Showing 1–12 of 28 resultsSorted by latest

Mein_Kampf -మెయిన్ కాంఫ్ (అడాల్ఫ్ హిట్లర్ ఆత్మకథ)

Original price was: ₹620.00.Current price is: ₹558.00.

మెయిన్ కాంఫ్ (అడాల్ఫ్ హిట్లర్ ఆత్మకథ)

మెయిన్ కాంఫ్అడాల్ఫ్ హిట్లర్ ఆత్మకథ అయిన ‘మీన్ కాంఫ్’, అక్షరాలా ఒంటరిగా చరిత్ర గమనాన్ని మార్చి, తరతరాలుగా ప్రజల మనోస్థైర్యాన్ని దెబ్బతీసిన ఒక వ్యక్తి మనస్తత్వాన్ని మనకు తెలియజేస్తుంది.

మైన్ కాంఫ్ (జర్మన్: [maɪn kampf] అక్షరాలా నా పోరాటం) అనేదినాజీ పార్టీనాయకుడైనఅడాల్ఫ్ హిట్లర్రాసినఆత్మకథాత్మకమరియు రాజకీయప్రణాళికహిట్లర్ యొక్కఅనేక, అతని రాజకీయ సిద్ధాంతం, మరియుజర్మనీమరియు ప్రపంచం కోసం అతని భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తుంది. మైన్ కాంఫ్ యొక్క మొదటి సంపుటం 1925లో మరియు రెండవ సంపుటం 1926లో ప్రచురించబడ్డాయి.

నవంబర్ 1923లో మ్యూనిచ్‌లో జరిగిన తన విఫలమైన తిరుగుబాటు మరియు ఫిబ్రవరి 1924లో దేశద్రోహం ఆరోపణలపై విచారణ తరువాత , హిట్లర్ లాండ్స్‌బర్గ్ జైలులో ఖైదీగా ఉన్నప్పుడు ‘మీన్ కాంఫ్’ రాయడం ప్రారంభించాడు . ఈ విచారణలో అతనికి కోట నిర్బంధంలో ( ఫెస్టంగ్‌షాఫ్ట్ ) ఐదు సంవత్సరాల శిక్ష విధించబడింది. మొదట్లో చాలా మంది సందర్శకులు వచ్చినా, అతను త్వరలోనే పూర్తిగా ఆ పుస్తకానికే అంకితమయ్యాడు. అతను రాస్తూ ఉండగా, అది రెండు సంపుటాలుగా ఉండాలని గ్రహించాడు. ఆ సమయంలో జైలు గవర్నర్ ఇలా పేర్కొన్నారు, “[హిట్లర్] ఈ పుస్తకం అనేక ముద్రణలకు రావాలని ఆశిస్తున్నాడు, తద్వారా అతను తన ఆర్థిక బాధ్యతలను నెరవేర్చగలడు మరియు తన విచారణ సమయంలో అయిన ఖర్చులను భరించగలడు. హిట్లర్ ఒక సంవత్సరానికి పైగా జైలులో గడిపాడు మరియు విడుదలైన తరువాత వేసవిలో మొదటి సంపుటాన్ని ప్రచురించాడు. మొదట్లో అమ్మకాలు నెమ్మదిగా ఉన్నప్పటికీ, 1933లో హిట్లర్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పుస్తకం జర్మనీలో బెస్ట్ సెల్లర్‌గా మారింది.

మైన్ కాంఫ్ (జర్మన్: [maɪn kampf] అక్షరాలా నా పోరాటం) అనేదినాజీ పార్టీనాయకుడైనఅడాల్ఫ్ హిట్లర్రాసినఆత్మకథాత్మకమరియు రాజకీయప్రణాళికహిట్లర్ యొక్కఅనేక, అతని రాజకీయ సిద్ధాంతం, మరియుజర్మనీమరియు ప్రపంచం కోసం అతని భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తుంది. మైన్ కాంఫ్ యొక్క మొదటి సంపుటం 1925లో మరియు రెండవ సంపుటం 1926లో ప్రచురించబడ్డాయి.

