• Agnipatham_Mattimanushulu

    Agnipatham_Mattimanushulu

    విభిన్న ఇతివృత్తాలతో విలక్షణ నవలలు

    కథారచయితగా ‘పాలపిట్ట’ పాఠకులకు సుపరిచితులైన గన్నవరపు నరసింహమూర్తి రాసిన రెండు నవలలు ఇవి. పోలీస్ వ్యవస్థలో నిజాయితీగా పని చేయడానికి పూనుకున్న ఒక యువ ఐపిఎస్ అధికారి ఎదుర్కొన్న సవాళ్ళను, రాజకీయ వ్యవస్థ ఒత్తిళ్ళను అధిగమించి నిజాయితీగా పని చేసిన తీరును ‘అగ్నిపథం’ నవల ఆవిష్కరించింది. నీతి, నిజాయితీ, చట్టాన్ని అమలు చేసే పట్టుదల గల పోలీసు అధికారులు ఉన్నపుడు పోలీస్ వ్యవస్థ విశ్వసనీయత ఇనుమడిస్తుంది. ఈ విషయాన్ని సాధికారికంగా నిరూపించిందీ నవల. ఆద్యంతం ఆసక్తికరమైన కథనంతో నడిచింది. ఉత్తరాంధ్ర అటవీ ప్రాంతంలోని ప్రకృతినీ, పరిస్థితులనీ, సమస్యలనీ బలంగా చిత్రించిన నవల ఇది. ప్రజలకు సేవ చేయడానికి అంకితమై పనిచేసే అధికారులు జనానికీ, సమాజానికి ఎన్నివిధాల మేలు చేసే అవకాశం ఉన్నదో ఈ నవల చదివితే బోధపడుతుంది.

    ఉత్తరాంధ్రలోని వ్యవసాయిక పరిస్థితులను, నీటి ప్రాజెక్టుల కోసం ఆందోళనలని చిత్రించిన నవల ‘మట్టిమనుషులు’. అంతేగాక తన ఊరి ప్రజల కోసం తపించే ఓ ఐఐటి చదువుకున్న యువకుడి జీవనగమనం భూమికగా రూపుదిద్దుకున్న నవల ఇది. వ్యవసాయరంగం సంక్షోభరహితంగా ఉండాలంటే ఏం చేయాలో ఈ నవలలో రచయిత చర్చించారు. అలాగే పల్లెల నుంచి వలసలు ఆగిపోవాలంటే స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలో బాగా చెప్పారు. ముఖ్యంగా మానవ సంబంధాల ప్రాముఖ్యాన్ని ఆరంగా చిత్రించారు రచయిత. ఈకాలాన అమెరికాకు తరలిపోవడమే లక్ష్యంగా ఉన్నత చదువుల్లో చేరుతున్నారు. దీనికి భిన్నంగా తన గ్రామం కోసం, అక్కడి ప్రజల కోసం, నీటివసతుల కలువ కోసం ఓ యువకుని తపనని, కృషిని దృశ్యమానం చేసిన నవల ‘మట్టిమనుషులు, ఈ నవలా పఠనం ఉదాత్త అనుభవం. ముఖ్యంగా సన్నివేశాల కల్పన, సంబాపణలు సహజంగా ఉన్నాయి. గన్నవరపు నరసింహమూర్తి కథనశైలిలోని ప్రత్యేకత…………

    150.00
    Add to cart
  • Aksharabhyasam

    Aksharabhyasam

    అక్షరాభ్యాసం

    ఆ రోజు నేను స్కూల్లో పాఠం చెబుతున్నప్పుడు నా స్నేహితుడు పద్మనాభం ఫోన్ చేసి శనివారం నాడు తన కొడుక్కి అక్షరాభ్యాసం చేయిస్తున్నాననీ, నన్ను తప్పక రమ్మని చెప్పాడు.

    నేను, పద్మనాభం చిన్నప్పట్నించీ ఒకే ఊరిలో పెరిగాం. ఒకే స్కూల్లో చదువుకున్నాం. ఇద్దరం బీఈడీ చేసాం. నేను పట్నంలో మున్సిపల్ టీచరుగా ఉద్యోగం చేస్తుంటే, వాడు మా ఊరి స్కూల్లోనే టీచర్ గా పని చేస్తున్నాడు. వాళ్ల నాన్న పాతికెకరాల భూస్వామి కావడంతో రాజకీయ పలుకుబడి ఉపయోగించి మా ఊళ్లోనే పోస్టింగ్ వేయించుకున్నాడు.

    – పద్మనాభం ఓ పక్క టీచరు ఉద్యోగం చేస్తూనే ఇంకో పక్క వ్యవసాయం కూడా చేస్తుంటాడు.

    వాడికి ఆరేళ్ల క్రితం పెళ్ళైంది. వాడెందుకో ముప్పై ఏళ్ల తరువాత పెళ్ళి

    చేసుకున్నాడు.

    నేను మా నాన్నగారి దగ్గర స్మార్తం నేర్చుకున్నాను. మా నాన్న గారు మా ఊరి పురోహితుడు. ముందు నన్ను చదివించనన్నారు. నేను చదువుకుంటానని పట్టుపట్టడంతో తప్పక నన్ను చదివించారు.

    కానీ కులవృత్తి అని స్మార్తం నేర్పించారు. రెండేళ్ల క్రితం నాన్నగారు చనిపోవడంతో ఊరికి పురోహితుడు లేకుండా పోయాడు. అందుకే ఈ రోజు పద్మనాభం నన్ను పిలిచాడు.. నేనైతే రెండు విధాలుగా ఉపయోగపడతాననీ వాడి ఆశ. |

    ఈ విషయం నాకు చాలా రోజుల నుంచీ వాడు చెబుతున్నాడు. వాడి కొడుకు అక్షరాభ్యాసం నేనే చేయించాలనీ.

    నేను శుక్రవారం రాత్రి బయలుదేరి ఆఖరి బస్సుకి మా ఊరు వెళ్లాను.

    150.00
    Add to cart