YOU MAY ALSO LIKE…
-
Asamardhuni Jeeva Yatra
₹120.00
-
Amrutham Kurisina Ratri
₹120.00
-
Tribasha Nigantuvu (Hindi- English- Telugu)
₹300.00
-
Vidhi
₹150.00
Showing 277–288 of 860 resultsSorted by latest
Akhari Athidhi
₹230.00ప్రతి మనిషి తప్పని సరిగా ఎదో రోజు ఆఖరి అతిథిని ఒక్కసారే కలుసుకుంటాడు. కాని డాక్టర్ శ్రీజిత్ మాత్రం అతన్ని అనేక సార్లు కలుసుకున్నాడు.
ఎందుకు? ఎప్పుడు? ఎలా?
మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన, అతింద్రియ నేపథ్యంతో సాగే ఈ సస్పెన్స్, ఫాంటసీ డైరెక్ట్ నవల వినూత్నమైన అంశాన్ని ఆవిష్కరించింది. మూడు రోజుల్లో డాక్టర్ శ్రీజిత్ కి ఎదురైన విచిత్ర అనుభవాలు ఉత్కంఠంగా సాగుతాయి.
– మల్లాది వెంకటకృష్ణ మూర్తి
21 Va Sathabdhi Vyaparam
₹225.00ఆర్ధికవ్యవస్థ ఇక్కడ సమస్య కాదు.
ఆ సమస్య మీరే.
కార్పోరేట్ ప్రపంచంలోని అవినీతి మీద కోపంగా ఉందా? వాల్ స్ట్రీట్, పెద్దపెద్ద బ్యాంకుల మీద కోపంగా ఉందా? చేయాల్సిన సరైన పనులు చేయకుండా, చేయకూడని చెడ్డపనులు చేస్తున్న ప్రభుత్వం మీద కోపంగా ఉందా? లేక, మీ ఆర్ధిక పరిస్థితులను అదుపులో ఉంచుకోనందుకు, మీమీదే కోపం కలుగుతోందా?
జీవితం కఠీనంగానే ఉంటుంది. ప్రశ్న ఏమిటంటే – దాని గురించి మీరేం చేయదలుచుకున్నారు? ఆర్ధికవ్యవస్థ గురించి ఏడుస్తూ కూర్చున్నా, లేక ఇతరులను నిందించినంత మాత్రాన మీ ఆర్ధిక భవిష్యత్తుకు భద్రత కలగదు. మీరు సంపద కావాలనుకుంటే, దానిని మీరు సృష్టించాలి. మీ ఆర్ధిక భవిష్యత్తును మీ చేతుల్లోనే ఉంచుకునే ఆవశ్యకత ఉంది. దానికోసం మీరు మీ ఆదాయం మూలాన్ని అదుపులోకీ తీసుకోవాలి – ఈనాడే!
మీకో సొంత వ్యాపారం ఉండాలి.
అధిక సంఖ్యాకులకు ఆర్ధికపరంగా ఇది కష్టకాలం కావచ్చు. కాని ఎంతోమంది వ్యాపారవేత్తలకు సొంత వ్యాపారం ఏర్పరచుకోవటానికి ఇదే సరైన సమయం. దీనిని మించిన సమయం ఇంతవరకూ రానేలేదు.
రాబర్ట్రా టి. కియోసాకీ (రచయిత గురించి) :
రాబర్ట్ టి. కియోసాకీ ఒక మల్టిమిలియనేర్ మదుపరి, బిజినెస్ సొంతదారు, విద్యావేత్త, వక్త, అత్యధికంగా అమ్ముడుబోయే రిచ్ డాడ్ పూర్ డాడ్ గ్రంథమాల రచయిత. తన 47వ ఏట పదవీవిరమణ చేశాక ఆయన క్యాష్ ఫ్లో టెక్నాలజీస్ సహావ్యవస్థాపకుడుగా ఉన్నారు. రిచ్ డాడ్ కంపెనీను స్థాపించారు. ఈ కంపెనీ ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కొన్నిలక్షలమంది జనానికి ఆర్ధికస్వేచ్చ ఎలా పొందాలి అన్న అంశం మీద సలహాలని అందిస్తోంది. రాబర్ట్ 16 పుస్తకాలు రాశారు. 27 కోట్లకీ పైగా అవి అమ్ముడయాయి.
