• Mahaa Prasthanam

    Mahaa Prasthanam

    100.00
    Add to cart
  • Mahabaratham

    Mahabaratham

    1,440.00
    Add to cart
  • Navvulo Sivudunnaduraa!

    Navvulo Sivudunnaduraa!

     నిజం – నవ్వులో శివుడున్నాడు. నిరంతరం నవ్వేముఖంలో దైవం వుంటుంది . కొన్ని నవ్వులు ఉదయకిరణాల్లా హాయిహాయిగా వుంటయి. కొన్ని పొద్దెక్కిన సూర్యాకిరణాల్లా చురుక్కుమనిపిస్తాయి. కొన్ని నవ్వులు చంద్రుడి పై ప్రతిఫలించిన  వెన్నెలమడుగుల్లా చల్లదనాలు  పంచుతాయి. ఇంతకీ నవ్వులో శివుడున్నాడుగాని, శివుడులో నవ్వు కనిపించదు. ఆవేశం వచ్చినా , ఆనందం కలిగినా తాండవం చేస్తాడు.

    180.00
    Add to cart
  • Ramayanamlo Ratnalu
  • Sai Geethamritha Sa(Ga) Ram

    Sai Geethamritha Sa(Ga) Ram

      కె. వివేకానంద రెడ్డి గారు నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం, అలాగే “సాయి కీర్తన” గారు కూడా ఫోన్ ద్వారా పరిచయం .

                 వివేకానంద రెడ్డి గారు చాలాకాలంగా వేలాది ఆధ్యాత్మిక గ్రంధాలని చదువుతున్న వ్యక్తి. నా ఆధ్యాత్మిక నవల “జయం” చదవం ద్వారా వారు నాకు పరిచయమయ్యారు. అయన తరచూ షిర్డీ వెళ్తూ, దారిలో హైద్రాబాద్ లోని మా ఇంటికి వస్తుంటారు. ఆయనది భక్తి మార్గం.

                   పుట్టుకతో అన్యమతస్తురాలైన కుమారి సాయి కీర్తన వారి మతాన్నే కాక హిందూమతాన్ని కూడా లోతుగా అధ్యయనం చేసారు. వీరిద్దరూ సాయి భక్తులే. కుమారి “సాయి కీర్తన”, “సాయి సచ్చరిత్ర” ని చదివి దాని గూడార్ధాన్ని గురించి వివేకానంద రెడ్డి గారితో చర్చించాక, ఈ పుస్తకానికి అంకురార్పణ జరిగింది. వీరు పరస్పర సహాకారంతో ఈ పుస్తకాన్ని రాసారు.

                     ఈ పుస్తకం షిర్డీ సాయి భక్తులకే కాక , ఆధ్యాత్మిక ఆసక్తి గల అందరికి నచ్చుతుందని ఆశిస్తూ.

    230.00
    Add to cart
  • Sandhya Vandanamu

    Sandhya Vandanamu

    మనవి

    వేదకాలములో నిత్యాగ్నిహోత్రము, స్వాధ్యాయము, మంత్రజపము, తపస్సు యజ్ఞయాగాదులు, పుణ్యకర్మానుష్ఠానముగా చెప్పబడినవి. ఆ తరువాత కలియుగములో వీటికి ప్రత్యామ్నాయముగా అనేకములు నేడు చోటుచేసుకున్నవి. అందువలన ఏది కర్మ? (అనగా వేదోక్తమైన కర్మ), ఏది వికర్మ? (అనగా కర్మబాహుళ్యము) ఏది అకర్మ (అనగా ఏది అపభ్రంశము) అని తర్కవితర్కములు చేయక • తమోగుణ రజోగుణయుతులై పుణ్యకర్మానుష్ఠానము చేయకుండా • సత్త్వగుణ ప్రధానులై నిష్కామపుణ్యకర్మానుష్ఠానము చేసి గుణరహితులై

    ఆత్మస్థానమును పొంది, ఆత్మయై విరాజిల్లుటయే పరమపురుషార్థము.

