-
Cancer Code
₹150.00కెనడా దేశస్తుడైన డా॥ ఫంగ్ కిడ్ని వైద్య నిపుణులు. ఒబేసిటీ, డయాబెటిస్, ఫాస్టింగ్లపై ఆయన రాసిన పుస్తకాల ద్వారా సాంప్రదాయ వైద్యంపై
గొప్ప తిరుగుబాటు చేశారు. జర్మనీకి చెందిన హెన్రిచ్ వార్నర్ (1888-1970) ఒక భౌతిక శాస్త్రవేత. ఆయన కణాలు శక్తిని ఎలా తయారు చేసుకుంటున్నాయన్న అంశంపై విస్తృత అధ్యయనం చేశాడు. జీవశాస్త్రానికి భౌతిక, రసాయన శాస్త్రాలను జోడించాడు. సాధారణ కణాలకు, కాన్సరు కణాలకు జీవక్రియలలో గల తేడాలను గుర్తించాడు.. జీవశాస్త్ర పరిణామ వాద కోణం నుండి ఈ సమస్యను పరిశోధించారు.
అపుడు కాన్నరు మెట్లు మెట్లుగా ఎదగడం లేదని, పెరుగుదల, చొరబాటు, వ్యాప్తి వంటివి దశలవారీగా జరగడం లేదని అర్థమైంది. శరీరంలో కాన్సరు కొంతకాలం పాటు పెరిగాక మాత్రమే వ్యాప్తి చెందగలదన్న భావన తప్పు అని తేలింది. ఆరంభం నుండే వ్యాప్తి కూడా కాన్సరు లక్షణంగా గుర్తించారు.దశలవారీగా పెరుగుదల వుండి వుంటే కాన్సరుకు చికిత్స సులువయి ఉండేది. కాన్సరు వచ్చిన భాగాన్ని సర్జరీ చేసి తొలగిస్తే అది అక్కడికి నిలిచి ఉండాలి. కానీ కాన్సరు వచ్చినట్లు గుర్తించేనాటికే ఆ కణాలు ఇతర శరీర భాగాల్లోకి చేరుతున్నట్లు బయటపడింది.
మమ్మోగ్రఫి పరీక్ష చేసే 10 మందిలో ఒకరికి మాత్రమే కాన్సరు పాజిటివ్ అన్న ఫలితం వస్తుంది. అలా పాజిటివ్ గా తేలిన వాళ్ళలో నూటికి 5 మందికే కాన్సరు వుంది. 95 మందిలో అవసరం లేకున్నా ఆ పరీక్షకు కొనసాగింపుగా మళ్ళీ బయాప్సీ పరీక్షలు, గడ్డల సర్జరీ, కొందరికి కీమోథెరపీలు కూడా చేస్తున్నారు. ఎక్కువ మందిలో రొమ్మును మొత్తంగా తొలగించడం (Mastectomy), రేడియేషన్ ఇస్తున్నారు. అమెరికాలో తీసిన లెక్కలలో పాజిటివ్ ఫలితం వచ్చిన వాటిలో 30 నుండి 50 శాతం తప్పు రిపోర్టులని తేలింది. దీనితో పాటు మమ్మోగ్రఫీ అయ్యాక పెరిగే మానసిక, శారీరక వ్యధలవల్ల జీవితపు నాణ్యత తగ్గిపోతుంది.
35 శాతం కాన్సర్లు పోషకాహారంతో ముడిపడి ఉంటాయి. కాన్సరుకు పొగాకు తర్వాత రెండో కారణం ఆహార లభ్యతే. అదనపు బరువు కాన్సరును తెచ్చిపెట్టే అంశం అని చెప్పుకున్నాం. అనేక రకాల కాన్సర్లు తగ్గుముఖంలో ఉన్నప్పటికీ, ఊబకాయ సంబంధ కాన్సర్లు సోకడం పెరుగుతోంది. అందువల్ల వాటి నివారణ కోసం ఆహారపరమైన వ్యూహాలు రూపొందించుకోవలసిందేనంటాడు జాసన్ఫంగ్.
కాన్సరు రాకుండా అద్భుతాలు సృష్టించగల ఆహారాలేమీ లేవు. అయితే ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇన్సులిన్ అధికం కావడం వల్ల వస్తున్న ఊబకాయం, మధుమేహం-2లను నివారించగల వ్యూహమే కాన్సరుకూ పనికి వస్తుంది.
