• Suswarala Lakshmi M S Subbalakshmi

    Suswarala Lakshmi M S Subbalakshmi

    0

    ఇదొక జీవనరాగం. విశ్వవిఖ్యాత కర్నాటక సంగీత విద్వాంసురాలు శ్రీమతి ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి జీవితం ఆధారంగా శ్రీమతి పల్లవి రచించిన నవల. ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి తొలిదశలో చలనచిత్ర నటిగా మీరా వంటి చిత్రాలలో నటించింది. తర్వాత సదాశివంతో వివాహమై జీవితంలో స్థిరపడిన తర్వాత కచ్చేరీలకే పరిమితమైంది. ఆమె కేవలం గాయని మాత్రమే కాదు, మానవీయమైన సుగుణసంపత్తి గల వ్యక్తి – పారగాన్ ఆఫ్ వర్చూస్ అంటారు. ఒక సంగీత సామ్రాజ్ఞి జీవితాన్ని హృద్యంగా వచన కథాకావ్యంగా తీసుకుని రావడం కష్టతరమైన పనియే. ఎందుకంటే ఇందులో కల్పనకు తావులేదు. ఉన్నది ఉన్నట్లు చెప్పాలి. అందులోని సాధక బాధకాలు రచయిత్రికే తెలుసు.

                పల్లవి లోగడ మహానటి సావిత్రి జీవిత చరిత్రను రచించింది. పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆరేడు ముద్రణలకు నోచుకుంది. అందులో కథ ‘చిత్ర’ విచిత్ర గతులతో నడుస్తుంది. ఇందులో అలా ఉండదు. ఇదొక గాంధర్వలోకం. రచయిత్రి ప్రతిభా విశేషముతోనే కథాకథనం రాణించాలి. అందులో ఈమె కృతార్థురాలయింది. అందుకు మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. సుబ్బలక్ష్మి రాగము, సదాశివం తానం, రచయిత్రి పల్లవి. మధ్యలో నా అనుపల్లవి అవసరం లేదు. అయినా ఆమె కోరికను కాదనలేక ఈ నాలుగు మాటలు రాశాను. సుబ్బలక్ష్మిగారి జీవితంపై వచ్చిన సమగ్ర ప్రామాణిక పరిశోధనా గ్రంథం ఇది.

                                 – ముదిగొండ శివప్రసాద్

    400.00
    Add to cart
  • Swapna Jeevi

    Swapna Jeevi

    0

    మనకు జరిగిందే కథ కాదు. మనలో జరిగేది కూడా కథే!

    మానవజాతి అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఎన్నో అంశాలలో కళ కూడా ఒకటి. మనిషి అంతరంగంలోని ఎన్నో విషయాలను వ్యక్తీకరించే మార్గం కళ. మాటలు, పదాలు వ్యక్తీకరించే భావాలను సైతం వివిధ కళారూపాల ద్వారా వ్యక్తపరిచే అవకాశం ఉంటుందని మనిషి కనుగొన్నాడు. మానవుల మొట్టమొదటి కళారూపాలు పురాతన గుహల ‘గోడలపై చిత్రించిన బొమ్మలుగా కనుగొనబడ్డాయి. ఆ విధంగా చిత్రలేఖనం మానవుడి మొదటి కళగా అర్థం చేసుకోవచ్చు. కళల ద్వారానే సంస్కృతి వ్యాపించింది. కళ మరియు సంస్కృతి ప్రజలని ఒక సమాజంగా దగ్గర చేశాయి. సమాజాన్ని బలోపేతం చేయడానికి కూడా కళ, సంస్కృతి ఎంతో ఉపయోగపడతాయి. వినోదం, విశ్రాంతి పొందడం కోసమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవడం, నేర్పించడం, వ్యక్తిగత వృద్ధి సాధించడంలో కూడా వివిధ కళలు ఎంతో ఉ పయోగపడతాయి. సమాజానికి ఇంత మేలు చేసే కళ వెనుక ఉండే కళాకారుల జీవితాలు చాలా వరకూ ఎన్నో కష్టనష్టాలతో కూడి ఉండడం మాత్రం ఎంతో బాధాకరమైన విషయం. బహుశా అందుకు కారణం కళాకారుడు మిగిలిన వారికంటే ఎక్కువ వ్యాకులత కలిగి ఉండి, సమాజం పట్ల చింతకలిగిన వాడై ఉండడం ఒక కారణం అయ్యుండొచ్చు. |

    మరణం తప్పదని తెలిసిన మనిషికి తన క్షీణతను అధిగమించగలిగే ఒకే ఒక సాధనం కళ, కళాకారుడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళినా, కళాకారుడు చేసిన సృష్టి అతనికి…………

    175.00
    Add to cart
  • The God Father

    The God Father

    0

    ది గాడ్ ఫాదర్

    న్యూ యార్క్ మహానగరం.

