Showing 349–360 of 860 resultsSorted by latest

Ambedkar Jeevita Charitra

600.00

డా|| కత్తి పద్మారావు

  1. రాజ్యాంగ అభిభాషణ – డా|| బాబా సాహెబ్ అంబేడ్కర్ వ్యాసాలు – ఉపన్యాసాలు వాల్యూం – 17 మూడవ భాగం (అనువాదం-పీఠిక) వ్రాశాను. వ్రాసే క్రమంలో నేను అనేక గ్రంథాలు అధ్యయనం చేశాను. ఆ అధ్యయనం నుండి ఈ బృహత్తర గ్రంథ రూపకల్పన జరిగింది. ఈ గ్రంథాన్ని మొత్తంగా రెండు వేల పేజీలు వ్రాశాను. దీన్ని మూడు భాగాలుగా విభజించాను. మొదటి భాగం నా 69వ జన్మదినం జులై 2022కి తెస్తున్నాను. ఇది నా 78వ గ్రంథంలో నేను మొదటి చాప్టర్ లో అంబేడ్కర్ మూలాలు గురించి చర్చించాను. “మహర్లకు | రత్నగిరిజిల్లా కాణాచి 1911న జనాభా లెక్కల ప్రకారం ఒక్క బొంబాయిలోనే 153 ప్రత్యేక స్థావరాలు కలిగి ఉన్నారు. మహర్లు అనే నామవాచకం వలే మహరాష్ట్ర ఏర్పడిందని చరిత్రకారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో వున్న అన్ని

గ్రామాల జీవన వ్యవస్థలకు మహర్లే పునాది వేశారు. అనేక సందర్భాలలో వచ్చిన మహర్ల ఉద్యమాలు మహారాష్ట్ర సంస్కృతిలో, పరిణామంలో భాగంగా నిలిచాయి. మహర్లు శక్తివంతమైన

జాతి, అతి ప్రాచీనకాలం నుండి వారి ఉనికి భారతదేశ మూలల్లో వుంది” అని నిరూపించాను ఇందుకు అనేక గ్రంథాలు | చదివాను. భారతదేశంలో మహర్లు శక్తివంతమైన జాతి. అంబేడ్కర్ లోని ఆ ధైర్య సాహసాలు వారి నుండి వచ్చినవే. అంబేడ్కర్ ఆత్మగౌరవం మహర్ల నుండి సంతరించుకున్నదే.

మహర్లలో ఈ ఆరు గుణాలు ఉన్నాయి. –
1. మహర్ అనే పదం నుంచి మహారాష్ట్ర ఏర్పడింది.
2. ఒకప్పటి ‘మల్ల’ రాష్ట్రం క్రమంగా మహరాష్ట్రమైంది.
3. ఆ ప్రజలకు నాటి నుండి నేటి దాకా ఆరాధ్యదైవమైన మల్లారి ఖండి పేరు నుంచి ఈ పదం ఏర్పడినది.
4. ‘రసిక’ అనే జాతి ప్రజల పేరు సంస్కృతీకరణ చెంది రాష్ట్రంలో దాని నుంచి రఠిక, మహరాష్ట్ర ఉత్పన్నమైనాయి.

Yoga Bala Shiksha

450.00

యోగ బాలశిక్ష

గీతా సారాంశము

అయ్యిందేదో మంచికే అయింది. అవుతున్నదేదో అదీ మంచికే అవుతుంది. -అవ్వబోయేదేదో కూడా మంచికే అవుతోంది.

నీవేమి పోగొట్టుకున్నావని నీవు విచారిస్తున్నావ్? నీవేమి తెచ్చావని నీవు పోగొట్టుకుంటావ్?

నీవేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది. నీవు ఏదైతే పొందావో అవి ఇక్కడనుండే పొందావు. -ఏదైతే ఇచ్చావో ఇక్కడ నుంచే ఇచ్చావు. -ఈనాడు నీవు నీ సొంతం అనుకున్నదంతా,నిన్న ఇంకొకరి సొంతం దాచిపెట్టిన ధనం భూమి పాలు – అందమైన ఈ దేహం అగ్నిపాలు – అస్తికలన్నీ గంగపాలు ఈ జీవం యముని పాలు – కొడుకు వండిన కూడు కాకిపాలు మన వస్తువులన్నీ ఎవరి పాలో తాను చేసిన దానం, ధర్మం, పుణ్యం మాత్రం తన పాలు |

తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు అందరినీ మరిచినా నీ తల్లిదండ్రులను మరువ వద్దు. వాళ్ళను మించి మంచి కోరే వారూ ఉండరని తెలుసుకో… నువ్వు పుట్టాలని ఎన్నో పూజలు, త్యాగాలు చేశారు వారు, రాయివై వారి హృదయాలను ముక్కలు చేయవద్దు. కొసరి కొసరి గోరుముద్దలతో నిన్ను పెంచారు వారు, నీకు అమృతమిచ్చిన వారి పైన నువ్వు విషాన్ని విరచిమ్మవద్దు.. ముద్దు మురిపాలతో నీ కోర్కెలు తీర్చారు వారు, ఆ ప్రేమమూర్తుల కోరికలు నీవు నెరవేర్చాలని మరువవద్దు. నువ్వెన్ని కోట్లు సంపాదించినా అవి తల్లిదండ్రులకు సమానమౌతాయా? సేవాభావం లేకపోతే అంతా వ్యర్థమే, గర్వం పనికిరాదు. సంతానం వల్ల సుఖం కోరుతావు. నీ సంతాన ధర్మం మరువ వద్దు. ఎంత చేసుకుంటే అంత అనుభవించక తప్పదనే న్యాయం మరువవద్దు. నీవు తడిపిన పక్కలో వారు పడుకొని నిన్ను పొడిపొత్తుల్లో పడుకోబెట్టారు.

అమృతాన్ని కురిపించే అమ్మ కళ్ళలో అశ్రువులను నింపకు. .నీవు నడిచే దారిన పూలు వేసారు వారు, ముల్లువై వారిని బాధించకు.

డబ్బుపోతే మళ్ళీ సంపాదించవచ్చు, తల్లిదండ్రులను మాత్రం మళ్ళీ సంపాదించలేవు. తల్లి యొక్క గౌరవం భూమి కంటే మహత్తరమైనది, తండ్రి ఆకాశం కంటే గొప్పవాడు, వారి గొప్పతనం జీవితాంతం మరువవద్దు. తల్లిదండ్రులను, శాస్త్రములను, గురువులను, పెద్దలను, స్నేహితులను గౌరవించేవాడు అందరికి ఆదర్శవంతుడు కాగలడు.

NTR A Biography

650.00

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి తెలియని తెలుగువారుండరు. అన్నగారి సినీ జీవితం, రాజకీయ చరిత్ర గురించి ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత తెలిసే ఉంటుంది. ఇటీవల వచ్చిన ‘యన్.టి.ఆర్ – కథానాయకుడు’ చిత్రం ద్వారా ఆయన గురించి తెలియని మరిన్ని విషయాలను నేటి యువత తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ మహానుభావుడి గురించి క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం వచ్చింది. ఎన్టీఆర్ జీవితంలో మనకు తెలియని ఎన్నో విషయాలను పొందుపరిచి ఆయన జీవిత కథను ఇద్దరు విశ్రాంత ఉన్నతాధికారులు పుస్తక రూపంలో అందిస్తున్నారు. ‘ఎన్టీఆర్ బయోగ్రఫీ’ పేరిట ప్రచురితమైన ఈ పుస్తకాన్ని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కె.లక్ష్మీనారాయణ, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి కె.చంద్రహాస్ సంయుక్తంగా రచించారు.

Amaravathi Vivadalu-Vastavalu

300.00

ఆంధ్రుల అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇన్నాళ్లకు, ఇన్నేళ్లకు ఆంధ్రప్రదేశ్ కు తనదంటూ ఒక రాజధాని ఏర్పడే దశలో మళ్లీ విఘ్నం ఎదురైంది. ఈ పరిణామంతో వర్తమాన తెలుగు సమాజానికే కాదు, రానున్న తరాలకూ తీరని నష్టం వాటిల్లుతుంది. నగరానికి, నాగరికతకు దగ్గర సంబంధం ఉంది. ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఆంధ్రప్రదేశ్ వికసించాలంటే రాజధాని నగరం అవసరం.

అశాస్త్రీయ విభజనతో దగాపడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు అమరావతి విషయంలో మరొక తప్పిదం చేస్తున్నదన్న ఆవేదనతో రాసిన పుస్తకం ఇది. గతంలోనే కాదు, సమకాలీన చరిత్రలో కూడా ఆంధ్రులకు రాజధాని అందని ద్రాక్షపండుగా ఎందుకు మిగిలిపోయిందో తెలుసుకోడానికి చేసిన ప్రయత్నం ఇది.

Sirikakolanu Chinnadi

90.00

ఇది రాయలనాటి తెలుగునాటి సంస్కృతి, ప్రజాజీవన ధోరణి ప్రతిబింబించే కథ.

స్థలం కృష్ణానది తీరస్థమై ఆంధ్రవిష్ణు క్షేత్రంగా చరిత్రలో వాసికెక్కిన శ్రీకాకుళం.