-
-
Ubakayam Baruvu Peragadam Venuka Unna Mulalu- Parishkaralu
₹100.00బరువు తగ్గాలన్న, ఆరోగ్యంగా జీవించాలన్నా ఆహారంలో కొవ్వులు, మాంసకృత్తులు సరైన పాళ్లలో వుండాలి. పిండి పదార్ధాలను 10 నుండి 20 శాతానికి పరిమితం చేసి, మాంసకృత్తులు 20 నుండి 40 శాతానికి, కొవ్వులను 60 శాతం రోజువారీ ఆహారంలో వుండేలా చూసుకోవాలి.
జంతుమూలాల నుండి వచ్చే మాంసకృత్తులు మంచివి. శరీరానికి కావలసిన అన్ని కొవ్వు అమలలు అందులో వుంటాయి. పాలు, పాల ఉత్పత్తులలో కూడా.
మన దేశ జనాభాలో ఊబకాయం వస్తున్నది ప్రధానంగా పిండిపదార్ధాలు ఎక్కువగా తినడం వల్లనే. కొవ్వులు తినడం వలన కాదు. నిజానికి తగుపాళ్లలో కొవ్వులు, ప్రోటీన్లు తీసుకుంటే అదనంగా శరీరంలో వున్న కొవ్వులు తగ్గుతాయి.
మన శరీరంలో ప్రతికోణం బ్రతకడానికి, పని చెయ్యడానికి కొలెస్ట్రాల్ ఎంతో అవసరం.
-డా|| జాసన్ ఫంగ్.
-
-
Vaaduka Telugu Padakosam
₹200.00తెలుగు భాషా పద నిఘంటువులు చాలా వచ్చాయి. వాటిలో కావ్యభాషకు పదజాలమే ఎక్కువగా లభిస్తుంది. ప్రత్యేక నిఘంటువులద్వారా, పదకోశాలద్వారా – పరిభాషా పదాలకూ, ప్రత్యేక పదాలకూ, వృత్తి పదాలకూ, పదబంధాలకూ అర్థాలు కూడా లభిస్తాయి. ఇలాంటి వాటిలో నానార్థ పదకోశాలు, పర్యాయపద పదకోశాలు, మాండలిక నిఘంటువులు, మాండలిక వృత్తి పదకోశాలు, పత్రికాభాషా పదకోశాలు చేరతాయి. ఈ పదకోశం ఆధునిక ప్రమాణ రూపాలను మాత్రమే గ్రహించింది. అంతేకాదు ఇతర నిఘంటువులలో సులభంగా లభ్యంకాని పర్షో అరబిక్ పదాలు, ఆంగ్ల పదాలు కొన్ని ఇందులో లభిస్తాయి. సమాచార రంగంలో వ్యాప్తిలో వున్న మరికొన్ని పదాలను కూడా చేర్చాము. ఇది ఒక తొలి ప్రయత్నం మాత్రమే. ఇంకా ప్రసార సాధనాల్లో నలిగిన చాలా అన్య దేశ్యాలనూ, సృజనాత్మక భాషలో కనిపించే మరెన్నో మాండలిక పదాలనూ నిఘంటువులలో మనం చేర్చుకోవలసిన అవసరం ఎంతో వుంది.
ఈ వాడుకతెలుగు పదకోశంలో దాదాపు 20,000 పదాలు ఉన్నాయి. తెలుగు భాషాభిమానుల సూచనలను అనుసరించి మలి ముద్రణలో ఈనాటి అవసరాలకు తగినట్లుగా మరిన్ని పదాలను ఈ కోశంలో చేర్చడానికి ప్రయత్నిస్తామని సవినయంగా మనవి. మా ఈ తొలి ప్రయత్నాన్ని సమాదరిస్తారని ఆశిస్తూ….
– ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి
-
Aahaaramae Aoushadham – ఆహారమే ఔషధం
₹150.00ఆరోగ్యం సహజమైంది. అనారోగ్యం అసహజమైంది. పోషకాహారంపై గల అవగాహనారాహిత్యమే అనారోగ్య కారణమని రచయిత నమ్మకం.
జన బాహుళ్యంలో ఆహారంపై అవగాహన పెంచటం ఆయన లక్ష్యం. ఆ లక్ష్యంతో వ్రాయబడినవే ఈ పరిశోధనాత్మక వ్యాసాలు. ఆహారమే ఔషధం. వ్యాధుల నివారణే ఆరోగ్య రహస్యం.
