-
Maro Hiroshima – మరో హిరోషిమా
0₹90.00డాకూ మంగళ్సింగ్ పునర్జన్మే మీరని అంటున్నారు కదా. గత జన్మలోని ప్రతి విషయం మీకు గుర్తుందా?” వైట్హెడ్ అడిగాడు.
”ఈ జన్మలోని ప్రతి విషయమే మనకి గుర్తుండకపోవచ్చు”
”పోనీ కొన్ని ముఖ్య విషయాలు?”
”ఉన్నాయి”
”గత జన్మలో మీ భార్య రత్నాబాయి… ఆమెని చూడాలనిపించడం లేదా? ముఖ్యంగా మీ కొడుకుని?”
”గత జన్మలోని నా అరాచకాల్ని, అకృత్యాల్ని ప్రక్షాళన చేసుకుకోవడానికి ఈ జన్మ ఎత్తాను. అందుకని సాధ్యమైనంత వరకూ గతజన్మ తాలూకు విషయాల్ని మరచిపోవాలనే అనుకుంటున్నాను.”
”దేవుడి అదేశానుసారం మీరు నాయకుడిగా మారాలనుకుంటున్నారని చెప్పారు. ఆ ఒక్కకారణమూ మీ గత పాపాల్ని హరించి వేస్తుందా? అర్హతనిస్తుందా?”
”గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో నన్నెలా అనర్హుడ్ని చేస్తాయి? ఆ మాటకొస్తే ఈ జన్మలో చేసిన పాపాలే ఒక వ్యక్తి నాయకుడు అవడానికి అనర్హం కావు. ఆ విషయం పూలన్దేవికి ఓటేసి జనమే నిరూపించారు కదా!… ఆమె వ్యక్తిగత జీవితం గురించి కాదు నేను మాట్లాడేది! జాతీయ విధాన అవగాహన గురించి. పూలన్దేవి ప్రధానమంత్రి, హర్షద్మెహతా ఆర్ధికమంత్రి. ఆటో శంకర్ రవాణాశాఖామాత్యులు. చార్లెస్ శోభరాజ్ ¬మ్ మినిస్టరు అవడా నికి సౌలభ్యం వున్న ఈ ప్రజాస్వామ్యంలో నాదో పెద్ద అనర్హత అనుకోను…”
బృహస్పతి అనే అపూర్వమైన తెలివితేటలున్న ఓ యువకుడిని అతడి తల్లిదండ్రులు (ఆ తెలివితేటలను భరించలేక) ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. అడవిలో హఠాత్తుగా అతడికి తన పూర్వజన్మ గుర్తొస్తుంది. క్రితం జన్మలో తాను బందిపోటు దొంగైన మంగళ్సింగ్నని తెలుసుకున్నాడు. ఆ రోజుల్లో తనతోపాటు దోపిడీలు చేసిన ముగ్గురు దొంగలూ ఇప్పుడు కేంద్రమంత్రులుగా ఉన్నారని తెలుసుకున్నాడు. అప్పుడు అతడు ఏం చేశాడు? సెటైర్ని జోడించి వర్తమాన రాజకీయాలపై యండమూరి వీరేంద్రనాథ్ ఎక్కుపెట్టిన నవలాస్త్రం – ”మరోహిరోషిమా”
-
Meeru Manchi Ammai Kadu – మీరు మంచి అమ్మాయి కాదు
0₹50.00మీరు మంచి అమ్మాయి
– చదివిన చదువు చాల్లే అని తల్లి దండ్రులంటే బుద్దిగా చదువు మానేసి ఇంట్లో కూర్చున్నారు.
-పెళ్ళి చూపుల్లో తలెత్తి చూడకుండా తల్లిదండ్రులు చూపించిన సంబంధం చేసుకున్నారు.
– ‘ఆడపిల్లలం’టే అలా ఉండాలి అని ఇరుగు పొరుగుపొగుడుతుండగా అత్తవారింటికి వెళ్ళారు.
– అత్త పెట్టే ఆరళ్ళన్నీ సహనంతో భరించారు.
