• Adhunika Andhra Kavitvam

    Adhunika Andhra Kavitvam

    0

    సెలవులు అయిపోయి                                                బడులు తెరిచారని పిల్లలు ఏడుస్తారనే అనుకున్నానిన్నాళ్ళూ..                                                    ఈ రోజు… తెలుగు మాట ని  వదిలేసి.          గేయాచార్యుడు స్వర్గం బడి లో                               తెలుగు నేర్పడం కోసం                             నిష్క్రమించాడని.                                                       తెలుగు జాతి ఏడవాల్సి వస్తుందని ఊహించలేదు. దేవుని కి నిద్ర పట్టడం లేదు అనుకుంటాను.                       ‘ లాలీ లాలీ ‘అని జోలలు పాడించుకోవాలనే.           స్వార్థం అయి ఉంటుంది..                                         లేకుంటే ఈ వాగ్దేవుడీతో, వినయ విశారదుడితో          ఆయన కేం పని?                                                           ఒక్క ఒక్క రోజు ఒక్క మాటైనా అనని నిగర్విని..మననుండి తీసుకెళ్ళాడు…                     ‘అణువూ అణువున వెలసిన దేవా’                                అని కీర్తించడమే పాపమా?..                                  లోకంలో పాపమింకా పెరగాలి కాబోలు..         .’విశ్వంభరా’ తత్వం తో ‘భూగోళమంత మానవుడి’  పరిణామ రహస్యాలను తెనిగించి,                                   ‘నీ ధర్మం, నీ సంఘం నువ్వు మరవద్దు’.                        అన్న మానవత్వ ప్రవక్త ని                                            మన నుండి దూరమెందుకు చేస్తాడు?                   ‘మంచిని సమాధి చేస్తారా?’ అని మనల్ని దండించే మానవీయ మూర్తి ఇంకెవరున్నారు?                               ఈ దుర్వార్త తో                                                         రామప్ప నాగార్జున సాగర్ లు స్థాణువులైపోవా?.           .ఓ వైశ్వానరా!- తేట తెలుగు తో.                                    అటు అగ్ని కణాల్ని ఇటు తుహిన తుషారాల్ని కురిపించిన అభినవ కవితా సవ్యసాచీ!                మేమింకా అలానే ఉన్నాం…                                       మంచి ని సమాధి చేస్తూ…                                   అంతరంగం లోకి కాకుండా,                                       ఆకాశం వైపు మోరెత్తి చూస్తూ..                                    మరో మానవ మత ప్రవక్త కోసం ఎదురు చూస్తూ..  –                           :చిట్టేల. శ్రీధర్ కుమార్, సూళ్లూరుపేట

    600.00
    Add to cart
  • AADI YOGI YOGASASTRAMULAMU

    Adiyogi – The Source of Yoga (Telugu)

    0

    Adiyogi – The Source of Yoga (Telugu)

    200.00
    Add to cart
  • Agni Pareeksha - అగ్ని పరీక్ష

    Agni Pareeksha – అగ్ని పరీక్ష

    0

    ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడిదినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి. మా సంస్థ 50 సంవత్సరాలలోకి అడుగుపెట్టిన తరుణంలో వుత్తమ విలువలను ప్రోది చేసిన మాదిరెడ్డి నవలలను పునర్ముద్రించడం మాకెంతో ఆనందంగా వుంది. – నవోదయ పబ్లిషర్స్‌,

