YOU MAY ALSO LIKE…
-
Asamardhuni Jeeva Yatra
₹120.00
-
Amrutham Kurisina Ratri
₹120.00
-
Tribasha Nigantuvu (Hindi- English- Telugu)
₹300.00
-
Vidhi
₹150.00
Showing 289–300 of 860 resultsSorted by latest
Sandhya Vandanamu
₹360.00మనవి
వేదకాలములో నిత్యాగ్నిహోత్రము, స్వాధ్యాయము, మంత్రజపము, తపస్సు యజ్ఞయాగాదులు, పుణ్యకర్మానుష్ఠానముగా చెప్పబడినవి. ఆ తరువాత కలియుగములో వీటికి ప్రత్యామ్నాయముగా అనేకములు నేడు చోటుచేసుకున్నవి. అందువలన ఏది కర్మ? (అనగా వేదోక్తమైన కర్మ), ఏది వికర్మ? (అనగా కర్మబాహుళ్యము) ఏది అకర్మ (అనగా ఏది అపభ్రంశము) అని తర్కవితర్కములు చేయక • తమోగుణ రజోగుణయుతులై పుణ్యకర్మానుష్ఠానము చేయకుండా • సత్త్వగుణ ప్రధానులై నిష్కామపుణ్యకర్మానుష్ఠానము చేసి గుణరహితులై
ఆత్మస్థానమును పొంది, ఆత్మయై విరాజిల్లుటయే పరమపురుషార్థము.
దీనికి సాధనగా • ధర్మపరుడైయుండి • శ్రద్ధావంతః – అనగా శ్రద్ధ కలిగి
శ్రేయాన్ స్వధర్మః – స్వధర్మమును ఆచరించుచూ రాగద్వేషా తయోః న వశమ్ ఆగచ్చేత్ – రాగద్వేషములనే వాటి వశమునకు
లోనుగాక • నిరాశీ నిర్మమో భూత్వా – ఆశ, మమత, అహంకారము లేకుండా • అనసూయంతః – అసూయాది దుర్గుణములు లేకుండా |
ఈషణత్రయములు లేకుండా సుఖదుఃఖములనే ద్వంద్యములకు లోనుగాక | ద్వంద్వాతీతులై యున్న కర్మబంధ విముకులగుదురని చెప్పిన శ్రీకృష్ణ భగవానుని సూచనలు పాటించుట ఉత్తమము. శాస్త్రమును అధ్యయనము చేయుటవలన శాస్త్రములోని విషయముల గ్రహింపవచ్చును. కానీ గుణములవలననే ఆచరణ సాధ్యము. కావుననే |……
Samaya Yajamanyam
₹150.00పరిచయం
ఒక ఎగ్జిక్యూటివ్ గా మీ వృత్తిలో మీ సమయ యాజమాన్య సామర్థ్యమే మీ విజయాన్ని లేదా అపజయాన్ని నిర్ణయిస్తుంది. ఒక విషయాన్ని సాధించడానికి సమయం తప్పించరాని, మరో ప్రత్యామ్నాయం లేని వనరు. అది మీ అమూల్యమైన ఆస్తి. దాన్ని ఆదా చేయడమో, ఒకసారి చేజారినట్టయితే తిరిగి రాబట్టుకోవడమో సాధ్యం కాదు. మీరు చేయ వలసిన ప్రతి పనికి సమయం కావాలి. మీరు సమయాన్ని మెరుగ్గా ఉపయోగించే కొద్దీ మీరు మరింత ఎక్కువ సాధించగలుగుతారు. ఫలితాలు మెరుగ్గానూ, మరింత గొప్పగానూ ఉంటాయి.
చక్కని ఆరోగ్యానికీ, శక్తివంతమైన వ్యక్తిత్వానికి సమయ యాజమాన్యం అత్యంత అవసరం. మీ జీవితం మీద, సమయం మీద మీకున్న నియంత్రణా శక్తిస్థాయి భావన – మీ అంతరంగిక శాంతి, సమన్వయం, మానసిక ఆరోగ్యం స్థాయిని ప్రధానంగా నిర్ణయిస్తుంది. మీ సమయం మీద మీకు నియంత్రణ లకపోతోందన్న మీ భావమే మీ ఒత్తిడికీ, ఆందోళనకూ, కుంగుబాటుకూ ప్రధాన వనరు. మీ జీవితంలోని క్రిటికల్ ఈవెంట్ను మెరుగ్గా ఆర్గనైజ్
కుంటూ నియంత్రించగలిగినట్టయితే క్షణం క్షణం మీరు మెరుగైన నిహంతో మరింత శక్తివంతంగా పనులు చేసుకుంటూ, మెరుగ్గా నిద్రపోగలుగుతూ మరింత ఎక్కువగా సాధించగలుగుతారు.