– భర్త సిగరెట్నీ, తాగుడినీ, పేకాటనీ ఓర్పుతో సహించారు. భర్తకి సినిమాలిష్టం లేదని మీరూ మానేసారు. భర్తకోసం కట్టూబొట్టుతో పాటు మీ అభిరుచుల్నీ మార్చుకున్నారు.
– నీకేం తెలియదమ్మా, నువ్వూరుకో అని కొడుకూ, కూతుళ్లూ కసురుకుంటుంటే అదో బిరుదులా మీ అమాయత్వాన్ని మురిసిపోయారు.
– మా బామ్మా పాతకాలపు మనిషని మనవడు పరిచయం చేస్తుంటే అదో క్వాలిఫికేషన్ అనుకున్నారు.
ఇంతమందితో మంచి అనిపించుకోవటం కోసం మీరెంత కోల్పోయారు? ఇంతకీ మీరెవరితో మంచి అనిపించుకోవాలనుకుంటున్నారు, దానికోసం మీరు చెల్లించాల్సిన మూల్యం ఏమిటి?
మీరు మంచి అనిపించుకోవలసినది మీ మనసుతో. ఇంత ఆనందాన్ని జీవితకాలం పాటు నాకిచ్చిన ఈ అమ్మాయిలో నేనుండటం నా అదృష్టం అని మీ మనసు నిరంతరం అనుకోవాలి. అంతేగానీ మీ తల్లిదండ్రులూ, భర్తా, పిల్లలూ, అత్తా మామలు, మరుదులూ, మనవళ్లూ కాదు. అలాంటి ఆరోగ్యకరమైన ఆనందాన్ని వ్యక్తిత్వము అంటారు. దాన్ని ఎలా సాధించాలో ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. నేనిప్పుడు బాగా’నే’ వున్నాను అనుకుంటే మీరీ పుస్తకాన్ని చదవద్దు అంటున్నారు యండమూరి వీరేంద్రనాథ్.
-
Mimmalni Me Pillalu Preminchalante – మిమ్మల్ని మీ పిల్లలు ప్రేమించాలంటే
0₹50.00తిరస్కారపు పీడకలల్తో పెరిగిన చిన్నారి నేర్చుకొనేది పరనింద. ద్వేషపు ఆవేదనలో పెరిగిన చిన్నారి నేర్చుకునేది కొట్లాట. అవహేళన అనే గుంజిళ్ళు తీసిన చిన్నారి నేర్చుకునేది సిగ్గు. అవమానం అనే గోడ కుర్చీ వేసిన చిన్నారి నేర్చుకునేది అపరాధ భావం.
సహనంలో ఊయలలూగిన చిన్నారి నేర్చుకునేది శాంతం. ప్రోత్సాహపు గోరు ముద్దలు తిన్న చిన్నారి నేర్చుకునేది ఆత్మవిశ్వాసం. నిజాయితీ మూడు చక్రాల బండి నడిపిన చిన్నారి నేర్చుకునేది న్యాయం. సద్భావపు జన్మదినాలు జరుపుకున్న చిన్నారి నేర్చుకునేది నమ్మకం. అనురాగపు జోలపాటలు విన్న చిన్నారి నేర్చుకునేది సంతృప్తి. స్నేహపొత్తిళ్ళలో పెరిగిన చిన్నారి నేర్చుకునేది ప్రపంచం మీద ప్రేమ.
మన పిల్లలని మనం గౌరవించడమనేది ఎంతో ముఖ్యం. ఇక్కడ గౌరవించడం అంటే వారి అభిరుచుల్ని ప్రోత్సహించడం, వారికీ వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడమని అర్థం. పిల్లల పెంపకంలో గౌరవం, ప్రేమ పునాదిరాళ్ళుగా వుంటే వాటిమీదే పిల్లల ఉన్నత వ్యక్తిత్వం నిర్మించబడుతుంది. అది అద్దాలమేడా, అందమైన మేడా అనేది మీ చేతిలో ఉంది.
