-
-
Navvulo Sivudunnaduraa!
₹180.00నిజం – నవ్వులో శివుడున్నాడు. నిరంతరం నవ్వేముఖంలో దైవం వుంటుంది . కొన్ని నవ్వులు ఉదయకిరణాల్లా హాయిహాయిగా వుంటయి. కొన్ని పొద్దెక్కిన సూర్యాకిరణాల్లా చురుక్కుమనిపిస్తాయి. కొన్ని నవ్వులు చంద్రుడి పై ప్రతిఫలించిన వెన్నెలమడుగుల్లా చల్లదనాలు పంచుతాయి. ఇంతకీ నవ్వులో శివుడున్నాడుగాని, శివుడులో నవ్వు కనిపించదు. ఆవేశం వచ్చినా , ఆనందం కలిగినా తాండవం చేస్తాడు.
-
-
Sai Geethamritha Sa(Ga) Ram
₹230.00కె. వివేకానంద రెడ్డి గారు నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం, అలాగే “సాయి కీర్తన” గారు కూడా ఫోన్ ద్వారా పరిచయం .
వివేకానంద రెడ్డి గారు చాలాకాలంగా వేలాది ఆధ్యాత్మిక గ్రంధాలని చదువుతున్న వ్యక్తి. నా ఆధ్యాత్మిక నవల “జయం” చదవం ద్వారా వారు నాకు పరిచయమయ్యారు. అయన తరచూ షిర్డీ వెళ్తూ, దారిలో హైద్రాబాద్ లోని మా ఇంటికి వస్తుంటారు. ఆయనది భక్తి మార్గం.
పుట్టుకతో అన్యమతస్తురాలైన కుమారి సాయి కీర్తన వారి మతాన్నే కాక హిందూమతాన్ని కూడా లోతుగా అధ్యయనం చేసారు. వీరిద్దరూ సాయి భక్తులే. కుమారి “సాయి కీర్తన”, “సాయి సచ్చరిత్ర” ని చదివి దాని గూడార్ధాన్ని గురించి వివేకానంద రెడ్డి గారితో చర్చించాక, ఈ పుస్తకానికి అంకురార్పణ జరిగింది. వీరు పరస్పర సహాకారంతో ఈ పుస్తకాన్ని రాసారు.
ఈ పుస్తకం షిర్డీ సాయి భక్తులకే కాక , ఆధ్యాత్మిక ఆసక్తి గల అందరికి నచ్చుతుందని ఆశిస్తూ.
-
Sandhya Vandanamu
₹360.00మనవి
వేదకాలములో నిత్యాగ్నిహోత్రము, స్వాధ్యాయము, మంత్రజపము, తపస్సు యజ్ఞయాగాదులు, పుణ్యకర్మానుష్ఠానముగా చెప్పబడినవి. ఆ తరువాత కలియుగములో వీటికి ప్రత్యామ్నాయముగా అనేకములు నేడు చోటుచేసుకున్నవి. అందువలన ఏది కర్మ? (అనగా వేదోక్తమైన కర్మ), ఏది వికర్మ? (అనగా కర్మబాహుళ్యము) ఏది అకర్మ (అనగా ఏది అపభ్రంశము) అని తర్కవితర్కములు చేయక • తమోగుణ రజోగుణయుతులై పుణ్యకర్మానుష్ఠానము చేయకుండా • సత్త్వగుణ ప్రధానులై నిష్కామపుణ్యకర్మానుష్ఠానము చేసి గుణరహితులై
ఆత్మస్థానమును పొంది, ఆత్మయై విరాజిల్లుటయే పరమపురుషార్థము.
