• Raa Raa Samagra Sahityam 1, 2 & 3

    Raa Raa Samagra Sahityam 1, 2 & 3

    0

    ముందుమాట

    ఆధునిక భారతదేశ చరిత్రలోని భావోద్వేగ పూరితమైన రెండు ఘట్టాలు రాచమల్లు రామచంద్రారెడ్డి సాహిత్య కారునిగా, రా.రా. గా మారడానికి దోహదం చేశాయి. అందులో మొదటిది రాచమల్లు రామచంద్రారెడ్డి మద్రాసులో గిండి ఇంజనీరింగ్ కాలేజి మొదటి సం. విద్యార్థిగా (1940-41) వున్నపుడు జరిగింది. రెండవది మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రపు తొలి శాసనసభ ఎన్నికల సందర్భంగా 1955లో జరిగింది.

    1940లో బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటాలు ఉదృతంగా జరుగుతున్నాయి. అదే సమయంలో జర్మనీ యూరపు పై దాడి చేసి రెండవ ప్రపంచయుద్ధానికి తెరతీసి, బ్రిటీషు రాజకీయ సైనిక శక్తులను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇదే అదునుగా భారత జాతీయ వాదులూ, గాంధీ, భారత దేశానికి స్వాతంత్ర్యం ఇస్తామని వాగ్దానం చేయాలని బ్రిటీష్ పాలకులపై వత్తిడి పెంచారు. భారతదేశాన్ని యుద్ధంలోకి దించడానికి వ్యతిరేకంగా గాంధీజీ అక్టోబరు 1940లో దేశ వ్యాప్తంగా వ్యష్టి సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజానీకాన్ని సంఘటిత పరచడానికి పలువురు కాంగ్రెసు వాదుల్ని సన్నద్ధుల్ని చేశారు. దిక్కుతోచని బ్రిటీష్ ప్రభుత్వం ముందుకు ముందే దేశవ్యాప్తంగా ఇరవై వేల మందికిపైగా నాయకుల్ని జైళ్లలో కుక్కింది. ఈ బ్రిటీష్ దమనకాండకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం వీధుల్లోకి వచ్చి సమ్మెపిలుపు నిచ్చింది. ఆ సమ్మెలో భాగంగా మద్రాసులోని అన్ని కాలేజీల విద్యార్థులు సమ్మెబాట పట్టారు. వారిలో గిండీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులూ, వైద్య కళాశాల విద్యార్థులు కూడా వున్నారు. వారిలో అప్పటికే మార్క్సిస్టు భావజాలంతో పరిచయం వున్న రాచమల్లు

    రామచంద్రారెడ్డి గూడా వున్నాడని చెప్పనక్కరలేదు గదా!

    సమ్మె జరగడం వరకూ బాగానే వుంది. అయితే సమ్మె విరమించిన తర్వాత ఒక విచిత్రం జరిగింది. అదీ గిండీ ఇంజనీరింగ్ కాలేజీలోనే. సమ్మె ముగిసి విద్యార్థులందరూ వారి వారి తరగతులకు హాజరవుతున్నపుడు జరిగిన విచిత్రం అది. వైద్యకళాశాలతో సహా మిగతా అన్ని విద్యాలయాల అధికారులూ యెలాంటి…………

    700.00
    Add to cart
  • Ramana Mouna Bashan
  • Rayalaseema Hasya Kathalu

    Rayalaseema Hasya Kathalu

    0

    అతిథి దేవోభవ…

    ఆదోని బాష – 9440239828

    “డాడీ అతిథి దేవో భవ అంటే ఏమిటి?” సాయంత్రం ఇంటికి రాగానే రాంబాబుకి అతని ఆరేళ్ళకొడుకు చంటి వేసిన ప్రశ్న ఇది. అతిథి పేరు వింటేనే మండిపడే రాంబాబుకి కొడుకు ప్రశ్న విని చిర్రెత్తుకొచ్చింది.