మీరు చదవబోయే పేజీల్లో – మనిషిని మనిషి ఎందుకు గౌరవించాలి? పిల్లలు తమ తండ్రులకు ఎంత విలువ ఇవ్వాలి? తల్లిదండ్రులు తమ పిల్లలకి ఎంత విలువ, గౌరవం ఇవ్వచ్చు, ఒకే ఇంటో వ్యక్తుల మధ్య బంధాలు సరిగ్గా లేకపోతే మానసిక పరమైన అనారోగ్యాలు, వ్యక్తులు, వ్యక్తిత్వ పతనం ఎలా ఉంటుంది?
మీ పిల్లలకు మీరిచ్చే బహుమతి వాళ్ళకూ ఒక మనసుంటుందని గుర్తించడం, ఆ మనసుకు ఆలోచించే జ్ఞానం ఇప్పుడిప్పుడే వస్తుందని గ్రహించడం అంటున్నారు ‘మిమ్మల్ని మీ పిల్లలు ప్రేమించాలంటే’ పుస్తక రచయిత యండమూరి వీరేంద్రనాథ్.
-
Mimmalni Meeru Gelavagalaru – మిమ్మల్ని మీరు గెలవగలరు
0₹60.00పదహారేళ్ళ వయసులో ప్రేమలో పడి, ఆ అమ్మాయితో తన ప్రేమ గురించి ఎలా చెప్పాలా అని బుర్ర పాడుచేసుకునే అబ్బాయిల గురించీ, పద్దెనిమిదేళ్ళ వయసులో పెళ్ళి చేసుకుని – ఇరవై ఏళ్ళకే భర్త నిరాసక్తతకు గురైన యువతుల సమస్యలను గురించీ –
పాతికేళ్ళ వయసులో పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకుని ఆ విషయంగా అర్థాంగితో ఎలా రాజీకి రావాలా అని మధనపడే యువకుల గురించీ, ముఫై ఏళ్లొచ్చినా అత్తపోరుతో సతమతమయ్యే గృహిణుల సమస్యల గురించీ, నలభై ఏళ్లొచ్చినా ఒక వ్యక్తిత్వం – గుర్తింపు కోసం తాపత్రయపడే అనామకుల గురించీ –
నలభైఅయిదేళ్ళ వయసులో భర్తకి తనకన్నా ముందే మరో స్త్రీతో వివాహం జరిగిందని తెలిసిన అభాగ్యుల కన్నీళ్ళ గురించీ –
యాభై ఏళ్ళ వయసులో తన జీవితం అయిపోయిందే అంటూ ఏర్పడే దిగులు గురించీ –
యాభైఏళ్ళ వయసులో తమ పిల్లలు తమని దూరం చేస్తున్నారన్న ఫీలింగ్ వల్ల ఏర్పడే భయాల గురించీ –
ఇంకా … దర్శకత్వం నేర్చుకోవటం గురించీ, టి.వి.ల్లో నటన గురించీ, మోసం చేసేవాళ్ళ గురించీ, మోసగింపబడే వాళ్ళ గురించీ – మరెన్నో మానసిక సమస్యల గురించీ –
యక్షప్రశ్నలకు – లక్ష సమాధానాలుగా – ‘మిమ్మల్ని మీరు గెలవగలరు’ ఈ పుస్తకంలో యండమూరి వీరేంద్రనాథ్ వివరిస్తున్నారు
-
Nallanchu – Tella Cheera – నల్లంచు – తెల్లచీర
0₹90.00‘. ఇంతకీ ఇప్పుడేం చేస్తున్నావు?”
”వాయిదాల పద్ధతి మీద చీరెలమ్ముతున్నాను…. గవర్నమెంటు ఆఫీసుల్లో”.
”నీ చేతిలో గొప్ప ఆర్టుంది. మా కంపెనీలో చేరకూడదూ ?” రవి నవ్వి, ”జీతం ఎంతిస్తారు?” అని అడిగాడు.
”అయిదొందలు. ఓ.కె….”
