• Agnipatham_Mattimanushulu

    Agnipatham_Mattimanushulu

    విభిన్న ఇతివృత్తాలతో విలక్షణ నవలలు

    కథారచయితగా ‘పాలపిట్ట’ పాఠకులకు సుపరిచితులైన గన్నవరపు నరసింహమూర్తి రాసిన రెండు నవలలు ఇవి. పోలీస్ వ్యవస్థలో నిజాయితీగా పని చేయడానికి పూనుకున్న ఒక యువ ఐపిఎస్ అధికారి ఎదుర్కొన్న సవాళ్ళను, రాజకీయ వ్యవస్థ ఒత్తిళ్ళను అధిగమించి నిజాయితీగా పని చేసిన తీరును ‘అగ్నిపథం’ నవల ఆవిష్కరించింది. నీతి, నిజాయితీ, చట్టాన్ని అమలు చేసే పట్టుదల గల పోలీసు అధికారులు ఉన్నపుడు పోలీస్ వ్యవస్థ విశ్వసనీయత ఇనుమడిస్తుంది. ఈ విషయాన్ని సాధికారికంగా నిరూపించిందీ నవల. ఆద్యంతం ఆసక్తికరమైన కథనంతో నడిచింది. ఉత్తరాంధ్ర అటవీ ప్రాంతంలోని ప్రకృతినీ, పరిస్థితులనీ, సమస్యలనీ బలంగా చిత్రించిన నవల ఇది. ప్రజలకు సేవ చేయడానికి అంకితమై పనిచేసే అధికారులు జనానికీ, సమాజానికి ఎన్నివిధాల మేలు చేసే అవకాశం ఉన్నదో ఈ నవల చదివితే బోధపడుతుంది.

    ఉత్తరాంధ్రలోని వ్యవసాయిక పరిస్థితులను, నీటి ప్రాజెక్టుల కోసం ఆందోళనలని చిత్రించిన నవల ‘మట్టిమనుషులు’. అంతేగాక తన ఊరి ప్రజల కోసం తపించే ఓ ఐఐటి చదువుకున్న యువకుడి జీవనగమనం భూమికగా రూపుదిద్దుకున్న నవల ఇది. వ్యవసాయరంగం సంక్షోభరహితంగా ఉండాలంటే ఏం చేయాలో ఈ నవలలో రచయిత చర్చించారు. అలాగే పల్లెల నుంచి వలసలు ఆగిపోవాలంటే స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలో బాగా చెప్పారు. ముఖ్యంగా మానవ సంబంధాల ప్రాముఖ్యాన్ని ఆరంగా చిత్రించారు రచయిత. ఈకాలాన అమెరికాకు తరలిపోవడమే లక్ష్యంగా ఉన్నత చదువుల్లో చేరుతున్నారు. దీనికి భిన్నంగా తన గ్రామం కోసం, అక్కడి ప్రజల కోసం, నీటివసతుల కలువ కోసం ఓ యువకుని తపనని, కృషిని దృశ్యమానం చేసిన నవల ‘మట్టిమనుషులు, ఈ నవలా పఠనం ఉదాత్త అనుభవం. ముఖ్యంగా సన్నివేశాల కల్పన, సంబాపణలు సహజంగా ఉన్నాయి. గన్నవరపు నరసింహమూర్తి కథనశైలిలోని ప్రత్యేకత…………

    150.00
    Add to cart
  • Ahame Mee Satruvu

    Ahame Mee Satruvu

    పరిచయం

    మీరు సులువుగా మోసపోగలుగుతారు. మొట్టమొదట మీరు చేయవలసిందల్లా మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా ఉండటమే.