    “వెధవా…. ఆ మాత్రం తెలీదా? అతిథి దేవో భవ అంటే అతిథి దెయ్యంలా భయపెడతాడని అర్థం” కసిగా చెప్పి విసురుగా సోఫాలో కూర్చున్నాడు. ఆ

    అతని వేగానికి సోఫా కుయ్యో మొర్రో అంటూ టకటకమని చప్పుడు చేసింది. వంటింట్లో ఉన్న లత భర్త మాటలు విని హాల్లోకొచ్చింది.

    “అదేంటండీ, ఎవరి మీది కోపమో వాడి మీద చూపిస్తున్నారు. ఆఫీసులో బాసుతో గొడవపడి వచ్చారా?” అనడిగింది.

    “గొడవపడింది బాసుతో కాదు, బాసుగారి బాసుతో” “బాసుగారి బాసా, అదెవరు?” “ఇంకెవరు, మన బాసుగారి భార్యామణి” “ఆవిడ మీ ఆఫీసుకెందుకొచ్చింది? “బుద్ధి గడ్డి తిని మేమే పిలిచాం” “ఎందుకు?”

    మా కంపెనీ చాక్లెట్ల సేల్స్ పెంచటానికి మేం అప్పుడప్పుడు కస్టమర్లతో చిన్న చిన్న మీటింగులు ఏర్పాటు చేస్తుంటామని మీకు తెలుసు కదా. ఈ రోజు అలాంటిదే ఓ మీటింగ్ జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మా బాసుగారి భార్యని ఆహ్వానించాం. ఈ రకంగా సుని ప్రసన్నం చేసుకోవాలనుకున్నాం,

    ఆయన భార్య బిస్కెట్ కంపెనీకి సేల్స్ అడ్వయిజర్‌గా వ్యవహరిస్తోంది. ఏవో నాలుగు ఉచిత సలహాలిచ్చి మా బ్రాంచిని ప్రోత్సహిస్తుందనుకుంటే ఆవిడ మా స్టాప్ ని లక్స్ సబ్బుతో కడిగేసింది. నన్నయితే ఓబిస్కెట్ లా కరకర నమిలి తినేసింది”

    “ఇంతకీ ఆవిడ ఏం చెప్పింది?” “చాలా చెప్పింది.

    హిమాలయాల్లో ఐస్ క్రీముని అమ్మాలంది. థార్ ఎడారిలో ఇసుక వ్యాపారం చెయ్యాలని చెప్పింది. బంగాళాఖాతంలో ఉప్పుని అమ్మాలని సెలవిచ్చింది. ఇవన్నీ చెయ్యగలిగినవాడే నిజమైన స్స్మే న్ అని శ్రీకృష్ణుడిలా గీతోపదేశం చేసింది”………

    280.00
    Add to cart
  • Rendu Kommula Rushi

    Rendu Kommula Rushi

    0

    పరిచయం

    వివిధ ప్రాంతాలలో వివిధ భాషలలోని రామాయణ, మహాభారత, భాగవతాలను చదివి ఈ ఐదు భాగాల పుస్తకాలను రచించాను. అవి వేర్వేరుగా ఉన్నట్టు అనిపించినా వాటిని కలిపే మూలం ఒకే దారంగా అన్నింట్లోను కనబడుతుంది. పురాణాలలో పేర్కొన్న కొన్ని పాత్రలు వారి జీవిత కోణంలోంచి కథను చెబుతాయి. ఈ కథలలోని ప్రదేశాలు నేను దర్శించి అక్కడ చెప్పే కథల సారాంశాన్ని, సమాచారాన్ని అందించడం నా అదృష్టం,

    పురాణాల్లోని వివిధ అంశాలను సేకరించి వ్రాసిన ఐదు పుస్తకాలలో ఇది చివరిది. ప్రతి పుస్తకం మరో పుస్తకంతో సంబంధం లేనిదైనా దేనికదే వివరంగా ఉంటుంది. నేను వ్రాయలేక వదిలేసినవి అనేక కథలున్నాయి. ఈ పుస్తకం చదివి మీరు స్ఫూర్తిని పొంది మిగిలిన కథలు మీ అంతట మీరే చదువుతారని ఆశిస్తున్నాను.

