Description
స్పానిష్ రచయిత గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్ (1927-2014) ను, ఆయనకు ప్రపంచ ఖ్యాతి సంపాదించి పెట్టిన ‘వందేళ్ల ఏకాంతం’ నవలను తెలుగు సాహిత్యప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు.
తీపిచేదుల వాస్తవం, అద్భుత కల్పన, వ్యంగ్యం, రక్తపాత అంతర్యుద్ధాలు, సెక్సు, సైన్సు, మూఢనమ్మకాలు కలబోసుకున్న ఈ నవలకు భారతదేశంతో బీరపీచు సంబంధం ఉంది. కథ ప్రకారం ఈ రచన మెల్కియాదిస్ అనే ఇంద్రజాలికుడు, బహుశా భారతీయుడు తన మాతృభాష సంస్కృతంలో రాసిన గాథ.
ఇందులోనివన్నీ సార్వజనీన అనుభవాలు కనకే ‘వందేళ్ల ఏకాంతం’ ప్రతి మనిషి ఏకాంతం అయింది. వందేళ్ల మకోందో చరిత్ర ప్రతి ఊరి కథ అయింది.





Reviews
There are no reviews yet.