”ప్రస్తుతం నాకు డిజైన్స్ కత్తిరించేవాడికి అంతే ఇస్తున్నాను. క్షమించండి. మిమ్మల్ని హర్ట్ చేయటం నా వుద్దేశ్యం కాదు. ఇప్పుడు నేను చేస్తున్న ఆప్లిక్ పని బాగానే వుంది. దాన్ని వదిలి రాలేను”.
”ఎంతుంటాయి నీ అమ్మకాలు?”
”క్రితం నెల దాదాపు లక్ష…”
శర్మ విస్తుబోయి అతడివైపు చూశాడు. తేజ టెక్స్టైల్స్ హైదరాబాద్ విభాగం అమ్మకాలకన్నా అది ఎక్కువ…
చీరలు… చీరలు…. పిఠాపురం, ధర్మవరం చీరలు. నారాయణపేట నేత చీరలు… అంటూ వీధుల వెంట తిరుగుతూ చీరలమ్ముకునే ఆ కుర్రవాడు బడా వస్త్రవ్యాపారుల వెన్నులో చలిపుట్టించాడు. వస్త్రవ్యాపార ప్రపంచంలో ఎదురులేకుండా దూసుకుపోయాడు. కానీ రవంత జీవన మాధుర్యం కోసం అర్రులు సాచి ప్రత్యర్ధుల వలలో చిక్కుకుపోయాడు.
అతివల అందాన్ని ఇనుమడింపజేసే పట్టు – సిల్కు, జార్జెట్ – షిఫాన్ – కాటన్ చీరల వస్త్ర ప్రపంచంలో విహరింపజేసే యండమూరి వీరేంద్రనాథ్ శారీ థ్రిల్లర్ ‘నల్లంచు తెల్లచీర’ 106 రోజుల పాటు ఆంధ్రజ్యోతి డైలీ సీరియల్గా వచ్చి హిట్ అయిన నవల ఇది.
-
Nissabdam Neeku Naaku Madhya – నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య
0₹50.00జీవితం ఆ కుర్రాడికి వడ్డించిన విస్తరే- కాని అదొక్కటే అబ్బాయిలూ, అమ్మాయిలూ, ఎలా కలుస్తారు- ఏం మాట్లాడుకుంటారు- ఆ తరువాత్తర్వాత యింకేం మాట్లాడుకుంటారో తెలుసుకోవాలనే కోరిక, ఉబలాటం, తపన, సరదా-
ఎన్ని రకాలుగానో ప్రయత్నించి ఆ అసలు రహస్యం తెలుసుకోవాలని కుస్తీలు పట్టగా పట్టగా తనో సైకో అయిపోతాననే భయంతో-
ఓసారి పట్నవాసం నుంచి పల్లెటూరికి ప్రయాణం కాగా, అక్కడో గోదారి గట్టు, అక్కడో మావయ్య, అక్కడే ఓ ముద్ద మందారం-
ఆ నిశ్శబ్ధంలోనే ఆ ప్రశాంత వాతావరణంలోనే అంతా తెలిసిపోయినట్లు మనసు తేలికయిపోయింది-
అదే ఆనందభైరవి రాగంలా యువతరానికి అటూయిటూ వున్న సంగతుల్ని ముగ్ధమనోహరంగా అరటి పండొలిచినట్లు చెప్పిన నవలా రత్నమాల- నిశ్శబ్దం నీకు నాకూ మధ్య
-
Oka Radha – Iddaru Krishnulu – ఒక రాధ – ఇద్దరు కృష్ణులు
0₹70.00అంతలో ఓ కారు రివ్వున దగ్గరకొచ్చి స్లో అయింది. అందులో నుంచి ఓ రివాల్వర్ బయటకు కనిపించింది. మరుక్షణంలో రెండు గుళ్లు వరుసగా ఆమె పక్క నుంచి దూసుకు పోయాయి.