దీనికి సాధనగా • ధర్మపరుడైయుండి • శ్రద్ధావంతః – అనగా శ్రద్ధ కలిగి
శ్రేయాన్ స్వధర్మః – స్వధర్మమును ఆచరించుచూ రాగద్వేషా తయోః న వశమ్ ఆగచ్చేత్ – రాగద్వేషములనే వాటి వశమునకు
లోనుగాక • నిరాశీ నిర్మమో భూత్వా – ఆశ, మమత, అహంకారము లేకుండా • అనసూయంతః – అసూయాది దుర్గుణములు లేకుండా |
ఈషణత్రయములు లేకుండా సుఖదుఃఖములనే ద్వంద్యములకు లోనుగాక | ద్వంద్వాతీతులై యున్న కర్మబంధ విముకులగుదురని చెప్పిన శ్రీకృష్ణ భగవానుని సూచనలు పాటించుట ఉత్తమము. శాస్త్రమును అధ్యయనము చేయుటవలన శాస్త్రములోని విషయముల గ్రహింపవచ్చును. కానీ గుణములవలననే ఆచరణ సాధ్యము. కావుననే |……
-
Seetaramanjaneya Samvadamu
₹350.00ఈ సీతారామాంజనేయ సంవాదానికి కీ.శే.గురుమూర్తి గ్రంధకర్త. నారాయణ శాస్త్రులు సరళ వ్యాఖ్యానం రాశారు. 29 ఏళ్ళ తరువాత యిప్పుడు మారిన వాడుక భాషకు అనుగుణంగా మూలభంగం కాకుండా వోరుగంటి రామకృష్ణ ప్రసాద్ గారు సరళ వ్యాఖ్యానం రాశారు. ఆధ్యాత్మిక రామాయణానుభూతి (రామాయణంలో ఈ సంవాదం లేదు) తో గురుమూర్తి గారు రాసినదే ఈ సీతారామాంజనేయ సంవాదం. భక్తునికీ భగవంతునికీ మధ్య జరిగిన సంవాదమిది. ఆనందానికీ, ఆనందోబ్రహ్మకూ నిదర్శనం.
-
Sirikakolanu Chinnadi
₹90.00ఇది రాయలనాటి తెలుగునాటి సంస్కృతి, ప్రజాజీవన ధోరణి ప్రతిబింబించే కథ.
స్థలం కృష్ణానది తీరస్థమై ఆంధ్రవిష్ణు క్షేత్రంగా చరిత్రలో వాసికెక్కిన శ్రీకాకుళం.
ఆ ఊళ్లో ప్రతి వైకుంఠ ఏకాదశికి తిరునాళ్లు – కాముని పున్నమ అని దవన పున్నమ అని ప్రసిద్ధి గాంచిన శృంగార రాత్రికి నటవిటరాసిన జన సందోహమంతా తరలివచ్చి తనివితీరా పొరలి వెళ్లే పోతుగడ్డ.
అక్కడొక సానివాడ. అందొక రంగాజమ్మ.
ఆమె వయసు మళ్లిన వాడ వదిన- ఆమెకు అందాలరాశి, భక్తికి వారాసి అయిన అలివేణి గారాల కూతురు. కళలూ, కావ్యాలూ అన్ని నేర్చిన చిరుజన. మువ్వను కవ్వించడం, మువ్వగోపాలుని నవ్వించడం ఆమె ఇష్టక్రియ.అమెకొక అక్క. పేరు చంచల.
-
Sri Purnima
₹430.00మంగళకరమైన ఐశ్వర్యమే …. ‘ శ్రీపూర్ణిమ ‘
ఆచార్యుని అనుశాసనంలాంటి అపూర్వ గ్రంధాలను అందిస్తూ, అద్భుతాలను
సృజియిస్తూ, అఖండ జెండాగా ఎగురుతూ, భక్త పాఠకులపై ఆనందరస వర్షాన్ని
కురిపిస్తున్న మనోహర రచనల రచయిత, సర్వాంతర్యామిత్వాల సంకలనకర్త పురాణపండ
శ్రీనివాస్ లోకకళ్యాణకారకంగా అందించిన మంగళ గ్రంధం ‘ శ్రీపూర్ణిమ’ గ్రంధం .