పుస్తకంలో విపులీకరించిన ఆలోచనలనూ, పద్ధతులనూ గించడం ద్వారా మీరు ప్రతిరోజూ రెండు అదనపు ఉత్పాదక గంటలు
ఉపయోగించడం ద్వారా…………
Samakalina Bharatiya Kathalu
₹160.00ఉర్దూ కథ : శిరీస్ నియాజి
చిన్నచేప-పెద్దచేప
అదొక చీకటి రాత్రి! ప్రకృతి నలువైపులా నల్లటి దుప్పటి కప్పుకుంది. దూరాన ఉత్తర దిక్కులోని ఓ మూలలో మాత్రం రక్తం గడ్డకట్టినట్టు ఎర్రబడింది. ఆకాశం,
పగలంతా తమ కువకువలతో సందడి చేసిన పక్షులు అలసిపోయి తమ గూళ్ళలో దూరి నిశ్శబ్దంగా నిద్రిస్తున్నాయి. కుక్కలు మొరగటం, ఏడ్వటం మానేసి రోడ్లు, సందుల్లో తమ కడుపుల్లో తలలు దూర్చుకుని నిద్రకు ఉపక్రమించాయి.
ఇలాంటి భయానకమైన రాత్రి ఓ నీడ తూలుతూ నది వైపు వేగంగా కదులుతోంది. అతని భుజాలు ముందుకు వంగి ఉన్నాయి. చిరిగిన దుస్తులు, అరిగిన చెప్పులతో అతను నడుస్తున్న తీరు చూస్తే అతనొక ముసలివాడని, బలహీనమైన వ్యక్తి అని ఇట్టే చెప్పొచ్చు. కాకపోతే కటిక పేదరికమే అతన్ని వయస్సుకన్నా ముందే ముసలివాడిగా మార్చేసింది. అయితే అలాంటి బలహీనమైన వ్యక్తి అర్ధరాత్రి పూట నది దగ్గరికి ఎందుకు వెళుతున్నాడు?
పైగా ఈ రోజు సాయంత్రమే రేడియోలో ఒక హెచ్చరిక వెలువడింది- “ఈ రోజు రాత్రి భయంకరమైన తుఫాను వచ్చే అవకాశముంది. అందువల్ల చేపలు పట్టే జాలరులు ఎవరూ నదిలోకి వెళ్ళకూడదు” అని. ఆ వార్త అనగానే ఆ జాలరి వెంటనే చేపల కాంట్రాక్టర్ దగ్గరికి ‘ఈ రోజు చేపలు పట్టలేనని చెప్పడానికి’ వెళ్ళాడు. ఆ మాట వినగానే కాంట్రాక్టర్ మండిపడ్డాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ చేపలు పట్టాల్సిందేనన్నాడు. దాంతో తుఫాను రాత్రి అయినా చేపల కోసం నదిలోకి వెళ్ళక తప్పదనుకున్నాడు జాలరి. వెళ్ళకపోతే మరుసటి రోజు కాంట్రాక్టర్ తనకు డబ్బులు ఇవ్వడు. డబ్బు లేకపోతే ఇంట్లో పొయ్యి వెలగదు. తిండిలేక పిల్లలు విలవిల్లాడతారు. ఆకలిని తట్టుకునే వయసు వాళ్ళకింకా రాలేదు.
| ఓ పడవ నిండా పట్టిన చేపలకి కాంట్రాక్టర్ ఇరవై రూపాయలిస్తాడు. దాంతోనే అతను తనతోపాటు భార్య, ముగ్గురు కూతుళ్ళ కడుపులు నింపుతాడు. నిజానికి అతను పడే కష్టానికి ఇరవై రూపాయలు చాలా తక్కువ. కష్టం తనది, సుఖమూ, సొమ్మూ కాంట్రాక్టర్ ని అతనికి తెలుసు. చలిలో, వర్షంలో అవస్థలుపడి నదిలో చేపలు పట్టి నిజాయితీగా చేపలన్ని కాంట్రాక్టర్ కి చేరుస్తాడు. తన పిల్లల కోసం ఒక్క చేప కూడా తీసుకెళ్ళడు. అయినా కాంట్రాక్టర్ ఎన్నడూ అతనిపట్ల సానుభూతి చూపలేదు..