    Pages : 211
    70.00
    Add to cart
  • Agnipatham_Mattimanushulu

    Agnipatham_Mattimanushulu

    0

    విభిన్న ఇతివృత్తాలతో విలక్షణ నవలలు

    కథారచయితగా ‘పాలపిట్ట’ పాఠకులకు సుపరిచితులైన గన్నవరపు నరసింహమూర్తి రాసిన రెండు నవలలు ఇవి. పోలీస్ వ్యవస్థలో నిజాయితీగా పని చేయడానికి పూనుకున్న ఒక యువ ఐపిఎస్ అధికారి ఎదుర్కొన్న సవాళ్ళను, రాజకీయ వ్యవస్థ ఒత్తిళ్ళను అధిగమించి నిజాయితీగా పని చేసిన తీరును ‘అగ్నిపథం’ నవల ఆవిష్కరించింది. నీతి, నిజాయితీ, చట్టాన్ని అమలు చేసే పట్టుదల గల పోలీసు అధికారులు ఉన్నపుడు పోలీస్ వ్యవస్థ విశ్వసనీయత ఇనుమడిస్తుంది. ఈ విషయాన్ని సాధికారికంగా నిరూపించిందీ నవల. ఆద్యంతం ఆసక్తికరమైన కథనంతో నడిచింది. ఉత్తరాంధ్ర అటవీ ప్రాంతంలోని ప్రకృతినీ, పరిస్థితులనీ, సమస్యలనీ బలంగా చిత్రించిన నవల ఇది. ప్రజలకు సేవ చేయడానికి అంకితమై పనిచేసే అధికారులు జనానికీ, సమాజానికి ఎన్నివిధాల మేలు చేసే అవకాశం ఉన్నదో ఈ నవల చదివితే బోధపడుతుంది.

    ఉత్తరాంధ్రలోని వ్యవసాయిక పరిస్థితులను, నీటి ప్రాజెక్టుల కోసం ఆందోళనలని చిత్రించిన నవల ‘మట్టిమనుషులు’. అంతేగాక తన ఊరి ప్రజల కోసం తపించే ఓ ఐఐటి చదువుకున్న యువకుడి జీవనగమనం భూమికగా రూపుదిద్దుకున్న నవల ఇది. వ్యవసాయరంగం సంక్షోభరహితంగా ఉండాలంటే ఏం చేయాలో ఈ నవలలో రచయిత చర్చించారు. అలాగే పల్లెల నుంచి వలసలు ఆగిపోవాలంటే స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలో బాగా చెప్పారు. ముఖ్యంగా మానవ సంబంధాల ప్రాముఖ్యాన్ని ఆరంగా చిత్రించారు రచయిత. ఈకాలాన అమెరికాకు తరలిపోవడమే లక్ష్యంగా ఉన్నత చదువుల్లో చేరుతున్నారు. దీనికి భిన్నంగా తన గ్రామం కోసం, అక్కడి ప్రజల కోసం, నీటివసతుల కలువ కోసం ఓ యువకుని తపనని, కృషిని దృశ్యమానం చేసిన నవల ‘మట్టిమనుషులు, ఈ నవలా పఠనం ఉదాత్త అనుభవం. ముఖ్యంగా సన్నివేశాల కల్పన, సంబాపణలు సహజంగా ఉన్నాయి. గన్నవరపు నరసింహమూర్తి కథనశైలిలోని ప్రత్యేకత…………

    150.00
    Add to cart
  • Agrarajyangaaa Bharathadesam

    Agrarajyangaaa Bharathadesam

    0

    మన దేశ రాజకీయ , ఆర్ధిక సమస్యల మీద సమగ్ర అవగాహన కావాలనుకునే వారికి ఒక రిఫరెన్స్ గా పనికివస్తుంది .

                                                                                                         -జె.డి.శీలం.

    మన దేశం ప్రపంచంలో అగ్రరాజ్యంగా నిలబడడానికి కావలసిన ఆలోచనల క్రోడీకరణ ఈ గ్రంధం.

                                                                                                         – పద్మశ్రీ ప్రో|| కొలకలూరి ఇనాక్.

    350.00
    Add to cart
  • Aha Oho Ikigai

    Aha Oho Ikigai

    0

    1.    ప్రారంభం

    అది అందాల మైసూరు నగరంలోని దాసప్రకాష్ హోటల్.

    ఆటోలోంచి దిగిన పూర్ణిమ చకచకా నడుస్తూ తన అన్నావదినలు బస చేసిన గదికి వెళ్లింది.

    ఆమె అన్నయ్య రత్నాకర్ ప్రముఖ వ్యాపారవేత్త, వదిన వనజ వైద్యురాలు. వాళ్లకు తొమ్మిదో తరగతి చదువుచున్న పదమూడేళ్ల బాబు అన్వేష్. వాళ్లు ఉండేది హైదరాబాద్లో.

    గదిలో అడుగు పెట్టిన పూర్ణిమను చూడగానే “చెల్లీ, వచ్చేశావా! పద పద. మాకు మంచి అల్పాహారం పెట్టిద్దువుగాని” అన్నాడు రత్నాకర్ సరదాగా నవ్వుతూ,

    “రాకరాక వచ్చారు. అల్పాహారంతో సరిపుచ్చుతానేంటి! మీరిక్కడ ఉన్నన్ని రోజులూ మా మైసూరు ప్రసిద్ధ వంటకాల రుచి చూపిస్తాలే, అన్నయ్యా” అంది పూర్ణిమ కొంటెగా.

