-
-
Idli – Orchid – Akasam – ఇడ్లి – ఆర్కిడ్ – ఆకాశం
0₹150.00ఆత్మహత్య చేసుకోవాలని నా స్నేహితుడి ఆఫీసు 26వ అంతస్థుకి చేరుకున్నాను. అతణ్ణి బయటకు పంపి, కీటికీలోంచి బయటకు దూకబోతుండగా ఒక సంఘటన నన్ను మార్చింది. 600 కోట్ల హోటల్కి అధిపతిగా చేసింది.
ఇడ్లీ ఒక ప్లేట్లో, చట్నీలు మరొక ప్లేట్లో, సాంబార్ సెపరేట్గా గిన్నెలో సర్వ్ చేసేవాళ్ళం. మూడూ ఒకే దానిలో ఇచ్చేలా ‘దొప్ప’లున్న ”కామత్” ప్లేట్లు తయారు చేయించారు. దానితో అంట్లు తోమే వారి ఖర్చు నెలకి పాతికవేలు తగ్గింది.
‘నీ జీవితాశయం ఏమిటి’ అని ఓబెరాయ్ నన్ను అడిగారు.” మీ హోటల్ కన్నా పెద్దది కట్టడం” అన్నాడు. పన్నెండేళ్ళ వయసులో అది నా అహంభావం కాదు – కల!
భారత రాష్ట్రపతికి లస్సీ కావాలని మా హోటల్కి కబురొచ్చింది. అందమైన ఫ్లాస్క్ మీద ‘కామత్’ అని ప్రింట్ చేయించి లస్సీ పోసి పంపాను. పది లక్షలు వెచ్చించినా ఇంత వ్యాపార ప్రకటన దొరకదు.
14 భాషల్లో అనువదింపబడి – రెండు యూనివర్సిటీలకీ నాన్డిటెయిల్డ్గా ఉన్న పుస్తకం.
ప్రపంచ ప్రతిష్ఠాత్మకమైన హోటల్గా ప్రథమ బహుమతి పొందిన ‘ఆర్కిడ్స్’ హోటల్ అధినేత విఠల్ ఆత్మకథకి శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ విశిష్ఠ రూపకల్పన.
ఎలా ప్రారంభించాలో, ఎక్కణ్ణుంచి మొదలుపెట్టాలో, ఎలా బ్రేక్త్రూ సాధించాలో ఈ పుస్తకం చెపుతుంది. ఇది చదివి ఒకరైనా స్ఫూర్తి చెందితే ఈ రచన ఆశయం నెరవేరినట్టే.
-
Naa Jeevana Gamanam
0₹175.00అత్యంత గౌరవనీయుడు, మేధావీ, రాజకీయవేత్త అయిన అబ్దుల్ కలామ్ జీవితంలోని స్పూర్తిదాయకమైన ఉదంతాలు.
రామేశ్వరంలో గడిపిన బాల్యంతో మొదలు పెట్టి దేశాధ్యక్షుడిగా ఎదగడం వరకు అబ్దుల్ కలామ్ నడిచిన దారి అసాధారణమైనది. పట్టుదలా, కృతనిశ్చయం, ధైర్య సాహసాల రహదారి……..ఈ పుస్తకంలో అయన తన గతంలోని కొన్ని ముఖ్యమైనవి, కొన్ని సాధారణమైనవి అయిన అనుభవోదాంతాలను, కొందరి వ్యక్తిత్వాలను స్మరించుకుంటూ, అవి తనకు ఎట్లా స్పుర్తినిచ్చాయో సుందర సులభమైన శైలిలో చెప్పారు. తాను పెరిగి పెద్దవాడువుతున్నప్పుడు తన వ్యక్తిత్వంపై ముద్ర వేసిన వ్యక్తులను వాత్సల్య గౌరవాలతో తలుచుకున్నారు. వారితో తనకు గల సాంగత్యంలో తాను నేర్చుకున్న విలువైన పాఠాలను నెమరువేసుకున్నారు. తనకు అత్యంత ప్రేమ పాత్రుడైన తన తండ్రిని, ఆయన దైవభక్తిని వివరంగా జ్ఞాపకం చేసుకున్నారు. ఒక దేశాధ్యక్షునిగా ఎదిగిన క్రమంలో ఎదుర్కొన్న సమస్యలను, సంఘర్షణలను, చేసిన త్యాగాలను ఒక్కసారి వెనుతిరిగి చూసుకున్నారు.
వెనుకటి తీపి జ్ఞాపకలతోను, మరెంతో నిజాయితితో చెప్పిన ఈ వ్యక్తిగత అనభవ పరంపర ఒక అసాధారణమైన వ్యక్తి జీవిత కథ. ఇందులోంచి నేర్చుకోవలసిన విలువైన పాఠాలతో సహా………
-
-
-
-
-
1232 KM Gruhonmukhanga Sudhirgha Prayanam
0₹350.00నాంది
భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ 24 మార్చి 2020 రోజున భారతదేశంలో భకోవిడ్-19 మహమ్మారి ఇంకా పెరిగిపోకుండా ఉండడానికి జాగ్రత్త పడుతూ లాక్ డౌన్ ప్రక్రియను మొదలుపెట్టారు. కొన్ని గంటల వ్యవధిలోనే అది అమలు చేయబడింది.’
మూడు భాగాలలో అది మే 31వ తారీఖు వరకు కొనసాగింది. సార్స్ కోవి 2 అనే ఈ వైరస్ కి సమాధానంగా ఎన్నో దేశాల్లో, జరిగిన ఎన్నో ప్రక్రియలలో, భారతదేశంలో జరిగిన ఈ లాక్ట్రాన్స్లోనే ప్రక్రియను మాత్రం కొందరు వ్యక్తులు క్రూరమైనది గా వర్ణించారు.
138 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో 21 రోజుల లాక్ట్రాన్ ప్రకటించడం అంటే, మినహాయింపు ఉన్నా వారు తప్పించి మరెవ్వరూ బయటకు వచ్చే వీలు కానీ, సౌకర్యం కానీ లేదు. దేశ ప్రజలను ఈ మహమ్మారి నుంచి రక్షించడానికే ఈ ప్రక్రియను అమలులో పెట్టినట్లు దేశ ప్రధాని ప్రజలకు చెప్పారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండు పౌర శాఖ తో కలిసి పని చేసి, పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాయి అని, నిత్యావసర వస్తువుల సరఫరా లో ఎటువంటి అంతరాయము కలగకుండా తాము చర్యలు |
– ఈరోజు అర్ధరాత్రి నుండి, దేశం మొత్తం సంపూర్ణంగా లాక్టిన్’ లోకి వస్తుంది.
-
-
-