-
Paakudu Rallu – పాకుడు రాళ్ళు
0₹500.00చిత్ర పరిశ్రమలోని అనేక కోణాల్ని అద్భుతంగా అవిష్కరించిన ‘పాకుడురాళ్లు ‘నవలకు ఈ పురస్కారం దక్కింది.
‘పాకుడురాళ్ళు’ నవలలోని కొన్ని సంఘటనలు, సన్నివేశాలు, సామాన్య పాఠకునికి చాలా కొత్తగా కనిపిస్తాయి. వాటిని అభివ్యక్తం చేయడంలో రచయిత ప్రదర్శించిన చొరవ, తెగువ అభినందనీయమైనవి. ’దారుణా ఖండల శస్త్రతుల్యము’ లైన వాక్యాలతో శ్రీ భరద్వాజ ఆయా ఘట్టాలను చిత్రించిన విధానం అపూర్వంగా ఉన్నది. తను చెప్పదలచుకున్నదేదో బలంగా చెప్పగల బహుకొద్దిమంది రచయితలలో భరద్వాజ వొకరు. ఆయన విమర్శ, వ్యక్తిగతంగా ఉండదు. ఆ వ్యక్తుల తాలూకు సమాజమూ, అందులోని వాతావరణమూ, ఆయన విమర్శకు గురి అవుతాయి.
అట్టడుగునుండి జీవితం ప్రారంభించి ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ప్రతిభాశాలిని మంజరి. నీగ్రో బానిసగా జన్మించి, అమెరికా చరిత్రనే మార్చివేసిన ‘జార్జి వాషింగ్టన్ కార్వర్’, మామూలు కార్మికుడుగా బ్రతుకు ప్రారంభించి, కార్ల సామ్రాజ్యాధిపతిగా పేరు సంపాదించిన ’వాల్టన్ పెర్సీ క్రిజ్లర్’, మట్టిలో పుట్టి, మణిమందిరాలలో నివసించిన ’మార్లిన్ మాన్రో’- వీరందరూ అనుసరించిన మార్గాలనే మంజరికూడా అవలంబించి తమ ధ్యేయాన్ని సాధించుకోవడానికి నిరంతర కృషి, అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమూ, వారి విజయాలకు కారణాలు. మంజరికూడా ఈ రెండు సూత్రాలనూ అక్షరాలా పాటించింది. గుంటూరు గుడిసెల్లో తిరిగి, బొంబాయిలోని చలువరాతి మందిరం చేరిన ఈ మధ్య కాలంలో- మనకొక విచిత్రమైన చలనచిత్ర ప్రపంచాన్ని చూపించింది.
సినిమారంగం ఆధారంగా, తెలుగులో చాలా చిన్న కథలొచ్చాయి గానీ, పెద్ద నవలారూపంలో రావడం మాత్రం ఇదే ప్రథమం.
……. ఆలపాటి వెంకట్రామయ్య
మద్రాసులో ముడున్నరేళ్ళు ‘చిత్రసీమ’ సినిమా పత్రికలో పనిచేస్తూ సినిమా తారల భేటీలెన్నో దిద్దాను. రిపోర్టర్లతో ఉన్న సాహిత్యంతో వారి ద్వారా తెలుసుకున్న వివరాలు నేను స్వయంగా తెలుసుకున్నవి గుదిగుచ్చి ఒక కధ రాశాను. మంచి స్పందన రావడంతో ‘మాయాజలతారు’ నవలను రాశాను. దీనికే పాకుడు రాళ్లు పేరు మార్చారు శీలా వీర్రాజు. నాకు ఇష్టమైన నవల ఇది. రాజకీయం,సినిమా మహా సముద్రం లాంటివి. ఎంతరాసిన తక్కువే.
…… రావూరి భరద్వాజ
-
-
Padi Rupaayala Notu – పది రూపాయల నోటు
0₹100.00పది రూపాయల నోటు అనేది డబ్బుకు గుర్తు.
దాని చుట్టూ సమాజంలో ఎన్నో విభిన్నమైన పాత్రలను
రచయిత అద్బుతంగా ప్రవేశపెట్టాడు. పెట్టుబడిదారీ
అనంతర సమాజంలో అవసరమైన ఉన్నత మానవ
విలువలకు పెట్టుబడిదారీ సమాజంలోనే
పునాదులేర్పడతాయని ఈ నవలలోని కొన్ని పాత్రల
ద్వారా రచయిత మనకు చూపిస్తాడు.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలపై
ఆధారపడి వుంటాయన్న సత్యాన్ని తెలియజేశాడు.
కిషన్ చందర్ రచనలు సమాజ స్వరూపానికి అద్దం
పడతాయి. మ¬దాత్త శ్రమకి, ప్రేమకీ నీరాజన
మిస్తాయి. పాఠకుణ్ణి ఆకట్టుకునే శైలీ, జీవిత వైవిధ్యం,
మానసిక అంతర్మథనానికీ మాటలతో రూపమివ్వటం
ఆయన ప్రతిభా సంపన్నతకు ప్రతీకగా నిలుస్తాయి.