    ఈ పుస్తకాలు రాసేటప్పుడు నా సంపాదకురాలు శృతకీర్తి ఖురానా నాకు సహకారం అందించింది. నేను పరిశోధన చేసేటప్పుడు జీవితం, ఆధ్యాత్మికత గురించి, పుస్తకాల గురించి అనేక లోతైన చర్చలు జరిపి మమ్మల్ని మేం తెలుసుకున్నాం. మా అనుబంధం సంపాదకురాలు – రచయిత కన్న ఎక్కువది. అనేక విధాలుగా ఆమె నాకు కూతురు, మరిన్ని రకాలుగా ఆమె నా విద్యార్థి, నేను చేపట్టే వితరణ కార్యక్రమాలలో చిరకాల సలహాదారు. మేం చేసే వినోదభరిత సంగీత సాహిత్య సాహసయాత్రలో నాతోబాటు ప్రయాణించిన యువనేస్తం.

    పెంగ్విన్ రాండంహౌస్ లోని సోహిని మిత్రా, షాలిని అగర్వాల్, ప్రియంకర్ గుపా బృందం ఐదు పుస్తకాలు అందించడానికి ఇచ్చిన తోడ్పాటుకు, తెలుగులో తీసుకువచ్చిన అలకనంద ప్రచురణలకు నేను కృతజ్ఞురాలిని.

    225.00
    Add to cart
  • Russian Classics

    Russian Classics

    0

     రష్యన్ విప్లవం జరిగిన వంద సంవత్సరాలు గడిపోయాయి. ఈ విప్లవానికి ముందే “జార్” రాజు పరిపాలించే రష్యాలో నూతన ఆలోచనా ధోరణుల పెల్లుబికాయి. పట్టణాలలో డిసెంబరీష్ట్ తిరుగుబాటు, గ్రామాలలో రాచరిక భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా, బానిసల, అర్ధబానిస రైతులలో అసంతృప్తి జ్వాలలు పెల్లుబికాయి. వాటి ప్రభావం వల్ల మేధో, మధ్యతరగతి వర్గాలలో ఓ చైతన్యపూరితమైన కదలిక ప్రాభవం అయ్యింది. దీని ప్రబింబమే రష్యన్ మహారచయితల ఆవిర్భావం.

                           రష్యన్ ఆకాశం పై వెలిసిన వేగుచుక్కలు, పుష్కిన్ , గోగోల్, తుర్గెనోవ్,, కుప్రిస్, చేవోహ్, గోర్కీలు . వీరి రచనలు అనువాదాలు కొన్ని తెలుగులో వచ్చినప్పటికీ, రెండో ప్రపంచ యుద్ధం తరువాత అప్పటి సోవియట్ ప్రభుత్వం సాహిత్యాన్ని చాలా ప్రపంచ బాషలలో అనువదించి ప్రపంచమంతా పంచింది. 1945 నుంచి 1985 వరకు అనేక తెలుగు ప్రజలకు పరిచయం అయ్యాయి. సోవియట్ పతనం అనంతరం ఈ సాహితిధార ఆగిపోయింది.

    225.00
    Add to cart
  • Sagara Ghosha

    Sagara Ghosha

    0

     ఇది విశ్వకావ్యం. భూమి చరిత్రే ఈ కావ్యంలోని ఇతివృత్తం. మానవుడే దీంట్లో నాయకుడు. ఇది మనిషి కథ. కోట్ల ఏళ్లనాటి భూమి పుట్టుక నుండి నిన్న మొన్నటి ఘట్టాల వరకు ఇంచుమించుగా మానవుని మహాప్రస్థానంలోని అన్ని సంఘటనలు ఈ కావ్యంలో చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఇది పర్యావరణ పద్య కావ్యం. మనిషి భౌతిక పరిసరాలు అందంగానూ, ఆనందాయకంగాను ఆలోచించాలని తెలియజెప్పే కావ్యం ఇది. ఆదిశంకరాచార్యుని అద్వైత సిద్ధాంత నేపథ్యంలో అన్ని దేశాల సాంస్కృతిక చరిత్రని పరిశీలించి, విశ్లేషించిన  కావ్యం.

