• Krishna Sastry Sahityam - 5 Vyasaavali - Vyasaalu - కృష్ణశాస్త్రి సాహిత్యం - 5 వ్యాసావళి - వ్యాసాలు

    Krishna Sastry Sahityam – 5 Vyasaavali – Vyasaalu – కృష్ణశాస్త్రి సాహిత్యం – 5 వ్యాసావళి – వ్యాసాలు

    0

    ‘ఆధునికాంధ్ర సాహిత్యంలో అసాధారణ ప్రతిభావంతుడైన రచయిత శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి. అట్టివారి రచనలు లోకానికి త్వరగా సమగ్రంగా అందాలి. ఆ ప్రయత్నంలో సంకీర్ణ వ్యాసాలు, సాహిత్య ప్రసంగాలు, యక్షగానాలు, శ్రవ్యనాటికలు, గేయాలు, ఖండకావ్యాలు క్రమంగా ప్రకటితం కావడం ఆంధ్ర సాహిత్య ప్రియులకు ఎంతైనా హర్షదాయకమనుకుంటాను” అన్నారు శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి 1-10-65న  విశ్వోదయ ప్రచురణలకు ‘రెండుమాటలు’ వ్రాస్తూ. ఆనాటి ఆయన ఆశయం నేడు కార్యరూపం ధరిస్తున్నది. అందులో భాగంగా విడుదలయింది కృష్ణశాస్త్రి సాహిత్యం – 5 వ్యాసావళి – వ్యాసాలు. ఇందులో – కవిపరంపర – కవితా ప్రశస్తి – మహా వ్యక్తులు – అప్పుడు పుట్టి ఉంటే – పుష్పలాలికలు – బహుకాల దర్శనం – అమూల్యాభిప్రాయాలు ప్రకరణలున్నాయి. ఇందులో మొదటి ప్రకరణం ‘కవిపరంపర’ విడివిడికవుల కవితా విశిష్ట లక్షణాలను వివరించేది.
    తొలిచి చూసి, లోపల దాగి ఉన్న సౌందర్యాన్ని పెల్లగించి చూచే కృష్ణశాస్త్రి గారి కవిచూపు సునిశితమైన సాహిత్య విమర్శకుని చూపు కూడా అని ఈ ‘కవిపరంపర’లోని దిగువ ఉదాహరించిన వాక్యాలు స్పష్టం చేస్తున్నాయి.
    ”నన్నయ వైకుంఠాన్ని భూలోకంలో అవతరింపజేస్తాడు, తిక్కన్న భూలోకాన్ని స్వర్గం దగ్గరకు ఎత్తడానికి ప్రయత్నిస్తాడు.”
    ”శబ్ధం పలకడమే కాదు, పాడుతుంది”.
    ”ఏడెనెమిది వందల ఏళ్ళ నుండి పల్లెల్లో, పట్టణాల్లో, ఇళ్ళల్లో, రచ్చ చావళ్ళలో ఈ భారతం చదువుకుని పురాణంగా చెప్పి తెనుగు వారు తమ జీవితంలో కలిపేసుకున్నారు. తిక్కన్న రచనలో అంత జీవచ్ఛక్తి, చైతన్యం ఉన్నాయి”.
    ”వారు (తిరుపతి వేంకట కవులు) గొప్ప కవులు, అయితే పద్యకవిత్వం కన్నా వారి వచనం గొప్పదని నా నమ్మకం”.
    కవిగా, వక్తగా, భావకవిత్వోద్యమ జయస్తంభంగా, భక్త కవిగా, సినీ కవిగా శ్రీ కృష్ణశాస్త్రిని గుర్తించినంతగా సాహిత్య విమర్శకుడిగా ఆయన్ను లోకం గుర్తించినట్టు లేదు. దేశంలో నవ్య సాహిత్యోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లోనే ఆయన చేసిన రేడియో ప్రసంగాలు ఇంతవరకూ గ్రంథరూపం దాల్చకపోవడమే ఇందుకు కారణం. ఇదిగో – ఇపుడీ సంపుటం ఆ లోపాన్ని పూరిస్తుంది.