జాన్ ప్లెమింగ్ (రచయిత గురించి) :
జాన్ ప్లెమింగ్ ఒక విజయవంతమైన వాణిజ్యవేత్త, సలహాదారు, వక్త. ప్రస్తుతం డైరెక్టర్ సెల్లింగ్ న్యూస్ అనే పత్రికకు ప్రచురణకర్తగా ఉంటున్నారు. జాన్ ద వన్ కోర్స్ అనే పుస్తకం కూడా రాశారు. ఆర్కిటెక్చర్ సిద్ధాంతాల్ని ఉపయోగిస్తూ విజయవంతమైన జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలో ఇది వివరిస్తుంది.
Visuma Paramardhamu
₹200.00ఆ పరమార్ధము – పరమార్థము
ప్రేరణ
కోరికలే దుఃఖమునకు కారణమా? కోరికలు పరిమితమా? లేక అపరిమితమా? దుఃఖనివారణ మానవునికి సాధ్యమేనా? అనునవి నా తొలి సందేహాలు. ప్రతి మనిషికీ జీవిత పరమార్థమును క్లుప్తముగా తెలిసికొనవలెనని ఉంటుంది. ఈ ప్రశ్నలకు నా సమాధాన సాహసమే ఈ ‘పరమార్థము’.
ప్రతి మనిషి ఆశించేది సునాయాసంగా సుఖంగా జీవించాలని, సుఖమనగా కోరికలను సాధించడం వలన మనస్సునుంచి జనించే స్పందన. కోరికలను సాధించడానికి చేసే ప్రయత్నమే వృత్తి లేదా ఉద్యోగం. ఉద్యోగం చేయడంలో జ్ఞానము, శక్తి, మనోనిగ్రహము, రక్షణ (ధర్మము, యుద్ధము)లు అత్యంత ప్రధానములు. తద్వారా గరిష్ఠ స్థాయిలో సంపదను సృష్టించాలి. త్రికాలములలో ఎవ్వరూ సాధించనంత సంపదను సృష్టించి కీర్తిమంతులవ్వాలి. అదే మోక్షము, అదే జీవిత పరమార్దము అని తెలియజేయాలని నా ప్రయత్నము.
‘పరమార్థము’ అనునది పరమ’, ‘అర్థము’ అను పదములు కలసిన సంధి. పరమ’ అను పదమునకు విశిష్టము, పవిత్రము, స్వర్గము మొదలగు అర్థములు మరియు ‘అర్థము’ పదమునకు గ్రహించు, భావము, ప్రయోజనము, సంపద, ధనము మొదలగు అర్ధములు కలవు. పరమార్థమునకు పవిత్ర లక్ష్యము, విశిషాంశము, విశిష్టసంపద అను సామాన్యార్ధములు కూడా కలవు…
‘బాలసంగ్రహము’ అనునది బాల, సంగ్రహము అను పదములు కలిసిన సమాసము. ‘బాల’ అను పదమునకు చిన్న, బాలబాలికలు అను అర్థములు కలవు. ‘సంగ్రహము’ అనగా వివరణ, మంచిని గ్రహించునది అని అర్థములు. ‘బాలసంగ్రహము’ అనగా సంక్షిప్త వివరణ, చిన్న వివరణ, బాలబాలికలు మంచిని గ్రహించునది అని అర్ధము.
విజయపథము’ అనగా విజయమునకు దారి అని, ‘పరమపదము’ అనగా ఉన్నత సానము లేదా మోక్షము లేదా స్వర్గము అని, ‘సోపానము’ అనగా మెట్టు అని అర్థము. ‘పరమపద సోపానములు” అనగా ఉన్నత స్థానమునకు లేదా మోక్షమునకు లేదా స్వర్గమునకు మెట్లు అని అర్థము.
