Showing 1–12 of 32 resultsSorted by latest

Kailasa Manasarovar

175.00
హిమాలయాల తీర్దాలన్నింటిలోనూ అతిపవిత్రమైన తీర్థక్షేత్రాలు – కైలాసం – మానసరోవరమునూ… ఈ తీర్థక్షేత్రాల పరిసరాల్లోకి ఎవరు ప్రేవేశి౦చినా మతంతోగాని, జాతితో గాని సంబంధం లేకుండా, నాస్తికుడైనా సరే,

Yudha Kala

150.00
యుద్ధ కళ అనేది రాజ్యానికి చాలా కీలకమైన విషయం. ఇది చావు, బతుకుల సమస్య . ఇది సురక్షిత మార్గం వైపు లేదా పూర్తిగా వినాశనంవైపు తీసుకెళ్లే మార్గం. ఇది విచారణకు సంబంధించిన విషయం కావడంతో , దీన్ని పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు." తూర్పు ఆసియా దేశాల సంస్కృతి, చరిత్రల్లో ప్రత్యేక స్థానం కలిగిన అద్భుత దృశ్యకావ్యం... యుద్ధకళ . ఈ పుస్తకం రాణానితి , సైనిక వ్యూహాలలోని రాజకీయాలు, సిద్ధాంతాలకు సంబంధించిన ప్రాచీన చైనా పాఠం. ఈ పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్దుడైన యోధుడు. తత్వవేత్త అయిన సన్ ట్జు క్రుస్తుపూర్వం 6 వ శతాబ్దంలో రాశారు.

Sampada Srustinche Rahasyam

175.00
ధనవంతులయ్యేందుకు ఓ శాస్త్రం ఉంది. ధనవంతులు కావడానికి ఓ శాస్త్రం ఉంది. అది.. బీజ గణితం లేదా అంకగణితం వంటి కచ్చితమైన శాస్త్రం. సంపదను సంపాదించే ప్రక్రియను నియంత్రించే కొన్ని చట్టాలున్నాయి. ఈ చట్టాలను నేర్చుకుని, పాలించిన తర్వాత ఎవరైనా నిశ్చయంగా సంపన్నుడు కాగలడు. ఒక నిర్దిష్ట మార్గంలో పనిచేయడం వలన డబ్బు మరియు ఆస్తి యాజమాన్యం లభిస్తుంది. ఉద్దేశపూర్వకంగా గానీ లేదంటే అనుకోకుండా కానీ ఈ నిర్దిష్ట మార్గంలో పనిచేసిన వారు సంపన్నులు అవుతారు. ఈ నిర్దిష్ట మార్గంలో పనులు చేయనివారు ఎంత కష్టపడినా, ఎంత సామర్థ్యం ఉన్నా 'పేదలుగానే మిగిలిపోతారు. ఇది నిజమని ఈ క్రింది విషయాలు నిర్ధారిస్తాయి. ధనవంతులు కావడమనేది పర్యావరణానికి సంబంధించిన అంశం కాదు. ఒకవేళ అదే గనుక నిజమైతే నిరిష పరిసరాలలోని వారంతా సంపన్నులు అవుతారు. ఒక పట్టణంలోని వారో లేదంటే ఒక రాష్ట్రంలోని వారో మాత్రమే ధనవంతులుగా ఉంటారు. ఇతర పట్టణాలు, ఇతర రాష్ట్రాల్లోని వారంతా పేదలుగానే మిగిలిపోతారు. కానీ.. ప్రతిచోటా ధనవంతులు, పేదలు పక్కపక్కనే ఒకే వాతావరణంలో నివసిస్తుంటారు. వారిలో చాలామంది ఒకే వృత్తిలో కొనసాగడం కూడా మనం చూసే ఉంటాం. ఇద్దరు వ్యక్తులు ఒకే ప్రాంతంలో, ఒకే వ్యాపారంలో ఉన్నప్పుడు వారిలో ఒకరు ధనవంతులుగా మరొకరు పేదలుగా ఉన్నప్పుడు.. సంపన్నులు కావడమనేది ప్రధానంగా పర్యావరణానికి సంబంధించిన అంశం కాదన్న విషయం ఇక్కడ అర్థమవుతుంది. కొన్ని వాతావరణాలు ఇతరులకన్నా మరింత ఎక్కువ అనుకూలంగా ఉండొచ్చు. | ... ఒకే వ్యాపారంలో ఉన్న ఇదరు వ్యక్తులు ఒకే పరిసరాల్లో ఉన్నప్పుడు వారిలో - విఫలమై.. మరొకరు ధనవంతులు కావడం అనేది ఒక నిర్దిష్ట మార్గంలో ........