    225.00
    Add to cart
  • Satha Vasanthala Telugu Katha - శత వసంతాల తెలుగు కథ

    Satha Vasanthala Telugu Katha – శత వసంతాల తెలుగు కథ

    0

     తెలుగు కథకు శ్రీకారం చుట్టిన శ్రీ గురజాడ అప్పారావుగారి కలం నుంచీ ఈనాటివరకూ వచ్చిన కొన్ని వేల కథలలో ఉత్తమ కథలను ఎన్నిక చేసి ప్రచురించాలనే సంకల్పం కలిగినా, ఆ కోరిక 1974 వ సంవత్సరానికి గాని తీరలేదు. ఆ నాటి ఆ కథా సంకలనాన్ని పునర్ముద్రించమని అనేకమంది రచయితల, పాఠకుల అభీష్టం మేరకు కొద్ది మార్పులు, చేర్పులతో తిరిగి ఆనాటి ఆణిముత్యాన్ని అందిస్తున్నాం. ఆంధ్రుల సామాజిక, ఆర్థిక, కుటుంబ జీవనంలో గత వంద సంవత్సరాల్లో వచ్చిన మార్పులకు ఈ కథాసంకలనం అద్దం పడుతుంది. 

                లాటిన్ అమెరికన్ కవి పాబ్లో నెరుడా అన్నట్లు – కవితలు, కథలు అభాగ్య సోదరుల కన్నీరు తుడిచే చేతిగుడ్డలు కావాలి. వారి పోరాటాలకు సాధనాలుగా కత్తులు లాంటి కథలు కావాలి. “రుమాళ్ళుగా, సవాళ్లుగా, ఎర్రెర్రటి జెండాలు” గా ఆ కథా సంకలనాన్ని స్వీకరించి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ శాత వసంతాల తెలుగు కథను పాఠకులకు సగర్వంగా అందిస్తుంది.

    450.00
    Add to cart
  • " Maha Nati" Cinema Aa" Nati" Ki Nyayam Cheyudu!

    ” Maha Nati” Cinema Aa” Nati” Ki Nyayam Cheyudu!

    0

    పెళ్ళి కానీ యువతీ, పెళ్ళి చేసుకునే ముందు, తనకు భర్త కాబోయే వాడి ప్రవర్తన “ఫలానా రకం  ” అని తెలిసినా , అప్పుడు కూడా ఆమె, అతని వ్యభిచార ప్రవర్తనని పాటించుకోనక్కరలేదా? భార్యగా సంబంధం ఏర్పడిన తర్వాత మాత్రమే భర్తతో సంబంధాల గురించి ఆలోచిస్తుందా?- ఎలా వుంది సినిమా సావిత్రి జవాబు? “నేను ని భార్యగా వున్నాను కాబట్టి, నన్ను ఇప్పుడు మోసం చెయ్య కూడదు’ అంది. మరి, తను అతనికి భార్యగా మరలను కున్నపుడు , అతనికి అప్పటికే తాళి కట్టించు కున్న భార్య వుందని ఈమెకి తెలుసు కదా? అతడికి తను కొత్త భార్యగా అవడం అంటే, అతడు మొదటి భార్యని మోసం చేస్తున్నాడని  ఆ మోసంలో తను కూడా బాగస్తురాలిని  అవుతున్నానని అర్ధమే కదా? అది సావిత్రికి అప్పుడు తెలియదా?

    70.00
    Add to cart
  • 11th Hour

    11th Hour

    0
    250.00
    Add to cart
  • 1232 KM Gruhonmukhanga Sudhirgha Prayanam

    1232 KM Gruhonmukhanga Sudhirgha Prayanam

    0

    నాంది

    భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ 24 మార్చి 2020 రోజున భారతదేశంలో భకోవిడ్-19 మహమ్మారి ఇంకా పెరిగిపోకుండా ఉండడానికి జాగ్రత్త పడుతూ లాక్ డౌన్ ప్రక్రియను మొదలుపెట్టారు. కొన్ని గంటల వ్యవధిలోనే అది అమలు చేయబడింది.’

