-
Aalochinchu – ఆలోచించు
₹50.00‘ఆలోచించుకో, నిన్ను నువ్వు తరచి ప్రశ్నించుకో, భగవంతుడు ఉన్నాడూ లేడు, అతనిలో నమ్మకం ఉంది, లేదు – ఇదికాదు ముఖ్యం. నీకు మంచితనంలో నమ్మకం ఉందా?”
‘భగవంతుని ప్రతీక మంచితనం. అయితే మంచి అనే దాని నిర్వచనం ఏమిటి? నీకు మంచిది అనిపించిది యితరులకు మంచి కాకపోవచ్చు. అది వారికి చెడుగా పరిణమించవచ్చు.”
”అందుకనే ప్రతీదానికీ కారణం వెతకమంటాను. ప్రతి పనికీ వెనుక కారణం ఉంటుంది. ప్రతి బాధకూ, ప్రతి దు:ఖానికీ ఎక్కడో ఒకచోట కారణం ఉంటుంది. ప్రతి రుగ్మతకీ కారణం వెదకి మందువేసినట్లే మన బాధలు ఏ కారణం వల్ల మొలకెత్తాయో – ఎక్కడ పుట్టాయో తెలుసుకోవాలి., అందుకనే ఆలోచించమంటున్నాను’ స్వామీజీ లలితతో అన్న మాటలివి.
ఏమని ఆలోచించాలి? ఏం అర్ధం చేసుకోవాలి? తనే ఇటువంటి పనిచేస్తే అతను అర్ధం చేసుకుంటాడా? ఏ భర్తా ఇటువంటి సందర్భాల్లో భార్యని అర్థం చేసుకున్నట్లు తను వినలేదు. అన్ని కావ్యాల్లో, అన్ని నవలల్లో – పురుషుడు స్త్రీని అర్ధం చేసుకోమని, మరో స్త్రీతో తనని పంచుకొమ్మని భార్యని కోరాడే తప్ప ఇటువంటి కోర్కె ఏ భార్యా భర్తని కోరలేదు.
స్త్రీ అబల! ఎందుకని? పవిత్రత, పాతివ్రత్యం, ప్రకృతి – యిలా ఎన్నో కారణాలు చెబుతారు. ప్రతీసారీ స్త్రీని సహించు. సహనం కోల్పోకు, అర్ధం చేసుకో అంటూ అడుగుతారు. తానెందుకు అర్ధం చేసుకోవాలి?
స్త్రీ పురుష ప్రకృతులను ఢీకొని చేసి మిమ్ములను ఆలోచింప చేసే నవల. ప్రతి స్త్రీ తప్పక చదవాలి. ఇది మాలతీచందూర్ అపూర్వసృష్టి.
-
Enni Metlekkina
₹150.00అతను పత్రికా సంపాదకుడు, రచయిత వ్యక్తిగత జీవితంలో సుఖం లేనివాడు. మొగుడు వదిలేసిన పెద్ద కూతురు, పోలియోతో కాళ్ళు చచ్చుబడ్డ చిన్నకూతురు. నాలుగు రోడ్ల కూడలిలో మరణించిన కొడుకు, కాలేజీ రోజుల నెచ్చెలి లీల… ఫ్రెంచ్ క్లాసులో పరిచయమైన శకుంతల… అతని తృప్తి నియ్యలేని భార్య సుభద్ర… వీరందరి మధ్య అతనికి జీవితంమీద అసంతృప్తి. ఏమిటి అతనిలోని లోపం? ఏమిటి అతని వ్యామోహం…
మాలతీ చందూర్ వ్రాసిన ప్రతి కధా, నవల, వ్యాసం, అన్నీ ఇంటింటికీ మామిడి తోరణాలై, మణిదిపాలై ప్రకాశిస్తుంటాయి, ఆమె కలం నుండి వెలువడిన మరో మణిపూస, “ఎన్ని మెట్లెక్కినా”.
