• Mugdha

    Mugdha

    0

    ముగ్ధ

    జీవితం కొందరికి విశాలమైన ఆకాశం. మరికొందరికి ఉరకల, పరుగుల, విలాసమైన సముద్రం. జీవితం కొందరికి లేత బుగ్గమీద కన్నీటి చుక్క మరికొందరికి పున్నమి వెలుగుల్లో పూలమొక్క జీవితం కొందరికి కనబడని కంటి కాటుక. మరికొందరికి సప్తస్వరాల్ని కాళ్ళకు కట్టుకున్న బంగారు పట్టీల సంజె వెలుగు.

    పురుషుడికైనా, స్త్రీకయినా బతుకు నిండుసున్నా దగ్గరే ప్రారంభమవు తుంది. బాల్యం, అస్పష్టపు జ్ఞాపకాలు, పెరుగుదల, మరచిపోలేని వాతావరణం, యౌవనం, కలలు, ఆశలు, ఆకాంక్షలు, జడివానలా ముంచెత్తి, ఉక్కిరి బిక్కిరి చేసే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ఒక అధ్యాయమైతే, పెళ్ళయిన తర్వాత మరో అధ్యాయం ప్రారంభమవుతుంది… వ్యామోహం, పిల్లలు, అస్పష్టపు దారిని సరైన దారిగా మార్చుకోడానికి చేసే విశ్వ ప్రయత్నం… ఆ ప్రయత్నంలో సఫలాలు, విఫలాలు, భోగాలు, త్యాగాలు, యోగాలు, చివరికి రోగాలు, మనిషిని చివరి వరకూ అంటి పెట్టుకునే వుంటాయి. ఎన్నెన్నో మలుపులు, ఎన్నెన్నో మజిలీలు, ఎన్నెన్నో మెరుపులు, ఎన్నెన్నో మలు……………..

    140.00
    Add to cart
  • Munniti Gitalu

    Munniti Gitalu

    0

    మున్నీటి గీతలు

    సందెకాడ సూరీడు అందగాడినన్నాడు….. కొండచాటు నుంచి కొంగుచాటుదాక వచ్చాడోయమ్మా… వెలుగుతోటలో అగ్గిపూలనే పూయించాడమ్మా…..

    మెత్తని ఎదలో పచ్చని ఆశలు రగిలించాడమ్మా…. పారవశ్యంతో కళ్లు మూసుకుని పాడుతున్నాడు జముకుల గరటయ్య. రాగం కూడా తీస్తున్నాడు.

    డురుడుక్కు.. డురుడుక్కు.. డురుడుక్కు…

    డ్రు డ్రు డ్రు డ్రు….

    చేతుల్లోని జముకు వాద్యాన్ని చిత్రమైన శబ్దాలు వెల్లువెత్తేలా మోగిస్తున్నాడు.

    అయితే అక్కడున్న పుంజీడుమందికీ ఆ పాట ఆ మోత అస్సలు నచ్చడం లేదు. మాడిపోయిన అరిసెల్లా కనిపిస్తున్న వాళ్ల మొహాలనుబట్టి దీన్ని అర్థం చేసుకోవచ్చు.

    గరటయ్యకి ఇదేం బోధపడలేదు. నేత్రాలు మూతలేసుకుని రాగప్రస్తారాలు చేస్తూనే ఉన్నాడు.

    కాబట్టే, అసహనం ముంచుకొస్తుండగా నిలుచున్న కిళ్లీ బడ్డీచోటు వదిలి పెట్టి పుక్కళ్ల ఎల్లారావు కదిలాడు. గరటయ్య దగ్గరసా నాలుగు అడుగులు విసవిసా వేశాడు. సరం తీగ చుట్టుకున్న మువ్వల కోలమీద చెయ్యివేశాడు. అదిమి పట్టేశాడు. జముకు ఆగిపోయింది. గీతం మలిగిపోయింది. ధ్వని నిలిచిపోయింది.

    కంగారుపడి రెప్పలు తెరిచాడు గరటయ్య. ఎల్లడివైపు తీక్షణంగా చూశాడు.

