-
Khadga Srushti – ఖడ్గ సృష్టి
0₹180.00నీ తొడపై శిరస్సుంచి నే నిలా పడుకున్నప్పుడు, కామ్రేడ్
ఇదివరకు నీతో, గాలితో అన్నదే ఇప్పుడూ అంటున్నాను మళ్ళీ
ఔను నే నెరుగుదును నాకు శాంతి లేదని, ఇతరులని కూడా అశాంతిలో ముంచుతానని,
ఔను నేనెరుగుదును ఆయుధాలు నా మాటలని, ఆగ్రహపూరితాలని, మృత్యువుతో నిండినవని,
నిజానికి నేను కత్తి దూసిన సిపాయిని, కదనరంగంలోని సేనానికి మించిన కసాయిని,
ఎంచేతనంటే, అన్నింటినీ ఎదిరిస్తాను, శాంతిని, క్షేమాన్ని చట్టాలను, కట్టుదిట్టాలను, వాటిని ధిక్కరించడమే నా పని,
అందరూ నాకెంత దూరమైతే అంత బిర్ర బిగుస్తాను,
అందరూ నాతో ఏకీభవిస్తే ఇంత పట్టుదల నాకుండేది కాదేమో!
దేన్నీ లక్ష్యపెట్టను, ఎన్నడూ లక్ష్యపెట్టలేదు. అనుభవాన్ని, ఆచారాన్ని అధిక సంఖ్యాకుల్ని అవమానాలని,
నరకమనేది నన్ను భయపెట్టదు, స్వర్గం నన్నాకర్షించదు,
డియర్ కామ్రేడ్! విను! నాతో రా మునుముందుకి, ఈ
ప్రోత్సాహం ఎందుకో, ఎక్కడికో నాకూ తెలియదు. అయినా రమ్మనడం మానలేను,
జయాపజయాలతో నిమిత్తం లేదు. ఎడతెగనిది మన యాత్ర.
వాల్ట్ వైట్మాన్ ఆంగ్ల కవితకు శ్రీశ్రీ ‘కామ్రేడ్’ శీర్షికన చేసిన అనువాదమిది. ఇంకా ఇందులో శ్రీశ్రీ రచించిన కవితలు – మరికొన్ని అనువాద కవితలు (120) – వాటికి సంబంధించిన ఫుట్ నోట్స్ ఉన్నాయి.
-
Loya Marikonni Kathalu – లోయ మరికొన్ని కథలు
0₹140.00తెల్లని పలుచటి తడిబట్టను ముఖంమీద కప్పుకుని లోకాన్ని చూసినట్టుగా ఉంటుంది అజయ్ ప్రసాద్ కథలు చదివితే. అంతా కనబడుతూ ఉంటుంది; ఇంకా కనబడనిది ఏదో వుందని కూడా తెలుస్తూవుంటుంది. స్పష్టాస్పష్టం. అజయ్ మానసిక ప్రపంచంలోని మనుషులు ఒక దారప్పోగు లాంటి బలహీన బంధాన్ని మాత్రం ఉంచుకుని సంచరించే జీవులు. అయినా వీరందరిలోనూ ఏదో తెలియని దు:ఖం. అది పొగిలి ఏడ్చేదీ కాదు; బయటకి వ్యక్తం చేయగలిగేదీ కాదు. మొత్తంగా శరీరమంతా జీవితమంత లోతుగా వ్యాపించివున్న దిగులు. ఎక్కడో దూరంగా ఏ బైరాగో తన మొత్తం అనుభవసారాన్నంతా గొంతెత్తి తనలో తానే ఏ తత్వంగానో పాడుతూవుంటే మనకు తెలియకుండానే దానిలో లీనమై అంగీకారంగా తలవూగుతూ వుండగా కనీకనబడని చెమ్మతో కళ్ళు మసకబారే పఠనానుభవం. – పూడూరి రాజిరెడ్డి
ఈ కథల్లో తీరని దిగులుతో కల్పన సాకుగా అజయ్ తన జ్ఞాపకాల్ని నిమురుకున్న ప్రతి సందర్భమూ నాకు నచ్చింది. కల్పనలు జ్ఞాపకాలుగా మారుతున్న సందర్బాలు కూడా. – మెహెర్
పేజీలు : 166
-
Manusmruti Samagra Sastreeya Vyakhya Modati Bhagam – మనుస్మృతి సమగ్ర శాస్త్రీయ వ్యాఖ్య మొదటి భాగం
0₹200.00మనుస్మృతి గురించి విననవివారుండరు. మూలంలో అసలేముందో తెలిసినవారు తక్కువే అయినా తెలుసుకోవాలనే కుతూహలమున్నవారు ఎక్కువే. ఇది మనుస్మృతికి శాస్త్రీయంగా చేసిన శస్త్ర పరీక్ష. మనువాద విమర్శకులు అనుకుంటున్నట్టు దీనిలో ఉన్నదంతా చెడేనా? లేక సమర్థకులు భావిస్తున్నట్లు దీనిలో ఉన్నవన్నీ నేటికీ పనికొచ్చే మంచి విషయాలేనా? వాస్తవానికి ఈ రెండూ పూర్తి నిజాలు కావు. రెంటిలోనూ కొంత మాత్రమే నిజం. గతితార్కిక దృక్పథంతో, ఆధునిక శాస్త్ర విజ్ఞానం వెలుగులో మనువు చెప్పిన విషయాలలోని మంచి చెడుగులను లోతుగా విశ్లేషించిన తులనాత్మక అధ్యయనమిది. పన్నెండు అధ్యాఆయల ఆ బృహద్గ్రథం మొదటి మూడు అధ్యాఆలలోని మొత్తం 654 శ్లోకాలపై చేసిన సమగ్ర శాస్త్రీయ విశ్లేషణ ఇప్పుడు మొదటి భాగంగా మీ ముందుంది. మరో రెండు భాగాలు త్వరలో వెలువడనున్నాయి. సరళమైన వాడుకభాషలో, సుబోధకమైన శైలిలో రాశారు పుస్తక రచయిత ముత్తేవి రవీంద్రనాథ్.