    వనజ అందుకుని “మేముండేది ఈ రోజు సాయంత్రం వరకేనమ్మా. తరువాత హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం. వ్యాపారరీత్యా మీ అన్నయ్య విదేశాలకు వెళ్లాలట” అంది.

    “అవునా ? ఇంతకీ మీరు ఏ పనిమీదొచ్చారు, వదినా ?” అడిగింది పూర్ణిమ.

    “మీ అన్నయ్యకు ఇక్కడ ఏదో ముఖ్యమైన బిజినెస్ పని ఉంది. నాకేమో మా డాక్టర్ల సదస్సు ఉంది. అవును పూర్ణిమా, ఇక్కడ మైసూరు విశ్వవిద్యాలయంలో ఎంతో ఇష్టపడి సైకాలజీ కోర్సులో చేరావు కదా! ఎలా ఉంది ?” అడిగింది వనజ…………

    90.00
    Add to cart
  • Ahame Mee Satruvu

    Ahame Mee Satruvu

    0

    పరిచయం

    మీరు సులువుగా మోసపోగలుగుతారు. మొట్టమొదట మీరు చేయవలసిందల్లా మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా ఉండటమే.

    – రిచర్డు ఫెన్మెస్

    మీరు యువకులుగా ఉండి ఏదో ఆశయం కోసం పట్టుదలతో పనిచేస్తున్న వారు కావచ్చు లేదా సమస్యలతో తెగ పోరాడుతున్నవారు కావచ్చు. తొలి మిలియన్ సంపాదించి, ఒక పెద్ద ఒప్పందం చేసుకుని పేరుపొందిన బృందంలో సభ్యత్వం పొందిన వారు కావచ్చు లేదా ఇప్పటికే మీరు జీవితాశయాన్ని సాధించిన వారు కావచ్చు. విజయశిఖరాలు చేరిన తర్వాత అక్కడ ఎంత శూన్యం ఆవరించిందో అన్న ఆలోచనలతో ఉన్న వ్యక్తయినా కావచ్చు. సంక్లిష్ట వాతావరణంలో ఓ పెద్ద బృందానికి నాయకత్వం వహిస్తున్నవారు కావచ్చు లేదా ఉద్యోగం నుంచి అకస్మాత్తుగా బయటకు నెట్టివేయబడిన వారు కావచ్చు. ఇవేమీ కాకపోతే ఒక్కసారిగా కుప్పకూలి జీవితంలో అథోగతి పాలయిన వారు కూడా కావచ్చు.

    మీరేం చేస్తున్నా, మీరెక్కడ ఉన్నా, మీకు చేటు చేసే శత్రువు మీలోనే ఉంటుంది. దాన్నే ‘అహం’ అని పిలుస్తారు.

    “నాకు అహం లేదు. నన్నెవరూ ఇంత వరకూ అహంకారి అని అనలేదు తెలుసా?” అని మీరు అనవచ్చు. చాలా సంయమనంతో నడుచుకునే వ్యక్తిగా మిమ్మల్ని మీరు భావించుకో వచ్చు. కానీ ఆశయాలు, నైపుణ్యాలు, సమర్థత, ప్రేరణ, శక్తితో ఏదయినా సాధించ దలుచుకున్నప్పుడు అక్కడ అహం రంగప్రవేశం చేస్తుంది. మనం ఆలోచనా పరులుగా, సృజనాత్మక జీవులుగా, క్రియాశీలురుగా, వ్యాపారవేత్తలుగా ఆయా రంగాల్లో ఉన్నతస్థాయికి చేరేందుకు సాగించే ప్రయత్నంలో మనస్సులో దాగి ఉంటే ఈ చీకటి కోణం మనల్ని దుర్బలులుగా మారుస్తుంది.

    ఫ్రాయిడ్ పరిభాషలో అహాన్ని గురించి వివరించే పుస్తకం కాదిది. గుర్రంపై స్వచేసే వ్యక్తి లాంటిది అహం అని, జంతువు మాదిరిగా ఉపచేతన మనసు దానిని నడుపుతూ ఉంటుందని ఫ్రాయిడ్ ఒక పోలిక ద్వారా దాని గురించి చెప్పే మత్నం చేస్తారు. ఆధునిక మనస్తత్వవేత్తలు మాత్రం దీనికి కొత్త భాష్యం చెబుతారు.