    దీనికి సాధనగా • ధర్మపరుడైయుండి • శ్రద్ధావంతః – అనగా శ్రద్ధ కలిగి

    శ్రేయాన్ స్వధర్మః – స్వధర్మమును ఆచరించుచూ రాగద్వేషా తయోః న వశమ్ ఆగచ్చేత్ – రాగద్వేషములనే వాటి వశమునకు

    లోనుగాక • నిరాశీ నిర్మమో భూత్వా – ఆశ, మమత, అహంకారము లేకుండా • అనసూయంతః – అసూయాది దుర్గుణములు లేకుండా |

    ఈషణత్రయములు లేకుండా సుఖదుఃఖములనే ద్వంద్యములకు లోనుగాక | ద్వంద్వాతీతులై యున్న కర్మబంధ విముకులగుదురని చెప్పిన శ్రీకృష్ణ భగవానుని సూచనలు పాటించుట ఉత్తమము. శాస్త్రమును అధ్యయనము చేయుటవలన శాస్త్రములోని విషయముల గ్రహింపవచ్చును. కానీ గుణములవలననే ఆచరణ సాధ్యము. కావుననే |……

    360.00
    Add to cart
  • Seetaramanjaneya Samvadamu

    Seetaramanjaneya Samvadamu

       ఈ సీతారామాంజనేయ సంవాదానికి కీ.శే.గురుమూర్తి గ్రంధకర్త. నారాయణ శాస్త్రులు సరళ వ్యాఖ్యానం రాశారు. 29 ఏళ్ళ తరువాత యిప్పుడు మారిన వాడుక భాషకు అనుగుణంగా మూలభంగం కాకుండా వోరుగంటి రామకృష్ణ ప్రసాద్ గారు సరళ వ్యాఖ్యానం రాశారు. ఆధ్యాత్మిక రామాయణానుభూతి (రామాయణంలో ఈ సంవాదం లేదు) తో గురుమూర్తి గారు రాసినదే ఈ సీతారామాంజనేయ సంవాదం. భక్తునికీ భగవంతునికీ మధ్య జరిగిన సంవాదమిది. ఆనందానికీ, ఆనందోబ్రహ్మకూ నిదర్శనం.

    350.00
    Add to cart
  • Sirikakolanu Chinnadi

    Sirikakolanu Chinnadi

    ఇది రాయలనాటి తెలుగునాటి సంస్కృతి, ప్రజాజీవన ధోరణి ప్రతిబింబించే కథ.

    స్థలం కృష్ణానది తీరస్థమై ఆంధ్రవిష్ణు క్షేత్రంగా చరిత్రలో వాసికెక్కిన శ్రీకాకుళం.

    ఆ ఊళ్లో ప్రతి వైకుంఠ ఏకాదశికి తిరునాళ్లు – కాముని పున్నమ అని దవన పున్నమ అని ప్రసిద్ధి గాంచిన శృంగార రాత్రికి నటవిటరాసిన జన సందోహమంతా తరలివచ్చి తనివితీరా పొరలి వెళ్లే పోతుగడ్డ.

    అక్కడొక సానివాడ. అందొక రంగాజమ్మ.

    ఆమె వయసు మళ్లిన వాడ వదిన- ఆమెకు అందాలరాశి, భక్తికి వారాసి అయిన అలివేణి గారాల కూతురు. కళలూ, కావ్యాలూ అన్ని నేర్చిన చిరుజన. మువ్వను కవ్వించడం, మువ్వగోపాలుని నవ్వించడం ఆమె ఇష్టక్రియ.అమెకొక అక్క. పేరు చంచల.

    90.00
    Add to cart
  • Sri Devi Bhagavatham

    Sri Devi Bhagavatham

    (అ) శ్రీమద్దేవీభాగవత మాహాత్మ్యం

    ఈ చరాచర జగత్తు అంతా ఆ పరాశక్తికి ఒక క్రీడావిలాసం. జగత్సృష్టివేళ సృజనస్వరూప, రక్షణవేళ పాలన స్వరూప, సంహారవేళ రౌద్రస్వరూప. పరా – పశ్యంతి – మధ్యమా – వైఖరీ భేదాలతో ఉన్న వాక్కు ఆ తల్లి స్వరూపమే. కనక త్రిమూర్తి సంపూజిత ఆ జగన్మాత ప్రసన్నురాలై మనకు అందరికీ అమోఘమైన వాక్ శక్తిని అనుగ్రహించుగాక ! ముందుగా శ్రీమన్మహాదేవికి నమస్కరించి, నరనారాయణులకు శిరసువంచి, సరస్వతీదేవినీ వ్యాసమహర్షిని అభినుతించి పురాణం ప్రారంభించాలి.