    – రిచర్డు ఫెన్మెస్

    మీరు యువకులుగా ఉండి ఏదో ఆశయం కోసం పట్టుదలతో పనిచేస్తున్న వారు కావచ్చు లేదా సమస్యలతో తెగ పోరాడుతున్నవారు కావచ్చు. తొలి మిలియన్ సంపాదించి, ఒక పెద్ద ఒప్పందం చేసుకుని పేరుపొందిన బృందంలో సభ్యత్వం పొందిన వారు కావచ్చు లేదా ఇప్పటికే మీరు జీవితాశయాన్ని సాధించిన వారు కావచ్చు. విజయశిఖరాలు చేరిన తర్వాత అక్కడ ఎంత శూన్యం ఆవరించిందో అన్న ఆలోచనలతో ఉన్న వ్యక్తయినా కావచ్చు. సంక్లిష్ట వాతావరణంలో ఓ పెద్ద బృందానికి నాయకత్వం వహిస్తున్నవారు కావచ్చు లేదా ఉద్యోగం నుంచి అకస్మాత్తుగా బయటకు నెట్టివేయబడిన వారు కావచ్చు. ఇవేమీ కాకపోతే ఒక్కసారిగా కుప్పకూలి జీవితంలో అథోగతి పాలయిన వారు కూడా కావచ్చు.

    మీరేం చేస్తున్నా, మీరెక్కడ ఉన్నా, మీకు చేటు చేసే శత్రువు మీలోనే ఉంటుంది. దాన్నే ‘అహం’ అని పిలుస్తారు.

    “నాకు అహం లేదు. నన్నెవరూ ఇంత వరకూ అహంకారి అని అనలేదు తెలుసా?” అని మీరు అనవచ్చు. చాలా సంయమనంతో నడుచుకునే వ్యక్తిగా మిమ్మల్ని మీరు భావించుకో వచ్చు. కానీ ఆశయాలు, నైపుణ్యాలు, సమర్థత, ప్రేరణ, శక్తితో ఏదయినా సాధించ దలుచుకున్నప్పుడు అక్కడ అహం రంగప్రవేశం చేస్తుంది. మనం ఆలోచనా పరులుగా, సృజనాత్మక జీవులుగా, క్రియాశీలురుగా, వ్యాపారవేత్తలుగా ఆయా రంగాల్లో ఉన్నతస్థాయికి చేరేందుకు సాగించే ప్రయత్నంలో మనస్సులో దాగి ఉంటే ఈ చీకటి కోణం మనల్ని దుర్బలులుగా మారుస్తుంది.

    ఫ్రాయిడ్ పరిభాషలో అహాన్ని గురించి వివరించే పుస్తకం కాదిది. గుర్రంపై స్వచేసే వ్యక్తి లాంటిది అహం అని, జంతువు మాదిరిగా ఉపచేతన మనసు దానిని నడుపుతూ ఉంటుందని ఫ్రాయిడ్ ఒక పోలిక ద్వారా దాని గురించి చెప్పే మత్నం చేస్తారు. ఆధునిక మనస్తత్వవేత్తలు మాత్రం దీనికి కొత్త భాష్యం చెబుతారు.

    ఆ పట్ల అలక్ష్యం చూపుతూ, ప్రమాదకరస్థాయిలో తమను గురించి తాము అప్పగా ఆలోచించుకునే వారిని అహంకారులు అని చెబుతారు. ఇవన్నీ నిర్వచనాలు వలన,కానీ వైద్యసంబంధమైన వ్యవహారాలకు వెలుపల మాత్రం వాటికంత వ్యాపారవేత్తలుగా ఆయా రంకటి కోణం మనల్ని మన పుస్తకం కాదిది. పరంగా సరైనవే,కానీ వైద్యసంబంధమైన విలువ లేదు………..

    350.00
    Add to cart
  • Akhari Athidhi

    Akhari Athidhi

    ప్రతి మనిషి తప్పని సరిగా ఎదో రోజు ఆఖరి అతిథిని ఒక్కసారే కలుసుకుంటాడు. కాని డాక్టర్ శ్రీజిత్ మాత్రం అతన్ని అనేక సార్లు కలుసుకున్నాడు.
    ఎందుకు? ఎప్పుడు? ఎలా?
    మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన, అతింద్రియ నేపథ్యంతో సాగే ఈ సస్పెన్స్, ఫాంటసీ డైరెక్ట్ నవల వినూత్నమైన అంశాన్ని ఆవిష్కరించింది. మూడు రోజుల్లో డాక్టర్ శ్రీజిత్ కి ఎదురైన విచిత్ర అనుభవాలు ఉత్కంఠంగా సాగుతాయి.
    – మల్లాది వెంకటకృష్ణ మూర్తి

    230.00
    Add to cart
  • Amazon Vijaya Rahasyalu
  • Andhamaina Viplavam

    Andhamaina Viplavam

    ఇటలీలో కళాచంద్రోదయం

    ఆరువందల ఏళ్ల క్రితం మన ప్రపంచంలో ఓ అద్భుతం జరిగింది. పద్నాలుగవ శతాబ్దపు తొలి నాళ్లలో ఇటలీలో ఒక విప్లవం మొదలయ్యింది.

