• komma kommako sannayi_veturi
  • Komuram Bheemudo Komuram Bheemudo

    Komuram Bheemudo Komuram Bheemudo

    0
    165.00
    Add to cart
  • Konni Kalaalu Konni Samayalu - కొన్ని కలాలు కొన్ని సమయాలు

    Konni Kalaalu Konni Samayalu – కొన్ని కలాలు కొన్ని సమయాలు

    0

    సమాజంలో ఎక్కడ ఏ కొద్దిపాటి అవకతవకలు జరిగినా ముందు కవులూ, రచయితలు స్పందిస్తారు. తమ స్వరాన్ని వినిపిస్తారు. వారి వల్ల, వారి అక్షరాల వల్ల విప్లవాలు, సంస్కరణలు, మేళ్ళు నేరుగా జరగకపోవచ్చు కాని, జనాన్ని చైతన్యవంతుల్ని చేయడంలో వారు ముందుంటారు. వారి అక్షరాలు ముందుంటాయి. సృజనకారులకు అడ్డుగోడలు పనికిరావు. వారు విశ్వమానవులు! మానవీయ విలువల్ని కాపాడుతూ వచ్చిన కొంతమంది సాహితీ మహనీయుల జీవితాల్ని, వారి సృజనాత్మక కృషిని ఈ పుస్తకంలో గుర్తు చేసుకోవడం జరిగింది. ఇందులో ఎకడమిక్‌ విభజనలేవీ లేవు. ఇందులో చేర్చని మహాకవులు, రచయితలు ఇంకా ఎంతోమంది ఉన్నారు. వారి గూర్చి నేను రాయకపోవడం వల్ల చేర్చలేకపోయాను. భవిష్యత్తులో రాయగలిగితే, మరో పుస్తకంతో పాఠకుల ముందుకొస్తాను. ఇందులో తెలుగు రచయితలు, భారతీయ రచయితలు, విదేశీ రచయితలు అని మూడు విభాగాలుగా విభజించాను. పక్కపక్కనే ఉండడం వల్ల సాహిత్యకృషి పోల్చి చూసుకోవడానికి, బేరీజు వేసుకోవడానికి, అధ్యయన పరులకు ఉపయోగకరంగా ఉంటుందని అనుకున్నాను. చదవడం తగ్గించిన నేటి తరానికి వ్యక్తిత్వ వికాస దిశగా తపన గురించి, వారు నిలబెట్టాలనుకున్న జీవిత విలువల గూర్చి తెలియజేస్తుంది. – దేవరాజు మహారాజు

    280.00
    Add to cart
  • Kontha Mandhi. . Konni Chotla. . . .
  • Kothi Kommachi
  • Kothi Kommachi

    Kothi Kommachi

    0

    సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ అన్నారు పండిత కవి ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు.

    మేము ఒప్పుకోలేదు. మేం తీశాం. “స్నేహం” అనే సినిమా తీశాం. మాకు ముందు హిందీలో “దోస్తీ” అనే సినిమా తీశారు తారాచంద్

    బ్యా

    పంచదార కన్నపరదార లేపి….

    “తీయని అంటే సినిమా తీయకపోవడం కాదండి – తీయనిది అంటే తీపిగా ఉండేది. ‘స్నేహం మధురమైనది అని కదా” అన్నారు స్వాతి బలరామ్

    “ఓహో అదా- అయితే అలాటి తీపివి చాలానే ఉన్నాయి. వేసవి వెళ్ళగానే వచ్చే తొలకరి వానజల్లుకి మట్టి గుబాళించే వాసనల జల్లు తీయన… అమ్మానాన్నల ముద్దులు తీయన ఆలుమగల తొలిముద్దు అంతకంటే… మసక సంజెలో తొలి గిలి తగిలీ తగలని చేతులూ కలిసి కలియని చూపులూ- కృష్ణశాస్త్రిగారన్నట్లు పంచదారకన్న పరదార తీపిరా అని…