                   ఇది 1116 పద్యాలతో నిండిన కావ్యం. ఒక ఆశ్వాసానికి 108 చొప్పున 10 ఆశ్వాసాలు ఉన్నాయి. అవతారికలో 36 పద్యాలు ఉన్నాయి. వృత్తాలు పాతవే అయితే ఇతివృత్తం కొత్తది. ఒకానొక ప్రౌడవయస్కుడైన కవి సాగరతీరంలో కూర్చొని, సముద్రాన్ని వర్ణిస్తూ, తన్మయస్థితిలో ఉంటాడు. ఇంతలో ఒక పిల్ల కెరటం ఒడ్డుకు వచ్చి, ఆ కవి ఒళ్ళో వాలుతుంది. ఒక పసిపాప తన ఒడిలోకి వచ్చినట్లుగా భావించి, ఆ కవి ఆ కెరటాన్ని ప్రేమగా చేరదీస్తాడు. లాలిస్తూ దాని ఒళ్ళంతా నిమురుతూ ఉంటే, దాని వీపంతా జిడ్డు జిడ్డుగా, మడ్డిగా కనబడుతుంది.

    “స్వచ్చంగా ఉండవలసిన నీటికెరటానివి, ఇలా ఉన్నావేమిటి”? అని ప్రశ్నిస్తాడు. తాను ఇరాక్ తీరం నుంచి కొట్టుకు వస్తున్నానని, సద్దాం హుస్సేన్ సముద్రంలో ఆయిల్ పారబోసినప్పటి నుండి తన పరిస్థితి ఇలా అయిందని కెరటం వాపోతుంది. తాను కొద్ది రోజులు కవి ఒడిలోనే విశ్రాంతి తీసుకు వెళతానని ఆర్థిస్తుంది. గుండె కరిగిన కవి ఆ తరంగ బాలికకు కవిత్వంతోనే అతిథి మర్యాదలు చేసి, జోలపాడి నిద్రపుచ్చుతాడు. తరంగం మేల్కొన్న తరువాత అది తిరిగి వచ్చిన తీరాలలోని విశేషాలను చెప్పమని ఆర్థిస్తాడు. అప్పుడా కెరటం చెప్పిన మానవుని జీవిత కథే ఈ సాగరఘోష.

    440.00
    Add to cart
  • Samakalina Bharatiya Kathalu

    Samakalina Bharatiya Kathalu

    0

    ఉర్దూ కథ : శిరీస్ నియాజి

    చిన్నచేప-పెద్దచేప

    అదొక చీకటి రాత్రి! ప్రకృతి నలువైపులా నల్లటి దుప్పటి కప్పుకుంది. దూరాన ఉత్తర దిక్కులోని ఓ మూలలో మాత్రం రక్తం గడ్డకట్టినట్టు ఎర్రబడింది. ఆకాశం,

    పగలంతా తమ కువకువలతో సందడి చేసిన పక్షులు అలసిపోయి తమ గూళ్ళలో దూరి నిశ్శబ్దంగా నిద్రిస్తున్నాయి. కుక్కలు మొరగటం, ఏడ్వటం మానేసి రోడ్లు, సందుల్లో తమ కడుపుల్లో తలలు దూర్చుకుని నిద్రకు ఉపక్రమించాయి.

    ఇలాంటి భయానకమైన రాత్రి ఓ నీడ తూలుతూ నది వైపు వేగంగా కదులుతోంది. అతని భుజాలు ముందుకు వంగి ఉన్నాయి. చిరిగిన దుస్తులు, అరిగిన చెప్పులతో అతను నడుస్తున్న తీరు చూస్తే అతనొక ముసలివాడని, బలహీనమైన వ్యక్తి అని ఇట్టే చెప్పొచ్చు. కాకపోతే కటిక పేదరికమే అతన్ని వయస్సుకన్నా ముందే ముసలివాడిగా మార్చేసింది. అయితే అలాంటి బలహీనమైన వ్యక్తి అర్ధరాత్రి పూట నది దగ్గరికి ఎందుకు వెళుతున్నాడు?