    కత్తులతో, కాగడాలతో, నినాదాలతో, నెత్తుటి రాతలతో చేసిన హింసాపూరిత విప్లవం కాదది.

    అదొక అందమైన విప్లవం. మానవ మేధ లోతుల్లో రాజుకున్న విప్లవం. చిత్రకళ, శిల్పం, స్థాపత్యం, సాహిత్యం , విజ్ఞానం, నగర నిర్మాణం, సాంస్కృతికం ఇలా ఏదీ వదలకుండా మానవ జీవన విభాగాలన్నిటి మీద తన సర్వాంగ సుందరమైన ప్రభావాన్ని ప్రసరించి యూరప్ నాగరికత మీద శాశ్వత ముద్ర వేసింది. ఆ విప్లవం.

    ఆ విప్లవం పద్నాల్గవ శాతాబ్దంలో ఎందుకు జరిగింది?

    ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే క్రైస్తవ మత చరిత్రను క్లుప్తంగా గమనించాలి. ఒకటవ శతాబ్దంలో యూరప్, ఆసియాకి సరిహద్దుల వద్ద జుడెయాలో క్రైస్తవ మతం ఆవిర్భవించింది. ఆ కాలంలో జుడెయా రోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ప్రభుత అనుసరించే పేగన్ (Paganism) మతానికి ఈ కొత్త మతభావాలు విరుదంగా ఉండడంతో, రోమన్ పాలకుల నుండి, సమాజం నుండి కూడా ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొంది. మొదటి నాలుగు శతాబ్దాల కాలం పలు రోమన్ పాలకుల నుండి క్రైస్తవులు ఎన్నో రకాల వేధింపులకి గురయ్యారు. ఇలా ఉండగా ఐదవ శతాబ్దపు చివరి దశలో రోమన్ సామ్రాజ్యం తూర్పు, పశ్చిమ విభాగాలుగా విడిపోయింది. పశ్చిమ విభాగం పూర్తిగా ఛిన్నాభిన్నమై పతనం కాగా, తూర్పు విభాగం | కాంస్టాంటినోపుల్ రాజధానిగా మరో వేయేళ్లపాటు వర్ధిల్లింది. – తూర్పు రోమన్ సామ్రాజ్యాన్నే బైజాంటైన్ సామ్రాజ్యం అని అంటారు. ఈ | కొత్త సామ్రాజ్యం క్రైస్తవ మతాన్ని సాధికార మతంగా స్వీకరించింది. దాంతో క్రైస్తవ మతం బాగా బలాన్ని పుంజుకుంది. అన్ని రకాల సామాజిక వ్యవహారాల మీద మతం పట్టు క్రమంగా బలపడుతూ వచ్చింది. జీవితం పట్ల మనిషి దృక్పథాన్ని కూడా మతమే శాసించింది. ఆ దృక్పథం ప్రకారం జన్మతః మానవుడు పాపి. మతం | బోధించిన జీవన సరళిని అనుసరించి జీవిస్తే, జన్మానంతరం సద్గతిని పొంది,…………

