-
-
-
-
-
Aadhunika Mahabharatham
₹500.00“ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు… కలలు ఖనిజాలతో చేసిన యువత, మన దేశ భవిష్యత్తుకు సేవకులు”, అన్న ‘మహాకవి శేషేంద్ర గారి మాటలు ఆయన్నంత అమితంగా ఇష్టపడేలా చేసినాయి. ‘నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా?’ అన్న ఆయన వేసిన ప్రశ్న నాకు ‘మహావాక్యం’ అయింది. నీకు అత్యంత ప్రీతిపాత్రమయిన ‘ఆధునిక మహాభారతం’ అనే ఈ మహాగ్రంథాన్ని దేశ, సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం తపనపడే వారికోసం అందుబాటులో ఉండాలన్న నీ ఆకాంక్ష. ఈ మహాగ్రంథాన్ని ఇంకోసారిలా మీ ముందుకు తీసుకొచ్చింది. నాకీ అవకాశాన్ని కల్పించిన ‘మహాకవి’ శేషేంద్ర గారి అబ్బాయి, కవి అయిన ‘సాత్యకి’ గారికి నాకు ఈ ‘మహాకవిని’ పరిచయం చేసిన నా మిత్రుడు ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’ గారికి నా కృతఙ్ఞతలు…
– పవన్ కళ్యాణ్
-
-
Antharardha Sridevi Bhagavatamu Antarardha Mahavishnu Puranamu
₹90.00లక్ష్మీదేవిని చూసి విష్ణుమూర్తి నవ్వేడు. లక్ష్మి విష్ణుని నీ తల తెగిపడిపోవుగాక అంది. అంటే, విష్ణుని తల తెగపడింది. బ్రహ్మ విష్ణువు యొక్క మొండేనికి గుర్రం తలతెచ్చి అతికించేడు. ఇది లక్ష్మి హయగ్రీవావతార కథ. కరంభుడు అనేవాడు బ్రహ్మ చెప్పిన ప్రకారం తన ఎదుటనున్న గేదెతో రమించెను. ఆ గేదెకూ, కరంభునకు పుట్టినవాడు మహిషాసురుడు. వాడు శ్రీదేవిని తన్ను పెండ్లాడవలసిందిగా ఆర్గురు తన రాయబారుల ద్వారా కోరేడు. శ్రీదేవి వారి ఆర్గురనూ, మహిషాసురుణ్ణి కూడా చంపివేసింది. ఇది మహిషాసురమర్దినీ అవతార కథ. ఇలాంటి తలాతోకా లేని కథలెన్నో! ఇవి ముక్తినిస్తాయిట! ఇవి అవతారకథలు. ఎలాగు అవి ముక్తినివ్వడానికి సమర్ధంగా ఉన్నాయో వ్యుత్పత్యార్ధాలతో నిరూపించి శ్రీ శర్మగారు ముక్తి సౌధానికి మెట్లు కట్టి చూపించేరు. వీరు ఇంతకు పూర్వం రామాయణ, భారత, భాగవతాలకు కూడా అంతరార్ధాలు వ్రాసేరు, చదివి తరించండి.
-
-
-
Chirasmarana
₹70.00“చిరస్మరణ” నవల రచనకు సంబంధించి ఈ సందర్భంలో ఒకటి రెండు మాటలు వ్రాయడం అప్రస్తుత మనిపించదు. భారతదేశ శ్రమజీవులు కొనసాగిస్తూ వచ్చిన వర్గ సమారా ఇతిహాసం సుదీర్ఘమయింది. దాని గగుర్పాటు కలిగించే ఒక అధ్యాయం కేరళలోని కయ్యూరు రైతుల పోరాటం. అదే ‘చిరస్మరణ’ రచనకు ప్రేరణ. ఆ ఇతివృత్తం నా మనస్సును తాకినది, తట్టినది నా విద్యార్థి దశలో.
“చిరస్మరణ” లోని అనేక పాత్రలు వాస్తవ జీవితం నుంచే నవల పుటలకు నడిచి వచ్చాయి. అయితే అవి ఇక్కడ పాత్ర నిర్వహణ కోసం రంగ ప్రసాదన వేష భూషణాలను నిరాకరించలేదు. మాస్టర్ పాత్రకు మాధవన్ – మాధవేట్టన్ – స్ఫూర్తి, ప్రభుపాత్రకు కామత్. మరికొన్ని పాత్రల విషయంలో జనాభా లెక్కలు చెప్పమొగం వేయవచ్చు. కాని అలాంటివారు ఉండి ఉండరు – అని ఖరాఖండిగా చెప్పడం కష్టం. “చిరస్మరణ” జయప్రియతను సంపాదించాకపోయినా, అల్ప సంఖ్యాకులైన పాఠకులకు చాలా ఇష్టమయిందనితోస్తుంది.