ప్రాచీన భారతీయ భాషాసంస్కృతులు అందించిన జీవిత పరమార్థాన్ని గతి తార్కిక వాదముతో సామాజిక, వైజ్ఞానిక కోణంలో దర్శించాలని నా ప్రయత్నం. మోక్షము, స్వర్గము, లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇందుడు, అసము మొదలగు పదాలకు భాషాపరమైన అర్థమును, మతపరమైన ప్రామాణికతలను దృష్టిలో ఉంచుకొని వాటిని పరమారములో చేర్చడమయినది. ఈ పదాలకు, విజయపథము’లోని అంశాలకు మధ్య ఉన్న ప్రత్యక్షసారూప్యాన్నినేను ప్రత్యేకంగా విశదీకరించి చెప్పవలసిన అవసరం లేదు. ఈ ‘పరమారము నందు కొని పదములకు పై భాగములో కుడిప్రక్కన – గుర్తును ఉంచాను. అటువంటి పదములకు సనాతన సంపద అను అధ్యాయములో మరింత వివరణను ఇచ్చాను. అక్కడక్కడ వాటిపై నా అభిప్రాయములను కూడా…………
Vidwan Viswam Panchatantram
₹150.00పంచతంత్రం
విను మహిలా రోప్య మను పట్టణమ్ము
వెనుక, దక్షిణభూమి వెలయుచు నుండె.
అమరేంద్ర వైభవుం డా యూరి రాజు;
అమరశక్తి యటందు రాతని జనులు.
మువ్వురు కొడుకులు మూర్ఖులై రంచు
చివ్వుమన్నది రాజు చిత్తమ్ములోన
చింతతో మంత్రుల చేరంగ బిలిచి
మంతన మ్మొనరించి మాట్లాడె నిట్లు:
తెలివిమాలిన కుమారుల పాడు నడత
తెలియుగదా మీకు తీర్పరులార: |
చదువుసాములు లేని చవటలై వీరు
పదుగుర నవ్వుల పాలయినారు.
అనగా అనగా దక్షిణాపథంలో మహిలా రోప్యం అనే పటణం కలదు. అంగ రంగ వైభవంతో ఆ నగరాన్ని అమరశక్తి అనే ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు ముగ్గురు కుమారులు. వారు ముగురూ మూరులయినందువల్ల ఆ రాజు మనస్సు చివుక్కు మన్నది. విచారంతో ఆయన మంత్రులందరినీ పిలిపించి వారితో మంతనం సాగించినాడు.
ఆ నరపాలుడు ఇట్లన్నాడు – “ఈ తెలివిలేని నా కుమారుల
నడత మీకు తెలుసు గదా! మీరు న్యాయం చెప్పవలసిన వారు చదువూ, సామూ లేక చవటలె పోయి ఉన్నాడు. పాడు నడత మీకు తెలుసు గదా! మీరు న్యాయం చెప్పవలసిన వారు. చదువు, సాము లేక చావతలై పోయిన వీరు పడుగుర ముందు నవ్వుల పాలవుతారు . …..
Vallu Padina Bhupalaragam
₹250.00కాలాతీత కథల కథనశిల్పం
శీలా సుభద్రాదేవి, సంపాదకురాలు
డా|| పి.శ్రీదేవి పేరు చెప్పగానే సాహితీలోకంలో ‘కాలాతీత వ్యక్తులు’ నవల గుర్తుకు రానివారు అరుదు. ఆమె కథలు రాసినట్లు తెలిసినా, ఆ కథల గురించి తెలిసినవారూ తక్కువే. పి. శ్రీదేవి రాసిన కథలు రాశిలో తక్కువే అయినా వాసిలో ‘కాలాతీత వ్యక్తులు’కు దీటుగా ఉన్న కథలూ వాటిలో ఉన్నాయి. 1955 నుండి 1960 వరకూ రాసిన కథలు సుమారుగా ఇరవై వరకూ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమె రచనా జీవితం ఆరు సంవత్సరాలు మాత్రమే. ఆ కొద్దికాలంలోనే నవల, కథలు, కవిత్వం, వ్యాసాలతో సాహిత్యరంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రని సాధించిందామె. అరవై ఏళ్ళకు పైగా ఆ ముద్ర చెరిగిపోకుండా ఉందంటే శ్రీదేవి రచనలకు గల విశిష్టత తెలుస్తుంది.