    300.00
    Add to cart
  • Bali Kathalu

    Bali Kathalu

    అప్పికట్ల వారి వీధికి ఆహ్వానం

    1972లో వడ్డెర చండీదాస్ గారి నవల “

    హిమజ్వాల” ఆంధ్రజ్యోతి

    భాగానికి వారపత్రికలో సీరియల్ గా వస్తున్నప్పుడు, ప్రతివారమూ ఆ నవలా వేసిన బొమ్మలు కూడా ఆ నవలంత కొత్తగా, అధునాతనంగా వుండేవి. ఆ బొమ్మలు వేసిన చిత్రకారుడి పేరు బాలి. అదీ బాలిగారితో తెలుగు సాహిత్యానికి తొలి పరిచయం. (అప్పటికే కొన్ని నవలలకు బొమ్మలు వేసి ఉంటారు). అప్పటి నుంచీ తెలుగు పత్రికలకో కొత్త చిత్రకారుడు దొరికాడు. అప్పటి పత్రికల చిత్రకారుల్లాగే ఆయన కూడా ఆ తరువాత కార్టూన్లూ గీసి నవ్వించారు. వాళ్లలో చాలా మందికి భిన్నంగా అప్పుడప్పుడు కథలూ రాశారు. బాపూగా రొకటి రెండు కథలు రాసినట్టు యెవరో చెబుతుంటే విన్న గుర్తు. చంద్రగారు చాలా కథలు రాశారు. అయితే యిలా కథల సంపుటాన్ని ప్రచురిస్తున్న తొలి పత్రికా చిత్రకారుడు నాకు తెలిసి బాలిగారొకరే!

    యీ సంపుటంలోని కథలన్నీ వొక ప్రముఖ చిత్రకారుడి కుంచెలోంచి వచ్చిన కథలు, అంతకంటే మౌలికంగా విశాఖపట్టణం దగ్గరి అనకాపల్లి అనే వూళ్లో వుంటే వొక మధ్యతరగతి వ్యక్తి బాల్య ప్రజ్ఞాపకాల దొంతరలు. పట్టుమని అయిదారు పేజీలకు మించని కథలే వున్న యీ సంపుటంలో చిత్రంగా, వూహించ రీతిలో, (238వ పేజీ నుంచి దాదాపు 57 పేజీల నిడివుండే) పెద్ద కథ వొకటుంది. దాని పేరు ‘అప్పికట్ల వారి వీధి’. ఆ కథ చదువుతున్నంత సేపూ నాకు ముళ్లప్పూ

    వెంకటరమణ గారి ‘జనతా ఎక్స్ ప్రెస్’ కథే గుర్తుకొచ్చింది. ముళ్లపూడి గా బాపూగారనే గొప్ప స్నేహితుడుండేవారు. ఆయన తన స్నేహితుని కథలకు యిం ముబ్బడిగా బొమ్మలేసి పెట్టేవాడు. ‘జనతా ఎక్స్ ప్రెస్’ అనే ఆ పెద్ద కథ నా

    ండా…………

    320.00
    Add to cart
  • Chandamama Kathalu- 8 (1969- 2012 Madhyalo Vachina Kathalu Sachitramgaa)

    Chandamama Kathalu- 8 (1969- 2012 Madhyalo Vachina Kathalu Sachitramgaa)

    శేషపతి అనే ఆయన పనిమీద అడవి అవతల ఉన్న ఒక గ్రామానికి వెళ్ళాడు. అతనికి అడవిదారి తెలియదు. కాని ఆ గ్రామానికి చెందిన ఒక మనిషి శేషపతిని వెంట తీసుకువెళ్ళి, అక్కడే దిగపడిపోయాడు. అందుచేత వెళ్ళిన పని పూర్తికాగానే శేషపతి ఒంటరిగా తన స్వగ్రామానికి బయలుదేరవలసి వచ్చింది. ఆయన అడవిలో దారి తప్పి, అదృష్టవశాన, చీకటిపడే వేళకు ఏదో గ్రామం చేరాడు.

    ఆ ఊరు కొండ కింద ఉన్న ఒక చిన్నగ్రామం ఊరి మొదట్లోనే ఒక పెద్ద పాతకాలపు భవనం ఉన్నది. సింహద్వారపు తలుపులకు నగిషీలున్నాయి. శ్లేషపతి తలుపుమీద బాదగానే, లోపలి నుంచి ఒక వృద్ధుడు వచ్చి తలుపు తీశాడు.

    “మా ఊరు పోతూ దారి తప్పాను. ఈరాత్రికి మీ ఇంట ఆశ్రయం ఇయ్యగలరా ?” అని ఆ వృద్ధుణ్ణి శేషపతి అడిగాడు.

    వృద్ధుడు శేషపతిని పరిశీలనగా చూసి, “నువు సాంబశివుడి కొడుకువు కాదూ ? మీది పలానా ఊరు కాదూ ?” అని అడిగాడు.