ఆ యువకుడు సమయానికి ఆమెను పక్కకు లాగబట్టి బ్రతికింది కానీ లేకపోతే రక్తపు మడుగులో కూలి ఉండేది. మరుక్షణంలో ఆమెను వదిలి అటువైపు దూకాడు హరి. కానీ కారు వాయువేగంతో వెళ్లి మిగతా వాహనాల ప్రవాహంలో కలిసిపోయింది. జనమంతా పోగయ్యారక్కడ.
”ఎవరిదా కారు ?”
అతడి తండ్రిని హత్య చేసి తల్లి జైలుకెళ్లింది. తమ్ముడు మాయమయ్యాడు. ఎక్కడున్నాడో తెలీదు. సమాజం తల్లి మీద కులట, హంతకురాలు అంటూ ముద్రవేసింది…… ఒక వ్యక్తి పన్నాగం పన్ని చేసిన ద్రోహం అది. అతడా వ్యక్తిని ఎదుర్కొవాలనుకున్నాడు. అతడి చేత పాతికేళ్ల కిందటి నిజాల్ని కక్కిద్దామనుకున్నాడు. దానికి ఓ అద్భుతమైన ప్లాను వేశాడు. ఫలితమే….. ఒక రాధ ఇద్దరు కృష్ణులు.
ఊహించలేని మలుపులతో, క్షణక్షణం ఉత్కంఠతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ కూడా – చక్కటి హాస్యంతో గిలిగింతలు పెట్టే యండమూరి వీరేంద్రనాథ్ హ్యూమర్ క్రైమ్ నవల – ఒక రాధ ఇద్దరు కృష్ణులు.
-
Oka Varshakalapu Sayantram – ఒక వర్షాకాలపు సాయంత్రం
0₹100.00‘శత్రు గూఢచారులు నా ప్రాణం తీస్తున్నా, నా వారిని హింసిస్తున్నా – నా దేశ రహస్యాలు చెప్పను….”
సి.బి.ఐ ఆఫీసు గోడ మీద చిన్న కొటేషన్ అది. దాన్ని పూర్తిగా తన జీవితానికి అన్వయించుకున్నది ఆమె! పర్యవసానం – భయంకరమైన ప్రమాదపు ఊబిలో చిక్కుకుపోయింది !! తాను వ్యవహరిస్తున్నది భయంకర కాలకూట విషసర్పాలతో అని ఆమెకు తెలీదు!!! తన చర్య కొన్ని లక్షల మంది భారతీయుల ప్రాణాల్ని కాపాడబోతోందా ?
చాలా కాలం విరామం తర్వాత యండమూరి వీరేంద్రనాథ్ కలం నుంచి జాలువారిన ఒక వినూత్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఒక వర్షాకాలపు సాయంత్రం’. చరిత్రలో ప్రాముఖ్యం వున్న కొన్ని పాత్రలను తీసుకొని దానికి కాల్పనిక పాత్రలని జతపరచి కథ నడపటం అనేది కొందరు ప్రముఖ పాశ్చాత్య రచయితల టెక్నిక్. ఈ నవలలో అదే టెక్నిక్ని ఎంచుకొని కథ నడిపారు యండమూరి వీరేంద్రనాథ్. మంచితనం భారతదేశానికి కష్టాల్నే మిగిల్చింది కాబట్టి, ఇకనైనా ఆ పంథా మార్చుకోవాలంటారు రచయిత. ‘విజయవిహారం’ పత్రికలో సీరియల్గా వచ్చిన నవలయిది.
-
Parnasaala – పర్ణశాల
0₹75.00అ పడిలేచే కడలి తరంగం లాటి జీవిత
రంగంలో డబ్బుంటేనే ఆప్యాయతలూ,
అభిమానాలూ, ఆపేక్షలూ
చెల్లుబాటవుతాయా?
లేకపోతే వాటికి విలువే లేదా?
అనే ప్రశ్నకు సముద్రతీరాన బెస్తల
జీవితపు నేపథ్యంలో డబ్బునే,
ఆప్యాయతకీ లంగరందదని
వాదోపవాదాలు పోయిన యువతీ
యువకులకు ఓ గుణపాఠం
జీవితానికీ, జీవిత సమస్యలకూ
దర్పణం పట్టిన ఓ చమత్కారమైన
నవజీవన నవలావాహిని
పర్ణశాల ….