Atomic Habits

299.00
ప్రతి రోజు ఒక శాతం మెరుగుపరచుకునే విప్లవాత్మక పద్ధతి। ప్రజలు అనుకుంటారు జీవితాన్ని మార్చుకోవాలంటే భారీగా ఆలోచించాలని అయితే ప్రపంచ ప్రఖ్యాత అలవాట్ల నిపుణుడు జేమ్స్ క్లియర్ మరో మార్గం కొనుగోన్నారు। నిజమైన మార్పు కొన్నిచిన్న చిన్న నిర్ణయాల సామూహిక ప్రభావం వల్ల కలుగుతుందని తెలియజేస్తారు - రోజు రెండు పుష్ అప్ లు చేయడం , ఐదు నిముషాలు ముందుగా లేవడం , ఒక పేజీని ఎక్కువగా చదవడం।।। వీటినే క్లియర్ అటామిక్ హబిట్స్ అంటారు। సంచలనం సృష్టించిన ఈ పుస్తకంలో క్లియర్ చిన్న చిన్న మార్పులు జీవితాన్ని మార్చే ఫలితాన్ని ఎలా అంధిస్తాయో తెలియజేస్తారు। వీటిని మనస్తత్వశాస్త్రం, న్యూరో సైన్స్ ఆధారంగా సాధికారికంగా వివరిస్తారు। ఈ పరంపరలో ఒలింపిక్ స్వర్ణపతాక విజేతలు వున్నతమైన సి।ఐ।ఓ।లు ప్రసిద్ధి పోందిన శాస్త్రజ్ఞుల స్ఫూర్తిదాయకమైన కథలని, తెలియజేస్తారు। మీ జీవితం పట్ల , నిత్య జీవితంలో మీ దృక్పథంలోనూ మార్పుని తీసుకువచ్చే ప్రత్యేకమైన పుస్తకమిది।

Chitra Veena

200.00
మనసు మీటిన "చిత్రవీణ" ఉరుదూ ముషాయిరాల్లో కొందరు గజలను “తరన్నుమ్” (రాగయుక్తం) గానూ, మరికొందరు "తహెత్” (రాగం లేకుండా) గానూ వినిపిస్తారు. గజల్ ప్రధానంగా గాన ప్రక్రియకు చెందినదే అయిననూ, ఎవరికి వారు రాగరహితంగానూ చదువుకుని ఆనందించవచ్చును. దేని సౌందర్యం దానిదే. హైదరాబాద్కు చెందిన ఉస్తాద్ (నజీర్ అలీ ఆదిల్ గారు)... తన గజళ్ళను తహెత్ (రాగంలేకుండా) గా వినిపించేవారు. అప్పట్లో వారి ముషాయిరాలకూ జనం కోకొల్లలుగా ఉపస్థితి అయ్యేవారు. అమితంగా ఆనందించేవారు కూడా.. ఇప్పుడిది ఇక్కడ ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందీ అంటే, కవయిత్రి విజయ గోలి గారి "చిత్రవీణ” గజళ్ళలో అటు “తరున్నుమ్” లోనూ, ఇటు “తహెత్"లోనూ ఎలా వినిపించిననూ శ్రోతల హృదయాలను అకట్టుకోగలిగే గజళ్ళు పుష్కలంగా వున్నాయని చెప్పడానికే. ఈ క్రింది గజలను చదవండి “మనసెందుకు గమ్మత్తుగ గగనవీథి తేలుతుంది ! ఏమైనదో తెలియకుంది ఎద చప్పుడు పెరుగుతుంది ! కనుపాపల లాలిపాడ కరుణించదు నిదుర తల్లి కలలలోన రూపమేదొ అలలాగే కదులుతుంది ! నీలిమబ్బు ఛాయలలో జారుకురుల దోబూచుల అల్లరేదొ తీగలాగ అల్లుకుంటు నవ్వుతుంది !