    “అదేంటి తండ్రీ! అడసుడిగా ఆపీసేవు, వీలయినంత మృదువుగానే అడిగాడు.

    వెర్రెక్కిపోయినట్టయ్యాడు ఎల్ల. ………….

    200.00
    Add to cart
  • Na Jeevita Katha Maxim Gorky

    Na Jeevita Katha Maxim Gorky

    0

    Na Jeevita Katha Maxim Gorky

     

    ఇరుకుగా వున్న చీకటిగదిలో కిటికీకి దగ్గరగా నేలమీద మా నాన్న పడుకున్నాడు. తెల్లని దుస్తులు తొడుక్కుని అలా పడుకుని వుంటే యెంతో పొడుగరిలాగ కనబడ్డాడాయన. కాలివేళ్ళు, అదొక మోస్తరుగా ఒకదాని కొకటి యెడమ యెడమగా వున్నాయి. ప్రశాంతంగా గుండెలమీద పెట్టుకున్న మృదువైన చేతివేళ్ళు కూడా కొంకర్లుపోయున్నాయి. కళ్ళమీద వుంచిన నల్లని రాగి నాణేలు ఆయన ఉల్లాసపు కళ్ళను కప్పుతున్నాయి. దయతో ఉట్టిపడుతూండే ఆయన ముఖం నల్లబారిపోయింది, బిర్రబిగుసుకు పోయిన ఆయన పళ్ళు మెరుస్తూండడం చూచి నాకు భయం వేసింది.
    అమ్మ ఆయన దగ్గర మోకాళ్ళమీద కూచుంది. అమ్మ వంటిమీద ఎర్ర గాగరా వొక్కటే వుంది, ఆమె అలా కూచుని పట్టులాంటి ఆయన జుట్టును నల్లని దువ్వెనతో నుదుటి మీద నుండి వెనక్కి దువ్వుతూంది. నేనా దువ్వెనతోనే పుచ్చకాయ తొక్కలను రంపంతో కోసినట్టు కోసేవాణ్ణి. మంద్రమైన గొంతుకతో ఏమిటేమిటో ఆమె అలా గొణుగుతూనే వుంది. ఆమె బూడిదరంగు కళ్ళు వాచిపోయి పెద్ద కన్నీటి బొట్టుల కింద కరిగిపోతూన్నట్టని పించింది నాకు.
    మా అమ్మమ్మ నా చేయి పట్టుకుంది. అమ్మమ్మ స్థూలంగా గుండ్రంగా వుంది. పెద్ద తల, పెద్ద పెద్ద కళ్ళు, మాంసపు ముక్కలా ముక్కు, ఆ ముక్కు చూస్తేనే నాకు నవ్వొచ్చేది. ఆమె అంత నల్లగా వుండికూడా మృదువుగా అద్భుతంగా కనబడుతోంది. ఆమె కూడా యేడుస్తూనే వుంది. ఆమె యేడుపు అదొక విధంగా వుండి అమ్మ యేడుపుకి వెనక పాటలా వినడానికి ఇంపుగానే వుంది. ఆమె వొళ్ళు అంతా వణికిపోతూనే నన్ను నాన్న దగ్గరకి నెట్టుతూంది. నేను మాత్రం ముందుకు రాకుండా ఆమె గాగ వెనక దాగుకున్నాను. నాకు భయంవేసి యేమిటోలా వుంది……………………….

     

     

       

     

    Meeru Sreelu (36 Principles for Achieving Success in Telugu)

     

    విభాగం-1

    వదిలించుకోవలసినవి
    “ఉద్ధరేద్ ఆత్మనాఆత్మానం నాత్మానం అవసాదయేత్ |
    ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ||”
    (శ్రీమద్భగవద్గీత – అధ్యాయం-6 శ్లోకం -5)

