-
Vismrutha Yatrikudu
₹280.00రాహుల్ సాంకృత్యాయన్ అంతర్జాతీయ విఖ్యాతి పొందిన పాళీ, సంస్కృత భాషా పండితుడు. గొప్ప చరిత్రకారుడు, కార్యశూరుడు, సుమారు 10 సంవత్సరాలు సుదీర్ఘ కాలాన్ని స్వాతంత్ర్య యోధులుగా కారాగారాల్లో గడిపిన త్యాగమూర్తి. లెనిన్ గ్రాడ్ విశ్వవిద్యాలయంలో ప్రాచ్య భాషా బోధకుడుగా పనిచేసి ఖ్యాతినొందిన సుప్రసిద్ధ భారతీయుడు. హిందూ సన్యాసిగా, ఆర్యసమాజకునిగా, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బౌద్ధబిక్షువుగా ఈయన పేరు పొందారు. వీరు చేసిన భాషాసేవకు కాశీ పండితులు వీరిని “మహాపండిత్” బిరుదుతో గౌరవించారు. బౌద్ధవేదములు మూడింటిలోను ఈయన నిధి.
అందువల్ల బౌద్ధ విజ్ఞానులు ఈయనకు “త్రిపీఠకాచార్య” బిరుదుని ఇచ్చారు. రాహుల్ జీ సాగించిన పరిశోధనలు భారత సంస్కృతిని 600 సంవత్సరాలు చరిత్రలో సుసంపన్నం చేశాయి. వీరి రచనలు హిందీ భాషకు 400 సంవత్సరాల చరిత్రను చేర్చాయి. వాటిలో హెచ్చువాటిని జైళ్ళలోను లేక నేపాల్. టిబెట్, సిలోన్ లలో రచించారు. వివిధ భాషలలో వీరి గ్రంథాలు 60కి పైగా ఉంటాయి. తెలుగు పాఠకులకు సుపరిచితమైన “విస్మృత యాత్రికుడు” రచనను 1953 సంవత్సరంలో రాశారు.
-
Simhaavalokanam – సింహావలోకనం
₹120.00సింహావలోకనం – మూలం : యశ్పాల్, అనువాదం : ఆలూరి భుజంగరావు
సింహావలోకనం …. ఈ దేశ ప్రజలకు మానవోచితమైన జీవితాన్ని – జీవనాన్ని, స్వేచ్ఛా – స్వాతంత్య్రాలనూ సమకూర్చడం కోసం నిరంతరం సంఘర్షపథంలో రక్తతర్పణం గావిస్తూ విప్లవాన్ని ఆవాహనం చేస్తున్నాం! – యశ్పాల్
ప్రజల జీవితాన్ని, జీవనాన్ని – కలుషితం చేస్తూ, పాలకవర్గాలు, వారి తొత్తులూ దోపిడి, అణచివేతల్నూ, నిరంతర హత్యల్నూ, దొంగ ఎదురు కాల్పుల్నూ సాగిస్తూ విప్లవ పోరాటాల్ను రక్తపుటేరుల్లో ముంచడంతోపాటు వంచనా శిల్పంతో ప్రజల మేధస్సులు విభ్రమింప చేయ ప్రయత్నిస్తున్నంత కాలం ఈ దేశానికి – సింహావలోకనం – ప్రాసంగికమే. – ఆలూరి భుజంగరావు