ఆ ఊళ్లో ప్రతి వైకుంఠ ఏకాదశికి తిరునాళ్లు – కాముని పున్నమ అని దవన పున్నమ అని ప్రసిద్ధి గాంచిన శృంగార రాత్రికి నటవిటరాసిన జన సందోహమంతా తరలివచ్చి తనివితీరా పొరలి వెళ్లే పోతుగడ్డ.

అక్కడొక సానివాడ. అందొక రంగాజమ్మ.

ఆమె వయసు మళ్లిన వాడ వదిన- ఆమెకు అందాలరాశి, భక్తికి వారాసి అయిన అలివేణి గారాల కూతురు. కళలూ, కావ్యాలూ అన్ని నేర్చిన చిరుజన. మువ్వను కవ్వించడం, మువ్వగోపాలుని నవ్వించడం ఆమె ఇష్టక్రియ.అమెకొక అక్క. పేరు చంచల.

Inko Kothi Kommacchi

225.00

రమణ పత్రికారంగాన్ని విడవడంతో మొదటి భాగం పూర్తి అవుతుంది. ఆ తర్వాతి నిరుద్యోగ విజయాలు, సినీరంగ ప్రవేశం, తొలిదశలో ఎదురైనా అవమానాలు, హేళనలు, సినీరచయితగా నిలదొక్కుకోవడం, ఓ డైరెక్టర్ ప్రవర్తనతో విసిగి సినీరంగాన్ని వదిలివేసి వచ్చేసినా ఆ రంగమే రెట్టింపు పారితోషికంతో పునరాహ్వనించడం, బాపుతో కలిసి చేసిన ‘జ్యోతి’ ప్రయోగం మేలు చేయడం మానేయడంతో ఏకంగా సినీనిర్మాతలు అయిపోవడం, ప్రయోగాత్మక సినిమాల నుండి అక్కినేని అందించిన సాయంతో కమర్షియల్ సినిమా వైపు మరలడం, ‘బుద్దిమంతుడు’ సంపూర్ణ రామాయణం’ సినిమా నిర్మాణాలలో ఔత్సాహిక నిర్మాతలుగా పడిన కష్టాలు…. వీటన్నిటితో రెండవ భాగం మరింత పరిచితంగా, రసవత్తరంగా సాగింది.

Kothi Kommacchi

225.00

“కోతి కొమ్మచ్చి” పుస్తకం పాటకులనే కాదు, సమీక్షకులను మెప్పించింది. బతుకుపోరాటంలో ఎటువంటి కష్టాలు ఎదురైనా నవ్వుతూ బతకాలని భోదించిన జీవనవేదంగా – మొక్కవోని దైర్యాన్ని,ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని నురిపోసిన వ్యక్తిత్వ వికాస పాట్య పుస్తకంగా – తెలుగునాట వెలసిన, మసలిన ఆనాటి మహానుభావులతో వ్యక్తిగత అనుభవాలను ఆవిష్కరించిన జ్ఞాపకాల మాలికగా – అడుగడుగునా తెలుగు పలుకుబళ్ళను, భాషాప్రయోగాలను వెదజల్లిన చమత్కార మంజరిగా – ఒక శకానికి ఆద్యులైన భావుకద్వయం ఎలా రుపుదిద్దుకున్నారో వివరించే చారిత్రక గ్రంధంగా – రకరకాలుగా వర్ణించారు “కోతికొమ్మచ్చి”ని.

Kosaru Kommachi

250.00

“…తన ఆత్మ కథను మూడు భాగాలుగా గ్రంధస్తం చేసిన రమణగారు చాలా సంగతులు చెప్పలేదు. సినిమాలు తగ్గినా స్థితిలో సాహితి సర్వస్వం మార్కెట్లోకి వచ్చి అదరగోట్టింది. “భాగవతం” టివి సీరియల్ వచ్చి బాపు-రమణలు ఏ మాత్రం పట్టు కోల్పోలేదని నిరూపించింది. ఆఖరి శ్వాస విడిచేదాకా అయన క్రియేటివిటి తగ్గలేదని “శ్రీరామరాజ్యం” నిరూపించింది. ఇవన్ని చెప్తేనే చరిత్రకు న్యాయం జరుగుతుందనిపించి “కోతికొమ్మచ్చి”లో అయన వదిలేసిన విషయాలతో “కొసరు కొమ్మచ్చి” తయారు చేశాం.

ఆయన కుటుంబ విషయాల గురించి వారి శ్రీమతి శ్రీదేవి, కుమారుడు శ్రీ వరా ముళ్ళపూడి, కుమార్తె శ్రీమతి అనురాధ ముళ్ళపూడి రాయగా……సాహిత్యం గురించి “సాహితి సర్వస్వం” సంకలనకర్త శ్రీ ఏమ్బియస్ రాయగా….