పేజీలు : 136
-
Padma Yuham
0₹100.00తిరిగి యిన్నేళ్ళ కు మాదిరెడ్డి సులోచన నవలలు మీ ముందుకు వచ్చాయి. దాదాపు ఏభై యేళ్ళ క్రితం అచ్చమైన తెలంగాణా వాతావరణం పొందికైన మానవ సంబంధాలూ కలగలిపి చక్కని యితివృత్తాలు ఆమె సాహిత్యంలో కనిపిస్తాయి. డెబ్భై పైగా నవలలు ఆమె రచించారు. వాసిలోనూ రాశిలోను కూడా సులోచన రచనలు ఎన్నతగినవే. ఆమె ప్రమాదవశాత్తు అకాలమరణం పాలు కాకుండావుంటే మరెన్ని మంచి నవలలు రాసి వుండేవారోననేది ఊహకు మాత్రమే మిగిల్చి వెళ్లిపోయారు.
ఇప్పుడు అంటే నూతన సహస్రాబ్ది తొలిదశకంలో యీ నవలల్ని చదువుతున్నపుడు కొన్ని కొన్ని సందర్భాలలో పాఠకులకు అసహజంగా వున్నా భావన కలిగే అవకాశం వుంది. ఎందుకంటే గడచిన ఏభై సంవత్సరాలలో ఆర్థిక సాంఘిక సాంస్కృతిక రంగాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఆనాటి రూపాయికి నేటి రూపాయికి పొంతన లేదు. కొన్ని వూళ్ళపేర్లు కొన్ని మాటల అర్దాలు సైతం మారిపోయాయి. వేషధారణ మారింది. దూరాలు తగ్గిపోయాయి. భూగోళం గుప్పెట్లో వొదిగిపోయింది. ఆనాడు వంద రూపాయలంటే చాలా పెద్ద మొత్తం. నేడు అది చిల్లర డబ్బు. కనుక ఇలాంటివి మాదిరెడ్డి నవలలో తారసపడినప్పుడు విజ్ఞలైన మా పాఠకులకు కాలంతో అన్వయించుకుని అర్ధం చేసుకోగలరని ఆశిస్తున్నాము.
– మాదిరెడ్డి సులోచన
-
Palavu Kurma
0₹180.00మాంసాహార వంటకాల్ని వెరైటీగా చేసుకుంటే చల్లని వాతావరణంలో ఆనందంగా నోరూరిస్తుంటాయి. మాంసాహారులకు కొత్తరకం పదార్ధాల తయారీ అంటే పసందుగా వుంటుంది. ఎప్పుడూ చేసుకునే వాటికి భిన్నంగా తయారు చేసుకుంటే ఘుమఘుమలాడే మసాలా వంటకాలు మాంసాహరులను నోరూరిస్తుంటాయి. అలాంటివి కొన్ని మీ కోసం….
-
Pallavi Leni Pata
0₹100.00రంగనాయకమ్మ గారు సమర్పిస్తున్న ఈ పుస్తకంలో పల్లవి లేనిపాట! శీర్షికతో ఒక నవలికా ‘కులవిధానం’ గురించీ. ‘దెయ్యాల శాస్త్రం’ గురించీ. ‘మార్క్సిజం’ గురించీ కొన్ని వ్యాసాలూ ఉన్నాయి.
ఈ పుస్తకంలో వున్న ఎక్కువ వ్యాసాలు ‘వర్గాలకూ-కులాలకూ’ సంబంధించినవి. ఆ అన్ని వ్యాసాలలోనూ వున్నది ఒకే సమస్య. ఒకే పరిష్కారం, కాని, చర్చించిన కారణాలు వేరు వేరు.ఈ పుస్తకంలోనే వున్న ఇతర వ్యాసాలలో కొన్ని, ”దెయ్యాలూ-పరలోకాలూ కూడా సైన్సు విజ్ఞానమే” అని చెప్పే అజ్ఞానశాస్త్రం మీద విమర్శనా వ్యాసాలు.
ఏదైనా ఒక సమస్య మీద వాదోపవాదాలు జరిగితే. అందులో హేతుబద్ధమైన వాదం కనపడితే, మన వాదం తప్పుగా వున్నట్టయితే, మనం మన వాదాన్ని తప్పకుండా మార్చుకోవాలి.
అది ఎదుటి వాళ్ళ కోసం కాదు; మనకోసమే – మన అభివృద్ధి కోసమే.ఈ పుస్తకంలో వున్న చిట్టచివరి వ్యాసం, మార్క్సిజాన్ని చాలా జాగ్రత్తగా అర్ధం చేసుకోవడానికి అవసరమైనది.
ఆ అవసరం కోసమే చర్చించదగ్గది. ‘పల్లవిలేని పాట’లో రెండు రకాల చర్చలు వున్నాయి. ‘కుల భేదాల’ గురించీ, ‘ప్రేమ సంబంధాల గురించీ’. ఈ చర్చల్ని కూడా పరిశీలించండి!