– మాలతీ చందూర్
-
-
Hrudayanetri – హృదయనేత్రి
₹80.00‘గోపాలాన్ని – నా వెంట తీసుకెడతానురా తమ్ముడూ. వాడు బట్టలు సంచీలో పెట్టుకు ఏడుస్తున్నాడురా!” అంటూ తండ్రిని రాముడత్తయ్య అడగటం, తలుపు వెనకన నక్కి నిల్చుని వింటున్నాడు గోపాలం.
పొందూరు ఖద్దరు చీరె – గోచీపోసి ట్టుకుని, గుండ్రటి సిగమధ్యన రాళ్ళ చామంతి పువ్వు చుట్టుకున్న రాముడత్తయ్య అంటే గోపాలానికి ప్రాణం. రాముడత్తయ్య ‘వందేమాతరం’ అంటుంది. ఎవరో గాంధీగారుట, ఆయన్ని మహాత్ముడంటూ, ‘ఆ గాంధీగారు స్వరాజ్యం తెచ్చిపెడతాడు – తెల్లవాళ్ళందరిని తరిమి కొడతాడు’ అంటూ – రాత్రిళ్ళు పక్కన పడుకోపెట్టుకుని కథలు చెప్పే రాముడత్తయ్య, వూరికి వెళ్ళిపోతోందీ అంటే ఏడుపు వచ్చింది గోపాలానికి –
”నీతో నేనూ వచ్చేస్తాను” అంటూ సంచీలో చొక్కాలాగూ పెట్టుకుని, రాముడత్త కొంగు వదలకుండా తిరుగుతున్నాడు పదేళ్ళ గోపాలం.
రాముడత్తయ్య అని పిలవబడే రామలక్ష్మమ్మగారు ఆ యింటి పెద్దాడబడుచు. నలభై ఏళ్ళుపైన వుంటాయి. పిల్లలు లేరు. ఆవిడ గురించి – విడ్డూరంగా పెద్దవాళ్ళు చెప్పుకోవటం చాలాపార్లు వినివున్నాడు గోపాలం. తన తల్లి సుబ్బమ్మకి, ఒదినగారంటే భయం – పైకి ‘ఒదినగారూ’ అంటూ – గౌరవంగా పిలుస్తూ – భయభక్తులతో వున్నా! …. -
-
-
-
Vantalu Pindi Vantalu – వంటలు పిండి వంటలు
₹150.00మనం రోజూ తీసుకునే ఆహారంలో ఏవేని ఎలా ఉపయోగ పడుతున్నవి వివరించిన పుస్తకమిది. ఓ రకంగా ఇది వంటల పుస్తకమే కాదు వైద్య గ్రంథం కూడా.
లోగడ మూడు భాగాలుగా ప్రకటించబడిన ”వంటలు – పిండివంటలు” పుస్తకం పాఠకుల సౌకర్యం కోసం దరిమిలా రెండు భాగాలుగా ప్రకటించబడింది. ఇలా విడివిడి భాగాలకంటే అన్నీ కలిపి ఒకే సమగ్ర సంపుటంగా ఉంటే బాగుంటుందని చాలామంది పాఠకులు సూచించిన మీదట అన్నీ కలిపిన ‘కంబైన్డ్ ఎడిషన్’ ప్రచురిస్తున్నాము.
ఇంతవరకూ ఈ పుస్తకంలోని కొలతలు కొలమానాఉ పాత పద్ధతిలోనివి ఉండేవి. ఇప్పుడే తరం పాఠకులకు ఆ కొలతలు తెలియనందున, ఇప్పటి పాఠకుల కోసం అన్నీ కొత్త కొలతలు కొలమానాలివ్వడం జరిగింది. కొలతల్లో చేర్పులు మార్పులు తప్ప ఐటమ్స్ అన్నీ మామూలుగానే ఉన్నవి.