    నైమిశారణ్యంలో సమావిష్టులైన ఋషులందరూ సూతుణ్ణి సవినయంగా అభ్యర్థించారు. సూతమహర్షి! నువ్వు వందల సంవత్సరాలు జీవించు. వ్యాస శిష్యుడివి. మహామతివి. ఎన్నెన్నో పుణ్యకథలు మాకు వినిపిస్తున్నావు. ఎంతో మనోహరంగా చెబుతున్నావు. విష్ణుకథలు చెప్పావు. అవతారగాథలు వర్ణించావు. శివుడి చరిత్రలు వినిపించావు. భస్మరుద్రాక్షల మహిమలు వివరించావు. అన్నీ భక్తిశ్రద్ధలతో విన్నాం. నీ పుణ్యమా అని జ్ఞాన – ఆనందాలను పొందాము. ఇంక ఇప్పుడు పావనాలలోకెల్లా పావనమూ అనాయాసంగా భుక్తిముక్తి ప్రదమూ అయిన మహాపురాణాన్ని నీ ముఖతః వినాలి అనుకుంటున్నాం. దయచేసి అటువంటిది అనుగ్రహించు.

    శౌనకాది మహామునీశ్వరులారా ! అడగవలసింది అడిగారు. లోకహితం కోరి అడిగారు. కనక సర్వశాస్త్ర సారమూ పరమపావనమూ దేవీ భాగవతం వినిపిస్తాను. శ్రద్ధగా ఆలకించండి. ఇది చెవిని పడనంతవరకే మిగతా పురాణాలూ తీర్థాలూ వ్రతాలూ మిడిసిపడేది. ఈ దేవీ భాగవతం పాపారణ్యాలకు గండ్రగొడ్డలి. గాఢ కిల్బిషతమస్సులకు పొద్దు పొడుపు, వినిపిస్తాను.

    సూతమహరీ ! తప్పకుండా వినిపించు. భక్తి శ్రద్ధలతో వింటాం. విని తరిస్తాం. ఆ పురాణం ఏమిటి? దాన్ని వినడానికి నియమాలు ఏమన్నా ఉన్నాయా ? ఎన్ని రోజుల్లో వినాలి? ఏ పూజలు చెయ్యాలి? లోగడ ఎవరెవరు విన్నారు ? ఏమేమి ఫలాలు పొందారు ? ఎవరు వినిపించారు?

    మునీశ్వరులారా ! విష్ణుమూర్తి అంశతో పరాశరాత్మజుడుగా వ్యాసుడు జన్మించిన సంగతి మీకు తెలుసుగదా ! వేదాలను నాలుగుగా విభజించి శిష్యులకు నేర్పాడు. వేదాధికారం లేనివారికి ధర్మజానం ఎలా కలుగుతుందా అని ఆలోచన చేసి పురాణ సంహితలు రచించాడు. శిష్యులద్వారా ప్రచారంలోకి తెచ్చాడు. అష్టాదశ పురాణాలు రచించాడు. మహాభారతం రచించాడు. ఇవన్నీ నాకు వినిపించాడు. చదివించాడు. వాటిలో దేవీ భాగవతం – ఉత్తమోత్తమ పురాణం, భుక్తిముక్తిప్రదం. దీన్ని స్వయంగా వ్యాసుడే జనమేజయుడికి వినిపించాడు.

    600.00
    Add to cart
  • Sri Purnima

    Sri Purnima

    మంగళకరమైన ఐశ్వర్యమే  …. ‘ శ్రీపూర్ణిమ ‘
     
     
    ఆచార్యుని అనుశాసనంలాంటి అపూర్వ గ్రంధాలను అందిస్తూ, అద్భుతాలను
    సృజియిస్తూ, అఖండ జెండాగా ఎగురుతూ, భక్త పాఠకులపై ఆనందరస వర్షాన్ని
    కురిపిస్తున్న మనోహర రచనల రచయిత, సర్వాంతర్యామిత్వాల సంకలనకర్త పురాణపండ
    శ్రీనివాస్ లోకకళ్యాణకారకంగా అందించిన మంగళ గ్రంధం   ‘ శ్రీపూర్ణిమ’ గ్రంధం . 