    750.00
    Add to cart
  • Krotha Godavari Etara Kruthulu Kathalu
  • Kwilt

    Kwilt

    0
    300.00
    Add to cart
  • Lopali Daari

    Lopali Daari

    0

    Lopali Dari Short Stories by Sowbhagya సౌభాగ్య అనబడే పాలెళ్ల విజయకుమార్ ఒక బహుముఖీన ప్రజ్ఞగల సాహిత్యవేత్త. ఏదో ఒక సాహిత్య ప్రక్రియలో మాత్రమే కాకుండా కవిత్వం, కథ, నవల, విమర్శ, అధ్యయనాత్మక సాహిత్యం, వ్యక్తిత్వ వికాస ఉద్దీపక సాహిత్యం ఇలాంటి వివిధ విభిన్న రంగాల్లో విశేషమైన కృషిచేసిన ప్రతిభాశాలి. కవిగా, దాదాపు తొమ్మిది సంపుటాలను వెలువరించారు. ముప్పది తొమ్మిది సాహిత్య విమర్శ గ్రంథాలను అందించి నాణ్యమైన విమర్శకునిగా పేరుపొందారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన గొథె, ఐన్స్టీన్, జాన్ కీట్స్, రస్సెల్, ఖలీల్ జిబ్రాన్, తావో తెచాంగ్, సిసిరో వంటి వ్యక్తుల ఆసక్తికర గ్రంథాలను సరళంగా పాఠకులకు అందించిన పరిశోధకుడు. ప్రధానంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఓషో భావజాలాన్నీ, చింతననూ అనేక గ్రంథాలుగా అందించారు. సాభాగ్య అనేక దశాబ్దాలుగా అనితర సాధ్యమైన ఈ రచనా కార్యక్రమాన్ని నిష్ఠతో కొనసాగించి దాదాపు 195 గ్రంథాలను యిప్పటివరకు వెలువరించారు. ఒక సాహిత్య కారుడు ‘సాహిత్య సాధన’ను తపస్సుగా స్వీకరించి, నిరంతర యజ్ఞంగా కొనసాగిస్తే తప్ప ఇంత నాణ్యమైన, ప్రామాణికమైన అక్షర సంపదను సృష్టించడం సాధ్యం కాదు. ఏ.గంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా మోతె గ్రామానికి చెందినవారు. 2006లో UK లోని బెడ్ ఫోర్డ్ యూనివర్సిటీ నుండి MBA పూర్తి చేశారు. కొంత కాలం అక్కడే జాబ్ చేసి, తిరిగి ఇండియాకు వచ్చారు. హైదరాబాద్ లో e-tutors world పేరుతో, మొట్టమొదటి online tuitions అకాడమిని ప్రారంభించారు. 2010 లో ఓ ఫిల్మ్ స్కూల్ నుండి డైరెక్షన్ కోర్స్ చేసి, రెండు తెలుగు సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్గా, సహ రచయితగా పనిచేశారు. 2016 నుండి మాయాజూమ్ ఫిలిమ్స్ పేరుతో ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసి, యాడ్ ఫిలిమ్స్న, డాక్యుమెంటరీస్ ను డైరెక్ట్ చేస్తున్నారు. సాహిత్యం అంటే ఆసక్తి,

    250.00
    Add to cart
  • Loya Nunchi Sikharaniki - లోయ నించి శిఖరానికి

    Loya Nunchi Sikharaniki – లోయ నించి శిఖరానికి

    0

    విద్యార్ధులకి శిక్షణాతరగతులు ప్రారంభిస్తూ ”మీలో జీవితంలో పైకి వద్దామనుకునేవారు చేతులు ఎత్తండి” అని అడిగినప్పుడు అందరూ ఎత్తుతారు. కొందరు నిలబడి మరీ ఎత్తుతారు.

    ”ఏ వయసులో?” అన్న రెండో ప్రశ్నకి హాలులో నిశ్శబ్దం అలుముకుంటుంది. మూల నుంచి ఎవరో, ”ఇరవై అయిదేళ్ళకి” అంటారు.

    ”అప్పుడేమి జరుగుతుంది? ఉద్యోగం వస్తుందా? పెళ్ళవుతుందా? (నవ్వులు)

    అసలు పైకి రావటం అంటే ఏమిటి? ఒక లక్షాధికారి ముప్పై ఏళ్ళకే ముసలివాడై పోయాడు. మరొకడు తల్లి దండ్రుల్ని అనాధాశ్రమంలో చేర్చాడు. వీరు జీవితంలో పైకి వచ్చినట్టా?”

    పెద్దవాళ్ళు కూడా అంత తొందరగా సమాధానం చెప్పలేని ప్రశ్న.