-
Popular Rachanalu Cheyadam Ela – పాపులర్ రచనలు చేయడం ఎలా
0₹90.00‘కథ ఎలా ప్రారంభించినా దానికి చదివించే గుణం ఉండాలి అన్న విషయాన్ని ఏ రచయితా మర్చిపోకూడదు. ఉదాహరణకి మొదటి చాప్టర్ని ‘బాగా వర్షం కురుస్తోంది. రోడ్డంతా తడిసిపోయింది. కారు నెమ్మదిగా వెళుతూంది. ఆ కారు నెంబరు ఏ.పి.పి. 4.045. ఆ కారులోభార్గవ కూర్చుని ఉన్నాడు. అతడి చేతిలో సిగరెట్ వెలుగుతోంది.’ అని మొదలు పెడితే పాఠకుడికి మొదటి పేరాలోనే సంగం ఇంట్రస్ట్ తగ్గి పోవటం మొదలు పెడుతుంది. వీలైనంత వరకు నవల మొదటి చాప్టర్లోనే ఏదో ఒక ముడి వేసేయటం మంచిది…..”
కథని కానీ నవలని కానీ ఎలా ముస్తాబు చేయాలో రచనా వ్యాసంగంలో పాతికేళ్ళ అనుభవమున్న నెంబర్ వన్ రైటర్ వివరిస్తున్నారు. ప్రతి చిన్న విషయమూ అర్థమయ్యేలా తన వృత్తి రహస్యాన్ని వెల్లడిస్తున్నారు. వర్ధమాన రచయితలకి మరిన్ని టెక్నిక్కులు నేర్పి ప్రొఫెషనల్ రైటర్స్గా నిలబెట్టేందుకై రైటర్స్ వర్క్షాప్ని స్థాపించిన యండమూరి వీరేంద్రనాథ్ దానికి సిలబస్గా ”పాపులర్ రచనలు చేయడం ఎలా ?” అన్న పేరుతో ఈ పుస్తకాన్ని వెలువరిస్తున్నారు. ప్లాట్ (కథాంశం) నుంచి క్లైమాక్స్ దాకా కథ నడకకి సంబంధించిన పలు అంశాలని ఆయన బోధిస్తున్నారు.
-
Prarthana – ప్రార్ధన
0₹120.00భార్గవ చప్పున అతడిని ఆపుచేసి ”అసలేమయింది. చెప్తారా లేదా ?” అన్నాడు ఇరిటేషన్ నిండిన గొంతుతో.
”వెల్….” అన్నారు డాక్టర్.
”విల్ యు ప్లీజ్ సిట్డౌన్”
భార్గవ కోపంతో ”విల్ యు ప్లీజ్ టెల్ మి” అని అరిచాడు. అన్నాజీరావు అతడివైపు తలెత్తి చూసేడు. డాక్టరుగా పుట్టం మనిషి చేసుకున్న దురదృష్టం . తప్పదు. అతడి పెదాలు స్పష్టంగా కదిలాయి. ”భార్గవా .” అన్నాడు, ”ప్రార్ధనకి లుకేమియా”.రాబిన్కుక్ ‘ఫీవర్’ ప్రేరణతో వ్రాయబడిన నవల ‘ప్రార్ధన’. కరుణరసం ఆసాంతం పోషించబడిన నవల యిది. మానవాళికి పెనుభూతంగా దాపురించిన క్యాన్సర్ వ్యాధిని గురించీ, దాని నివారణ కోసం జరుగుతున్న ప్రయత్నాలని గురించీ, పచ్చి వ్యాపారంగా పరిణమించిన దాని చికిత్సలని గురించీ, మందులని గురించీ చర్చిస్తారు రచయిత.