Rugvedha Aryulu
₹180.00మనం – మన పూర్వీకులు
నేడు మనదేశంలో మానవుని చూస్తున్నాం. అతని సాంఘిక, రాజకీయ, మున జీవితాన్ని ఎరుగుదుం, అతని ఆహారం, వేషభాషలు, నిత్యావసరాలు ఏమిటో మనకు తెలుసు. “మనకు సంబంధించిన ప్రతి విషయంలోనూ మార్పు జరుగుతూ వుంది. ఈ సంగతిని ఎవరూ కాదనలేరు. కాని ఆ మార్పు ఎంత తీవ్రంగా జరిగిందో తెలుసుకొనుట కషం. ఇందుకు నూరు సంవత్సరాల తేడాతో చారిత్రక కాలాన్ని, అంతకంటే ఎక్కువ తేడాతో చరిత్రకు పూర్వమున్న కాలాన్ని, సాంఘిక, ఆర్థిక, మతదృష్టితో పరిశీలిస్తే, మార్పు నమ్మకంగా తెలుస్తుంది. మనం క్రీ|| శ|| 1956 నుండి కాకుండా క్రీ॥ ఈ 1950 నుండి వెనక్కు పయనించుదాము. ఇక్కడ 1857 ను గురించి ఒకమాట చెప్పాలి.. 1857 లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. 1757 లో ప్లాసీ యుద్ధంలో విజయులైనందున మనదేశంలో ఆంగ్లరాజ్య స్థాపన జరిగింది. కాబట్టి చాలామంది మేధావులు •57ను చాలా చెడుగా భావిస్తారు. కాని 1657, 1557, 1457 మొదలైన సంవత్సరాల్లో అటువంటి అనిష్టాలు మనదేశంలో ఏమీ కానరావు. | క్రీశ 1950 1ఇప్పుడు మనం రాతియుగం, రాగియుగం, యినుపయుగం. తుపాకిమందు.
ఆవిరి యుగాలను దాటి పరమాణుయుగంలో ఉన్నాం. 2 వాయు మండలంపై మనకు అధికారముంది. గంటకు 500 మైళు వేగంతో పోయే విమానాలు ఆకాశంలో పరుగులు తీస్తున్నాయి. ఇక రైళ్ళు, మోటారు వాహనాల సంగతి చెప్పేదేముంది?
మనది ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ. 4మన గణరాజ్యానికి రాష్ట్రపతి డా|| రాజేంద్రప్రసాదు. ఆయన మనదేశ రాజధాని
ఢిల్లీలో వుంటారు. మనకు ముఖ్యమైన సమన్వయ భాష హింది. దేశంలోని వివిధ రాష్ట్రాలలో అస్సామీ, బెంగాలీ, ఒరియా, తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం, మరాఠీ, గుజరాతీ
మొదలైన సాహిత్య భాషలున్నాయి. ఇవే కాకుండా మైథిలీ, మాగధీ, భోజపురి, ప్రజ, మాళవీ, రాజస్థానీ, కౌరవీ, పహాడీ మొదలైనవి కూడా సాహిత్య భాషలే.
(అవికూడా సాహిత్య భాషలవుతున్నాయి.) 6. మనం పెట్టుబడిదారీ వర్గ వ్యవస్థలో వున్నాం. 7. మనచేతిలో రాజ్యాధికారాన్ని అట్టి పెట్టుకొనుటకు యుద్ధ విమానాలు, అణు
బాంబులు పరమాస్త్రాలుగా వున్నాయి. భీషణ ఫిరంగులు, మెషినుగన్నుల సంగతి
చెప్పనవసరం లేదు. 8. మనదేశంలో హిందూ మతం, ఇస్లాం మతం ముఖ్య మతాలు. కాని
విద్యావంతులకు ఆ మతాలపై పూర్వంవలె విశ్వాసం లేదు. 9. చదువుకొన్నవారు ఆహార పానీయాల్లో అంటును పాటించరు. వివాహాదుల్లో
కూడా కులగోత్రాలు కూలుతున్నాయి. 10. సాహిత్యాకాశంలో రవీంద్రుడు,
జయశంకరప్రసాదు అస్తమించారు. హిందీలో నిరాలా, సుమిత్రానంద పంతు యిప్పుడు కూడా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నారు.