శ్రీదేవి 1929 సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో విశాఖ జిల్లాలోని అనకాపల్లిలో జన్మించింది. తండ్రి డాక్టర్ గుళ్ళపల్లి నారాయణమూర్తి నాటకకర్త, రచయిత,
జాతీయవాది కావటాన శ్రీదేవికి బాల్యంనుండీ సాహిత్యాభిలాష, అభినివేశం అలవడ్డాయి. తండ్రితోపాటూ అనేక సమావేశాల్లో పాల్గొనటంవలన జాతీయ సమస్యల పట్లా, సాహిత్యంపట్లా స్పష్టమైన అవగాహన ఆమెకి కలిగింది.
Unnava Lakshminarayanagari Malapalli Oka Paramarsha
₹200.00ప్రవేశిక
బహుముఖమైన మానవ జీవిత చిత్రణకు అనువైన ఆధునిక వచన సాహిత్య ప్రక్రియ ‘నవల’. జీవితాన్ని సహజంగా చిత్రించి, వ్యాఖ్యానించటమేగాక, అందలి సమస్యల్ని చర్చించి, పరిష్కార మార్గాల్ని గూడా నవల చూపగలుగుతోంది. వ్యక్తి జీవితంలోనూ, సమాజంలోనూ వస్తున్న పరిణామాల్ని చక్కగా ప్రతిబింబిస్తూ, కొత్త కొత్త శిల్ప ధోరణుల్ని సంతరించుకుంటూ, ‘నవల’ నానాటికీ ఎదుగుతోంది. ఇట్లా ప్రజా జీవితానికి సన్నిహితంగా ఉంటున్నది కాబట్టే ‘నవల’ ఇతర సాహిత్య ప్రక్రియల కంటే అధికంగా ఆదరింపబడుతోంది.
తెలుగు నవలకు నూరేళ్లు దాటాయి. ఈ నూరేళ్ల పైచిలుకు కాలంలో వేల సంఖ్యలో నవలలు వెలువడ్డాయి. వీటిలో “యివీ మా తెలుగు నవలలు” అని తెలుగు జాతి చెప్పుకోదగ్గ స్థాయిలో గల ఉత్తమ నవలలు కొన్ని ఉన్నాయి. దీనిలో “మాలపల్లి, ఒకటి అని నిస్సందేహంగా చెప్పవచ్చు..
తెలుగు నవలా సాహిత్య చరిత్రలో విశిష్ట స్థానాన్ని సాధించుకొన్న ‘మాలపల్లి” పరామర్శకు “మాలపల్లి” రచయిత శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులుగారి జీవిత విశేషాలు, ఆనాటి మాలపల్లి ప్రచురణ, ఆదరణలకు సంబంధించిన విశేషాలు తెలిసి కోవడం అవసరం.
ఉన్నవ జీవిత విశేషాలు :
‘మాలపల్లి’ నవలా రచయిత, సుప్రసిద్ధ సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమర యధులు, ఆంద్రోద్యమ సూత్రధారుల్లో ఒకరూ, శారదానికేతన సంస్థాపకులూ అయిన ఆ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులుగారు గుంటూరు జిల్లా వేములూరు పాడులో 1877 డిసెంబరు 4న జన్మించారు. (ఈశ్వర నామ సంవత్సర కార్తీక బహుళ 30, ప్రక్క గ్రామమైన ‘అమినాబాదు’లో ప్రాథమిక విద్య అభ్యసించిన అనంతరం, గుంటూరు ఎ.ఇ.యల్.యమ్. కళాశాలలో యఫ్.ఎ. వరకు చదువుకొన్నారు. ఉపాధ్యాయుడుగా,…………..
Swapna Jeevi
₹175.00మనకు జరిగిందే కథ కాదు. మనలో జరిగేది కూడా కథే!