    మూడు భాగాలలో అది మే 31వ తారీఖు వరకు కొనసాగింది. సార్స్ కోవి 2 అనే ఈ వైరస్ కి సమాధానంగా ఎన్నో దేశాల్లో, జరిగిన ఎన్నో ప్రక్రియలలో, భారతదేశంలో జరిగిన ఈ లాక్ట్రాన్స్లోనే ప్రక్రియను మాత్రం కొందరు వ్యక్తులు క్రూరమైనది గా వర్ణించారు.

    138 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో 21 రోజుల లాక్ట్రాన్ ప్రకటించడం అంటే, మినహాయింపు ఉన్నా వారు తప్పించి మరెవ్వరూ బయటకు వచ్చే వీలు కానీ, సౌకర్యం కానీ లేదు. దేశ ప్రజలను ఈ మహమ్మారి నుంచి రక్షించడానికే ఈ ప్రక్రియను అమలులో పెట్టినట్లు దేశ ప్రధాని ప్రజలకు చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండు పౌర శాఖ తో కలిసి పని చేసి, పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాయి అని, నిత్యావసర వస్తువుల సరఫరా లో ఎటువంటి అంతరాయము కలగకుండా తాము చర్యలు |

    – ఈరోజు అర్ధరాత్రి నుండి, దేశం మొత్తం సంపూర్ణంగా లాక్టిన్’ లోకి వస్తుంది.

    350.00
    Add to cart
  • 16 Yuva Rachayithala Tholiprema Kathalu

    16 Yuva Rachayithala Tholiprema Kathalu

    0

    ఈ కథలన్నీ కాలాల మీదగా వీచిన హాయితనపు   గాలులు కాదు. వీటిలో ఈదురు గాలులున్నాయి, ఇప్పటికి ఎదల్ని కొస్తోన్న అంతుపట్టని సమాజపు   సజీవావవశేషాల  ఛాయలున్నాయి. ముళ్ళకంపల మీదగా నడిచొచ్చిన పాదాలు భద్రంగా దాచుకున్న గాయాల  తాలుకా ముద్రాలున్నాయి. పసివయసులో ఒక్కోరూపాయిని ముంతలో వేసుకున్నట్టే…. ఆనందాలని , ఆశ్చర్యాలని, నిరంకుశత్వాన్ని మూసినా నిర్మలత్వాని, కళ్ళల్లో అట్టే పెట్టుకున్న కన్నీళ్లని, అంటిపెట్టుకున్న పసితనపు అరోమా వాసన్లని  , కొనసాగుతోన్న కౌమారపు కాలాల కార్యాల లొలకపు కంపానలా  అవర్తనాలను, శిథిల జ్ఞాపకాల పుటల మీద కొత్తజీవితాలను నిర్మించుకుంటున్న కోట నీడల రెపరెపల పాటలను ఈ పుస్తకం సాక్షిగా వలపోసుకున్నారు.

    165.00
    Add to cart
  • 21 Va Sathabdhi Vyaparam

    21 Va Sathabdhi Vyaparam

    0

    ఆర్ధికవ్యవస్థ ఇక్కడ సమస్య కాదు.

    ఆ సమస్య మీరే.

    కార్పోరేట్ ప్రపంచంలోని అవినీతి మీద కోపంగా ఉందా? వాల్ స్ట్రీట్, పెద్దపెద్ద బ్యాంకుల మీద కోపంగా ఉందా? చేయాల్సిన సరైన పనులు చేయకుండా, చేయకూడని చెడ్డపనులు చేస్తున్న ప్రభుత్వం మీద కోపంగా ఉందా? లేక, మీ ఆర్ధిక పరిస్థితులను అదుపులో ఉంచుకోనందుకు, మీమీదే కోపం కలుగుతోందా?

    జీవితం కఠీనంగానే ఉంటుంది. ప్రశ్న ఏమిటంటే – దాని గురించి మీరేం చేయదలుచుకున్నారు? ఆర్ధికవ్యవస్థ గురించి ఏడుస్తూ కూర్చున్నా, లేక ఇతరులను నిందించినంత మాత్రాన మీ ఆర్ధిక భవిష్యత్తుకు భద్రత కలగదు. మీరు సంపద కావాలనుకుంటే, దానిని మీరు సృష్టించాలి. మీ ఆర్ధిక భవిష్యత్తును మీ చేతుల్లోనే ఉంచుకునే ఆవశ్యకత ఉంది. దానికోసం మీరు మీ ఆదాయం మూలాన్ని అదుపులోకీ తీసుకోవాలి – ఈనాడే!