Rayalaseema Hasya Kathalu
₹280.00అతిథి దేవోభవ…
ఆదోని బాష – 9440239828
“డాడీ అతిథి దేవో భవ అంటే ఏమిటి?” సాయంత్రం ఇంటికి రాగానే రాంబాబుకి అతని ఆరేళ్ళకొడుకు చంటి వేసిన ప్రశ్న ఇది. అతిథి పేరు వింటేనే మండిపడే రాంబాబుకి కొడుకు ప్రశ్న విని చిర్రెత్తుకొచ్చింది.
“వెధవా…. ఆ మాత్రం తెలీదా? అతిథి దేవో భవ అంటే అతిథి దెయ్యంలా భయపెడతాడని అర్థం” కసిగా చెప్పి విసురుగా సోఫాలో కూర్చున్నాడు. ఆ
అతని వేగానికి సోఫా కుయ్యో మొర్రో అంటూ టకటకమని చప్పుడు చేసింది. వంటింట్లో ఉన్న లత భర్త మాటలు విని హాల్లోకొచ్చింది.
“అదేంటండీ, ఎవరి మీది కోపమో వాడి మీద చూపిస్తున్నారు. ఆఫీసులో బాసుతో గొడవపడి వచ్చారా?” అనడిగింది.
“గొడవపడింది బాసుతో కాదు, బాసుగారి బాసుతో” “బాసుగారి బాసా, అదెవరు?” “ఇంకెవరు, మన బాసుగారి భార్యామణి” “ఆవిడ మీ ఆఫీసుకెందుకొచ్చింది? “బుద్ధి గడ్డి తిని మేమే పిలిచాం” “ఎందుకు?”
మా కంపెనీ చాక్లెట్ల సేల్స్ పెంచటానికి మేం అప్పుడప్పుడు కస్టమర్లతో చిన్న చిన్న మీటింగులు ఏర్పాటు చేస్తుంటామని మీకు తెలుసు కదా. ఈ రోజు అలాంటిదే ఓ మీటింగ్ జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మా బాసుగారి భార్యని ఆహ్వానించాం. ఈ రకంగా సుని ప్రసన్నం చేసుకోవాలనుకున్నాం,
ఆయన భార్య బిస్కెట్ కంపెనీకి సేల్స్ అడ్వయిజర్గా వ్యవహరిస్తోంది. ఏవో నాలుగు ఉచిత సలహాలిచ్చి మా బ్రాంచిని ప్రోత్సహిస్తుందనుకుంటే ఆవిడ మా స్టాప్ ని లక్స్ సబ్బుతో కడిగేసింది. నన్నయితే ఓబిస్కెట్ లా కరకర నమిలి తినేసింది”
“ఇంతకీ ఆవిడ ఏం చెప్పింది?” “చాలా చెప్పింది.
హిమాలయాల్లో ఐస్ క్రీముని అమ్మాలంది. థార్ ఎడారిలో ఇసుక వ్యాపారం చెయ్యాలని చెప్పింది. బంగాళాఖాతంలో ఉప్పుని అమ్మాలని సెలవిచ్చింది. ఇవన్నీ చెయ్యగలిగినవాడే నిజమైన స్స్మే న్ అని శ్రీకృష్ణుడిలా గీతోపదేశం చేసింది”………
Raa Raa Samagra Sahityam 1, 2 & 3
₹700.00ముందుమాట
ఆధునిక భారతదేశ చరిత్రలోని భావోద్వేగ పూరితమైన రెండు ఘట్టాలు రాచమల్లు రామచంద్రారెడ్డి సాహిత్య కారునిగా, రా.రా. గా మారడానికి దోహదం చేశాయి. అందులో మొదటిది రాచమల్లు రామచంద్రారెడ్డి మద్రాసులో గిండి ఇంజనీరింగ్ కాలేజి మొదటి సం. విద్యార్థిగా (1940-41) వున్నపుడు జరిగింది. రెండవది మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రపు తొలి శాసనసభ ఎన్నికల సందర్భంగా 1955లో జరిగింది.
