Showing the single result

Vidwan Viswam Panchatantram

150.00
పంచతంత్రం విను మహిలా రోప్య మను పట్టణమ్ము వెనుక, దక్షిణభూమి వెలయుచు నుండె. అమరేంద్ర వైభవుం డా యూరి రాజు; అమరశక్తి యటందు రాతని జనులు. మువ్వురు కొడుకులు మూర్ఖులై రంచు చివ్వుమన్నది రాజు చిత్తమ్ములోన చింతతో మంత్రుల చేరంగ బిలిచి మంతన మ్మొనరించి మాట్లాడె నిట్లు: తెలివిమాలిన కుమారుల పాడు నడత తెలియుగదా మీకు తీర్పరులార: | చదువుసాములు లేని చవటలై వీరు పదుగుర నవ్వుల పాలయినారు. అనగా అనగా దక్షిణాపథంలో మహిలా రోప్యం అనే పటణం కలదు. అంగ రంగ వైభవంతో ఆ నగరాన్ని అమరశక్తి అనే ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు ముగ్గురు కుమారులు. వారు ముగురూ మూరులయినందువల్ల ఆ రాజు మనస్సు చివుక్కు మన్నది. విచారంతో ఆయన మంత్రులందరినీ పిలిపించి వారితో మంతనం సాగించినాడు. ఆ నరపాలుడు ఇట్లన్నాడు - "ఈ తెలివిలేని నా కుమారుల నడత మీకు తెలుసు గదా! మీరు న్యాయం చెప్పవలసిన వారు చదువూ, సామూ లేక చవటలె పోయి ఉన్నాడు. పాడు నడత మీకు తెలుసు గదా! మీరు న్యాయం చెప్పవలసిన వారు. చదువు, సాము లేక చావతలై పోయిన వీరు పడుగుర ముందు నవ్వుల పాలవుతారు . .....