    మీకో సొంత వ్యాపారం ఉండాలి.

    అధిక సంఖ్యాకులకు ఆర్ధికపరంగా ఇది కష్టకాలం కావచ్చు. కాని ఎంతోమంది వ్యాపారవేత్తలకు సొంత వ్యాపారం ఏర్పరచుకోవటానికి ఇదే సరైన సమయం. దీనిని మించిన సమయం ఇంతవరకూ రానేలేదు.

    రాబర్ట్రా టి. కియోసాకీ (రచయిత గురించి) :

    రాబర్ట్ టి. కియోసాకీ ఒక మల్టిమిలియనేర్ మదుపరి, బిజినెస్ సొంతదారు, విద్యావేత్త, వక్త, అత్యధికంగా అమ్ముడుబోయే రిచ్ డాడ్ పూర్ డాడ్ గ్రంథమాల రచయిత. తన 47వ ఏట పదవీవిరమణ చేశాక ఆయన క్యాష్ ఫ్లో టెక్నాలజీస్ సహావ్యవస్థాపకుడుగా ఉన్నారు. రిచ్ డాడ్ కంపెనీను స్థాపించారు. ఈ కంపెనీ ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కొన్నిలక్షలమంది జనానికి ఆర్ధికస్వేచ్చ ఎలా పొందాలి అన్న అంశం మీద సలహాలని అందిస్తోంది. రాబర్ట్ 16 పుస్తకాలు రాశారు. 27 కోట్లకీ పైగా అవి అమ్ముడయాయి.

    జాన్ ప్లెమింగ్ (రచయిత గురించి) :

    జాన్ ప్లెమింగ్ ఒక విజయవంతమైన వాణిజ్యవేత్త, సలహాదారు, వక్త. ప్రస్తుతం డైరెక్టర్ సెల్లింగ్ న్యూస్ అనే పత్రికకు ప్రచురణకర్తగా ఉంటున్నారు. జాన్ ద వన్ కోర్స్ అనే పుస్తకం కూడా రాశారు. ఆర్కిటెక్చర్ సిద్ధాంతాల్ని ఉపయోగిస్తూ విజయవంతమైన జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలో ఇది వివరిస్తుంది.

    225.00
    Add to cart
  • 25 Va Ganta! !

    25 Va Ganta! !

    0

    స్వీయ అస్తిత్వ ఆవిష్కరణ నుంచి మూలాల అన్వేషణ వరకు

    పాఠకుల పఠనానుభవం రచయిత రచనానుభవం కలిసే ఉమ్మడి క్షేత్రం వొకటి సాహిత్యతలంలో వుంటుంది. అక్కడ రచయితా పఠితా వొకరికొకరు సన్నిహితమౌతారు. సామీప్యాన్ని అనుభూతి చెందుతారు. భావాలు వినిమయం చేసుకుంటారు. దృక్పథాల్ని పంచుకుంటారు. ఒకరి మనస్సుని మరొకరు స్పృశిస్తారు. రచన మాధ్యమంగా వొక సంభాషణకు పూను కుంటారు. ఒక చైతన్యధార వొకరి నుంచి మరొకరికి ప్రవహిస్తుంది. నిజానికి రచన యేదైనా రచయిత తన పాఠకులతో యెదురెదురుగా కూర్చుని చేసే సంభాషణే. కాల్పనిక సాహిత్యంలో ఆ సంభాషణ సంవాదంగానో ప్రవచనం గానో మారకుండా దాన్ని కళాత్మక వ్యక్తీకరణగా రూపొందించటంలో రచయిత అనేక వ్యూహాలతో ముందుకు రావడం చూస్తాం. అదే ఆ రచనలో శిల్పంగా భాసిస్తుంది. ఆ యా స్థల కాలాలకు లోబడి పాఠకులకు చేరువ కావడానికి రచయిత యెంచుకుని నిర్మించుకునే సాధనం అది. నిర్దిష్ట జీవిత అనుభవాల్ని సాధారణీకరించడం ద్వారా వాస్తవాన్ని కాల్పనీకరించడం ద్వారా పాఠకుల్ని రచనలో తాదాత్మ్యం చేసే రసవిద్య అది. దాని రహస్యం. తెలుసుకోడానికి చేసే ప్రయత్నం నిరంతరం జరుగుతూనే వుంటుంది. “మీ టూ” కథాసంకలనంలో ఉమా నూతక్కి ‘మిట్టమధ్యాహ్నం నీడ’ కథ వచ్చినప్పుడు దాని నిర్మాణంలో చూపిన నైపుణ్యంతోపాటు వ్యక్తీకరణలో……………

