-
-
Veerakesari
0₹70.00అరుణకాంతులు శయ్యగారమాత ఆవరించి, చీకటిని పారద్రోలుచున్నవి. అలసటగా తన అందమైన అవయములను విరుచుకున్నది అరుణసుందరి. గత రాతిరి వెలిగించిన దివ్వె గొంపో వచ్చిన దాసి మృదువుగా మందహాసము చేసినది. “యెందులకే ఆ గడుసు నవ్వు?” చిరుకోపం ప్రకటించింది యువరాణి.
“ఇట్టి తరుణము తమ నాథులు గాంచిన కపొలములు కందిపోవా! పాపం! శ్రీవారు ఈ దేవి దర్శనము గానక, ఆ భవాని దర్శనార్ధమై ఆలయమును కేగినారు” కొంటె చూపులు విసిరినది దాసి చండి. అరుణసుందరి అదిరిపాటున లేచినది. “చండి! సత్యము వచింపుము. వారు యేటించి యుండిరా?”
“అసత్యము వచించుట ఎలా? తమరు శయ్యవిడి గవాక్షము ద్వారా తిలికించడు. ప్రభువులు, శ్రీవారు, పరివారము ఆలయమున కేగుచున్నారో లేదో తెలియును.”
-
Warrior Shadow
0₹120.00చారెడేసి కన్నులు, చేమంతి బంతులు
ముంగురుల ముద్దుమోము – మనస్సు నిలువనీయదే
బావికాడ కడవతో వయ్యారపు నీ నడక
గుండెపట్టి గిల్లిందే-ఒళ్ళు తిమ్మిరెక్కిందే
నా వంక చూడవా నడుమొంపు చిన్నదాన
ఒక్క నవ్వు నవ్వవా రంగపూరు నెరజాణఇవ్వాళో రేపో విరిగిపోయేటట్లున్న చెక్కబల్లమీద ఎడమచేత్తో దరువు వేస్తూ పెద్ద గొంతుతో పాడటం మొదలు పెట్టాడు గంగారాం.
మాట్లాడేటప్పుడు మహా కరుకుగా ధ్వనిస్తుంది అతని కంఠం.
పాటలు మొదలు పెట్టిన మరుక్షణం మార్దవంగా మారిపోతుంది.
తలలు వంచుకుని తమదారిన తాము వెళ్ళిపోవాలనుకునే వారుకూడా ఆగిపోవాల్సిందే. పాట పూర్తి అయ్యేవరకూ ఆగి విని తీరాల్సిందే.
-
Youth and Truth: Unplug with Sadhguru
0₹157.00What happens when millennials meet a mystic? An avalanche of queries and an unflinching stream of answers. In this compilation of five talks from Youth and Truth events, Sadhguru fields questions that are quirky, personal, profound and shockingly bold from university students.
In a camaraderie bridging age, they adventure through a mind-boggling spectrum of subjects like romance and sexuality, loneliness and jealousy, parenting and education, career and business, politics and spirituality, artificial intelligence, racism, drugs, food, Yogic sciences, and god-making. Equally wide-ranging is the mood of the talks – from playfulness and hilarity to moments of gobsmacked speechlessness, dawning clarity and paradigm shifts, all infused with the fizzing energy of youth.
Here is a book not just for youth, but for the youthful in search of truth.
-
Yudha Kala
0₹150.00యుద్ధ కళ అనేది రాజ్యానికి చాలా కీలకమైన విషయం. ఇది చావు, బతుకుల సమస్య . ఇది సురక్షిత మార్గం వైపు లేదా పూర్తిగా వినాశనంవైపు తీసుకెళ్లే మార్గం. ఇది విచారణకు సంబంధించిన విషయం కావడంతో , దీన్ని పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు.”
తూర్పు ఆసియా దేశాల సంస్కృతి, చరిత్రల్లో ప్రత్యేక స్థానం కలిగిన అద్భుత దృశ్యకావ్యం… యుద్ధకళ . ఈ పుస్తకం రాణానితి , సైనిక వ్యూహాలలోని రాజకీయాలు, సిద్ధాంతాలకు సంబంధించిన ప్రాచీన చైనా పాఠం. ఈ పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్దుడైన యోధుడు. తత్వవేత్త అయిన సన్ ట్జు క్రుస్తుపూర్వం 6 వ శతాబ్దంలో రాశారు. -
Zero to One: Notes on Start Ups, or How to Build the Future
0₹490.00What Valuable Company is Nobody Building? The next Bill Gates will not build an operating system. The next Larry Page or Sergey Brin won’t make a search engine. If you are copying these guys, you aren’t learning from them. It’s easier to copy a model than to make something new: doing what we already know how to do takes the world from 1 to n, adding more of something familiar. Every new creation goes from 0 to 1. This book is about how to get there.
-
Chivaraku Migiledi
0₹300.00చివరకు మిగిలేది – ఏమిటి? అన్నదానికి వెంటనే దేని చివరకు? అన్న ప్రశ్న పుడుతుంది. ఆ వెంటనే మిగిలేది ఎవరికి? – అన్న జిజ్ఞాసా రాక తప్పదు. వ్యక్తికా – జీవితానికా – వ్యక్తులతోనూ వాళ్ళ మధ్య అనేకానేక ఉత్పతి, పునరుత్పతి సంబంధాలతోనూ ఆవిష్కారమైన సమాజానికా – అన్నదే అది. ఈ ప్రశ్న భావనామాయమైంది. దీనికి సమాధానం భౌతిక రూపంలో వెదకడం సులువేనా? అసలీ “మిగలటం” – అన్న సమస్య గురించి విశ్వనాథ ‘వేయిపడగల’ లో చర్చించాడు. అలాగే చలం తన “మ్యూజింగ్స్” లో కొంత ఆలోచన చేశాడు.
ఒకానొక విశ్వాసం మిగులుతుందని విశ్వనాథ అంటే, మిగులుతుందనుకోవటం భ్రమగా తేల్చేశాడు చలం. వీరి తాత్త్విక విశ్వాసాలకు సృజనాత్మకరూపం కల్పించి నవలగా రూపొందించిన ఘనత బుచ్చిబాబుది. రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కొత్త విలువల రూపుకడ్తున్నాయి. నిరాశా నిస్పృహల్లో మునిగిన సమాజాన్ని “లోచూపు” లో చూడటం అన్న వాస్తవికతలకు నవలారూపమే ఈ రచన. పురుషస్వామ్య సామాజిక భావాజాలం – అది సృష్టించిన పాత్రలు – వీటి ప్రవర్తన ఈ నవలలో బొమ్మకడుతుంది.
ప్రపంచంలోని వ్యక్తులే సాహిత్యంలో పాత్రలౌతారు. అలాగే బుచ్చిబాబు ఈ నవలలో సృష్టించిన పాత్రలు; ఆ కాలంలో తెలుగు దేశంలోని ఆధునిక సాహిత్య – సామాజిక – తాత్విక ధోరణుల ప్రతిబింబాలనిపిస్తాయి. రాధాకృష్ణన్ – రసెల్ – జిడ్డు కృష్ణమూర్తుల సమాహార తాత్వికతే బుచ్చిబాబు దార్శనికత్వం అనిపిస్తుంది. ఆధునిక తెలుగు నవలల్లో మంచివేవి? అని ఏ సాహిత్య విద్యార్థిని ప్రశ్నించినా ముందుగా చెప్పేది; తెలుగు కల్పనా సాహిత్యంలో చివరికంటా మిగిలేది ఈ “చివరకు మిగిలేది”.