తెలుగునాట వండర్ ఫుల్ వర్కోహాలిక్ గా పేరుపొందిన శ్రీనివాస్ రమణీయ
సౌందర్యాల రచనాశైలికి, పుస్తక నిర్మాణ చాతుర్యానికి, సంకలనాల
నైపుణ్యానికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ.తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు, సీనియర్ ఐఏఎస్ అధికారి
కె.వి.రమణాచారి సమర్పణలో ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ
ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ పరమ రమణీయ శోభలతో ,
సుసంపన్నంగా అందించిన ఈ మంచి పవిత్ర గ్రంధాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం
కళ్యాణమండపంలో మహాపండితోత్తములు చాగంటి కోటేశ్వరరావు ఆవిష్కరించి
మంగళాశాసనాలు చెయ్యడం ఒక అపూర్వ సన్నివేశమైతే … ఇప్పటికి ఈ శ్రీపూర్ణిమ
సుమారు ఇరవై ఐదు ప్రచురణలు నోచుకోవడం ఒక పవిత్ర సంచలనమని చెప్పక తప్పదు.సుమారు ఏడువందల యాభైపేజీలలో , వేదవిహితమైన మంత్ర భాగాలతో , స్తోత్ర
వైభవాలతో, వాటికి పురాణపండ శ్రీనివాస్ ప్రామాణికమైన వ్యాఖ్యానాలతో ఈ
శ్రీపూర్ణిమ గ్రంధం రూపుదిద్దుకోవడంతో చాలామందితో కూడుకున్న భక్త సమాజం
తమ పూజాపీఠాలలో ఈ శ్రీపూర్ణిమను ఒక అఖండ శక్తిగా ఉంచుతున్నారు.ఒక భౌతిక సాధనంతో కొలవలేని అప్రమేయ అంశాలెన్నో ఈ ‘ శ్రీపూర్ణిమ’ లో చోటు
చేసుకోవడం వల్లనే , ధర్మభావన వాళ్ళ ప్రేరేపితమైన పారమార్ధిక శక్తులుండటం
వల్లనే, వేంకటాచల క్షేత్ర అతీంద్రియ మహనీయతల్ని అద్భుతంగా వర్ణించడం
వల్లనే, సమస్త బ్ర హ్మాండం లోని ప్రతి అణువూ నారసింహుని విరాట్రూపంలోని
అభిన్నరూపమని చక్కని కథతో నిరూపించడం వల్లనే … తేజస్వుల వర్చస్సుగా ఈ
బుక్ సంచలనమై విశేషంగా ఆకర్షిస్తోంది. కేవలం స్తోత్ర భాగాలే కాకుండా
పురాణపండ శ్రీనివాస్ మధ్యలో ఇఛ్చిన స్క్రిప్ట్ సూపర్బ్.ముఖపత్రంపై తిరుచానూరు అలమేలుమంగమ్మ దివ్యతేజస్సుల శోభతో ఈ పుస్తకం నిస్సందేహంగా ఒక అఖండ ప్రకాశంగా భక్త పాఠకులకు షోడశకళాప్రపూర్ణంగా అందిందనేది సత్యం.
బాహ్య ఆవరణలనుండి మనల్ని భగవంతుని వైపు నడిపించిన శ్రీపూర్ణిమ
పుస్తకాన్ని అందుకున్న వారెంత ధన్యులో. మహా మహా తలలు తిరిగిన,
నోరుతిరిగిన వేద పండితులు, పీఠాధిపతులు సైతం శ్రీనివాస్ కృషిని
అభినందించి ఆశీర్బలాలు అందించడం ఒక మంచి మంగళ పరిణామం.శ్రీపూర్ణిమ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మంగళకరమైన ఐశ్వర్యమే !
ఈరోజుల్లో ఒక పుస్తకం రెండేళ్లలో ఇరవైఐదు ప్రచురణలకు నోచుకోవడమంటే ఆ
రచయిత తాలూకు తపస్సు ఫలించినట్లే.అందువల్లనే ఈ రచయిత మరొక అమోఘ రచనా సంకలనం ‘ నన్నేలు నాస్వామి ‘ ఆంజనేయ
ఉపాస్య గ్రంధాన్ని అమిత్ షా వంటి రాజకీయ దిగ్గజం, ఈ దేశహోమ్ శాఖామంత్రి
ఆవిష్కరించారంటే ఇదేమీ మామూలు విషయం కాదు. -