సినిమాల గురించి, టీవీ సీరియల్స్ గురించి శ్రీ బివియస్ రామారావు (సీతారాముడు) రాశారు. అయన రమణగారికి హైస్కూల్ నుండి  స్నేహితుడు. దాదాపు వారి సినిమాలన్నిటిలోనూ పాలుపంచుకున్నారు. మంచి రచయిత; సినిమా కళపై అవగాహనా కలిగినవారు. ఆయన బాపు-రమణల సొంత సినిమాల గురించే కాకా రమణ చేసిన సినిమాలన్నిటిని చూసి, వాటి కథాసంగ్రహాలు, ఎంపిక చేసిన సంభాషణలు, తెరవెనుక విశేషాలు-తన జ్ఞాపకాలతో, అనుభవాలతో రంగరించి మరీ అందించారు.

అనేక అరుదైన ఫోటోలతో అచ్చమైన ‘బాపురమణీయంగా’ రూపొందింది……ఈ “కోసరు కోమ్మచ్చి”.

-వరప్రసాద్

Sri Lekha

275.00

“ఖారమేలా! నీకు మనిషంటే భయం. నీ నీడంటేనే నీకు భయం. అందుకే నిరంతరం అప్రమత్తతో నిద్రలేకుండా బ్రతుకుతుంటావు. ఇనుప కవచాల కటకటాల మధ్య నిన్ను నీవే బంధించుకుంటూ, చుట్టూ వందలాది సైనికులను నీకు నీవే కాపలా పెట్టుకుని స్వేచ్ఛలేని జీవంలా అరుస్తూ, రోదిస్తూ జీవిస్తున్నావు. ఖారమేలా! ఇదీ ఒక జీవితమేనా? నీవు నిజంగా వీరుడవైతే ఈ పావురం కాలికి దెబ్బ తగిలింది. దీని కంటినీరు తుడవగలవా?” అని ప్రశ్నించింది. శ్రీలేఖ.

“ఏమే సీతలా, సావిత్రిలా ధర్మోపదేశాలు చేస్తున్నావు?”

“అనవసరంగా పౌరాణికపు పోలికలు వద్దు. నేను సీతనైతే, నీవు రావుణుడివి కావలసివస్తుంది.”

“ఓరోరి! ధాన్యకటకపు వన్నెల చిలక కూనిరాగాలు పాడుతుందిరా! దీనిని కట్టేసి మనం జరపబోయే సింహక్రీడలో ఆహారంగా పడేయండి”

“రసవత్తరమైన ఇటువంటి సంభాషణలతో నిండిన ఈ చారిత్రక నవల క్రీ.పూ.200సంవత్సరాలకు పూర్వం నేటి గుంటూరు జిల్లాలోని అమరావతి (ధాన్యకటకము) రాజధానిగా చేసుకుని పరిపాలించిన ఆంధ్ర శాతవాహనుల గాధ.

– ముదిగొండ శివప్రసాద్

Sraavani

275.00

అదొక మహోజ్వల మహాయుగం.

నేటికి రెండు వేల సంవత్సరాల నాటి ఆంధ్రుల పరాక్రమ గాధ

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే క్రీస్తుశకం 78వ సంవత్సరం.

శక కర్త, శక హర్త అయిన శాలివాహన యుగపురుషుడు

గౌతమీపుత్ర శాతకర్ణి మొత్తం భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలమది.

నేటి గుంటూరు జిల్లాలోని అమరావతి వారి రాజధాని.

ఆనాటి ఆంధ్రుల సాహిత్యానికి సంస్కృతీకి.

నాగరికతకు అద్దం పట్టిన నవల శ్రావణి.

ఇదొక గద్య ప్రబంధం.

షడ్రసోపేతమైన విందు భోజనం.

నవరసభరితమైన వచన మహాకావ్యం.

కరుణశ్రీ సాహిత్యం 5

200.00

ఉదయశ్రీ కావ్యస్పందనతో మందాకిని పొంగింది. నందనం నవ్వింది. బృందావనం వెలిసింది. మందారం విరిసింది. మకరందం కురిసింది. ఆమకరందం తెలుగుజాతిని పోతన వేమనల తర్వాత మరింత ప్రభావితం చేసింది. కరుణశ్రీ మాటలతో బొమ్మల్ని గీశారు. అక్షరాలతో మానవతాశిల్పాన్ని చెక్కారు. ఏయిజానికి చెందని హ్యూమనిజం మాత్రం తొణికిసలాడే ప్రజాకవి కరుణశ్రీ.