    పైగా ఈ రోజు సాయంత్రమే రేడియోలో ఒక హెచ్చరిక వెలువడింది- “ఈ రోజు రాత్రి భయంకరమైన తుఫాను వచ్చే అవకాశముంది. అందువల్ల చేపలు పట్టే జాలరులు ఎవరూ నదిలోకి వెళ్ళకూడదు” అని. ఆ వార్త అనగానే ఆ జాలరి వెంటనే చేపల కాంట్రాక్టర్ దగ్గరికి ‘ఈ రోజు చేపలు పట్టలేనని చెప్పడానికి’ వెళ్ళాడు. ఆ మాట వినగానే కాంట్రాక్టర్ మండిపడ్డాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ చేపలు పట్టాల్సిందేనన్నాడు. దాంతో తుఫాను రాత్రి అయినా చేపల కోసం నదిలోకి వెళ్ళక తప్పదనుకున్నాడు జాలరి. వెళ్ళకపోతే మరుసటి రోజు కాంట్రాక్టర్ తనకు డబ్బులు ఇవ్వడు. డబ్బు లేకపోతే ఇంట్లో పొయ్యి వెలగదు. తిండిలేక పిల్లలు విలవిల్లాడతారు. ఆకలిని తట్టుకునే వయసు వాళ్ళకింకా రాలేదు.

    | ఓ పడవ నిండా పట్టిన చేపలకి కాంట్రాక్టర్ ఇరవై రూపాయలిస్తాడు. దాంతోనే అతను తనతోపాటు భార్య, ముగ్గురు కూతుళ్ళ కడుపులు నింపుతాడు. నిజానికి అతను పడే కష్టానికి ఇరవై రూపాయలు చాలా తక్కువ. కష్టం తనది, సుఖమూ, సొమ్మూ కాంట్రాక్టర్ ని అతనికి తెలుసు. చలిలో, వర్షంలో అవస్థలుపడి నదిలో చేపలు పట్టి నిజాయితీగా చేపలన్ని కాంట్రాక్టర్ కి చేరుస్తాడు. తన పిల్లల కోసం ఒక్క చేప కూడా తీసుకెళ్ళడు. అయినా కాంట్రాక్టర్ ఎన్నడూ అతనిపట్ల సానుభూతి చూపలేదు..

    160.00
    Add to cart
  • Sampada Srustinche Rahasyam

    Sampada Srustinche Rahasyam

    0

    ధనవంతులయ్యేందుకు ఓ శాస్త్రం ఉంది.

    ధనవంతులు కావడానికి ఓ శాస్త్రం ఉంది. అది.. బీజ గణితం లేదా అంకగణితం వంటి కచ్చితమైన శాస్త్రం. సంపదను సంపాదించే ప్రక్రియను నియంత్రించే కొన్ని చట్టాలున్నాయి. ఈ చట్టాలను నేర్చుకుని, పాలించిన తర్వాత ఎవరైనా నిశ్చయంగా సంపన్నుడు కాగలడు. ఒక నిర్దిష్ట మార్గంలో పనిచేయడం వలన డబ్బు మరియు ఆస్తి యాజమాన్యం లభిస్తుంది. ఉద్దేశపూర్వకంగా గానీ లేదంటే అనుకోకుండా కానీ ఈ నిర్దిష్ట మార్గంలో పనిచేసిన వారు సంపన్నులు అవుతారు. ఈ నిర్దిష్ట మార్గంలో పనులు చేయనివారు ఎంత కష్టపడినా, ఎంత సామర్థ్యం ఉన్నా ‘పేదలుగానే మిగిలిపోతారు. ఇది నిజమని ఈ క్రింది విషయాలు నిర్ధారిస్తాయి.

    ధనవంతులు కావడమనేది పర్యావరణానికి సంబంధించిన అంశం కాదు. ఒకవేళ అదే గనుక నిజమైతే నిరిష పరిసరాలలోని వారంతా సంపన్నులు అవుతారు. ఒక పట్టణంలోని వారో లేదంటే ఒక రాష్ట్రంలోని వారో మాత్రమే ధనవంతులుగా ఉంటారు. ఇతర పట్టణాలు, ఇతర రాష్ట్రాల్లోని వారంతా పేదలుగానే మిగిలిపోతారు. కానీ.. ప్రతిచోటా ధనవంతులు, పేదలు పక్కపక్కనే ఒకే వాతావరణంలో నివసిస్తుంటారు. వారిలో చాలామంది ఒకే వృత్తిలో కొనసాగడం కూడా మనం చూసే ఉంటాం. ఇద్దరు వ్యక్తులు ఒకే ప్రాంతంలో, ఒకే వ్యాపారంలో ఉన్నప్పుడు వారిలో ఒకరు ధనవంతులుగా మరొకరు పేదలుగా ఉన్నప్పుడు.. సంపన్నులు కావడమనేది ప్రధానంగా పర్యావరణానికి సంబంధించిన అంశం కాదన్న విషయం ఇక్కడ అర్థమవుతుంది.