    మూడో నెంబర్ క్రిమినల్ కోర్ట్ ఆవరణ.

    ఆవరణలో చాలా మంది మనుష్యులు వేచి ఉన్నారు. న్యాయమూర్తి రాక కొరకు వాళ్లు పడిగాపులు పడుతున్నారు. వారిలో అమెరిగో బోనసేరా ఒకడు.

    అతడు పగతో రగిలిపోతున్నాడు.

    అతడి కూతురును కౄరంగా గాయపరిచారు. ఆ బిడ్డ ఇంకా ఆసుపత్రిలోనే ఉంది. అతడి కూతురు మర్యాదను మట్టిపాలు చేయాలని ప్రయత్నించారు.

    న్యాయమూర్తి దిగబడ్డాడు. ఆయన భారీకాయుడు. న్యాయమూర్తి నల్లటివీ, పొడవు పాటివీ దుస్తులు ధరించాడు. తన ఎదుట నిలబడిన ఇద్దరు యువకులను పవిత్రీకరించే ఉద్దేశ్యంతోనే ఆయన తన ఆసనంలో కూర్చున్నట్టు తోస్తోంది.

    న్యాయమూర్తి మొహంలో ఎటువంటి భావాలూ లేవు. న్యాయమూర్తిగా సంతృప్తి చెందుతున్నట్టు ఉంది ఆయన మొహం. తన కూతురు విషయంలో ఆయన న్యాయసమ్మతమైన తీర్పును ఇవ్వడేమో అని అమెరిగో బోనసేరాకు తోస్తోంది. తన మనస్సు ఎందుకలా భావిస్తోందో అతడికే కావడంలేదు. అ

    న్యాయమూర్తి ఎదుట ఉన్న ఇద్దరు యువకులూ గుడ్లప్పగించి న్యాయమూర్తినే చూస్తున్నారు.

    వాళ్లను పరిశీలనగా చూస్తూ, “మీరు అసలు మనుష్యులేనా? మీ ప్రవర్తనకు మీకు సిగ్గనిపించడంలేదా?” అంటూ, న్యాయమూర్తి కోపం వ్యక్తం చేశాడు. యువకులు భిన్నులైపోయారు. పశ్చాత్తాపంతో కాబోలు తలలు దించుకున్నారు. మాట పడిపోయినవారి మాదిరిగా వారు కిక్కురుమనడంలేదు.

    “ఆమాత్రం చాలు. మీలో కొంత మార్పు వచ్చింది. మిమ్మల్ని పశ్చాత్తాపం దహిస్తోంది. ఆమెను లైంగికంగా వేధించలేదు కాబట్టి సరిపోయింది. తీవ్రంగా గాయపరచిన విషయం అలా ఉంచుతాను. మీరు ఇరవై సంవత్సరాల జైలు జీవితం గడపబోయేవారు. అయినప్పటికీ మీ ఇద్దరి మీదా పాత నేరాలు ఎటువంటివీ మోపబడి లేవు. అందువల్లనే మీ ఇద్దరినీ క్షమిస్తున్నాను. నిర్దోషులుగా విడుదల చేస్తున్నాను” అన్నాడు న్యాయమూర్తి………….

    300.00
    Add to cart
  • Vamsankuram - వంశాంకురం

    Vamsankuram – వంశాంకురం

    0

    తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు.

    వంశాంకురం :

    కొడుకుని తమ యిష్టాయిష్టాలకు బలిచేసినా మనవడి కోసం పెద్దతరం వారు పడే ఆవేదన, ఆ ఒక్క కోరిక తీరడానికై నలిగిన రేఖలాంటి కోడల్ని ఇంటికి తెచ్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నా, ఆ అమ్మాయి అదుకు అంగీకరించక పోవడం పెద్దలకు మింగుడు పడని ప్రశ్న.

    స్త్రీ జీవిత సాఫల్యం వంశాంకురాన్నిచ్చి తానుగా రాలిపోవటమేనా?

    రేఖ జీవితం ఓ కన్నీటి కెరటాల వెన్నెల, ఆ వెన్నెలను తన వారికిచ్చి తాను నిశీధంలోకి నిష్క్రమించిన స్త్రీ ఎదుర్కొన్న జటిలమైన సమస్యలకు ”వంశాంకురం” నవలాదర్పణం!