    తెలుగునాట వండర్ ఫుల్ వర్కోహాలిక్ గా పేరుపొందిన శ్రీనివాస్ రమణీయ
    సౌందర్యాల రచనాశైలికి, పుస్తక నిర్మాణ చాతుర్యానికి, సంకలనాల
    నైపుణ్యానికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. 
     
    తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు, సీనియర్ ఐఏఎస్ అధికారి
    కె.వి.రమణాచారి సమర్పణలో ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ
    ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్  పరమ రమణీయ శోభలతో ,
    సుసంపన్నంగా అందించిన ఈ మంచి పవిత్ర గ్రంధాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం
    కళ్యాణమండపంలో మహాపండితోత్తములు చాగంటి కోటేశ్వరరావు ఆవిష్కరించి
    మంగళాశాసనాలు చెయ్యడం ఒక అపూర్వ సన్నివేశమైతే … ఇప్పటికి ఈ శ్రీపూర్ణిమ
    సుమారు ఇరవై ఐదు ప్రచురణలు నోచుకోవడం ఒక పవిత్ర సంచలనమని చెప్పక తప్పదు.
    సుమారు ఏడువందల యాభైపేజీలలో , వేదవిహితమైన మంత్ర భాగాలతో , స్తోత్ర
    వైభవాలతో, వాటికి పురాణపండ శ్రీనివాస్ ప్రామాణికమైన వ్యాఖ్యానాలతో ఈ
    శ్రీపూర్ణిమ గ్రంధం రూపుదిద్దుకోవడంతో చాలామందితో కూడుకున్న భక్త సమాజం
    తమ పూజాపీఠాలలో ఈ శ్రీపూర్ణిమను ఒక అఖండ శక్తిగా ఉంచుతున్నారు.

    ఒక భౌతిక సాధనంతో కొలవలేని అప్రమేయ అంశాలెన్నో ఈ ‘ శ్రీపూర్ణిమ’ లో చోటు
    చేసుకోవడం వల్లనే , ధర్మభావన వాళ్ళ ప్రేరేపితమైన పారమార్ధిక శక్తులుండటం
    వల్లనే, వేంకటాచల క్షేత్ర అతీంద్రియ మహనీయతల్ని అద్భుతంగా వర్ణించడం
    వల్లనే, సమస్త బ్ర హ్మాండం లోని ప్రతి అణువూ నారసింహుని విరాట్రూపంలోని
    అభిన్నరూపమని చక్కని కథతో నిరూపించడం వల్లనే …  తేజస్వుల వర్చస్సుగా ఈ
    బుక్ సంచలనమై విశేషంగా ఆకర్షిస్తోంది. కేవలం స్తోత్ర భాగాలే కాకుండా
    పురాణపండ శ్రీనివాస్ మధ్యలో ఇఛ్చిన స్క్రిప్ట్ సూపర్బ్.

     

      ముఖపత్రంపై తిరుచానూరు అలమేలుమంగమ్మ దివ్యతేజస్సుల శోభతో ఈ పుస్తకం నిస్సందేహంగా ఒక అఖండ ప్రకాశంగా భక్త పాఠకులకు షోడశకళాప్రపూర్ణంగా అందిందనేది సత్యం.

    బాహ్య ఆవరణలనుండి మనల్ని భగవంతుని వైపు నడిపించిన శ్రీపూర్ణిమ
    పుస్తకాన్ని అందుకున్న వారెంత ధన్యులో. మహా మహా తలలు తిరిగిన,
    నోరుతిరిగిన వేద పండితులు, పీఠాధిపతులు సైతం శ్రీనివాస్ కృషిని
    అభినందించి ఆశీర్బలాలు అందించడం ఒక మంచి మంగళ పరిణామం.

    శ్రీపూర్ణిమ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మంగళకరమైన ఐశ్వర్యమే !

    ఈరోజుల్లో  ఒక పుస్తకం రెండేళ్లలో ఇరవైఐదు ప్రచురణలకు నోచుకోవడమంటే ఆ
    రచయిత తాలూకు తపస్సు ఫలించినట్లే.