పేజీలు : 256
-
Aharam Manchi- Chedu
₹100.00నిత్య జీవితావసరాల కోసం రోజూ ఎంతో శ్రమిస్తూ మనం సంపాదించుకున్న విలువైన డబ్బును వెచ్చించి పౌష్టికాహారం పేరుతో విషాన్ని తినాల్సి/ తాగాల్సి రావడం ఈ శతాబ్దపు గొప్ప విషాదం. ఏ ఆహారం తింటే ఆరోగ్యం చేకూరుతుందో మనకు చెప్పాల్సిన బాధ్యతలున్న ప్రభుత్వ, ప్రజారోగ్య, వైద్య పత్రికా వ్యవస్థలన్నీ కేవలం తమ స్వార్ధం కోసం ఆహార రంగంలోని బహుళ జాతి కంపెనీల ప్రలోభాలకు లొంగి తినకూడనిది తినమని ప్రచారం చేస్తూ ప్రజల ఆరోగ్యానికి కీడు చేస్తున్నాయి. వీరందరూ కలిసి శాస్త్రీయత మాటున అశాస్త్రీయతను ప్రచారం చేస్తున్న ఫలితంగా సామాన్యులు రోగగ్రస్తం అవుతున్నారు. లాభార్జనే ధ్యేయంగా నడుస్తున్న వైద్య , ఆరోగ్య శాఖలూ/వ్యక్తులూ/ప్రజల రోగాలను, మరణాలను కూడా సొమ్ము చేసుకునే ఒక క్రూరమైన వ్వవస్థను ఆవిష్కరించారు.
-
Dyana Margam
₹299.00ప్రశ్న: ‘ధ్యానం’ అంటే ఏమిటి?
ఎం: ధ్యానం అనేది చాలా విస్తృతమైన భావన. ఇంగ్లీషులో ఉపయోగించే మెడిటేషన్ అనే పదం పతంజలి యోగ సూత్రాలలోని ధారణ, ధ్యాన, సమాధి అనే మూడు భాగాలను సూచిస్తుంది.
ధారణ అంటే సామర్థ్యం లేదా శక్తి, లేదా తమ మనస్సును ప్రత్యేకించి ఒకే ఆలోచనా ప్రవాహంలో కేంద్రీకరించేలా అభ్యాసం చేయడం. అది పరిపక్వం చెంది నిరంతర ప్రక్రియగా మారినప్పుడు ధారణ, ధ్యానంగా మారుతుంది. ధ్యానం కొంతకాలం పాటు కొనసాగిన తర్వాత కలిగే అనుభవం ద్వారా సమాధి అంటే ఏమిటో అర్థం అవుతుంది. చాలాసార్లు ఇలాంటి ప్రశ్న అడిగిన వ్యక్తి పద్ధతిని గురించి అడుగుతున్నారు.
ధ్యానానికి సంబంధించిన అభ్యాసాలన్నీ పతంజలి యోగ సూత్రాలలో పొందుపరచబడి ఉన్నాయి. ధ్యానం గురించి మనం చర్చించేటప్పుడు చెప్పుకుందాం. వాస్తవమైన అనుభవం అనేది కేవలం అభ్యాసంతోనే వస్తుంది. ఇది ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఉంటుంది. అయితే, మెళకువలను అభ్యసించడం అనేది మంచి ప్రారంభమే. సుదీర్ఘకాలం స్థిరంగా, నిరంతర సాధనగా పతంజలి ఈ వ్యాయామాన్ని వివరించారు. ఇదే నైరంతర్యాభ్యసేన’, దీర్ఘకాలే.
ఎలాంటి అంతరాయాలు లేకుండా చాలా కాలం పాటు కచ్చితంగా చేసినప్పుడు…………
-
Yoga Bala Shiksha
₹450.00యోగ బాలశిక్ష
గీతా సారాంశము
అయ్యిందేదో మంచికే అయింది. అవుతున్నదేదో అదీ మంచికే అవుతుంది. -అవ్వబోయేదేదో కూడా మంచికే అవుతోంది.
నీవేమి పోగొట్టుకున్నావని నీవు విచారిస్తున్నావ్? నీవేమి తెచ్చావని నీవు పోగొట్టుకుంటావ్?
నీవేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది. నీవు ఏదైతే పొందావో అవి ఇక్కడనుండే పొందావు. -ఏదైతే ఇచ్చావో ఇక్కడ నుంచే ఇచ్చావు. -ఈనాడు నీవు నీ సొంతం అనుకున్నదంతా,నిన్న ఇంకొకరి సొంతం దాచిపెట్టిన ధనం భూమి పాలు – అందమైన ఈ దేహం అగ్నిపాలు – అస్తికలన్నీ గంగపాలు ఈ జీవం యముని పాలు – కొడుకు వండిన కూడు కాకిపాలు మన వస్తువులన్నీ ఎవరి పాలో తాను చేసిన దానం, ధర్మం, పుణ్యం మాత్రం తన పాలు |
తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు అందరినీ మరిచినా నీ తల్లిదండ్రులను మరువ వద్దు. వాళ్ళను మించి మంచి కోరే వారూ ఉండరని తెలుసుకో… నువ్వు పుట్టాలని ఎన్నో పూజలు, త్యాగాలు చేశారు వారు, రాయివై వారి హృదయాలను ముక్కలు చేయవద్దు. కొసరి కొసరి గోరుముద్దలతో నిన్ను పెంచారు వారు, నీకు అమృతమిచ్చిన వారి పైన నువ్వు విషాన్ని విరచిమ్మవద్దు.. ముద్దు మురిపాలతో నీ కోర్కెలు తీర్చారు వారు, ఆ ప్రేమమూర్తుల కోరికలు నీవు నెరవేర్చాలని మరువవద్దు. నువ్వెన్ని కోట్లు సంపాదించినా అవి తల్లిదండ్రులకు సమానమౌతాయా? సేవాభావం లేకపోతే అంతా వ్యర్థమే, గర్వం పనికిరాదు. సంతానం వల్ల సుఖం కోరుతావు. నీ సంతాన ధర్మం మరువ వద్దు. ఎంత చేసుకుంటే అంత అనుభవించక తప్పదనే న్యాయం మరువవద్దు. నీవు తడిపిన పక్కలో వారు పడుకొని నిన్ను పొడిపొత్తుల్లో పడుకోబెట్టారు.
అమృతాన్ని కురిపించే అమ్మ కళ్ళలో అశ్రువులను నింపకు. .నీవు నడిచే దారిన పూలు వేసారు వారు, ముల్లువై వారిని బాధించకు.
డబ్బుపోతే మళ్ళీ సంపాదించవచ్చు, తల్లిదండ్రులను మాత్రం మళ్ళీ సంపాదించలేవు. తల్లి యొక్క గౌరవం భూమి కంటే మహత్తరమైనది, తండ్రి ఆకాశం కంటే గొప్పవాడు, వారి గొప్పతనం జీవితాంతం మరువవద్దు. తల్లిదండ్రులను, శాస్త్రములను, గురువులను, పెద్దలను, స్నేహితులను గౌరవించేవాడు అందరికి ఆదర్శవంతుడు కాగలడు.
-
Aharam Manchi- Chedu
₹100.00నిత్య జీవితావసరాల కోసం రోజూ ఎంతో శ్రమిస్తూ మనం సంపాదించుకున్న విలువైన డబ్బును వెచ్చించి పౌష్టికాహారం పేరుతో విషాన్ని తినాల్సి/ తాగాల్సి రావడం ఈ శతాబ్దపు గొప్ప విషాదం. ఏ ఆహారం తింటే ఆరోగ్యం చేకూరుతుందో మనకు చెప్పాల్సిన బాధ్యతలున్న ప్రభుత్వ, ప్రజారోగ్య, వైద్య పత్రికా వ్యవస్థలన్నీ కేవలం తమ స్వార్ధం కోసం ఆహార రంగంలోని బహుళ జాతి కంపెనీల ప్రలోభాలకు లొంగి తినకూడనిది తినమని ప్రచారం చేస్తూ ప్రజల ఆరోగ్యానికి కీడు చేస్తున్నాయి. వీరందరూ కలిసి శాస్త్రీయత మాటున అశాస్త్రీయతను ప్రచారం చేస్తున్న ఫలితంగా సామాన్యులు రోగగ్రస్తం అవుతున్నారు. లాభార్జనే ధ్యేయంగా నడుస్తున్న వైద్య , ఆరోగ్య శాఖలూ/వ్యక్తులూ/ప్రజల రోగాలను, మరణాలను కూడా సొమ్ము చేసుకునే ఒక క్రూరమైన వ్వవస్థను ఆవిష్కరించారు.