    150.00
    Add to cart
  • 555 Suruchi Vantakaalu - 555 సురుచి వంటకాలు

    555 Suruchi Vantakaalu – 555 సురుచి వంటకాలు

    0

    555 రకాల శాకాహార, మాంసాహార సురుచి వంటలు.
    ఇంకా కూరలు, పచ్చళ్ళు, వడియాలు, ఊరగాయలు, స్వీట్స్‌, హాట్స్‌, కూల్‌డ్రింక్స్‌, సూప్స్‌, సలాడ్స్‌, యిలా ఎన్నో వంటలు గురించిన గ్రంథం యిది.
    ఇంచుమించు ఆంధ్రులు, కొందరాంద్రేతరులు నిత్య జీవితంలో ఉపయోగించే వంటలన్నింటినీ ఒక గ్రంథంలోకి తేవాలని గడచిన మూడు సంవత్సరాల మా కృషి యిప్పటికి ఫలించినది.
    అనేక మంది చేతులు యిందులో ఉన్నవి. ఇంకా అనేక మంది పాకశాస్త్ర ప్రవీణులు వీటిని పరీక్షించడం జరిగింది. పుస్తకం వ్రాయడం కంటే వీటిని అనుభవజ్ఞులు పరిశీలించడానికే యింత కాలం పట్టినది.
    తెలుగులో యింత సమగ్రమైన పుస్తకం యిదే. ఇన్ని రకాల వంటలున్న పుస్తకం కూడా యిదే.
    శాకాహార, మాంసాహారులకిది ఎంతో ఉపయోగకరమైనది.

    120.00
    Add to cart
  • 9 Gantalu

    9 Gantalu

    0

    ప్రారంభానికి ముందు రాజమండ్రి సెంట్రల్ జైలు.

    ఆ సాయంత్రం జైలు ఆవరణలో ఖైదీలకి సిటీస్ ఎం.ఎం. ప్రొజెక్టర్, నర్తనశాల సినిమాని చూపిస్తున్నారు.

    అంతా సినిమాని ఆసక్తిగా చూస్తున్నా ఇద్దరు మాత్రం ఆ సినిమాని చూడటంలేదు. పక్క పక్కనే కూర్చుని రహస్యంగా ఒకరితో మరొకరు గుసగుసలాడుకుంటున్నారు.

    ఇద్దరిలో ఎక్కువ వయసున్న వ్యక్తి పేరు అంబాజీరావు. బేంక్ దోపిడీ నేరంమీద ఆయన శిక్షని అనుభవిస్తున్నాడు.

    రెండో వ్యక్తి పేరు మునిస్వామి. అతను అమలాపురం నించి బయలుదేరిన ఓ లారీని తణుకు దగ్గర ఆపి అందులోని డ్రైవర్, క్లీనర్లని కొట్టి, కట్టేసి లారీలోని సరుకుని దోచుకున్న నేరానికి శిక్షపడి వచ్చి నాలుగు రోజులే ఐంది.

    అంతకుమునుపు మునిస్వామి, అంబాజీరావు కలసి అదే జైల్లో రెండు, మూడుసార్లు శిక్ష అనుభవించారు. ఆ ముఖపరిచయంతో ఒకరికొకరు దగ్గరయ్యారు.

    “ఇంపీరియల్ బేంక్ లో దొంగతనం చేయడం అంత తేలికా?” అంబాజీరావు అడిగాడు.