1940లో బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటాలు ఉదృతంగా జరుగుతున్నాయి. అదే సమయంలో జర్మనీ యూరపు పై దాడి చేసి రెండవ ప్రపంచయుద్ధానికి తెరతీసి, బ్రిటీషు రాజకీయ సైనిక శక్తులను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇదే అదునుగా భారత జాతీయ వాదులూ, గాంధీ, భారత దేశానికి స్వాతంత్ర్యం ఇస్తామని వాగ్దానం చేయాలని బ్రిటీష్ పాలకులపై వత్తిడి పెంచారు. భారతదేశాన్ని యుద్ధంలోకి దించడానికి వ్యతిరేకంగా గాంధీజీ అక్టోబరు 1940లో దేశ వ్యాప్తంగా వ్యష్టి సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజానీకాన్ని సంఘటిత పరచడానికి పలువురు కాంగ్రెసు వాదుల్ని సన్నద్ధుల్ని చేశారు. దిక్కుతోచని బ్రిటీష్ ప్రభుత్వం ముందుకు ముందే దేశవ్యాప్తంగా ఇరవై వేల మందికిపైగా నాయకుల్ని జైళ్లలో కుక్కింది. ఈ బ్రిటీష్ దమనకాండకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం వీధుల్లోకి వచ్చి సమ్మెపిలుపు నిచ్చింది. ఆ సమ్మెలో భాగంగా మద్రాసులోని అన్ని కాలేజీల విద్యార్థులు సమ్మెబాట పట్టారు. వారిలో గిండీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులూ, వైద్య కళాశాల విద్యార్థులు కూడా వున్నారు. వారిలో అప్పటికే మార్క్సిస్టు భావజాలంతో పరిచయం వున్న రాచమల్లు
రామచంద్రారెడ్డి గూడా వున్నాడని చెప్పనక్కరలేదు గదా!
సమ్మె జరగడం వరకూ బాగానే వుంది. అయితే సమ్మె విరమించిన తర్వాత ఒక విచిత్రం జరిగింది. అదీ గిండీ ఇంజనీరింగ్ కాలేజీలోనే. సమ్మె ముగిసి విద్యార్థులందరూ వారి వారి తరగతులకు హాజరవుతున్నపుడు జరిగిన విచిత్రం అది. వైద్యకళాశాలతో సహా మిగతా అన్ని విద్యాలయాల అధికారులూ యెలాంటి…………
Nela Jaarina Mugdatvam
₹150.00నేల జారిన ముగ్ధత్వం
“శనివారం ఉదయం పది గంటలకి మా స్కూలు ఆడిటోరియంలో ఓ చినసభ ని ఏర్పాటు చేసాము. దానికి మీరుభయులూ రావలసిందిగా కోరుతున్నాం” అని స్కూలు ప్రిన్సిపాల్ ఫోన్ చేసారు. ఓ విధంగా అర్థించారు. రిక్వెస్ట్ చేసారు.
ఆ మాటలు విన్నాక విద్యా సాగర్ ఏం మాట్లాడ లేదు. జవాబివ్వడానికేం లేదు. స్కూలుకి ఎందుకు రమ్మంటున్నారో తెలుసు.
వెళ్తే ఏం మాట్లాడాలి,? అసలు మాట్లాడేందుకేం ఉంది ? ఏమీ లేదనిపించింది. అందుకే నిశ్శబ్దంగా భార్య విజయని చూసాడు. మౌనం ఓ సుదీర్ఘమైన భాష . భాషతో పనిలేని కమ్యూనికేషన్. వారి మధ్య అగాధాల నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం ఎన్నింటినో మింగేసింది.