    ఆ పట్ల అలక్ష్యం చూపుతూ, ప్రమాదకరస్థాయిలో తమను గురించి తాము అప్పగా ఆలోచించుకునే వారిని అహంకారులు అని చెబుతారు. ఇవన్నీ నిర్వచనాలు వలన,కానీ వైద్యసంబంధమైన వ్యవహారాలకు వెలుపల మాత్రం వాటికంత వ్యాపారవేత్తలుగా ఆయా రంకటి కోణం మనల్ని మన పుస్తకం కాదిది. పరంగా సరైనవే,కానీ వైద్యసంబంధమైన విలువ లేదు………..

    350.00
    Add to cart
  • Aharam Manchi- Chedu

    Aharam Manchi- Chedu

    0

     నిత్య జీవితావసరాల కోసం రోజూ ఎంతో శ్రమిస్తూ మనం సంపాదించుకున్న విలువైన డబ్బును వెచ్చించి పౌష్టికాహారం  పేరుతో విషాన్ని తినాల్సి/ తాగాల్సి రావడం ఈ శతాబ్దపు గొప్ప విషాదం. ఏ ఆహారం తింటే ఆరోగ్యం చేకూరుతుందో మనకు చెప్పాల్సిన బాధ్యతలున్న ప్రభుత్వ, ప్రజారోగ్య, వైద్య పత్రికా వ్యవస్థలన్నీ కేవలం తమ స్వార్ధం  కోసం ఆహార రంగంలోని బహుళ జాతి కంపెనీల ప్రలోభాలకు లొంగి తినకూడనిది తినమని ప్రచారం చేస్తూ ప్రజల ఆరోగ్యానికి కీడు చేస్తున్నాయి. వీరందరూ కలిసి శాస్త్రీయత మాటున అశాస్త్రీయతను ప్రచారం చేస్తున్న ఫలితంగా సామాన్యులు రోగగ్రస్తం అవుతున్నారు. లాభార్జనే ధ్యేయంగా  నడుస్తున్న వైద్య , ఆరోగ్య శాఖలూ/వ్యక్తులూ/ప్రజల రోగాలను, మరణాలను కూడా సొమ్ము చేసుకునే ఒక క్రూరమైన వ్వవస్థను ఆవిష్కరించారు.

    100.00
    Add to cart
  • Akhari Athidhi

    Akhari Athidhi

    0

    ప్రతి మనిషి తప్పని సరిగా ఎదో రోజు ఆఖరి అతిథిని ఒక్కసారే కలుసుకుంటాడు. కాని డాక్టర్ శ్రీజిత్ మాత్రం అతన్ని అనేక సార్లు కలుసుకున్నాడు.
    ఎందుకు? ఎప్పుడు? ఎలా?
    మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన, అతింద్రియ నేపథ్యంతో సాగే ఈ సస్పెన్స్, ఫాంటసీ డైరెక్ట్ నవల వినూత్నమైన అంశాన్ని ఆవిష్కరించింది. మూడు రోజుల్లో డాక్టర్ శ్రీజిత్ కి ఎదురైన విచిత్ర అనుభవాలు ఉత్కంఠంగా సాగుతాయి.
    – మల్లాది వెంకటకృష్ణ మూర్తి

    230.00
    Add to cart
  • Aksharabhyasam

    Aksharabhyasam

    0

    అక్షరాభ్యాసం

    ఆ రోజు నేను స్కూల్లో పాఠం చెబుతున్నప్పుడు నా స్నేహితుడు పద్మనాభం ఫోన్ చేసి శనివారం నాడు తన కొడుక్కి అక్షరాభ్యాసం చేయిస్తున్నాననీ, నన్ను తప్పక రమ్మని చెప్పాడు.

    నేను, పద్మనాభం చిన్నప్పట్నించీ ఒకే ఊరిలో పెరిగాం. ఒకే స్కూల్లో చదువుకున్నాం. ఇద్దరం బీఈడీ చేసాం. నేను పట్నంలో మున్సిపల్ టీచరుగా ఉద్యోగం చేస్తుంటే, వాడు మా ఊరి స్కూల్లోనే టీచర్ గా పని చేస్తున్నాడు. వాళ్ల నాన్న పాతికెకరాల భూస్వామి కావడంతో రాజకీయ పలుకుబడి ఉపయోగించి మా ఊళ్లోనే పోస్టింగ్ వేయించుకున్నాడు.