    పేజీలు : 175

    80.00
    Add to cart
  • Vamsy Polamarina Gnapakaalu

    Vamsy Polamarina Gnapakaalu

    0
    900.00
    Add to cart
  • Varasulu

    Varasulu

    0

    తీయని కలలు కంటూ నిద్రపోతున్నది బాలామణి. యు ఫోమ్ పరుపు మీద కాదు. చింకి చాపపై పరిచిన బొంతమీద. ఆమె కలల్లోకి వచ్చేది రాకుమారుడు కాడు, జమీందారు కాడు. కనీసం అందమైన ఆరడుగుల సుందరాకారుడు కాడు. టీచర్ మార్తమ్మ కొడుకు విల్సన్. అంతకు ముందు రోజే పట్నం నుండి అతడు వచ్చినట్టు చెప్పింది టీచర్. బాలామణి మామూలుగా తలుపుతట్టింది పాలు పోద్దామని. ‘పరమ పితా, పరవినుతా!’ అనే సన్నని గొంతుతో పాటపాడుతూ మార్తమ్మ కాదు తలుపు తీసింది, చారల పైజమా వేసుకున్న ఒక యువకుడు తలుపు తీశాడు. అతను నలుపేకాని నలుపులో నాణ్యత కనిపించింది బాలామాణికి. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.

    90.00
    Add to cart
  • Veedani Needa - వీడని నీడ

    Veedani Needa – వీడని నీడ

    0

     తిరిగి యిన్నేళ్ళా కు మాదిరెడ్డి సులోచన నవలలు మీ ముందుకు వచ్చాయి. దాదాపు ఏభై ఏళ్ళ క్రితం అచ్చమైన తెలంగాణా వాతావరణం పొందికైన మానవ సంబంధాలూ కలగలిపి చక్కని యితివృత్తాలు ఆమె సాహిత్యంలో కనిపిస్తాయి. డెబ్భై పైగా నవలలు ఆమె రచించారు. వాసిలోనూ రాశిలోను కూడా సులోచన రచనలు ఎన్నతగినవే. ఆమె ప్రమాదవశాత్తు అకాలమరణం పాలు కాకుండావుంటే మరెన్ని మంచి నవలలు రాసి వుండేవారోననేది ఊహకు మాత్రమే మిగిల్చి వెళ్లిపోయారు.

            ఇప్పుడు అంటే నూతన సహస్రాబ్ది తొలిదశకంలో యీ నవలల్ని చదువుతున్నపుడు కొన్ని కొన్ని సందర్భాలలో పాఠకులకు అసహజంగా వున్నా భావన కలిగే అవకాశం వుంది. ఎందుకంటే గడచిన ఏభై సంవత్సరాలలో ఆర్థిక సాంఘిక సాంస్కృతిక రంగాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఆనటి రూపాయికి నేటి రూపాయికి పొంతన లేదు. కొన్ని వూళ్ళపేర్లు కొన్ని మతాల అర్దాలు సైతం మారిపోయాయి. వేషధారణ మారింది. దూరాలు తగ్గిపోయాయి. భూగోళం గుప్పెట్లో వొదిగిపోయింది. అనడు వంద రూపాయలంటే చాలా పెద్ద మొత్తం. నేడు అది చిల్లర డబ్బు. కనుక ఇలాంటివి మాదిరెడ్డి నవలలో తారసపడినప్పుడు విజ్ఞలైన మా పాఠకులకు కాలంతో అన్వయించుకుని అర్ధం చేసుకోగలరని ఆశిస్తున్నాను.

                                                                                                      – మాదిరెడ్డి సులోచన

    80.00
    Add to cart
  • Vennamudhalu
  • Vivahallo Vichitra Hatyalu

    Vivahallo Vichitra Hatyalu

    0

    వివాహాల్లో విచిత్ర హత్యలు

    రాత్రి పదీ ముప్ఫై రెండు అయింది. కమలా కళ్యాణ మండపం వందలాది అతిథులతో క్రిక్కిరిసి వుంది. ముందువరసలో వున్న సోఫాలో నేనూ పార్వతీ కూర్చున్నాం. ఎలక్ట్రిట్ లైట్లు ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. పురోహితుడు మంగళసూత్రాన్ని నా దగ్గరకు తీసుకొచ్చాడు. నేనూ పార్వతీ ముట్టుకుని రాజేశ్వరి దాంపత్య జీవితం నాలుగు కాలాలపాటు సుఖంగా సాగాలని దీవించాం. రాజేశ్వరి బి.ఎస్.సి. పాసయింది. నా మిత్రుడు కమలాకర్రావు కూతురు, పురోహితుడు మంగళసూత్రాన్ని తతిమ్మా పెద్దల వద్దకు తీసుకు వెళ్ళాడు.