    శఠగోప రహస్యాన్ని విశదీకరిస్తూ, షడ్గుణ ఐశ్వర్యాల్ని వివరిస్తూ, వ్యక్తిత్వ వికాసమంటే ”స్వార్థాన్ని పెంచడం” అన్న కొందరి అభిప్రాయాల్ని పటాపంచలు చేస్తూ, రెండు కోట్ల రూపాయలపైగా అమ్మకాలు సాధించిన ”విజయానికి అయిదు మెట్లు” రచయిత అందిస్తున్న మరో మాస్టర్‌ పీస్‌ ‘లోయ నుంచి శిఖరానికి’.

    150.00
    Add to cart
  • Madhurantakam Rajaram Samagra Katha Sankalanam 5 Parts Of Set

    Madhurantakam Rajaram Samagra Katha Sankalanam 5 Parts Of Set

    0

    సర్కసు డేరా

    ఏ పుట్టలో పాములుంటాయో, ఏ పుట్టలో ఈసిళ్ళుంటాయో యిర్లవాడికి తెలిసినట్టు మరొకరికి తెలియదు. భుజాన మోపెడు ఈతపుల్లలతోనూ, చేత నీళ్ళదుత్తతోనూ వాడొకడు మీకు పల్లెపట్టుల్లో ఎదురైతే, అతగా డక్క డెక్కడో పుట్టమూసి ఈసిళ్ళు పట్టబోతున్నాడన్న మాట! కీటక సంహారకాండలో నాందీ వాచకంగా అతడు పుట్టలో ముఖ్యరంధ్రాన్ని మాత్రం మినహాయించి, మిగిలిన వాటిని మూసేస్తాడు. ఆ తరువాత చిక్కగా నీళ్ళు చిలకరిస్తాడు. రంధ్రానికి చేరువగా ఒక దిగుడు అమర్చి అందులో దివ్వె వెలిగిస్తాడు. ఎండుమట్టి పైన చల్లటి నీళ్ళు పడ్డంతో నీటి ఆవిరి పైకెగిరి, పుట్టలోపలి కీటకాలకు వాన కురుస్తున్నట్టో లేక కురిసి వెలిసినట్టో భ్రమ కలుగుతుంది. బారులు బారులుగా అవి పైకొస్తాయి. వచ్చీరాగానే మృత్యుదేవత క్రూర దంష్ట్రలాంటి దీపశిఖ వాటిని ఆహ్వానిస్తుంది. అవి మొదట రెక్కలు రాల్చుకుంటాయి. తరువాత యిర్లవాడికి మరునాటి ఎరగా మారిపోతూ కుప్పగా కూలిపోతాయి.

    పూర్తిగా కాకపోయినా, కొంతవరకూ ఈ ‘పుట్టమూత’తో పోలికలున్న సంఘటన ఒకటి పట్టణంలో జరిగింది.

    గంటల కల్లా భోజనాలు ముగించి, జంబుచాపలు పరచుకోవడం తరువాయిగా దీపాలు ఆర్పేసి, వెచ్చగా వక్కాకు నములుతూ అరుగులపైన కూర్చున్న పల్లెటూళ్ళవాళ్ళకు ఆకాశంలో ఓ కాంతిపుంజం కనిపించింది. అది అచ్చంగా కాంతిపుంజం కూడా కాదు. భువినుండి దివికి ఏటవాలుగా ప్రసరిస్తున్న వెలుగుబాట. ‘ఎన్నడూ లేంది, ఏనాడూ వినంది, ఏమిటీ విడ్డూరం’ అని ఒక వైపున జానపదులు వెరగుపడిపోతున్నారు, మరొకవైపున ఆ వెలుగు వినువీధిలో నాలుగైదుసార్లు వలయాలు తిరిగి, అంతటితో తన పని తీరిపోయినట్టు అంతర్ధానమైపోయింది.

    మెరుపూ, ఉరుమూ ఒకేసారి ఉద్భవించినప్పటికీ శబ్దవేగం కన్నా కాంతివేగం ఎక్కువ గనుక మెరుపు ముందుగా కనిపిస్తుందని చెబుతుంది విజ్ఞాన శాస్త్రం. ఇక్కడగూడా సరిగ్గా అలాగే జరిగింది. రాత్రి ఎనిమిది గంటలు, ఆ ప్రాంతంలో వెలుగు కనిపించింది……………

    3,000.00
    Read more
  • madhuranthakamRajaram samgra sankalanam