అందుకే ఆమె ఫోన్ ఎవరిది, ఎక్కడ నుంచీ అని ఏం అడగలేదు. అయినా విద్యా సాగర్ ఆమెకి చెప్పాడు.. ఇప్పుడు స్కూలు ప్రిన్సిపాల్ మాటలకి , ఇప్పుడిప్పుడే ఆరుతున్న కళ్ళు మరోసారి ఊట బావులయ్యాయి. వారి గుండెల్లో పేరుకు పోయిన దుఃఖం కళ్ళల్లోకి వచ్చేసింది. ఎన్నో జ్ఞాపకాలు అప్పుడే పైపొర తొలిగిన పచ్చి పుండ్లలా సలిపేస్తున్నాయి. అవి అన్ని రాత్రింబవళ్ళు అక్కర్లేని అతిథుల్లాగా
ఎప్పుడొస్తున్నాయో, ఎప్పుడు వెళ్తున్నాయో వాళ్ళకి తెలీడం లేదు. ఆ జ్ఞాపకాల లోంచి ‘అమ్మా నాకు బతకాలని ఉంది, ఇప్పుడే చావాలని లేదు’ అంటూ బాధ పడుతూ, ఏడుస్తున్న శ్వేత కనిపిస్తోంది. ఆమె గొంతు వినిపిస్తోంది………..
Navvipodhurugaka
₹750.00జీవితంలో తగిలిన ఒక్కొక్క దెబ్బ ఒక్కో జ్ఞాపకాన్ని తట్టి లేపుతుంది. తగిలిన దెబ్బలకు శరీరమే కాదు, మనసు కూడా రాటుదేలుతుంది. రాయి కన్నా కఠినంగా మారుతుంది. పగ, ప్రతీకారాలే నా ఉచ్చ్వాస నిశ్వాసాలు. పగ, ప్రతీకారేచ్చలు లేకపోతే కురుక్షేత్ర యుద్ధం జరిగేదీ కాదు, మనకు భగవద్గీత దక్కేదీ కాదు. నేను ఈ కథ రాసేవాడినే కాదు. వయస్సు పెరుగుతున్న కొద్దీ అనుభవాల స్వరూపం మారుతుంది. ఒకనాటి ఒప్పు నేడు తప్పుగా అనిపిస్తుంది. ఈ రాతలు మొదలు పెట్టినప్పుడు ఉన్న ఆవేశకావేశాలు కాలం గడిచిన కొద్దీ మారిపోయాయి. గెలుప్లుకన్నా ఓటమిని అంగీకరించడంలోనే ఆనందం ఉంది.
సుమారు పదేళ్ళ క్రితం ప్రారంభించిన ఈ రాతల్లో ఉన్న నిజాయితీ అప్పటికీ ఇప్పటికీ మారలేదు. కాకపోతే నిజాయితీకి ధైర్యం తోడయ్యింది. ఇవన్నీ నా జ్ఞాపకాలు. ఆత్మకథలో వాస్తవాలను వక్రీకరించే హక్కు లేదు. అభిప్రాయాలను చెప్పేటప్పుడు అలంకారాలను, అతిశయోక్తులను ఎక్కువ తక్కువలుగా చెప్పడానికి అవకాశాలున్నాయి. ఎవరైనా భుజాలు తడుముకుంటే అది వాళ్ళ ఖర్మ. ఇవి కేవలం నా అనుభవాలు మాత్రమే. ఇది నా జీవితానికి సమాధానం.
– కాట్రగడ్డ మురారి
Nanu Nadipinchina Charitra
₹150.00ఒక్కమాటలో చెప్పాలంటే లలిత కిచ్చిన మాటకోసం. లలిత “నా జ్ఞాపజాలు’ పేరుతో తన జీవిత విశేషాలురాసింది. “మీరురాయాలండి, మీ జ్ఞాపకాలు విస్తృతమైనవి, విభిన్నమైనవి” అని అంటుండేది. నా పై తనకున్న ప్రేమాభిమానాలు మాత్రమే కాదుఅలా అనడానికి,నా అనుభవాలు అనేకానేక విషయాలను ప్రస్తావిస్తాయనీ, అవి ఆయా సందర్భాల్లో జరిగిన విశేషాలను తెలియచేస్తాయనికూడా కావచ్చు.
జీవితంలోనేను సంపాదించుకొన్నవెలకట్టలేని సంపద అనేకులైననా మిత్రులు,శ్రేయోభిలాషులు,పరిచయస్తులూను. వీరిపరిచయంతోపాటు వారిచ్చిన ప్రోద్బలం నాకు ఊతమిచ్చి నన్ను నడిపించింది. నన్ను నేను సమర్థించుకోవడానికి,ఇదిచెపుతున్నానని అనుకొన్నా,ప్రతి వ్యక్తికీ తన్ను గూర్చి చెప్పుకోవాలన్న ఆసక్తి వుండడం సహజం. ఇది బలహీనతా? కాదనను.మినహాయింపులుండవచ్చు.