మానవజాతి అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఎన్నో అంశాలలో కళ కూడా ఒకటి. మనిషి అంతరంగంలోని ఎన్నో విషయాలను వ్యక్తీకరించే మార్గం కళ. మాటలు, పదాలు వ్యక్తీకరించే భావాలను సైతం వివిధ కళారూపాల ద్వారా వ్యక్తపరిచే అవకాశం ఉంటుందని మనిషి కనుగొన్నాడు. మానవుల మొట్టమొదటి కళారూపాలు పురాతన గుహల ‘గోడలపై చిత్రించిన బొమ్మలుగా కనుగొనబడ్డాయి. ఆ విధంగా చిత్రలేఖనం మానవుడి మొదటి కళగా అర్థం చేసుకోవచ్చు. కళల ద్వారానే సంస్కృతి వ్యాపించింది. కళ మరియు సంస్కృతి ప్రజలని ఒక సమాజంగా దగ్గర చేశాయి. సమాజాన్ని బలోపేతం చేయడానికి కూడా కళ, సంస్కృతి ఎంతో ఉపయోగపడతాయి. వినోదం, విశ్రాంతి పొందడం కోసమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవడం, నేర్పించడం, వ్యక్తిగత వృద్ధి సాధించడంలో కూడా వివిధ కళలు ఎంతో ఉ పయోగపడతాయి. సమాజానికి ఇంత మేలు చేసే కళ వెనుక ఉండే కళాకారుల జీవితాలు చాలా వరకూ ఎన్నో కష్టనష్టాలతో కూడి ఉండడం మాత్రం ఎంతో బాధాకరమైన విషయం. బహుశా అందుకు కారణం కళాకారుడు మిగిలిన వారికంటే ఎక్కువ వ్యాకులత కలిగి ఉండి, సమాజం పట్ల చింతకలిగిన వాడై ఉండడం ఒక కారణం అయ్యుండొచ్చు. |
మరణం తప్పదని తెలిసిన మనిషికి తన క్షీణతను అధిగమించగలిగే ఒకే ఒక సాధనం కళ, కళాకారుడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళినా, కళాకారుడు చేసిన సృష్టి అతనికి…………
Sundara Kandamu 1, 2&3
₹1,500.00పరిచయము
శ్రీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు
రాజమహేంద్రవరము శ్రీమద్రామాయణము భారతీయ సాహిత్యమున శిఖరాయమానమైన మహాగ్రంథము. వాల్మీకి ప్రణీతమైన యాదికావ్యము. వేదమంత్రములవలనం దెలిసికొనఁదగిన పరమాత్ముఁడు దశరథాత్మజుడుగా నవతరించెను. ఏడు కాండములుగా నున్న రామాయణములో ఇరువదినాలుగువేల శ్లోకములు గలవు. గాయత్రీమంత్రాక్షరములు ఇరువదినాల్గు. వాల్మీకి
రామాయణములోని ప్రతి వేయవ శ్లోకము ఆ మంత్రాక్షరముతో నారంభమగును. దానివలన రామాయణము పారాయణము చేయుటవలనఁ గర్తకు సకలకార్యసిద్ధులగుచున్నవి. మనోహరమైన కవిత్వానందముతోపాటు మహిమసిద్ధిప్రదమైన
రామాయణమునకు సుందరకాండము శిరసానీయము. సప్తకాండమండితమైన శ్రీమద్రామాయణములో సుందరకాండమును ప్రత్యేకముగాఁ బారాయణము చేయుచుందురు. తత్పారాయణము అభిష్టసిద్ధి నొసగుచుండుటయు సర్వభక్తానుభవము.
‘ఒక శ్లోకము, ఒక పాదము, ఒక పదము కూడ పుణ్యప్రదమని చెప్పఁబడినది. శ్రద్ధాభక్తులతో, అర్థజ్ఞానము కలిగి పారాయణ మొనర్చుటవలన గలిగెడి ప్రయోజన మనంతమైనది. సంస్కృతభాషాపరిచయము కలవారు ఆంధ్రులలో ఎందఱుందురు? అర్ధజిజ్ఞాసువులయిన ధార్మికులకు, ఆస్తికులకు, పారాయణాసక్తులకు సుబోధముగా నుండునట్లు “సుందరకాండము” ప్రచురిత మగుట తెలుగువారికి అపేక్షితము. ఇతఃపూర్వము వావిళ్ళవారు సార్థతాత్పర్యముగా ప్రచురించియున్నను, ఆ గ్రంథము లిపుడు లభ్యము గాకుండుటచేఁ బలువురు ఆంధ్రవివరణసహితమగు సుందరకాండమునకు బహుకాలముగాఁ బ్రతిక్షించుచున్నారు.