    – పద్మనాభం ఓ పక్క టీచరు ఉద్యోగం చేస్తూనే ఇంకో పక్క వ్యవసాయం కూడా చేస్తుంటాడు.

    వాడికి ఆరేళ్ల క్రితం పెళ్ళైంది. వాడెందుకో ముప్పై ఏళ్ల తరువాత పెళ్ళి

    చేసుకున్నాడు.

    నేను మా నాన్నగారి దగ్గర స్మార్తం నేర్చుకున్నాను. మా నాన్న గారు మా ఊరి పురోహితుడు. ముందు నన్ను చదివించనన్నారు. నేను చదువుకుంటానని పట్టుపట్టడంతో తప్పక నన్ను చదివించారు.

    కానీ కులవృత్తి అని స్మార్తం నేర్పించారు. రెండేళ్ల క్రితం నాన్నగారు చనిపోవడంతో ఊరికి పురోహితుడు లేకుండా పోయాడు. అందుకే ఈ రోజు పద్మనాభం నన్ను పిలిచాడు.. నేనైతే రెండు విధాలుగా ఉపయోగపడతాననీ వాడి ఆశ. |

    ఈ విషయం నాకు చాలా రోజుల నుంచీ వాడు చెబుతున్నాడు. వాడి కొడుకు అక్షరాభ్యాసం నేనే చేయించాలనీ.

    నేను శుక్రవారం రాత్రి బయలుదేరి ఆఖరి బస్సుకి మా ఊరు వెళ్లాను.

    150.00
    Add to cart
  • Allam Seshagiri Kathalu

    Allam Seshagiri Kathalu

    0

    శ్రీపురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు “నీలి” కథతో దేశంలోనూ శ్రీ పాలగుమ్మి పద్మరాజు గారు “గాలివాన” కథతో ఇతర దేశాల్లోనూ తెలుగు కథకి మంచి పేరు సంపాదించిన తరవాత తెలుగు సాహిత్యంలో కథానిక ముందడుగు వేసిందని నేను తలుస్తున్నాను. కొత్త కొత్త రచయితలు కొత్త కొత్త దార్లంట వెళ్ళి, కొత్త సంగతులు కనుక్కున్నారు. అంతే కాదు చాలా మందికి తెలియని పాత సంగతుల్ని కూడా బైటికి తీసుకు వచ్పేరు. తెలుగు కథ విస్తరించింది. మధ్య తరగతి వారి గురించి కథలు వస్తున్నప్పటికీ ఇతర వర్గాల వారి గురించి కూడా కథలు వస్తూనే వున్నాయి. జీవితంలోని వైవిధ్యాన్ని ప్రతిబింబించడానికి తెలుగు కథ ప్రయత్నిస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే, జీవితంలో ముఖ్యమైన అధర్మం ఒకటుంది. అదేమిటంటే ఒక జీవిని మరొక జీవి చంపుకు తినడం. చంపి తినడం అనేది జీవితంలో ముఖ్య విశేషం. ఈ లోకాన్ని భగవంతుడలా సృష్టించేడు కాబట్టి, ఒకరు మరొకర్ని చంపుకు తినడంలో తప్పు లేదని వాదించేవారిని కదిలించి చూస్తే చాలా మంది ఉంటారు. –

    ఇతర ప్రాణుల్ని పూర్వపు మానవులు వేటాడి చంపి తినే వారు. ఇప్పుడు వాటిని పెంచి చంపి తింటున్నాం . తేడా పెద్దగా ఏమీ లేదు. అయితే ఇతర ప్రాణుల్ని మనం చంపి తింటున్నప్పటికీ కూడా మనల్ని మనం చంపుకోకూడదు తినుకోకూడదు అనే ఆలోచనలోకి మానవులం కొంత వరకూ వచ్చేమని చెప్పుకోవచ్చును. కాని అందులో కూడా నిజాయితీ లేదు. బలహీనుల్ని బలవంతులు చంపుతూనే ఉన్నారు. చంపకపోతే, దోచుకుంటూనే ఉన్నారు.

    275.00
    Add to cart
  • Alluri Sitaramaraju

    Alluri Sitaramaraju

    0

    Alluri Sitaramaraju

    150.00
    Add to cart