    నిముషాలు గడుస్తున్నాయి. పెద్దల అరుపులు, పిల్లల కేకలు, బయట రోడ్డుమీద కారు హారన్లు వినిపిస్తున్నాయి. వుడ్బైన్ సిగరెట్ వెలిగించాను. పురోహితుడు మా ముందున్న పెళ్ళి పీటవద్దకు వెళ్ళాడు. మంగళసూత్రాన్ని పెళ్ళికొడుక్కి అందించాడు. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. పెళ్ళికొడుకు లేచాడు. కాస్సేపట్లో బాజా భజంత్రీలు రణగొణధ్వనులు చెయ్యసాగాయి. పెళ్ళికొడుకు మంగళసూత్రాన్ని కట్టడానికి ముందుకి వంగాడు. ఢాం అని పిస్టల్ పేలింది!

    మరుక్షణంలో ఎందరో పరుగెడుతూన్న బూట్ల చప్పుడు వినిపించాయి. సోఫాలోంచి లేచాను. నలువైపులా చూశాను. చటుక్కున లైట్లు ఆరిపోయాయి. కమలా కళ్యాణమండపాన్ని చీకటి తెరలు కప్పేశాయి.

    ఏవో అరుపులు, ఏడ్పులు, పరుగెడుతూన్న బూట్ల చప్పుళ్ళు, పార్వతిని దగ్గరగా లాక్కున్నాను. జేబులోంచి టార్చితీశాను. టార్చికాంతిలో పెళ్ళి పీటవైపు చూశాను. అక్కడ అనేకమంది గుంపులుగా నిలబడ్డారు. గబగబా అటు నడిచాను. బలంగా అతిథులను తోసుకుంటూ లోపలకు జరిగాను.

    టారి కాంతిలో పెళ్ళిపీట మీద వెల్లకిలా వెనక్కి పడిపోయిన రాజేశ్వరి కనిపించింది. గొంతు ప్రాంతంలో రక్తం విశేషంగా చిమ్ముతోంది. ముందుకు వంగి ఆమె నాడిని పరిశీలించాను. రాజేశ్వరి చనిపోయిందని వెంటనే గ్రహించాను. లేచి నిలబడ్డాను. చుట్టూ చీకటి. ఆ అంధకారంలో నా కంఠం గంభీరంగా మ్రోగింది. “ఎవ్వరూ కదలకండి! మండపం గేట్లు మూసివేయండి!”…………………..

    300.00
    Add to cart
  • Yedi Gamyam Yedi Maargam - ఏది గమ్యం? ఏది మార్గం?

    Yedi Gamyam Yedi Maargam – ఏది గమ్యం? ఏది మార్గం?

    0

    మేరీని పెళ్ళి చేసుకుంటానని విశ్వనాథం తల్లిదండ్రులకు చెప్పేసరికి వాళ్ళెంత దెబ్బలాడారో – యీ నిశ్చయం విన్నాక అంతకు పదిరెట్టు పేచీపెట్టారు మేరీ తరపు వాళ్ళు. విశ్వనాథం – మేరీ యీద్దరూ థర్డ్‌ యమ్‌.జి.లో వుండగా – తమ స్నేహం మామూలు స్నేహం కాదని, ఇది ప్రేమ భావమనీ గ్రహించుకున్నారు. అయితే వీరి కుటుంబాలు రెండూ ఉత్తర దక్షిణ ధ్రువాలు. అవి కలవడమన్నది కలలోని వార్త అని తెలుసుకుని రెండు వైపులవారినీ ఎదరించి పెళ్ళి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు.
    విశ్వనాథం ఆంధ్ర శ్రోతియ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. తెల్లగా, బక్కపలచగా, ఆకర్షణీయంగా ఉంటాడు. నలుగురు అన్నదమ్ముల్లో రెండో వాడు. పెళ్ళిగావలసిన యిద్దరు చెల్లెళ్ళూ తమ్ముళ్ళూ వున్నారు. బస్తీగాక, పల్లెటూరూ గాక మధ్యస్తమైన ఊరు వాళ్ళది. అది ఒక జమీందారిలోది. ఆ ఊళ్ళో నాలుగైదు భవంతులు జమీందారులవి వున్నాయి. కోట గుమ్మాలూ, విశాలమైన లోగిళ్ళూను. జమీందారీపై ఆధారపడ్డ కుటుంబాలూ, ఆ ఎస్టేట్లలో పనిచేస్తున్నవారి కుటుంబాలూ ఎక్కువ. ఆ ఊళ్ళో, విశ్వనాథం పూర్వీకులంతా ప్రభువు ప్రాపకంలో గడిపారు. తేనె తుట్టెలాగా తల్లివైపు – తండ్రివైపు బంధులవి పది పదిహేను కుటుంబాలున్నాయి స్వంత వూళ్ళోనే. అతని బంధువులందరిలోకి – వీళ్ళే కొంచెం సంపన్నులూ, చదువుకొన్నవారూను. విశ్వనాథం అన్నగారు రామ్మూర్తి హైస్కూల్లో హిస్టరీ టీచరు. ఆయనకి ఇద్దరు పిల్లలు. పెద్ద చదువులు చదివిన విశ్వనాథం – తమ వంశానికి గౌరవం, ఇంటికి ధనం తెస్తాడని ఆశపడ్డ తండ్రి కలలు కల్లలయాయి……