    కొన్ని వాతావరణాలు ఇతరులకన్నా మరింత ఎక్కువ అనుకూలంగా ఉండొచ్చు. | … ఒకే వ్యాపారంలో ఉన్న ఇదరు వ్యక్తులు ఒకే పరిసరాల్లో ఉన్నప్పుడు వారిలో – విఫలమై.. మరొకరు ధనవంతులు కావడం అనేది ఒక నిర్దిష్ట మార్గంలో ……..

    175.00
    Add to cart
  • Shakti Aavribhavam
  • Smasananiki Vyragyam

    Smasananiki Vyragyam

    0

    మంచి పుస్తకం చదివి ఆస్వాదిస్తే కలిగే ఆనందమేంటో నాకు తెలుసు. తెలుగు సాహిత్యం మాత్రమే కాకుండా ఇతర భారతీయ భాషల్లోనూ, ఆంగ్ల భాషలోనూ వచ్చే సాహిత్యాన్ని విరివిగా చదవడం నాకు అలవాటు. ఒక తరం వేరొక తరానికి తమ అనుభవపరంపరను నిరంతరం అందించే శాశ్వత విజ్ఞాననిధులు పుస్తకాలు.

                   కానీ నా తర్వాత తరంలో పుస్తకాలు చదవడం తగ్గిపోతుందనే ఆలోచన నాకు కొంత బాధ కలిగించింది. పుస్తకాలు చదవడంలోని ఆనందాన్ని కొత్త తరానికి పరిచయం చెయ్యాలన్న ఆలోచన నాలో ప్రస్ఫుటంగా నాటుకుంది.

    2018 డిసెంబర్ లో ఒక రోజు మా శ్రీవారు సత్యదేవ్ నాతో మాట్లాడుతూ మనమొక పబ్లిషింగ్ హౌస్ స్థాపించబోతున్నామనగానే నాకు పాలో కొయిలో చెప్పిన ఒక సత్యం గుర్తొచ్చింద

    100.00
    Add to cart
  • SOONYAM

    SOONYAM

    0
    250.00
    Add to cart
  • Soul Circus

    Soul Circus

    0

    మంచి పుస్తకం చదివి ఆస్వాదిస్తే కలిగే ఆనందమేంటో నాకు తెలుసు. తెలుగు సాహిత్యం మాత్రమే కాకుండా ఇతర భారతీయ భాషల్లోనూ, ఆంగ్ల భాషలోనూ వచ్చే సాహిత్యాన్ని విరివిగా చదవడం నాకు అలవాటు. ఒక తరం వేరొక తరానికి తమ అనుభవపరంపరను నిరంతరం అందించే శాశ్వత విజ్ఞాననిధులు పుస్తకాలు.

                   కానీ నా తర్వాత తరంలో పుస్తకాలు చదవడం తగ్గిపోతుందనే ఆలోచన నాకు కొంత బాధ కలిగించింది. పుస్తకాలు చదవడంలోని ఆనందాన్ని కొత్త తరానికి పరిచయం చెయ్యాలన్న ఆలోచన నాలో ప్రస్ఫుటంగా నాటుకుంది.

    2018 డిసెంబర్ లో ఒక రోజు మా శ్రీవారు సత్యదేవ్ నాతో మాట్లాడుతూ మనమొక పబ్లిషింగ్ హౌస్ స్థాపించబోతున్నామనగానే నాకు పాలో కొయిలో చెప్పిన ఒక సత్యం గుర్తొచ్చింద

    275.00
    Add to cart