ఇపుడీ “సుబోధినీ” సహితమగు సుందరకాండము తెలుఁగువారి కోరికకు ఫలముగా వెలువడుచుండుట ఆనందదాయకము. ఈ పుణ్యకృతికి సంకల్పించినవారు శ్రీ బోయనపల్లి కామేశ్వరరావుగారు. వీరు రామనామప్రచారకాగ్రేసరులగు “శ్రీరామశరణు”గారి శిష్యులలో అగ్రగణ్యులు. త్యాగభోగములకుఁ దగిన సంపత్తితోపాటు ధార్మిక ప్రవృత్తి కలిగిన యుదారులు; నిరంతర శ్రీరామధ్యాన పూజాతత్పరులు. ఆంగ్లమున పట్టభద్రులయ్యును, భారతీయ సంప్రదాయములయెడ అవిచలితమైన శ్రద్ధాసక్తులు కలిగినవారు. వీరు తెనుఁగు పద్యరచన చేయ సహృదయులు. “అమృతోదయ” మన్న ఆంధ్రకావ్యమును కృతిపొందియన్నారు…….
Sri Sri Suktulu (Samajikam) 2nd Part
₹125.00అతని పేరు కొంచెం అతని ఊరు ప్రపంచం
అతడే శ్రీశ్రీ
జాజికం
001
ఢంకాని జోకొట్టాలనీ,
అలల్ని అరికట్టాలనీ, గాలిని ఉరి తియ్యాలనీ ఇదివరకెన్నో ప్రయత్నాలు
జరిగాయి. ఇక ముందు కూడా జరుగుతాయి.
కాని అవి ఎన్నడూ ఫలించలేదు.
ఇకముందు కూడా
ఫలించబోవు.
Sri Devi Bhagavatham
₹600.00(అ) శ్రీమద్దేవీభాగవత మాహాత్మ్యం
ఈ చరాచర జగత్తు అంతా ఆ పరాశక్తికి ఒక క్రీడావిలాసం. జగత్సృష్టివేళ సృజనస్వరూప, రక్షణవేళ పాలన స్వరూప, సంహారవేళ రౌద్రస్వరూప. పరా – పశ్యంతి – మధ్యమా – వైఖరీ భేదాలతో ఉన్న వాక్కు ఆ తల్లి స్వరూపమే. కనక త్రిమూర్తి సంపూజిత ఆ జగన్మాత ప్రసన్నురాలై మనకు అందరికీ అమోఘమైన వాక్ శక్తిని అనుగ్రహించుగాక ! ముందుగా శ్రీమన్మహాదేవికి నమస్కరించి, నరనారాయణులకు శిరసువంచి, సరస్వతీదేవినీ వ్యాసమహర్షిని అభినుతించి పురాణం ప్రారంభించాలి.
నైమిశారణ్యంలో సమావిష్టులైన ఋషులందరూ సూతుణ్ణి సవినయంగా అభ్యర్థించారు. సూతమహర్షి! నువ్వు వందల సంవత్సరాలు జీవించు. వ్యాస శిష్యుడివి. మహామతివి. ఎన్నెన్నో పుణ్యకథలు మాకు వినిపిస్తున్నావు. ఎంతో మనోహరంగా చెబుతున్నావు. విష్ణుకథలు చెప్పావు. అవతారగాథలు వర్ణించావు. శివుడి చరిత్రలు వినిపించావు. భస్మరుద్రాక్షల మహిమలు వివరించావు. అన్నీ భక్తిశ్రద్ధలతో విన్నాం. నీ పుణ్యమా అని జ్ఞాన – ఆనందాలను పొందాము. ఇంక ఇప్పుడు పావనాలలోకెల్లా పావనమూ అనాయాసంగా భుక్తిముక్తి ప్రదమూ అయిన మహాపురాణాన్ని నీ ముఖతః వినాలి అనుకుంటున్నాం. దయచేసి అటువంటిది అనుగ్రహించు.