– తిరుమల రామచంద్ర
-
Garuda Puranamu
₹800.00హిందూ మత ధార్మిక గ్రంధాలలో స్మృతులు ఒక భాగము. పురాణాలు కూడా స్మృతులే. పురాణాలలో గరుడపురాణం అంతగా అపనమ్మకాలు పాలైన వాటిల్లో మరొకటిలేదు. కొందరు పూర్వాచార పరాయణులు గరుడపురాణం చదవటం కాదు, కనీసం తాకడానికి కూడా ఇష్టపడరు. అందుకు కారణం ఆ పురాణం బ్రహ్మఖండంలో జీవికి మరణం తర్వాత కలిగే వివిధ సంస్కారాలు, అంత్యేష్టి వివరించబడటమే. అయితే గరుడపురాణం గరుడపురాణం మూడు భాగాలని అందులో బ్రహ్మ ఖండం చాలా చిన్నదని, ఆ ఖండంలోనే కొంత జీవి మరణానంతర కర్మకాండల గురించి చెప్పబడినదని ఎక్కువమందికి తెలియదు.
గరుడపురాణం వైష్టవ పురాణాలలో ఒకటి. ఇది మహావిష్ణువుకు అయన వాహనమైన గరుడునికి సంభాషణగా వివరింపబడిన పురాణం. గరుడపురాణం లో చాలా విలువైన సమాచారాన్ని పురాణ పాటకులకు తెలియచేస్తుంది. ఈ పురాణంలో చాలా విలువైన సమాచారాన్ని పురాణ పాటకులకు తెలియచేస్తుంది. ఈ పురాణంలో వైద్యము, వ్యాకరణము, రత్నపరీక్ష, జ్యోతిష్యము, వంటి అనేక శాస్త్రాలు వివరించబడ్డాయి. అందుకని దీనిని విజ్ఞాన సర్వస్వ లక్షణాలు ఉన్న పురాణంగా పురాణ పండితులు విశ్లేషిస్తున్నారు. అంతేగాక భారతీయ విజ్ఞానం అనేక సందర్భాలలో ఎటువంటి మినహాయింపులు లేకుండా ఈ పురాణంలో వివరించబడ్డాయి. అందువలన ఈ పురాణాన్ని విజ్ఞానం కావాలనుకునే వారందరూ అధ్యయనం చేయటం అవసరం. ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరాలను పెట్టుకోనవలసిన అవసరం లేదు. దీనిని జిజ్ఞాసువులైన వారందరూ పటించిన భక్తి ముక్తి పొందగలరు.
-
Maha Vishnu Puranam
₹400.00బ్రహ్మ మానసపుత్రుడైన వశిష్టుని పుత్రుడు శక్తీ. శక్తీ భార్య గర్భవతిగా వుండగా అతడిని, అతడి నూర్గురు సోదరులని బ్రహ్మ రాక్షసుడి చేత చంపించాడు విశ్వామిత్రుడు.
తల్లి గర్భాన్నించి పుడుతూనే ‘ఓం నమో నారాయణాయ…’ నామ స్మరణతో జన్మించాడు శక్తీ కుమారుడు పరాశరుడు. పుట్టిన నాటినించి నిరంతర నారాయణ తపోదీక్షలో మునిగిపోయిన కన్నకొడుకుని చూసి ఆ తల్లి ఆవేశంతో రగిలిపోయింది. నీ తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకో…” అంటూ కొడుకుని రెచ్చగొట్టింది తల్లి. ప్రతీకారేచ్చతో రగిలిపోయిన పరాశరుడు అధర్వణ మంత్ర ప్రయోగంతో సుదీర్ఘ సత్రయాగం ఆరంభించాడు. ఆ యాగ ప్రభావం చేత మహామహులైన దానవులేందరో శలభాల్లా ఎగిరివచ్చి యాగాకుండలంలో పది మలమల మాడిపోయారు.
‘దానవజాతిని సమూలంగా నాశనం చెయ్యవద్దు’ అన్న తాత వశిష్టుడు కోరిక మన్నించి యాగాన్ని విరమించాడు పరాశరుడు. దానవజాతికి మూలపురుషుడైన పులస్త్య బ్రహ్మ సంతసించి “నా జాతి నాశనం కాకుండా కాపాడావు. నీకేం కావాలో కోరుకో…”అన్నాడు.
” మహావిష్ణు పురాణమును సంస్మరణ మాత్రానే గ్రహించవలసిన భవ్య జ్ఞానాన్ని అనుగ్రహించండి.” అని వరం కోరుకున్నాడు పరాశరుడు. అలా భూలోకానికి చేరువైంది ‘మహావిష్ణు పురాణము’. యుగయుగాలుగా మానవజాతిని మాధవ భక్తి పరులుగా, మర్చి మోక్ష మార్గాన్ని చూపుతోంది ‘మహావిష్ణు పురాణము’ ఇంటింటా ఉండదగ్గ పురాణగ్రంధ రాజం ‘మహావిష్ణు పురాణము’.