    శేషపతి నిర్ఘాంతపోయి, “అవును, మా విషయాలు మీకు ఎలా తెలుసు ?” అని వృద్ధుణ్ణి అడిగాడు.

    “నేనూ, మీ నాయనా బాల్యమిత్రులం. పెళ్ళికాగానే నేను ఈ ఊరు ఇల్లరికం వచ్చేశాను. అప్పట్లో సాంబశివుడు అచ్చగా నీలాగే ఉండేవాడు. నిన్ను చూస్తూంటే అతన్ని చూస్తున్నట్టే ఉన్నది. రేపు పండగ ! సరదాగా గడిపి మరీ వెళుదువు గాని!” అంటూ వృద్ధుడు శేషపతిని ఆదరంతో లోపలికి తీసుకుపోయి, తన భార్యకూ,

    పిల్లలకూ పరిచయం చేశాడు. తరవాత శేషపతి స్నానం చేసి, భోజనం చేసి, ప్రయాణపు బడలికవల్ల నిద్ర ముంచుకు వస్తూంటే తనకోసం వృద్ధుడు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గదిలో, పెద్ద పట్టెమంచం మీద పడుకుని, వెంటనే నిద్రపోయాడు.

    ఒక రా త్రివేళ ఏదో అలికిడి అయి శేషపతికి మెలకువ వచ్చింది. ఇంటినిండా మనుషులు మసులుతున్నట్టు తోచింది. పిండివంటల వాసన వస్తున్నది. శేషపతి ఆశ్చర్యపోతూ, తన గదిలో నుంచి ఇవతలికి వచ్చాడు. మరొకగదిలో వృద్ధుడూ, ఆయన భార్యా,

    పిల్లలూ గాఢనిద్రలో ఉన్నారు. మిగిలిన ఇల్లంతా హడావుడిగా ఉన్నది. ఇంటినిండా జనం ! కొందరు బూజు దులుపుతున్నారు. కొందరు ఊడుస్తున్నారు. కొందరు ఇల్లు కడుగుతూ పోతున్నారు. కొందరు ఎక్కడి నుంచో బరువైన

    400.00
    Add to cart
  • Chantabbai

    Chantabbai

    తెనాలి రామకృష్ణ.
    షెర్లాక్ హోమ్స్.
    సాహిత్యంలో వీళ్ళద్దరి లక్షణాలని కలిపితే వచ్చే పాత్రే ఏకదంతం. డిటెక్టీవ్ యుగంధర్ ఏకలవ్య శిష్యుడైన ఏకదంతానికి, చాల ఏళ్ళ క్రితం దత్తత కెళ్ళిన చెంటబ్బాయ్ ని వెదికే పని అప్పగించబడింది.
    ఆ అన్వేషణ చుట్టూ జరిగే అనేక సంఘటనలు, పాత్రలతో అల్లిన “చంటబ్బాయ్” నవల ఉత్కంఠంతో సాగుతుంది. హాయిగా నవ్విస్తుంది.
    సస్పెన్స్. హాస్యం మిళితమైన “చంటబ్బాయ్” చిరంజీవి హీరోగా సినిమాగా కూడా వచ్చింది .
    స్టోరీ టెల్ లో శ్రవణనవలగా కూడా రూపొందింది.
    నలభై ఏళ్ళ క్రితం ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన “చెంటబ్బాయ్:” ఈ నాటికీ పాఠకులని అలరిస్తోంది.