    భావం: మనం మనల్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి మనల్ని మనమే దిగజార్చు కోకూడదు – (ఎందుకంటే) మన ఆత్మే మనకు మిత్రుడు, (కావచ్చు, అదే
    మన ఆత్మ మనకు శత్రువు (గా మారవచ్చు)
    మన ఆత్మ (అంటే మన మనస్సు), మన ఆలోచనలు, మన అలవాట్లు – ఇవే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. మన మనస్సు మనకు మిత్రుడిగా ఉండాలంటే చెడు అలవాట్లను వదలాలి. అలా వదలకపోతే, ఈ చెడు అలవాట్లు మన ఎదుగుదలకు ప్రధాన అడ్డంకిగా మారతాయి.
    మనం నాజూగ్గా కనపడాలంటే, మన శరీరంలో ఉన్న అధిక కొవ్వును వదిలించుకోవాలి. అలాగే, చురుగ్గా తయారవ్వాలంటే, భయాన్ని, పిరికితనాన్ని, ఆత్మన్యూనతను, అభద్రతా భావాన్ని, ఒత్తిడిని, జాలిని మరియు కొన్ని అపోహలను వదిలించుకోవాలి.
    ఈ విభాగం మనల్ని మనం ఎలా మార్చుకోవాలో, ఎలా మలచుకోవాలో చూపిస్తుంది. మన లోపాలను గుర్తించి, వాటిని ఎలా అధిగమించాలో కూడా తెలియజేస్తుంది…………

    600.00
    Add to cart
  • Naa Bharathadesam

    Naa Bharathadesam

    0

    ‘నా భారతదేశం: భవితకు సూచనలు’ అనే గ్రంథం డా ఎ పి జె కలాంగారి రాష్ట్రపతి పదవీవిరమణ తర్వాతి ఉపన్యాసాల నుండి గ్రహించిన సారాంశాల సంకలనం. డా కలాంగారు భారతదేశంలోనే కాక, విదేశాలలోనూ పలు పార్లమెంట్లు, విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు, ఇతర సంస్థలలో చేసిన ఉపన్యాసాల నుండి సంగ్రహించిన ఈ భాగాలలో, విజ్ఞానం, దేశ నిర్మాణం, పేదరికం, కనికరం, ఆత్మవిశ్వాసాలపై వారి అభిప్రాయాలు క్రోడీకరించబడ్డాయి.
    స్థిరచిత్తం గల మహానుభావులైన మేరీ క్యూరీ, డా విక్రమ్ సారాభాయి వంటి వారి జీవితాలను, డా కలాం యువనాయకులను ప్రోత్సాహపరిచేందుకు, స్పూర్తినిచ్చేందుకు ఉదాహరించారు. ఈ ఉపన్యాసాలు ద్వారా చెప్పిన ఎన్నో విలువైన పాఠాలను వినమ్రత, ఎదురుతిరగడం, దృఢనిశ్చయం.. తదితర విషయాలపై చెప్పడం, పిల్లలు ఆలోచించడం, ఎదగడం, వికసించడానికి తోడ్పడతాయి.

    డా కలాంగారి ఆఖరి పుస్తకం వారి మనసుకు చాలా దగ్గరగా ఉండే ప్రాజెక్టు. అది ప్రతి పిల్లవాడికీ మార్గదర్శనం చేసి, వారి కలలను అన్వేషించేందుకు, ఉత్తమపౌరులుగా ఎదగడానికి, మరింత మేలైన భారతదేశాన్ని గుర్తించేందుకు సాయపడుతుంది.

    150.00
    Add to cart
  • Nakili Manishi

    Nakili Manishi

    0

    అగథా క్రిస్టీ గురించి ఒకరు చెప్పగలిగే దేముంటుంది? పేరు పొందిన రచయిత్రి ఆమె. ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల కొదీ తన రచనలు అమ్ముకోగలిగిన రచయిత్రి. ప్రపంచ భాషలలోనికి తన కథలు, నవలలు అనువాదం చేయించుకోగలిగిన చెయ్యి తిరిగిన రచయిత్రి. అంతేకాదు, పిస్టల్ అనేది ఎలా ఉంటుందో తాకి చూడకుండానే పుంఖాను పుంఖాలుగా అపరాధ పరిశోధక రచనలు చేసినట్లు కూడా