ఇప్పుడు ఈ పుస్తకంలో మరో విశేషం. వంటల్లో వాడే ప్రతి కూర, వస్తువు గురించి, అది మనకెలా ఉపయోగపడుతున్నదీ వివరించారు. శరీర నిర్మాణానికి, అభివృద్ధికి, మనో వికాసానికి, తేజస్సుకు – మన శరీర ఉష్ణోగ్రతను సమంగా వుంచడానికి మనం రోజూ తీసుకునే ఆహారంలో ఏవేవి ఎలా ఉపయోగపడుతున్నవీ వివరించారు. ఓ రకంగా యిది ‘వంటల పుస్తక’మే కాదు – ‘వైద్య గ్రంథం’ కూడా! ఇలాంటి పుస్తకం యింతవరకూ తెలుగులో రాలేదు. ప్రతిఒక్కరూ ఒక్కసారి చదివి తెలుసుకోవలసిన విషయాలెన్నో యిందున్నవి. ప్రతి ఇంటా తప్పక ఉండదగిన పుస్తకం. -
Yedi Gamyam Yedi Maargam – ఏది గమ్యం? ఏది మార్గం?
₹50.00మేరీని పెళ్ళి చేసుకుంటానని విశ్వనాథం తల్లిదండ్రులకు చెప్పేసరికి వాళ్ళెంత దెబ్బలాడారో – యీ నిశ్చయం విన్నాక అంతకు పదిరెట్టు పేచీపెట్టారు మేరీ తరపు వాళ్ళు. విశ్వనాథం – మేరీ యీద్దరూ థర్డ్ యమ్.జి.లో వుండగా – తమ స్నేహం మామూలు స్నేహం కాదని, ఇది ప్రేమ భావమనీ గ్రహించుకున్నారు. అయితే వీరి కుటుంబాలు రెండూ ఉత్తర దక్షిణ ధ్రువాలు. అవి కలవడమన్నది కలలోని వార్త అని తెలుసుకుని రెండు వైపులవారినీ ఎదరించి పెళ్ళి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు.
విశ్వనాథం ఆంధ్ర శ్రోతియ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. తెల్లగా, బక్కపలచగా, ఆకర్షణీయంగా ఉంటాడు. నలుగురు అన్నదమ్ముల్లో రెండో వాడు. పెళ్ళిగావలసిన యిద్దరు చెల్లెళ్ళూ తమ్ముళ్ళూ వున్నారు. బస్తీగాక, పల్లెటూరూ గాక మధ్యస్తమైన ఊరు వాళ్ళది. అది ఒక జమీందారిలోది. ఆ ఊళ్ళో నాలుగైదు భవంతులు జమీందారులవి వున్నాయి. కోట గుమ్మాలూ, విశాలమైన లోగిళ్ళూను. జమీందారీపై ఆధారపడ్డ కుటుంబాలూ, ఆ ఎస్టేట్లలో పనిచేస్తున్నవారి కుటుంబాలూ ఎక్కువ. ఆ ఊళ్ళో, విశ్వనాథం పూర్వీకులంతా ప్రభువు ప్రాపకంలో గడిపారు. తేనె తుట్టెలాగా తల్లివైపు – తండ్రివైపు బంధులవి పది పదిహేను కుటుంబాలున్నాయి స్వంత వూళ్ళోనే. అతని బంధువులందరిలోకి – వీళ్ళే కొంచెం సంపన్నులూ, చదువుకొన్నవారూను. విశ్వనాథం అన్నగారు రామ్మూర్తి హైస్కూల్లో హిస్టరీ టీచరు. ఆయనకి ఇద్దరు పిల్లలు. పెద్ద చదువులు చదివిన విశ్వనాథం – తమ వంశానికి గౌరవం, ఇంటికి ధనం తెస్తాడని ఆశపడ్డ తండ్రి కలలు కల్లలయాయి……