• SREE VARAHA MAHA PURANAM

    Sri Varaha Maha Puranam

    0

    Sri Varaha Maha Puranam

    భారతీయ వాజ్మయంలో పురాణాలు అత్యంత విశిష్టమైనవి. అవి లోకానికి మిత్రులవలె హితాన్ని ఉపదేశిస్తాయి. కాబట్టి “మిత్రసమ్మితములు” గా ప్రఖ్యాతి వహించాయి. పురాణాలు ప్రాచీనమైనవైనా ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ప్రకాశిస్తూ ఉంటాయి. అవి మన పురాతన విజ్ఞాన సర్వస్వాలు ( Encyclopaedias ) అటువంటి పదునెనిమిది పురాణాల్లో అగ్రగణ్యమైనది “శ్రీ వరాహ మహాపురణం”.

     

    శ్రీ మహావిష్ణువు వరాహరూపమును ధరించి పాతాళ లోకము నుంచి భూమిని ఉద్దరించిన వృత్తాంతము ముఖ్య సంబంధము కలది, అయినందున ఈ పురాణమునకు వరాహపురాణము అనే పేరు వచ్చింది.

     

    వరాహ పురాణానికి సౌకర పురాణం అని, ఆదివరాహ పురాణం అని పేర్లు కూడా ఉన్నాయి. శ్రీ మహావిష్ణు అవతారపు పేర్లతో ఉన్న మత్స్య, కూర్మ, వరాహ, వామన పురాణాలలో ఇది మూడవది. పురాణపురుషుడగు శ్రీ మహా విష్ణువు యొక్క ‘ఎడమ చీలమండలం’ గా ఈ పురాణం తెలుపబడినది. ఈ పురాణంలో విష్ణు సంబంధమైన అనేక వ్రతాలు, వాని మహత్యం, వివరణ కూడా లభ్యమవుతున్నది.

    700.00
    Add to cart
  • SRIKANAKADURGAMMA CHARITAMU

    SRIKANAKADURGAMMA CHARITAMU

    0

    SRIKANAKADURGAMMA CHARITAMU

    కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మావారుని గురించి తపస్సు చేసి, ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసురమర్ధిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనక దుర్గ అయింది. ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. కనుక ఈ ప్రాంతం విజయవాడ అయింది.

    శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.

    రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు

    252.00
    Add to cart
  • The God Father

    The God Father

    0

    ది గాడ్ ఫాదర్

    న్యూ యార్క్ మహానగరం.

    మూడో నెంబర్ క్రిమినల్ కోర్ట్ ఆవరణ.

    ఆవరణలో చాలా మంది మనుష్యులు వేచి ఉన్నారు. న్యాయమూర్తి రాక కొరకు వాళ్లు పడిగాపులు పడుతున్నారు. వారిలో అమెరిగో బోనసేరా ఒకడు.

    అతడు పగతో రగిలిపోతున్నాడు.

    అతడి కూతురును కౄరంగా గాయపరిచారు. ఆ బిడ్డ ఇంకా ఆసుపత్రిలోనే ఉంది. అతడి కూతురు మర్యాదను మట్టిపాలు చేయాలని ప్రయత్నించారు.

    న్యాయమూర్తి దిగబడ్డాడు. ఆయన భారీకాయుడు. న్యాయమూర్తి నల్లటివీ, పొడవు పాటివీ దుస్తులు ధరించాడు. తన ఎదుట నిలబడిన ఇద్దరు యువకులను పవిత్రీకరించే ఉద్దేశ్యంతోనే ఆయన తన ఆసనంలో కూర్చున్నట్టు తోస్తోంది.

    న్యాయమూర్తి మొహంలో ఎటువంటి భావాలూ లేవు. న్యాయమూర్తిగా సంతృప్తి చెందుతున్నట్టు ఉంది ఆయన మొహం. తన కూతురు విషయంలో ఆయన న్యాయసమ్మతమైన తీర్పును ఇవ్వడేమో అని అమెరిగో బోనసేరాకు తోస్తోంది. తన మనస్సు ఎందుకలా భావిస్తోందో అతడికే కావడంలేదు. అ

    న్యాయమూర్తి ఎదుట ఉన్న ఇద్దరు యువకులూ గుడ్లప్పగించి న్యాయమూర్తినే చూస్తున్నారు.

    వాళ్లను పరిశీలనగా చూస్తూ, “మీరు అసలు మనుష్యులేనా? మీ ప్రవర్తనకు మీకు సిగ్గనిపించడంలేదా?” అంటూ, న్యాయమూర్తి కోపం వ్యక్తం చేశాడు. యువకులు భిన్నులైపోయారు. పశ్చాత్తాపంతో కాబోలు తలలు దించుకున్నారు. మాట పడిపోయినవారి మాదిరిగా వారు కిక్కురుమనడంలేదు.

    “ఆమాత్రం చాలు. మీలో కొంత మార్పు వచ్చింది. మిమ్మల్ని పశ్చాత్తాపం దహిస్తోంది. ఆమెను లైంగికంగా వేధించలేదు కాబట్టి సరిపోయింది. తీవ్రంగా గాయపరచిన విషయం అలా ఉంచుతాను. మీరు ఇరవై సంవత్సరాల జైలు జీవితం గడపబోయేవారు. అయినప్పటికీ మీ ఇద్దరి మీదా పాత నేరాలు ఎటువంటివీ మోపబడి లేవు. అందువల్లనే మీ ఇద్దరినీ క్షమిస్తున్నాను. నిర్దోషులుగా విడుదల చేస్తున్నాను” అన్నాడు న్యాయమూర్తి………….

    300.00
    Add to cart
  • Andhra Pradesh Prajatheerpu

    Andhra Pradesh Prajatheerpu

    0

    ఎన్నికలకు సంబంధించి పుస్తకాలు రాయడం అన్నది అంత తేలికైన విషయం కాదు. 1952 లో జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికలు మొదలు 2019 వరకు జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికల ఫలితాల వివరాలు, గెలిచినవారికి సంబందించిన విశేషాలు, వారికీ ఉండే రాజకీయ నేపథ్యం, పూర్వాపరాలు, గెలిచినవారి విశిష్టతలు మొదలైనవాటిని క్రోడీకరించి పుస్తకం తయారు చేయడం అంటే ఎంతో క్లిష్టమైన పని. అయినా రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తితో పాతికేళ్ల క్రితం ఈ పుస్తక రచనకు శ్రీకారం చుట్టడం జరిగింది.

                                                                                                – కొమ్మినేని శ్రీనివాసరావు

    300.00
    Add to cart