    పేరు మోసిన రచయిత్రి. ఈ సంపుటిలో సాధారణ పాత్రలూ ఉంటాయి. సాధారణ సంఘటనలూ ఉంటాయి. అయితే అసాధారణమైన రచనా వైవిధ్యంతో, మనస్తత్వ కల్పనతో రచయిత్రి ప్రతి కథకు ఊహించలేని స్థాయిలో ముగింపును సిద్ధం చేస్తారు. క్లుప్తమైన, సూటియైన సంభాషణలు పాఠకుల మస్తిష్కాలను ఉత్తేజ పరుస్తాయి. తాను చూసిన లండన్ మహా నగరంలో నిత్యం జరిగే సంఘటనలకు ఆమె తన కథనశైలితో, రచనావిన్యాసంతో, మలుపులూ, మెరుపులూ కల్పించి ప్రచురించిన ఇరవై నాలుగు కథల ఆసక్తికర సమాహారమిది. – ఆంగంలో వీటిని చదివినవారు సైతం తమ తొలి పఠన స్మృతుల పరిమళం తిరిగి పొందుతారు. చదవనివారు ఊపిరిసలపని ఉత్కంఠతో పాటు ఈ కథల రచనాశిల్పంతో రసాస్వాదనను సొంతం చేసుకుంటారు, ఈ కథలు వేటికవే నూటికి నూరు శాతం సంతృప్తి కలిగిస్తాయి.

    250.00
    Add to cart
  • Naku Nenu Rasukunna Premalekha

    Naku Nenu Rasukunna Premalekha

    0

    సొంత అజ్ఞానం

    కొంత ఆత్మజ్ఞానం

    సొంత పైత్యం

    కొంత సాహిత్యం

    సొంత ఆరోహణ

    కొంత అవరోహణ

    సొంత దుర్గంధం

    కొంత సుగంధం

    వెరసి

    ఇది స్వగ్రంథం

    Features

    100.00
    Add to cart
  • Nalla Trachu

    Nalla Trachu

    0

    నల్లతాచు

    ఇంతకుముందు ‘వారియర్ షాడో’ కథను గురించి కొంచెం గుర్తుచేసే ప్రయత్నం ఇది. దేశంలో ఉన్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్సంస్థలన్నిటినీ తందనాలు తొక్కిస్తున్న గజదొంగ షాడోని పట్టుకోవటంలో సహాయం చేసేందుకు వచ్చిన సిఐబి చీఫ్ కులకర్ణిగారికి చాలా దగ్గిరిగా వచ్చి కూడా ఆయన దృష్టిలో పడకుండా తప్పించుకున్నాడు షాడో.

    సరిహద్దులకు ఆవల నివశించే అసరుద్దీన్ అనే పెద్దమనిషిని బంధించి, అతని ఎస్టేట్ ని తను స్వాధీనం చేసుకున్న అజ్మల్ భాయ్ అనే ఒక క్రిమినల్ ఆట కట్టిస్తాడు అతను.

    ఆ ఎస్టేట్లో బంధింపబడిన భాంజీ సాబ్ కూతుర్నీ, ఇతర ఆడబిడ్డలను చెరనుంచి విడిపిస్తాడు.

    భాంజీసాబ్ సరిహద్దులకు ఇవతల ఉన్న తన ఎస్టేట్లో ఒక విచిత్రమైన ఒంటెల్ని పెంచుతూ ఉంటాడు,……….

    120.00
    Add to cart
  • Nalugu Devi Navarathrulu

    Nalugu Devi Navarathrulu

    0

    Nalugu Devi Navarathrulu

    దేవీ నవరాత్రుల విశిష్టత, పూజా విధానం, అమ్మవారి అవతారాల వివరాలతో కూడిన “నాలూగు దేవీ నవరాత్రులు” పుస్తకం, మల్లంపల్లి దుర్గా మల్లిఖార్జున ప్రసాద్ శాస్త్రి రచించినది అందుబాటులో ఉంది. ఈ పుస్తకం ప్యాపర్‌బ్యాక్ వెర్షన్‌లో లభిస్తుంది మరియు నవరాత్రుల సమయంలో చేయాల్సిన ప్రత్యేక పూజల గురించి వివరిస్తుంది.

