు కలబోసి ప్రపంచాన్ని కుదిపివేసిన యాభై సంపుటాలు రాసి’ నలభయ్యో యేట జీవితం నుంచి నిష్క్రమించాడు.
తెలుగు పాఠలోకానికి చిరపరిచితమైంది జాక్ లండన్ ‘ఉక్కుపాదం’ నవల, పెట్టుబడిదారీ వ్యవస్థ మీద ఎగరేసిన తిరుగుబాటు జండాగా ప్రజల మనోవీధుల్లో కలకాలం రెపరెపలాడుతూనే ఉంటుంది.
లక్షల మెదళ్ళను కదలించిన జాక్లండన్ కలం నుంచీ వెలువడ్డది ‘మెక్సికన్’ అనే ఈ కథ. ఆద్యంతం ఉత్కంఠతో చదివించే, విప్లవోద్రేకంతో కదిలించే ఈ కథ జాక్లండన్ రాసిన కథలన్నింట్లో గణగణమండే కాగడా లాంటిది. -
Anando Brahma – ఆనందో బ్రహ్మ
₹100.0013 ముద్రణలు పొందిన యండమూరి వీరేంద్రనాథ్ నవల
యండమూరి వీరేంద్రనాథ్
కోనసీమ కొబ్బరాకు – గలగలా గోదావరి …. ఆ ఇసుక తిన్నెల మీద నుంచి గాలి తరంగాల్లోంచి వచ్చే వేద పఠనంలా ఒక కుర్రవాడు ఎగిరి పట్నం వచ్చిపడ్డాడు. ఉక్కిరి బిక్కిరి అయ్యేడు.
ఓ ఇరవై నాలుగేళ్ల గృహిణి అతడికి లలితంగా సేద తీర్చింది.
అది ప్రేమా ? ఆకర్షణా ? స్పందనా ? సెక్సా?
ఆ బంధం నిర్వచనం ఏమిటి ? అమ్మాయిలయితే స్వీట్ సిక్స్టీన్ అంటారు. మరి అబ్బాయిలకి స్వీట్ ఎయిటీనా ?
నవల 2054 ఎ.డిలో మొదలవుతుంది. మళ్ళీ అక్కడి నుండి వందేళ్ళు వెనక్కు మళ్ళుతుంది. అబార్షన్కు తండ్రిని డబ్బడిగే పెళ్ళికాని కూతురు దగ్గర్నుంచి, అనిర్వచనీయ ఆత్మీయబంధం పెనవేసుకున్న సోమయాజీ మందాకినిల వరకూ ఎన్నో విలక్షణ పాత్రలు తారసిల్లే అపురూపమైన నవల ‘ఆనందో బ్రహ్మ’. ఫ్యూచరాలజీకి పాస్టాలజీ మిక్సు చేసి అచ్చ తెలుగులో యండమూరి వీరేంద్రనాథ్ అల్లిన లలిత పదాల సన్నజాజి పందిరి ‘ఆనందోబ్రహ్మ’. -
Ankitam – అంకితం
₹80.00ఆందోళనని భూతద్దం లోంచి చూస్తే భయం అవుతుంది. అయితే ఆమె పరుగెడుతున్నది ఆందోళనతోనూ భయంతోనూ కాదు. భర్తతో కాపురం చేసిన ఏడాదికాలంలో భయమూ, ఆందోళనా లాంటి స్థాయా భావాల్ని ఆమె ఎప్పుడో దాటిపోయింది. ప్రస్తుతం ఉన్నవి కసీ, పట్టుదల. కాళ్ళలోనూ కనబడుతుంది. అయినా అతడినుంచి దూరంగా పరుగెత్తలేకపోతోంది. అతడు క్రమక్రమంగా దగ్గరవుతున్నాడు. అతన్నించి ఎలాగయినా రక్షించుకోవాలన్నదే ఆమె ప్రయత్నం. తనని కాదు, తన కొడుకుని. అంకిత్ ఎనిమిదేళ్ళ కుర్రాడు. ‘ఇలాంటి కొడుకు తమకుంటే బాగుండును’ అని ప్రతి తల్లీదండ్రీ అనుకునే లాంటి అందమైన చురుకైన కుర్రాడు. అటువంటి కుర్రాడికి ఒక సమస్య వచ్చింది. మొదట్లో అది చాలా చిన్న సమస్య అనుకున్నాడు అతడి తండ్రి.
కానీ చూస్తుండగానే అది పర్వతంలా పెరిగిపోయింది. ఉప్పెనలా కబళించి వేయటానికి ముందుకు దూకింది. అతడినీ అతడి తండ్రినీ రక్షించగలిగేది ఆ పరిస్థితుల్లో ఒక్కరే.
అంకిత్ తల్లికి తాళి కట్టిన భర్త!
తండ్రంటే ఎలా వుండాలి ? కొడుకంటే ఎలా వుండాలి ? కుటుంబమంటే ఎలా వుండాలి ? దిగజారిపోతున్న బాంధవ్యాల బంధాన్ని సున్నితపు సెంటిమెంటు తీవెల్తో బంధించి. అనురాగశృతుల్ని మ్రోగించిన నవల ‘అంకితం’.
సెంటిమెంటు, ఆర్ధ్రత, సస్పెన్సుల మేళవింపుల సంచలన రచయిత యండమూరి వీరేంద్రనాథ్ సంతకం ‘అంకితం’.
-
Antarmukham – అంతర్ముఖం
₹100.00తులసిదళం నవల ద్వారా నవలా సాహిత్యంలో సంచలనం సృష్టించిన యండమూరి ఈ నవలలో మానవ సంబంధాలని అత్యద్భుతంగా విశ్లేషించారు. తెలుగు నవలా సాహిత్యంలో ఈ నవల చిరస్థాయిగా ఉంటుంది. ప్రతి పుస్తకాభిమాని చదివి గుండె లోతులో దాచుకోవలసిన భావాలూ ఈ పుస్తకంలో ఉన్నాయి. ప్రతి గ్రంధాలయంలోను ఉండాల్సిన పుస్తకం ఈ నవల.
– ఇండియాటుడే
******
యండమూరి రచనా జీవితంలో ఈ పుస్తకం అత్యుత్తమ మైనదని ఆయన ప్రకటించడం అతిశయోక్తి కాదు.
– ఈనాడు
******
ప్రతి పేజీ లోనూ గొప్ప వాక్యాలు ఉన్నాయి. ప్రతి వాక్యంలోనూ గొప్ప గొప్ప భావాలున్నాయి. ప్రతి పాఠకుడి గుండెని కదిలిస్తుంది. “నేను వయసులో ఉన్న వృద్ధ శవాన్ని జ్ఞానంతో శైశవాన్ని” లాంటి గొప్ప భావాలూ ఎన్నో…”
– ఆంధ్రజ్యోతి