    50.00
    Add to cart
  • పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా

    పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా

    0

    “వివిధ పాత్రల మనోగతాల్ని ఆవిష్కరించే క్రమంలో వాటిని వారి వారి కథలుగా ‘చెప్పించడం’ ద్వారా నవల రాయడంలో ఒక నూతన మార్గాన్ని సూచించిన గోపీచంద్ సాహిత్య చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు.”

    “ఏ నాటికీ నిలిచే నవల. మనిషి ఎలా ఉంటే సంపూర్ణ జీవితం గడపగలడో వివరించిన విశిష్ట నవల. ఆనాటి ప్రథమ తెలుగు నవల గుణగణాల్ని గుర్తుంచుకునేలా ఈనాటి పాఠకులకు అందజేసిన ప్రచురణకర్తలు అభినందనీయులు.”

    “సాంఘిక జీవితం బ్రతుకుదెరువుకూ అనుభవాలకీ ఉపయోగపడుతుంది. ఒంటరితనం అనుభవాలను జీర్ణించుకోడానికి వ్యక్తిగతాభివృద్ధికీ ఉపయోగపడుతుంది అంటారు గోపీచంద్. కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన ఈ తొలి తెలుగు నవల (1963)ను పునర్ముద్రించి ‘అలకనంద’ మంచి పనే చేసింది.”

    “తెలుగుదేశంలో రచయితల చుట్టూ అల్లుకున్న రాజకీయాలను ప్రతిభావంతంగా చిత్రీకరించిన నవల ‘గోపీచంద్’ రాసిన ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’. “

    200.00
    Add to cart
  • శప్తభూమి

    శప్తభూమి

    0

    శప్తభూమి రాయలసీమ చరిత్ర నేపథ్యంగా రాసిన నవల. రాయల కాల తదనంతరం సుమారు 18వ శతాబ్దం నాటి అనంతపుర సంస్థాన అధికార రాజకీయాలు. అప్పటి జీవితము చిత్రించిన చారిత్రాత్మక నవల. హండే రాజుల కాలంనాటి సంఘటనలు, కక్షలు, కార్పణ్యాల మధ్య నలిగిన ప్రజల జీవితాల, పాలెగాళ్ల దౌర్జన్యాల సమాహారం శప్తభూమి.

    ఈ నవలలోని చారిత్రక పాత్రలను సమీక్షించుకుంటున్నప్పుడు ఎక్కువమంది అణగారిన వర్గాల వారే అయి ఫున్నారన్న సంగతి తెలిసివచ్చింది. వారు దళిత బహుజన కులాలవారే ఈ విషయం గుర్తించిన తర్వాత రాయలసీమ చారిత్రక నవల కాస్తా, రాయలసీమ దళిత బహుజన చారిత్రక నవలగా రూపం తీసుకోవడం ప్రారంభించింది. ఈ విధంగా, చారిత్రక కథ నుండి చారిత్రక నవలకూ, చారిత్రక నవల నుండి దళిత బహుజన చారిత్రక నవలకూ ప్రయాణించిన ఆలోచన క్రమం కూడా ఈ నవలా రచన వెనుక పనిచేసింది.

    – బండి నారాయణస్వామి

    135.00
    Add to cart