Cherabanda Raju Sahitya Sarvaswam 1 & 2

1,000.00
సంపాదకుడి మాట మార్గదర్శి అల్లం రాజయ్య ప్రపంచ వ్యాపితంగా సామ్రాజ్యవాదం పూర్తిగా విస్తరించి - తను ఆర్థిక మాంద్యంలో కూరుకపోయి స్థానిక ఉత్పత్తి శక్తుల మీద - ఉత్పత్తి సంబంధాల మీద తీవ్రమైన ప్రభావం చూపిన కాలమది. అన్ని దేశాలల్లో దోపిడీ, హింసా, నిరుద్యోగం పెరిగిపోయాయి. వాటికి కారణాలేమిటో తెలియని ప్రజలు తీవ్రమైన భావోద్వేగాలకు లోనయ్యారు. కోపోద్రిక్తమైన యువకులు, విద్యార్థులు పారిన్లో తిరుగుబాటు చేశారు. హెచిమిన్ నాయకత్వంలో క్రూరమైన జిత్తులమారి అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వియత్నాం ప్రజలు పోరాటం పతాకస్థాయికి చేరింది. అది రష్యా సోషల్ సామ్రాజ్యవాదంగా రూపొందుతున్న కాలం. చైనాలో కొత్తగా రూపొందుతున్న పెట్టుబడిదారీవర్గానికి వ్యతిరేకంగా మావో సాంస్కృతిక విప్లవానికి పిలుపునిచ్చిన కాలం.. ఇలా ప్రపంచవ్యాపితంగా పెను సంచలనాలు - యుద్ధాలు చెలరేగుతున్న కాలం అది. మన దేశంలో నెహ్రూ మార్కు బూటకపు సోషలిజం విఫలమయ్యింది. భారత కమ్యూనిస్టు పార్టీ దేశంలోని వైరుధ్యాలను అర్థం చేసుకోలేక పోరాడే ప్రజలకు నాయకత్వం వహించే చారవ కోల్పోయింది. వర్గపోరాటం సానే వర్గ సామరస్యం వల్లిస్తూ రివిజనిజంలో కూరుకుపోయి రెండుగా చిలింది. దేశం జాతుల బందీభానాగా, ఉత్పతి శక్తుల బందిఖానాగా మారింది. గ్రామాలు సుదీర్ఘ కాలం కులాల కాన్సంట్రేషన్ క్యాంపులుగా మారి ఉత్పత్తి శక్తుల వికాసానికి ఆటంకమయ్యాయి. సంతో దాదో రేవో తేలుకొని పోరాడవలసి వచ్చింది. ఈ పోరాటాలన్నిట్లో సరైన నిర్మాణం, నాయకత్వం లేక వేలాది మంది విద్యార్థులు కదం తొక్కుతున్న కాలం అది. అలాంటి గడ్డుకాలంలో తెలంగాణా సాయుధ పోరాటం జరిగి(1948-51) నాయకత్వ హం వలన విరమించబడిన నేపథ్యం గల నల్గొండ జిల్లాలోని అంకుశాపురంలో బద్దం హ 1944లో పడి గాయాల నొప్పుల నీతిలో బాల్యం గడిపాడు. సంవత్సరం లో ఆంధ్ర మహాసభ అతివాద, మితవాద గ్రూపులుగా చిలింది. ఆయన బాల్యం రక్తసిక్త సాయుధ పోరాటం అతలాకుతలంతో గడిచింది. అయిదవ తరగతి నాటికి బాల తహ పేరు స్కూల్లో భాస్కరరెడ్డిగా మారింది. ఇలాంటి ఒత్తిడి చిత్తడిలో కౌమారపు స్వేచ్ఛా లలు గన్నారు. పలవరింతల మధ్య కవిత్వం ఓదార్చింది. కవిత్వం పూనిన తరువాత పెట్టు తప్పింది. ఈ గడబిడల మధ్యనే పదహారో ఏట శ్యామలతో పెండ్లి జరిగింది. - రైతు కుటుంబంలో శ్యామల వ్యవసాయ పనుల్లో గొడ్డు చాకిరీలో ఉండగా భాస్కర్ రెడ్డి.............