పేజీలు : 288
-
Nobel Kathalu – నోబెల్ కథలు
0₹120.00ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రచయితలకే నోబుల్ బహుమతి దక్కుతుంది. ఆ బహుమతి దక్కినవారిలో కొంతమంది రచనల నుండి మేలిమి కథలను స్వీకరించి, కథా సంకలన రూపంలో తెలుగు పాఠకులకు అందించారు రచయిత్రి శ్రీమతి జి.లక్ష్మి.
ఆమె ఎంచుకున్న రచయితలు, రచయిత్రులు ప్రపంచం నలుమూలలకు చెందినవారు. అందులో థామస్ మాన్, పెరల్ ఎస్ బక్, టాగోర్, సింక్లెయిర్, నైపాల్, లెస్సింగ్, రెమాంట్ లాంటివారు మన దేశ పాఠకులకు కూడా బాగా పరిచితులే. ఇరవై మంది రచనల నుండి ఇరవై కథలు అనువదించి ‘నోబెల్ కథలు’గా అందించారు లక్ష్మి.
Pages : 158 -
Palegadu – పాలెగాడు
0₹120.00‘పాలెగాడు’ అన్న పదానికి అర్థం – పాలించేవాడు, పరాక్రమవంతుడు, శౌర్యవంతుడని, ఇది రాయలసీమ మాండలిక పదం. విజయనగర రాజులు రాయలసీమ ప్రాంతానికిగానూ కొంతమంది సామంతరాజుల్ని ఏర్పరిచి వారి ఏలుబడిలో ఉండేందుకు వ్యక్తి పరిధిని బట్టి వంద, రెండు వందల గ్రామాలను ఇచ్చి పాలింపజేశారు. అయితే వారి పాలన సామంత పాలనగా కాకా స్వతంత్ర పాలనగా ఉండేది. అలాంటి పాలెగాళ్ళ సంతతికి చెందిన వ్యక్తి రాయలసీమలో ‘రేనాటి సింహం’ గా పిలువబడే వ్యక్తి, ఒక సామూహక శక్తి ఉయ్యాలవాడ నరసింహరెడ్డి.
కుంఫీణీ ప్రభుత్వం కుటిలనీతితో, తన రాక్షస కబంధ హస్తాలతో భారతదేశాన్ని వశం చేసుకొని కిరాతక రాజ్యపాలన సాగిస్తున్న కాలంలో వారిపై 1846 లోనే విప్లవ శంఖం పూరించి, వారి అధికారుల్ని చంపి, భయభ్రాంతుల్ని చేసి రేనాటి సీమలో సంచలనం రేకెత్తించాడు. చారిత్రక సంఘటనలను వస్తువుగా స్వీకరించి రాసిన నవలలు గతంలో అనేకం వచ్చాయి. కాని అజీజ్ చిత్రించిన చారిత్రక నవల పాలెగాడు – నరసింహరెడ్డి సహసగాథ మన హృదయాలను తాకుతుంది. పుస్తకం తెరిచిన తర్వాత మూసివేయకుండా పాఠకులను చదివిస్తుంది.