వ్యక్తిగతజీవిత చరిత్రల పొరల్లో దాగి, పరిసరాల, ప్రాంతీయ, దేశ చరిత్రల ఆనవాళ్లువుండ స్వీయజీవితచరిత్రకారుడు వీటినితన ‘కథ’లో స్పృశించడా?
జీవితచరిత్రలు,ఆయావ్యక్తుల,వారి,వారిజీవితాలనువాస్తవంగా, అరమరికలు, దాపరికాలులేకుండాప్రతిబింబిస్తాయా? అందరూ’మహాత్ములు’ కారు,కాలేరు.అలాంటప్పుడుఅవినికార్సయిన రచనలు అవుతాయా? ప్రతి జీవితచరిత్రకారుడునిజాయితీగాఎదుర్కొనే ప్రశ్నలుయివి!
Mi Kalalanu Kollagottindevaru? ?
₹225.00నేను ఈ పుస్తకాన్ని ఎందుకు రాసాను?
మిమ్మల్ని వేళాకోళం ఎవరైనా చేసారా…? మీరు తప్పు చేసారని నిరూపించడానికి ఎవరైనా ప్రయత్నించారా…? మిమ్మల్ని అపహాస్యం పాలు చేసారా…? మిమ్మల్ని అవమానించారా…? మిమ్మల్ని పడదోయడానికి ఎవరైనా ప్లాన్ చేశారా ? అయినా మీరు నిలదొక్కుకుని అరిచారా . . .
ఇక చాలు, మరీ ఎక్కువ అయింది… తస్మాత్ జాగ్రత్త………
నా జీవితంలో నేను ఒకప్పుడు ఇటువంటి పరిస్థితులలోనే చిక్కుకుపోయాను. ఇక సహించలేకపోయాను. చెలియలికట్ట తెగిపోయింది…. అందువలనే ఈ పుస్తకం రాసాను. మీకు అసలు సిసలైన నిజాలను చూపించాలి. నిజాలు తెలుసుకున్నాక మీ కళ్ళు తెరుచుకుంటాయని నా నమ్మకం….. తరతరాల నుండి వస్తున్న బిజినెస్లో మీరు ఎంత కాలం నిలదొక్కుకోగలుగుతారు. వాటిల్లో లాభాలు తక్కువ వస్తున్నాయి. జీతాన్ని చాలా వరకు తగ్గిస్తున్నారు. ఇక తమ ఆఫీసుల్లో పనిచేసే వర్కర్లను తీసేస్తున్నారు.
నేను తరతరాల నుండి వస్తున్న బిజినెస్ గురించి చెప్పాను. దీనికి వ్యతిరేకంగా మరో మార్గం కూడా ఉంది. ఈ మార్గంలో నడిస్తే మీరు బాస్ కూడా కాగలుగుతారు. దీనిని అపరంపరాగత బిజినెస్ అని కూడా అనవచ్చును. ఈ బిజినెస్ ఈనాడు ఎంతో వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ కొత్త పద్ధతి ప్రజల కార్యప్రణాళికలను ప్రభావితం చేస్తుంది. అంతేకాదు వాళ్ళ లైఫ్ స్టైలే మార్చేస్తోంది.
నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీలెవల్ మార్కెటింగ్ (ఎమ్.ఎల్.ఎమ్) అన్న పేరున నడిచే ఈ వ్యాపారం. ఎంతో పై ఎత్తున మీరు మీ లక్ష్యం దాకా… పనిచేసే సమయం, ఎన్నిగంటల పని చేయాలి అన్న నిర్ణయం తీసుకోగలుగుతారు. పార్ట్ టైమ్ పనిచేస్తూ బోలెడంత సంపాదించవచ్చు. ఇదంతా ఉత్తి కల్పనేనా? లేకపోతే ఏదైనా స్కామా?
Manchi Swiya Prema Dwara
₹399.00స్వీయప్రేమ అంటే ఏమిటి?