    295.00
    Add to cart
  • Nalugukalla Mandapam

    Nalugukalla Mandapam

    0

     నరేంద్ర కథావస్తువులు, ఇతివృత్త నిర్వహణ పైపైకి సరళంగా కనిపిస్తాయి. కానీ లోలోపలి పొరల్లోకి తొంగి చుస్తే అవి సంక్లిష్టమైనవి. చాల సంబద్దమైనవి. కొన్ని అసంబద్దమైనవి. సమకాలీన భారతదేశభాష సామజిక సంస్కృతులు, చరిత్ర అంత సంకీర్ణమైనవి.

                                                                                                        -కేతు విశ్వనాథరెడ్డి.

    290.00
    Add to cart
  • Nanu Nadipinchina Charitra

    Nanu Nadipinchina Charitra

    0

    ఒక్కమాటలో చెప్పాలంటే లలిత కిచ్చిన మాటకోసం. లలిత “నా జ్ఞాపజాలు’ పేరుతో తన జీవిత విశేషాలురాసింది. “మీరురాయాలండి, మీ జ్ఞాపకాలు విస్తృతమైనవి, విభిన్నమైనవి” అని అంటుండేది. నా పై తనకున్న ప్రేమాభిమానాలు మాత్రమే కాదుఅలా అనడానికి,నా అనుభవాలు అనేకానేక విషయాలను ప్రస్తావిస్తాయనీ, అవి ఆయా సందర్భాల్లో జరిగిన విశేషాలను తెలియచేస్తాయనికూడా కావచ్చు.

    జీవితంలోనేను సంపాదించుకొన్నవెలకట్టలేని సంపద అనేకులైననా మిత్రులు,శ్రేయోభిలాషులు,పరిచయస్తులూను. వీరిపరిచయంతోపాటు వారిచ్చిన ప్రోద్బలం నాకు ఊతమిచ్చి నన్ను నడిపించింది. నన్ను నేను సమర్థించుకోవడానికి,ఇదిచెపుతున్నానని అనుకొన్నా,ప్రతి వ్యక్తికీ తన్ను గూర్చి చెప్పుకోవాలన్న ఆసక్తి వుండడం సహజం. ఇది బలహీనతా? కాదనను.మినహాయింపులుండవచ్చు.

    వ్యక్తిగతజీవిత చరిత్రల పొరల్లో దాగి, పరిసరాల, ప్రాంతీయ, దేశ చరిత్రల ఆనవాళ్లువుండ స్వీయజీవితచరిత్రకారుడు వీటినితన ‘కథ’లో స్పృశించడా?

    జీవితచరిత్రలు,ఆయావ్యక్తుల,వారి,వారిజీవితాలనువాస్తవంగా, అరమరికలు, దాపరికాలులేకుండాప్రతిబింబిస్తాయా? అందరూ’మహాత్ములు’ కారు,కాలేరు.అలాంటప్పుడుఅవినికార్సయిన రచనలు అవుతాయా? ప్రతి జీవితచరిత్రకారుడునిజాయితీగాఎదుర్కొనే ప్రశ్నలుయివి!

    150.00
    Add to cart
  • Narakamlo Harishchandrudu

    Narakamlo Harishchandrudu

    0

      పురాణగాథలపై నార్లవారి విమర్శలలో ముఖ్యమైన మూడవది “నరకంలో హరిశ్చంద్రుడు”. ఆయన అభిప్రాయంలో మనకు “సుపరిచితుడైన” సత్యహరిశ్చంద్రునితో పాటు మరో ఇద్దరు హరిశ్చంద్రులున్నారు. ఒకడు అసత్య హరిశ్చంద్రుడు కాగా, మరొకడు రాజర్షి హరిశ్చంద్రుడు. ఈ ముగ్గురు హరిశ్చంద్రులు మన ప్రాచీన గ్రంథాలలో కనిపిస్తారంటారు నార్ల. ఐతరేయ బ్రాహ్మణం, రామాయణం, భారతం, మార్కండేయ పురాణం, పద్మ పురాణం, వాయు పురాణం, శివ పురాణం, భాగవతం, దేవీభాగవతం మొదలైన పురాణ గ్రంథాల్లో ఈ ముగ్గురు హరిశ్చంద్రులు కనిపిస్తారు. 