Bowmaniyam Jigmat Bowman

395.00
  ఒక సుదీర్ఘ సంభాషణ -మధురాంతకం నరేంద్ర 1950 ప్రాంతాల్లో 'ఆంధ్రపత్రిక'లో 'చంఘిజ్ ఖాన్' నవల ధారావాహికగా ప్రచురించబడుతున్నప్పుడు, ఆలోచనాజీవులైన కొందరు పాఠకులు దాన్ని రాసిన తెన్నేటి సూరిగారిని "మీరు రాస్తున్నది ఛంఘిజ్ ఖాన్ చరిత్రా? లేకపోతే యిప్పుడు జరుగుతున్న రాజకీయాలపైన వ్యాఖ్యానమా?” అని అడిగారట! జిగ్మంట్ బౌమన్ ప్రతిపాదించిన 'ద్రవాధునికత'ను తెలుగువాళ్ళకు పరిచయం చేస్తూ తిరుపతిరావు | గారు రాసిన ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు నాకు, “యిది ప్రత్యేకమైన సిద్ధాంత | మేమీ గాదు. ఇప్పుడు ప్రపంచంలో ప్రతిచోటా జరుగుతున్న సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితులనన్నింటినీ యిక్కడి రచయిత వివరిస్తున్నాడు" అనిపించింది. 1870 ప్రాంతాల్లోనే రష్యా ప్రజల్ని గురించి చెప్తూ దొస్తోయేవ్ స్కీ, “యెప్పుడైనా | రష్యన్లు నాస్తికులుగా మారితే అప్పుడు నాస్తికత్వానే మతంగా మార్చేసుకుంటారు | అన్నాడు. యీ స్వభావం నిజానికి కేవలం రష్యనది మాత్రమే గాదు. మానవులందు స్వభావమూ యిదే! అందుకే కార్ మార్క్స్ గొప్ప మానవీయ దృక్పథంతో చూపు దించిన కమ్యూనిజాన్ని గూడా అనేక దేశాలో అనేకమంది మతంగానే మ్చాడు కున్నారు. మార్క్స్ అనుకున్నదొకటి, జరిగింది. వేకటీ. “ద గాడ్ దట్ ఎముక (ఆర్డర్ కోస్టర్, యిగా జియో సిలోన్, రిచర్డ్ రెట్, ఆండ్రే గిడె, లు స్టిఫెన్ స్పెండర్ అనే ఆరుగురు రాసిన వ్యాసాల సమాహారం) అనడం మార్క్సిజాన్ని దేవుడని నమ్మేసిన మానవస్వభావమే స్పష్టంగా కనబడుత లోంచే సిద్ధాంతాన్ని తీసుకోవాలని నమ్మి, తాను చిత్త శుద్ధం భూమికలోనే దిట్టంగా నిలబడి, సమకాలీన ప్రపంచంలో ప్రతి అధ్యయనం చేయడం కోసం, సిద్ధాంతాల అచ్చుల్ని (moulds) బయటకు వచ్చిన సాహసి బొమన్. అందువల్ల బొమనను చ మనం జీవిస్తున్న ప్రపంచాన్ని చదివి అర్థం చేసుకోవడమే ఆ ఎమె స్పష్టంగా కనబడుతోంది. జీవితం తాను చిత్తశుద్ధితో నమ్మిన సోషలిస్టు లన ప్రపంచంలో వస్తున్న మార్పుల్ని బ్బల్ని (moulds) పగలగొట్టుకుని ల్ల బొమనను చదవడమంటే మనల్ని,............