    230.00
    Add to cart
  • Cherabanda Raju Sahitya Sarvaswam 1 & 2

    Cherabanda Raju Sahitya Sarvaswam 1 & 2

    సంపాదకుడి మాట

    మార్గదర్శి అల్లం రాజయ్య

    ప్రపంచ వ్యాపితంగా సామ్రాజ్యవాదం పూర్తిగా విస్తరించి – తను ఆర్థిక మాంద్యంలో కూరుకపోయి స్థానిక ఉత్పత్తి శక్తుల మీద – ఉత్పత్తి సంబంధాల మీద తీవ్రమైన ప్రభావం చూపిన కాలమది. అన్ని దేశాలల్లో దోపిడీ, హింసా, నిరుద్యోగం పెరిగిపోయాయి. వాటికి కారణాలేమిటో తెలియని ప్రజలు తీవ్రమైన భావోద్వేగాలకు లోనయ్యారు. కోపోద్రిక్తమైన యువకులు, విద్యార్థులు పారిన్లో తిరుగుబాటు చేశారు. హెచిమిన్ నాయకత్వంలో క్రూరమైన జిత్తులమారి అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వియత్నాం ప్రజలు పోరాటం పతాకస్థాయికి చేరింది. అది రష్యా సోషల్ సామ్రాజ్యవాదంగా రూపొందుతున్న కాలం. చైనాలో కొత్తగా రూపొందుతున్న పెట్టుబడిదారీవర్గానికి వ్యతిరేకంగా మావో సాంస్కృతిక విప్లవానికి పిలుపునిచ్చిన కాలం.. ఇలా ప్రపంచవ్యాపితంగా పెను సంచలనాలు – యుద్ధాలు చెలరేగుతున్న కాలం అది.

    మన దేశంలో నెహ్రూ మార్కు బూటకపు సోషలిజం విఫలమయ్యింది. భారత కమ్యూనిస్టు పార్టీ దేశంలోని వైరుధ్యాలను అర్థం చేసుకోలేక పోరాడే ప్రజలకు నాయకత్వం వహించే చారవ కోల్పోయింది. వర్గపోరాటం సానే వర్గ సామరస్యం వల్లిస్తూ రివిజనిజంలో కూరుకుపోయి రెండుగా చిలింది. దేశం జాతుల బందీభానాగా, ఉత్పతి శక్తుల బందిఖానాగా మారింది. గ్రామాలు సుదీర్ఘ కాలం కులాల కాన్సంట్రేషన్ క్యాంపులుగా మారి ఉత్పత్తి శక్తుల వికాసానికి ఆటంకమయ్యాయి. సంతో దాదో రేవో తేలుకొని పోరాడవలసి వచ్చింది. ఈ పోరాటాలన్నిట్లో సరైన నిర్మాణం, నాయకత్వం లేక వేలాది మంది విద్యార్థులు కదం తొక్కుతున్న కాలం అది.

    అలాంటి గడ్డుకాలంలో తెలంగాణా సాయుధ పోరాటం జరిగి(1948-51) నాయకత్వ హం వలన విరమించబడిన నేపథ్యం గల నల్గొండ జిల్లాలోని అంకుశాపురంలో బద్దం

    హ 1944లో పడి గాయాల నొప్పుల నీతిలో బాల్యం గడిపాడు. సంవత్సరం లో ఆంధ్ర మహాసభ అతివాద, మితవాద గ్రూపులుగా చిలింది. ఆయన బాల్యం రక్తసిక్త

    సాయుధ పోరాటం అతలాకుతలంతో గడిచింది. అయిదవ తరగతి నాటికి బాల తహ పేరు స్కూల్లో భాస్కరరెడ్డిగా మారింది. ఇలాంటి ఒత్తిడి చిత్తడిలో కౌమారపు స్వేచ్ఛా

    లలు గన్నారు. పలవరింతల మధ్య కవిత్వం ఓదార్చింది. కవిత్వం పూనిన తరువాత పెట్టు తప్పింది. ఈ గడబిడల మధ్యనే పదహారో ఏట శ్యామలతో పెండ్లి జరిగింది. – రైతు కుటుంబంలో శ్యామల వ్యవసాయ పనుల్లో గొడ్డు చాకిరీలో ఉండగా భాస్కర్ రెడ్డి………….

    1,000.00
    Add to cart
  • Chitra Veena

    Chitra Veena

    మనసు మీటిన “చిత్రవీణ”

    ఉరుదూ ముషాయిరాల్లో కొందరు గజలను “తరన్నుమ్” (రాగయుక్తం) గానూ, మరికొందరు “తహెత్” (రాగం లేకుండా) గానూ వినిపిస్తారు.

    గజల్ ప్రధానంగా గాన ప్రక్రియకు చెందినదే అయిననూ, ఎవరికి వారు రాగరహితంగానూ చదువుకుని ఆనందించవచ్చును. దేని సౌందర్యం దానిదే.