ఒక చోట నవలలో భార్గవ పాత్ర ఇట్లా అంటుంది…. ”ఈ ప్రపంచంలో ఎక్కడా క్యాన్సర్కి పూర్తిగా మందు కనుక్కోబడదు. ఎందుకో తెలుసా! శేఖరం!, కేన్సర్ చాలా పెద్ద బిజినెస్. డబ్బున్న వాళ్ళకి వచ్చేది. అది చాలా ఖరీదైన వ్యాధిగా వుండిపోవల్సిందే. కేన్సర్ని నాశనం చేయటానికి ఒక చౌకైన మందు గానీ మూలిక గానీ కనుక్కోబడిన మరుక్షణం అమెరికాలో కోట్ల కోట్ల రూపాయల్తో స్థాపించబడ్డ రీసెర్చి ఇన్స్టిట్యూట్లు మూతబడతాయి. ఎందరో క్యాన్సర్ స్పెషలిస్టులు వీధిన పడతారు. మొత్తం ఆర్ధిక వ్యవస్థే దెబ్బతింటుంది. అందుకే ఎంత ఖర్చయినా అసలు మందు కనుక్కోకుండా నొక్కెయ్యాటానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరికీ తెలియని సత్యం ఇది ! నేను దాన్ని బయటపెడితే నాకు పిచ్చెక్కిందంటారు”.. యండమూరి వీరేంద్రనాథ్ బాణీ సస్పెన్సుతో – ఆర్ద్రమైన మానవ సంబంధాల చిత్రీకరణతో – విశిష్టమైన పాత్ర పోషణతో సాగిపోయే నవల.
-
Prema – ప్రేమ
0₹90.00‘సరస్వతీ! స్త్రీ గానీ, పురుషుడుగానీ, వివాహిత గానీ, అవివాహిత గానీ, ఆనందంగా వుండటానికి కావలసిది ‘ప్రేమించిన మనిషి’ లేకపోవటం కాదు. తనకు ప్రేమించే హృదయం లేకపోవటం”.
భర్త మాటలు అర్ధంకానట్టు సరస్వతి తనలో తానే కొంచెం సేపు తర్కించుకుని చివరికి ”నాధా! ప్రేమంటే ఏమిటి ?” అని అడిగింది.
నారదుడు కంగారుగా ‘నారాయణ…. నారాయణ’ అన్నాడు. బ్రహ్మ చిరునవ్వుతో ”వాగ్దేవేనా ఈ ప్రశ్న అడుగుతున్నది ?” అన్నాడు.
”అందులో హాస్యాన్ని పట్టించుకోకండి. ప్రేమికుడు లేకపోవటానికి, ప్రేమించే హృదయం లేకపోవటానికి తేడా ఏమిటి ?” అంది.
”ప్రేమంటే ఆహ్లాదం. అది స్త్రీ పురుష సంపర్కమే కానవసరం లేదు.”
ఆ మాటలకి సరస్వతి మరింత అయోమయంగా భర్తవైపు చూస్తూ ‘మీ నాలుగు తలల తార్కిక జ్ఞానంతో నా ఒక్క మెదడునీ అతలాకుతలం చేస్తున్నారు స్వామీ’ అంది.
”అయితే నీవే చూడు దేవీ” – సరస్వతి చూసిన ఆమె పేరు వేదసంహిత! వైవాహిక జీవితం ఆమె మెడమీద భర్త పెట్టిన కత్తిగాటునే మిగిల్చింది.
బ్రతుకు బాటలో ముందుకు సాగిపోయే తరుణంలో – ఆలంబనగా ఒక అనుభవాన్నీ, అనుభూతినీ మిగుల్చుకోవాలనుకుంది. ఆమె జీవితంలోకి అభిషేక్ అపురూపంగా ప్రవేశించాడు. వెన్నెల్లో గోదావరి ఒడ్డున ఒక అనుభవం అనుభూతిగా మారింది.
ప్రతి పదమూ సరిగమ పదముగా – ప్రతి వాక్యమూ ఒక సరళీ స్వరముగా – ప్రతి ఉపమానమూ అపురూపముగా యండమూరి వీరేంద్రనాథ్ స్వరకల్పన చేసిన మృదుమధుర మంజుల నవలా నాదం ‘ప్రేమ’.