శౌనకాది మహామునీశ్వరులారా ! అడగవలసింది అడిగారు. లోకహితం కోరి అడిగారు. కనక సర్వశాస్త్ర సారమూ పరమపావనమూ దేవీ భాగవతం వినిపిస్తాను. శ్రద్ధగా ఆలకించండి. ఇది చెవిని పడనంతవరకే మిగతా పురాణాలూ తీర్థాలూ వ్రతాలూ మిడిసిపడేది. ఈ దేవీ భాగవతం పాపారణ్యాలకు గండ్రగొడ్డలి. గాఢ కిల్బిషతమస్సులకు పొద్దు పొడుపు, వినిపిస్తాను.
సూతమహరీ ! తప్పకుండా వినిపించు. భక్తి శ్రద్ధలతో వింటాం. విని తరిస్తాం. ఆ పురాణం ఏమిటి? దాన్ని వినడానికి నియమాలు ఏమన్నా ఉన్నాయా ? ఎన్ని రోజుల్లో వినాలి? ఏ పూజలు చెయ్యాలి? లోగడ ఎవరెవరు విన్నారు ? ఏమేమి ఫలాలు పొందారు ? ఎవరు వినిపించారు?
మునీశ్వరులారా ! విష్ణుమూర్తి అంశతో పరాశరాత్మజుడుగా వ్యాసుడు జన్మించిన సంగతి మీకు తెలుసుగదా ! వేదాలను నాలుగుగా విభజించి శిష్యులకు నేర్పాడు. వేదాధికారం లేనివారికి ధర్మజానం ఎలా కలుగుతుందా అని ఆలోచన చేసి పురాణ సంహితలు రచించాడు. శిష్యులద్వారా ప్రచారంలోకి తెచ్చాడు. అష్టాదశ పురాణాలు రచించాడు. మహాభారతం రచించాడు. ఇవన్నీ నాకు వినిపించాడు. చదివించాడు. వాటిలో దేవీ భాగవతం – ఉత్తమోత్తమ పురాణం, భుక్తిముక్తిప్రదం. దీన్ని స్వయంగా వ్యాసుడే జనమేజయుడికి వినిపించాడు.
Screenplay Direction
₹150.00మన తెలుగులో సినీ పరిజ్ఞానం గూర్చి తెలుసుకోవాలనుకున్న వారికి పుస్తక రూపంలో ఏ సమాచారమూ లభించదు. ఈ లోపం చిత్ర రంగ ప్రారంభదశ నుండి మనలను వెంటాడుతూనే ఉంది. కారణమేమిటంటే మొదటి నుండి మనకున్న సాంకేతిక నిపుణులు వాళ్ళ అనుభావాలను గ్రంథస్తం చేయలేకపోయారు. అనుభవజ్ఞుడు వ్రాయలేడు. వ్రాయగలిగిన వారికి సాంకేతిక నైపుణ్యం తెలియదు. ఈ ఇబ్బంది వలన మన తెలుగు సినీ రంగంలోని దర్శకులు, సాంకేతిక నిపుణులు తమ అనుభవాలను తమలోనే అణచివేసుకున్నారు.
నేను ‘నటసోపానం’ అనే నట సాంకేతిక సిద్ధాంత గ్రంథం వ్రాసిన తరువాత చాలా మంది మిత్రులు మన తెలుగులో స్క్రీన్ ప్లే, దర్శకత్వం గూర్చిన సమాచారం ఇసుమంతైనా లేదు. ఆ కొరత తీర్చగల్గే బాధ్యత తీసుకోమని నన్ను ప్రోత్సహించడంతో ఈ చిన్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టాను. కళా రంగంలో తమ కలలను సాకారం చేయదలచుకొన్న వారు తప్పని సరిగా నటసోపానం చదివి తీరాలి. ఎందుకంటే అందులో కళలకు సంబంధించిన సమస్త సమగ్ర సంపూర్ణ సమాచారం వాదించిన విస్తరిలా ఉంది. ఒక నటుడు జీవితాంతం శ్రమపడి నేర్చుకున్న అనుభవసారం కంటే ఒక్క నటసోపానం, ఎన్నో రెట్లు గురువు రూపంలో మీకు సాంకేతిక సంస్కారం బోధిస్తుంది ఇది వాస్తవం.