మానసిక ప్రశాంతత చేకూరాలంటే జీవితంలో తప్పనిసరిగా సంతులనం ఉండాలి. పనికి- విశ్రాంతికి, కార్యాచరణకి – సహనానికి, ఆదాయానికి -వ్యయానికి, హాస్యానికి-గాంభీర్యానికి, వదిలించుకోటానికి కొనసాగ టానికి మధ్య సమతుల్యత ఉండాలి. జీవితంలోని అన్ని పార్శ్యాలలోనూ మీరు సమతుల్యతను గనక సాధించకపోతే, మీరు తీవ్రంగా అలిసిపోతారు. విపరీతమైన భావోద్వేగాలు మిమ్మల్ని కుంగదీస్తాయి. అపరాధభావన మిమ్మల్ని వెంటాడుతుంది.
ఉదాహరణకు, కార్యాచరణకు- సహనానికి మధ్య సంతులనం గురించి చెప్పుకుందాం. మీరు చివరి సంవత్సరం యూనివర్సిటీ పరీక్షలకు
ప్రాజెక్టు లీడర్ గా ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో మీరు అధికంగా అభిమానించే ఆటగాడొకరు తన బృందానికి సహకరించటం లేదన్న విషయాన్ని మీరు గుర్తించారు. అదే అనేక మార్లు కొనసాగినప్పుడు తప్పనిసరిగా మీరు సంబంధిత అధికారుల దృష్టికి ఆ విషయాన్ని తీసికెళ్లాలి. అప్పుడు కూడా వారు మీ సూచనలను నిర్లక్ష్యం చేస్తుంటే, ఏ చర్య తీసుకోలేకపోయానన్న అపరాధభావన మిమ్మల్ని వెంటాడుతుందా
‘మీరు దయ,
జాలి గల వ్యక్తులయితే, అనవసరంగా వారి మనసును గాయపరిచి, ఇబ్బందులోకి నెటానేమోనన్న భావనా మిమ్మల్ని ఇబ్బంది
Manasuku MaroVepu
₹275.00నా కథల్తో పాటు…
‘గతంలో, అంటే అరవై ఏళ్ళ క్రితం జన జీవితంలో ఇంతటి విపరీత వేగం లేదు. స్థిరత్వం, స్తిమితం ఉండేవి. సమాజంలో ఒకళ్ళనొకళ్ళు పట్టించు కోటం ఎక్కువగా ఉండేది. విలువల్లో మార్పు రావటానికి చాలాకాలం పట్టేది. మెజారిటీ జన అభిప్రాయం అంటూ ఒకటి బలంగా ఉండేది. ఎవరైనా అనుభవంతో ఏదైనా చెపితే చాలామందికి నచ్చేది. ఎక్కువ మంచితనం, దానికన్నా తక్కువగానే చెడుతనం ఉండేవి. అన్ని వయసుల వాళ్ళలో సంతోషం కనిపించేది.. ముఖ్యంగా వృద్ధుల్లో,
పిల్లల్లో, ఎవరేనా ఇంటికి వస్తే, ఆ కలిసి మెలిసి గడిపే జీవితం పండుగలా ఉండేది. ఇరుగు పొరుగు, బంధువులకన్నా దగ్గరగా ఉండేవారు. అధికారం, పద్ధతులు, నియమనిబంధనల కన్నా, ఆప్యాయతది పైచెయ్యిగా ఉండేది. వెరసి జీవితంలో జీవం ఉండేది.
ఈనాడు అవన్నీ పలచబడిపోయాయి. ప్రస్తుతం మనం జీవిస్తున్నది. వేరే ప్రపంచం. ఎవరికీ దేనికీ ఖాళీ లేదు. ఓపిక లేదు. స్తిమితంగా తినరు. | సుఖంగా సంసారం కూడా చెయ్యరు. వాళ్ళది కాని వేరే బతుకే చాలామంది బతుకుతున్నారు. యవ్వనంలో ఉన్న ఆడ, మగ మధ్య అవసరమే తప్ప, ఆకర్షణ కరువవుతున్న దౌర్భాగ్యదశ.
ఆ రోజుల్లో దుఖాన్ని వెతికి పట్టుకుని కథలు రాశాం. ఒకరి దుఖం పది మందికి తెలిస్తే, జీవితం మెరుగుపడుతుందన్న నమ్మకంతో రాశాం. ఇప్పుడు దుఖాన్ని కాదు, సుఖాన్ని, సంతోషాన్ని వెతికి పట్టుకోవాల్సి వస్తోంది. ఆమె………….