    అందువల్లనే ఈ రచయిత మరొక అమోఘ రచనా సంకలనం ‘ నన్నేలు నాస్వామి ‘ ఆంజనేయ
    ఉపాస్య గ్రంధాన్ని అమిత్ షా వంటి రాజకీయ దిగ్గజం, ఈ దేశహోమ్ శాఖామంత్రి
    ఆవిష్కరించారంటే ఇదేమీ మామూలు విషయం కాదు.

    430.00
    Add to cart
  • Sri Shiva Bhakta Vilaasam(Periya Purana Kathalu)
  • Sundara Kandamu 1, 2&3

    Sundara Kandamu 1, 2&3

    పరిచయము

    శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు

    రాజమహేంద్రవరము శ్రీమద్రామాయణము భారతీయ సాహిత్యమున శిఖరాయమానమైన మహాగ్రంథము. వాల్మీకి ప్రణీతమైన యాదికావ్యము. వేదమంత్రములవలనం దెలిసికొనఁదగిన పరమాత్ముఁడు దశరథాత్మజుడుగా నవతరించెను. ఏడు కాండములుగా నున్న రామాయణములో ఇరువదినాలుగువేల శ్లోకములు గలవు. గాయత్రీమంత్రాక్షరములు ఇరువదినాల్గు. వాల్మీకి

    రామాయణములోని ప్రతి వేయవ శ్లోకము ఆ మంత్రాక్షరముతో నారంభమగును. దానివలన రామాయణము పారాయణము చేయుటవలనఁ గర్తకు సకలకార్యసిద్ధులగుచున్నవి. మనోహరమైన కవిత్వానందముతోపాటు మహిమసిద్ధిప్రదమైన

    రామాయణమునకు సుందరకాండము శిరసానీయము. సప్తకాండమండితమైన శ్రీమద్రామాయణములో సుందరకాండమును ప్రత్యేకముగాఁ బారాయణము చేయుచుందురు. తత్పారాయణము అభిష్టసిద్ధి నొసగుచుండుటయు సర్వభక్తానుభవము.

    ‘ఒక శ్లోకము, ఒక పాదము, ఒక పదము కూడ పుణ్యప్రదమని చెప్పఁబడినది. శ్రద్ధాభక్తులతో, అర్థజ్ఞానము కలిగి పారాయణ మొనర్చుటవలన గలిగెడి ప్రయోజన మనంతమైనది. సంస్కృతభాషాపరిచయము కలవారు ఆంధ్రులలో ఎందఱుందురు? అర్ధజిజ్ఞాసువులయిన ధార్మికులకు, ఆస్తికులకు, పారాయణాసక్తులకు సుబోధముగా నుండునట్లు “సుందరకాండము” ప్రచురిత మగుట తెలుగువారికి అపేక్షితము. ఇతఃపూర్వము వావిళ్ళవారు సార్థతాత్పర్యముగా ప్రచురించియున్నను, ఆ గ్రంథము లిపుడు లభ్యము గాకుండుటచేఁ బలువురు ఆంధ్రవివరణసహితమగు సుందరకాండమునకు బహుకాలముగాఁ బ్రతిక్షించుచున్నారు.

    ఇపుడీ “సుబోధినీ” సహితమగు సుందరకాండము తెలుఁగువారి కోరికకు ఫలముగా వెలువడుచుండుట ఆనందదాయకము. ఈ పుణ్యకృతికి సంకల్పించినవారు శ్రీ బోయనపల్లి కామేశ్వరరావుగారు. వీరు రామనామప్రచారకాగ్రేసరులగు “శ్రీరామశరణు”గారి శిష్యులలో అగ్రగణ్యులు. త్యాగభోగములకుఁ దగిన సంపత్తితోపాటు ధార్మిక ప్రవృత్తి కలిగిన యుదారులు; నిరంతర శ్రీరామధ్యాన పూజాతత్పరులు. ఆంగ్లమున పట్టభద్రులయ్యును, భారతీయ సంప్రదాయములయెడ అవిచలితమైన శ్రద్ధాసక్తులు కలిగినవారు. వీరు తెనుఁగు పద్యరచన చేయ సహృదయులు. “అమృతోదయ” మన్న ఆంధ్రకావ్యమును కృతిపొందియన్నారు…….

    1,500.00
    Add to cart