-
Raktasruvulu – రక్తాశ్రువులు
0₹180.00ప్రపంచ ప్రసిద్ధిగాంచిన విప్లవాలలో చైనా విప్లవం ఒకటి. సాయుధ ప్రజా విప్లవం ద్వారా ప్రజాతంత్ర చైనా ఆవిర్భవించింది. భూస్వామ్య విధానానికీ, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పాటు సాగిన చైనా సాయుధ పోరాటాన్ని ‘లాంగ్ మార్చ్’ గా ప్రపంచ చరిత్రపుటల్లో నిక్షిప్తం చేయబడింది. కష్టాలు, కన్నీళ్లు, రక్తతర్పణంతో నవ చైనా అవతరించింది. అందుకు ఆనాటి ప్రపంచ దేశాల్లోని పురోగామి శక్తులన్నీ తమ అండదండలు తెలియజేశాయి. భారతదేశాన్నుండి కొట్నీస్ వెళ్లి చైనా విముక్తి పోరాటానికి తన సాహసోపేతమైన సేవలందిస్తూ మరణించాడు. అదే కోవకు చెందినవారు నార్మన్ బెతూన్. తమ దేశాలను, కుటుంబాలను విడిచిపెట్టి మరో దేశం వెళ్లి ఆ ప్రజల కోసం నిస్వార్థ సేవలందిస్తూ ప్రాణత్యాగం చేసిన అమరవీరులు. చరిత్ర పుటల్లో, ప్రజల హృదయాల్లో ఆచంద్రతారార్కంగా వారు నిలిచిపోతారు.
నార్మన్ బెతూన్ కమ్యూనిస్టు. కమ్యూనిస్టు చైతన్యం ఆయన నరనరానా జీర్ణమైపోయింది. చైనా విముక్తి పోరాటంలో పాల్గొనడం తన అంతర్జాతీయ కర్తవ్యంగా భావించాడు. ఒకవైపున భీకరపోరాటం జరుగుతున్నా బాంబుల వర్హం కురుస్తున్నా, మొక్కవోని ధైర్యంతో ఒక అడుగు కూడా వెనక్కు వేయకుండా తనకు తానే నిర్దేశించుకున్న కర్తవ్య నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన మానవులలో మహోన్నతుడు నార్మన్ బెతూన్. ఆయన జీవిత అమరగాథే “రక్తాశ్రువులు” అనే నవలగా సిడ్నీ గోర్డన్, టెడ్ అలెన్ లు ఇంగ్లీషులో రాసిన నవలను సహవాసి తెలుగులో రచించారు.
-
Ramayana Vishavruksham – రామాయణ విషవృక్షం
0₹250.00రామాయణ విషవృక్షం – ఏడు ముద్రణలు పొందిన పుస్తకం – రంగనాయకమ్మ
రామాయణ విషవృక్షం మూడుభాగాలుగా వెలువడిన రచన. మొదటి భాగంలో – ఇదీ రామాయణం, చెప్పులు పాలైన సింహాసనం, ఇలాగే జరిగింది అనే మూడు కథలూ, కొనసాగింపుగా రాసిన రెండో భాగంలో అతనికంటె ఘనుడు ! రావొద్దంటే విన్నదా ?, కామశాస్త్రులు, తోడు దొంగలు (రాముడు – సుగ్రీవుడూ), స్నేహబండారం, సీతారావణులు, కాణీఖర్చులేని బహుమానం అనే ఏడు కథలూ, ఐదు లింకులూ – మూడోభాగంలో ఎంతో ఉత్తముణ్ణి! ఎన్ని కష్టాలో నాకు ! మూడో దొంగ (విభీషణుడు), రాముడు పోయాడా ?, పంచాయితీ, చెప్పుల చోట్లో రాముడు, రామరాజ్యం సొగసు అనే ఆరు కథలూ, అట్లాగే రామాయణం చదివితే లాభమేమిటి ? కవిగా వాల్మీకి, కొందరు రామయణ విమర్శకులు, రామాయణ సంస్కృతిని ఎందుకు తిరస్కరించాలి ? అన్న వ్యాసాలూ – ఉన్నాయి.
ఈ పుస్తకంలో మార్క్సిజాన్నీ, ఆంత్రపాలజీని పదునైన శైలిలో తేలికైన మాటలతో పరిచయం చేసారు రచయిత్రి రంగనాయకమ్మ. శాస్త్రీయ దృక్పధం అంటే ఏమిటి ? కల్పనలో స్ఫురించే వాస్తవికత, ప్రక్షిప్తాల ఘోష, పవిత్ర రామాయణం (చిన్నకథ) కొన్ని ప్రశ్నలూ కొన్ని సందేహాలూ, కొన్ని వ్యతిరేక విమర్శలూ, కొన్ని అనుకూల విమర్శలూ శీర్షికల కింద రామాయణానికి సంబంధించిన అంశాలను చర్చిస్తారు రంగనాయకమ్మ, అంతేకాదు –
”ఈ పుస్తకం మొహం చూసిన తర్వాతో, నాలుగు ముక్కలు చదివింతర్వాతో, ఒక అగ్గిపుల్ల గీసి అంటించాలని బుద్ధి పుట్టవచ్చు ధర్మాత్ములకు, అంటిస్తే తగలబడేవి కాగితాలే కాని ఆలోచనలు కావు” అంటున్న రంగనాయకమ్మగారి ఈ పుస్తకం, తెలుగు నాట అనేక వాద వివాదాలకు కేంద్రమైంది. రామాయణాన్ని కొత్తకోణం నుంచి చూపించే సంచలనాత్మక రచన రామాయణవిషవృక్షం.