    “అవును. అశోక్ నగర్ బ్రాంచ్ గురించి, అక్కడి ఉద్యోగస్తుల గురించి చాలా సమాచారం సేకరించాను. బేంక్ లో పనిచేసే ఉద్యోగస్తుల తల్లితండ్రులు, బంధువులు ఎవరు ఎక్కడెక్కడున్నారో వివరాలు నా దగ్గర ఉన్నాయి. మనం దొంగతనం చేద్దామనుకున్న రోజు బేంక్స్టాఫ్ తక్కువ మంది ఉండటానికి అనువుగా, ముందురోజు ముగ్గురు, నలుగురు |……..

    250.00
    Add to cart
  • A'nrutham

    A’nrutham

    0

     “నువ్వు ఒంటరిగా ఉండడం అంత మంచిది కాదు శ్రీజ. మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. దానిని మనం నమ్మలేం.”

                  “మనసుని కాదు రాధిక, నన్ను చుట్టుకున్న పరిస్థితులను నమ్ము. పదమూడు ఏళ్ళకే అమ్మానాన్నలు దూరమైతే ఎలా ఉంటుందో తెలుసా? అప్పటివరకు వాళ్ళే నా ప్రపంచం… ఒక్కసారిగా ఆ ప్రపంచం కూలిపోయింది. చిన్నపిల్లని నేను… ఆ వయసులో నాకసలు ఏమీ తెలీదు. ఏదీ తెలీదు! మరో పదిహేను సంవత్సరాల తరువాత, ఇప్పుడు మళ్ళీ నా ప్రపంచం కూలిపోయింది. కానీ ఇప్పుడు నాకు ఏది తెలిసినా… తెలియకపోయినా ఒక్క విషయం మాత్రం బాగా తెలుసు… I can handle this అని.”

                       “చూడగలగాలే కానీ ప్రతి అబద్ధంలోనూ ఓ నిజం ఉంటుంది. ఆ నిజమే అబద్దానికి ఉనికి.” ఈ కథకు శీర్షిక అనృతం’. అనృతం అంటే అబద్దం. ఆ అనృతంలో కూడా ఓ నృతం (నిజం) ఉండకపోలేదు! ఆ “కొన్నిసార్లు మనం వెళ్ళాల్సిన మార్గమే మనకి తెలుస్తుంది. చేరుకోబోయే గమ్యం కాదు.” గమ్యం ఎలా ఉండబోతుందో, అసలు గమ్యమంటూ ఉంటుందో లేదో తెలియకుండానే కథ అనే గమనాన్ని ఎంచుకున్నాను, పయనించాను. ఫలితం ఈ అనృతం’.

                        “ఓదార్చే తోడు లేదనిపిస్తే బాధ కూడా మాయమైపోతుంది.” ఈ వాక్యం నేను చూసిన సంఘటనల్లో నుండి రాశాను. తుడిచే చెయ్యే లేదనిపిస్తే కన్నీళ్ళు మాత్రం ఎందుకొస్తాయి? ప్రతి చర్యా, ప్రతిచర్యను కోరే జరుగుతుందేమో!

    50.00
    Add to cart
  • Aadhunika Mahabharatham

    Aadhunika Mahabharatham

    0

        “ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు… కలలు ఖనిజాలతో చేసిన యువత, మన దేశ భవిష్యత్తుకు సేవకులు”, అన్న ‘మహాకవి శేషేంద్ర గారి మాటలు ఆయన్నంత అమితంగా ఇష్టపడేలా చేసినాయి. ‘నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా?’ అన్న ఆయన వేసిన ప్రశ్న నాకు ‘మహావాక్యం’ అయింది. నీకు అత్యంత ప్రీతిపాత్రమయిన ‘ఆధునిక మహాభారతం’ అనే ఈ మహాగ్రంథాన్ని దేశ, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపనపడే వారికోసం అందుబాటులో ఉండాలన్న నీ ఆకాంక్ష. ఈ మహాగ్రంథాన్ని ఇంకోసారిలా మీ ముందుకు తీసుకొచ్చింది. నాకీ అవకాశాన్ని కల్పించిన ‘మహాకవి’ శేషేంద్ర గారి అబ్బాయి, కవి అయిన ‘సాత్యకి’ గారికి నాకు ఈ ‘మహాకవిని’ పరిచయం చేసిన నా మిత్రుడు ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’ గారికి నా కృతఙ్ఞతలు…

                                        – పవన్ కళ్యాణ్

    500.00
    Add to cart