    హైదరాబాద్కు చెందిన ఉస్తాద్ (నజీర్ అలీ ఆదిల్ గారు)… తన గజళ్ళను తహెత్ (రాగంలేకుండా) గా వినిపించేవారు. అప్పట్లో వారి ముషాయిరాలకూ జనం కోకొల్లలుగా ఉపస్థితి అయ్యేవారు. అమితంగా ఆనందించేవారు కూడా..

    ఇప్పుడిది ఇక్కడ ఎందుకు ప్రస్తావించవలసి వచ్చిందీ అంటే, కవయిత్రి విజయ గోలి గారి “చిత్రవీణ” గజళ్ళలో అటు “తరున్నుమ్” లోనూ, ఇటు “తహెత్”లోనూ ఎలా వినిపించిననూ శ్రోతల హృదయాలను అకట్టుకోగలిగే గజళ్ళు పుష్కలంగా వున్నాయని చెప్పడానికే. ఈ క్రింది గజలను చదవండి

    “మనసెందుకు గమ్మత్తుగ గగనవీథి తేలుతుంది ! ఏమైనదో తెలియకుంది ఎద చప్పుడు పెరుగుతుంది ! కనుపాపల లాలిపాడ కరుణించదు నిదుర తల్లి కలలలోన రూపమేదొ అలలాగే కదులుతుంది ! నీలిమబ్బు ఛాయలలో జారుకురుల దోబూచుల అల్లరేదొ తీగలాగ అల్లుకుంటు నవ్వుతుంది !

    200.00
    Add to cart
  • Divine Comedy

    Divine Comedy

    ది హాస్య నవల. గతంలో వెలువడ్డ “కల్నల్ ఏకలింగం ఎడ్వెంచర్స్. మిస్టర్ వీరియం, సుందరి సుబ్రావ్” కామెడీ నవలల్లా ఇది జోక్స్ తో కూర్చబడ్డ నవల. అక్కడక్కడ చదివితే దేవుడు, మతాలు, ఆలయాలు, ప్రవాచనాలు, తీర్ధయాత్రలు లాంటి దేవుడికి సంబంధించిన జోక్స్ బుక్ చదివినట్లుంటుంది. వరసగా చదివితే మిస్టర్ శఠగోపం జీవిత కథని చదువుతారు.
    “డివైన్ కామెడీ” నవల కోసం ఆంధ్రుల అభిమాన రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి వెయ్యికి పైగా ఇలాంటి జోక్స్ ని సేకరించి అందిస్తున్న నవల ఇది. మీరు నాస్తికులైనా లేదా ఆస్తికులైనా ఈ నవల మీకు తృప్తినిస్తుంది.

    290.00
    Add to cart
  • Dooram

    Dooram

    రచయితది హైద్రాబాద్. అభిమాన పాఠకురాలిది వైజాగ్.
    వ్యక్తిగత సమాచార మార్పిడికి ఉత్తరాలే ప్రధాన ఆధారమైన సంవత్సరం అది. 1976.

    అభిమాని, రచయితల మధ్య ఆరంభమైన ఉత్తరాలు చివరికి వారి పెళ్ళికి ఎలా దారి తీసాయి? ఆ ఉత్తరాల్లో ఏం రాసుకున్నారు?

    ఒకరితో మరొకరికి ముఖపరిచయం కూడా లేని వారి సంబంధం పెళ్ళి దాకా ఎలా వెళ్ళింది?.

    ఈ ప్రేమ నవలంతా కేవలం ఉత్తరాల ద్వారానే నడవడం విశేషం.

    ఆంధ్రభూమి వీక్లీకి మీ అభిమాన రచయిత మల్లాది తొలుత రాసిన ఈ రొమాంటిక్ సస్పెన్స్ సీరియల్ ద్వారా పాఠకులని ఆకట్టుకుని తర్వాత ధర్మయుద్ధం, ఈ గంట గడిస్తే చాలు లాంటి ఎన్నో నవలలని అందించారు.

    షరా : ఇతరుల ఉత్తరాలు చదవడంలోని ఆనందం, వాటికి సమాధానాలు ఇవ్వనవసరం లేదు.

    ఈ నవలతో పాటు మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ఒకటి ఒంటరి అంకె అనే నవల కూడా ఉంది.

    చదవండి! చదివించండి!!

    230.00
    Add to cart