    మార్కండేయ పురాణంలోని గాథకే అధిక ప్రాధాన్యం లభించిందనీ, అందులోని హరిశ్చంద్రుడి గాథే మనకు సత్యహరిశ్చంద్రుడిగా దర్శనమిస్తున్నాడని నార్లగారంటారు. ఈ నాటకానికి ఆయన రాసిన పీఠిక కూడా దాదాపుగా సమగ్రమైన “పురాణ విమర్శే”. పదకొండవ శతాబ్దిలో క్షేమేంద్రుడు రాసిన “చండకౌశిక” నాటకం నుండి, పదిహేనవ శతాబ్దిలో గౌరవ రాసిన “హరిశ్చంద్రోపాఖ్యానం”, పదిహేడవ శతాబ్దికి చెందిన రామరాజభూషణుడు రాసిన “హరిశ్చంద్రనలోపాఖ్యానం”, కందుకూరి వీరేశలింగం రాసిన నాటకం, బలిజేపల్లి లక్ష్మీకాంతం రాసిన నాటకం, విశ్వనాథ సత్యనారాయణ రాసిన “కావ్యవేదహరిశ్చంద్ర” నాటకాల వరకూ నార్లవారు పరిశీలించినట్లుగా ఆయన పీఠికలో రాశారు.

    60.00
    Add to cart
  • Natopatu Nalguram

    Natopatu Nalguram

    0

      తిరిగి యిన్నేళ్ళ కు మాదిరెడ్డి సులోచన నవలలు మీ ముందుకు వచ్చాయి. దాదాపు ఏభై యేళ్ళ క్రితం అచ్చమైన తెలంగాణా వాతావరణం పొందికైన మానవ సంబంధాలూ కలగలిపి చక్కని యితివృత్తాలు ఆమె సాహిత్యంలో కనిపిస్తాయి. డెబ్భై పైగా నవలలు ఆమె రచించారు. వాసిలోనూ రాశిలోను కూడా సులోచన రచనలు ఎన్నతగినవే. ఆమె ప్రమాదవశాత్తు అకాలమరణం పాలు కాకుండావుంటే మరెన్ని మంచి నవలలు రాసి వుండేవారోననేది ఊహకు మాత్రమే మిగిల్చి వెళ్లిపోయారు.

            ఇప్పుడు అంటే నూతన సహస్రాబ్ది తొలిదశకంలో యీ నవలల్ని చదువుతున్నపుడు కొన్ని కొన్ని సందర్భాలలో పాఠకులకు అసహజంగా వున్నా భావన కలిగే అవకాశం వుంది. ఎందుకంటే గడచిన ఏభై సంవత్సరాలలో ఆర్థిక సాంఘిక సాంస్కృతిక రంగాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఆనాటి రూపాయికి నేటి రూపాయికి పొంతన లేదు. కొన్ని వూళ్ళపేర్లు కొన్ని మాటల అర్దాలు సైతం మారిపోయాయి. వేషధారణ మారింది. దూరాలు తగ్గిపోయాయి. భూగోళం గుప్పెట్లో వొదిగిపోయింది. ఆనాడు వంద రూపాయలంటే చాలా పెద్ద మొత్తం. నేడు అది చిల్లర డబ్బు. కనుక ఇలాంటివి మాదిరెడ్డి నవలలో తారసపడినప్పుడు విజ్ఞలైన మా పాఠకులకు కాలంతో అన్వయించుకుని అర్ధం చేసుకోగలరని ఆశిస్తున్నాము.

                                                                                                      – మాదిరెడ్డి సులోచన

    70.00
    Add to cart