ఈ చిన్న పుస్తకంలో రెండు గొప్ప విషయాల గురించి వివరించడం జరిగింది. ఒకటి స్క్రీన్ ప్లే, రెండు డైరెక్షన్. ఈ భాగాలలో పరిపూర్ణమైన జ్ఞానం సంపాదించలేనివాడు కథను ప్రేక్షకామోదంగా చిత్రించలేడు. చిత్ర రంగంలో నాకున్న అనుభవం కొంచమేనని చెప్పలేను. అపారమని అంతకన్నా చెప్పలేను. కాని నేను రచించిన ఈ చిన్న పుస్తకం వర్ధమానులను ఉత్తమ విలువలు గల స్క్రీన్ ప్లే రైటర్స్ గా, డైరెక్టర్స్ గా తీర్చి దిద్దగలదని క్లాప్ కొట్టి మరీ చెప్పగలను.
Screen Play_Vanda Satyalu
₹300.00ఆశంస
ఎందరో మహాను భావులు. అందరికీ వందనాలు. ‘స్క్రీన్ ప్లే’ అన్న మకుటంతో కదన రచనలో వచ్చే సమస్యలేమిటి అనే విషయంపై, నూతనంగా చలన చిత్ర కథలు, సంభాషణలు, కథన రచనలో పాల్గొనే ఎందరో అధునాతన రచయితలు, సినిమా రచన చెయ్యాలని అభిలషించే యువతీ యువకుల కోసం, ఈ గ్రంథం రచించాలన్నది ఏనాటి నుంచో నా మనసులో పాతుకుపోయిన ఆకాంక్ష.
దాని కోసం అమెరికా వెళ్ళినప్పుడు చాలా ‘హాలీవుడ్ స్క్రీన్ ప్లే’ గ్రంథాలు కొని తీసుకు రావటం జరిగింది. 2007వ సంవత్సరం నుంచి తెలుగు విశ్వవిద్యాలయంలో “స్క్రీన్ ప్లే’ తరగతులు నిర్వహించి, తెలుగు సినీ రచయితల సంఘం పక్షాన కూడా ‘స్క్రీన్ ప్లే’ తరగతులు నిర్వహించడం జరిగింది.
అంతే కాకుండా రాఘవేంద్రరావు గారు, ఎ. కోదండరామిరెడ్డి గారు, బి. గోపాల్ గారు ఇలా ఎంతో మంది దర్శకులను ‘షూటింగ్ స్పాట్ లో గమనించి కొన్ని స్క్రీన్ ప్లే వాస్తవాలు తెలుసుకోవడం జరిగింది.
బొబ్బిలి బ్రహ్మన్నలో ఒక షాట్ తీసినప్పుడు ఇలా ఎందుకు చేసారు అని అడిగితే అభినయానికి విలువనిచ్చి అని చెప్పారు. అలాగే శారదగారి పాత్ర కూతురు ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు తలుపు తీసే షాట్లో ఎదురుగా కృష్ణంరాజు గారు కనిపించాలిగదా అంటే అది జనం ఊహిస్తారు. అందుకని కెమెరా లోపల పెట్టి తలుపు తియ్యగానే సజెషన్లో హీరో నిలబడి వుంటాడు. అతని అభినయం తెలిసిపోతుంది. అతను బాధగా ఉన్నాడా? కోపంగా ఉన్నాడా అనేది. తలుపు తెరిచి చూడగానే కట్రాయిలా నిలబడ్డ భర్తను చూసి వెనకడుగు వేస్తే, ఆమెకు గుండెఝల్లు మంది అన్న ఎక్స్ ప్రెషన్ ‘ఆడిటోరియా’నికి తెలుస్తుంది అన్నారు. ఇలా ఆయనను ఎన్నో సినిమాలలో చిన్న………….