Andhamaina Viplavam

300.00
ఇటలీలో కళాచంద్రోదయం ఆరువందల ఏళ్ల క్రితం మన ప్రపంచంలో ఓ అద్భుతం జరిగింది. పద్నాలుగవ శతాబ్దపు తొలి నాళ్లలో ఇటలీలో ఒక విప్లవం మొదలయ్యింది. కత్తులతో, కాగడాలతో, నినాదాలతో, నెత్తుటి రాతలతో చేసిన హింసాపూరిత విప్లవం కాదది. అదొక అందమైన విప్లవం. మానవ మేధ లోతుల్లో రాజుకున్న విప్లవం. చిత్రకళ, శిల్పం, స్థాపత్యం, సాహిత్యం , విజ్ఞానం, నగర నిర్మాణం, సాంస్కృతికం ఇలా ఏదీ వదలకుండా మానవ జీవన విభాగాలన్నిటి మీద తన సర్వాంగ సుందరమైన ప్రభావాన్ని ప్రసరించి యూరప్ నాగరికత మీద శాశ్వత ముద్ర వేసింది. ఆ విప్లవం. ఆ విప్లవం పద్నాల్గవ శాతాబ్దంలో ఎందుకు జరిగింది? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే క్రైస్తవ మత చరిత్రను క్లుప్తంగా గమనించాలి. ఒకటవ శతాబ్దంలో యూరప్, ఆసియాకి సరిహద్దుల వద్ద జుడెయాలో క్రైస్తవ మతం ఆవిర్భవించింది. ఆ కాలంలో జుడెయా రోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ప్రభుత అనుసరించే పేగన్ (Paganism) మతానికి ఈ కొత్త మతభావాలు విరుదంగా ఉండడంతో, రోమన్ పాలకుల నుండి, సమాజం నుండి కూడా ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొంది. మొదటి నాలుగు శతాబ్దాల కాలం పలు రోమన్ పాలకుల నుండి క్రైస్తవులు ఎన్నో రకాల వేధింపులకి గురయ్యారు. ఇలా ఉండగా ఐదవ శతాబ్దపు చివరి దశలో రోమన్ సామ్రాజ్యం తూర్పు, పశ్చిమ విభాగాలుగా విడిపోయింది. పశ్చిమ విభాగం పూర్తిగా ఛిన్నాభిన్నమై పతనం కాగా, తూర్పు విభాగం | కాంస్టాంటినోపుల్ రాజధానిగా మరో వేయేళ్లపాటు వర్ధిల్లింది. - తూర్పు రోమన్ సామ్రాజ్యాన్నే బైజాంటైన్ సామ్రాజ్యం అని అంటారు. ఈ | కొత్త సామ్రాజ్యం క్రైస్తవ మతాన్ని సాధికార మతంగా స్వీకరించింది. దాంతో క్రైస్తవ మతం బాగా బలాన్ని పుంజుకుంది. అన్ని రకాల సామాజిక వ్యవహారాల మీద మతం పట్టు క్రమంగా బలపడుతూ వచ్చింది. జీవితం పట్ల మనిషి దృక్పథాన్ని కూడా మతమే శాసించింది. ఆ దృక్పథం ప్రకారం జన్మతః మానవుడు పాపి. మతం | బోధించిన జీవన సరళిని అనుసరించి జీవిస్తే, జన్మానంతరం సద్గతిని పొంది,............