నవంబర్ 1923లో మ్యూనిచ్‌లో జరిగిన తన విఫలమైన తిరుగుబాటు మరియు ఫిబ్రవరి 1924లో దేశద్రోహం ఆరోపణలపై విచారణ తరువాత , హిట్లర్ లాండ్స్‌బర్గ్ జైలులో ఖైదీగా ఉన్నప్పుడు ‘మీన్ కాంఫ్’ రాయడం ప్రారంభించాడు . ఈ విచారణలో అతనికి కోట నిర్బంధంలో ( ఫెస్టంగ్‌షాఫ్ట్ ) ఐదు సంవత్సరాల శిక్ష విధించబడింది. మొదట్లో చాలా మంది సందర్శకులు వచ్చినా, అతను త్వరలోనే పూర్తిగా ఆ పుస్తకానికే అంకితమయ్యాడు. అతను రాస్తూ ఉండగా, అది రెండు సంపుటాలుగా ఉండాలని గ్రహించాడు. ఆ సమయంలో జైలు గవర్నర్ ఇలా పేర్కొన్నారు, “[హిట్లర్] ఈ పుస్తకం అనేక ముద్రణలకు రావాలని ఆశిస్తున్నాడు, తద్వారా అతను తన ఆర్థిక బాధ్యతలను నెరవేర్చగలడు మరియు తన విచారణ సమయంలో అయిన ఖర్చులను భరించగలడు. హిట్లర్ ఒక సంవత్సరానికి పైగా జైలులో గడిపాడు మరియు విడుదలైన తరువాత వేసవిలో మొదటి సంపుటాన్ని ప్రచురించాడు. మొదట్లో అమ్మకాలు నెమ్మదిగా ఉన్నప్పటికీ, 1933లో హిట్లర్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పుస్తకం జర్మనీలో బెస్ట్ సెల్లర్‌గా మారింది.

 

 

 

 

Na Jeevita Katha Maxim Gorky

600.00

Na Jeevita Katha Maxim Gorky

 

ఇరుకుగా వున్న చీకటిగదిలో కిటికీకి దగ్గరగా నేలమీద మా నాన్న పడుకున్నాడు. తెల్లని దుస్తులు తొడుక్కుని అలా పడుకుని వుంటే యెంతో పొడుగరిలాగ కనబడ్డాడాయన. కాలివేళ్ళు, అదొక మోస్తరుగా ఒకదాని కొకటి యెడమ యెడమగా వున్నాయి. ప్రశాంతంగా గుండెలమీద పెట్టుకున్న మృదువైన చేతివేళ్ళు కూడా కొంకర్లుపోయున్నాయి. కళ్ళమీద వుంచిన నల్లని రాగి నాణేలు ఆయన ఉల్లాసపు కళ్ళను కప్పుతున్నాయి. దయతో ఉట్టిపడుతూండే ఆయన ముఖం నల్లబారిపోయింది, బిర్రబిగుసుకు పోయిన ఆయన పళ్ళు మెరుస్తూండడం చూచి నాకు భయం వేసింది.
అమ్మ ఆయన దగ్గర మోకాళ్ళమీద కూచుంది. అమ్మ వంటిమీద ఎర్ర గాగరా వొక్కటే వుంది, ఆమె అలా కూచుని పట్టులాంటి ఆయన జుట్టును నల్లని దువ్వెనతో నుదుటి మీద నుండి వెనక్కి దువ్వుతూంది. నేనా దువ్వెనతోనే పుచ్చకాయ తొక్కలను రంపంతో కోసినట్టు కోసేవాణ్ణి. మంద్రమైన గొంతుకతో ఏమిటేమిటో ఆమె అలా గొణుగుతూనే వుంది. ఆమె బూడిదరంగు కళ్ళు వాచిపోయి పెద్ద కన్నీటి బొట్టుల కింద కరిగిపోతూన్నట్టని పించింది నాకు.
మా అమ్మమ్మ నా చేయి పట్టుకుంది. అమ్మమ్మ స్థూలంగా గుండ్రంగా వుంది. పెద్ద తల, పెద్ద పెద్ద కళ్ళు, మాంసపు ముక్కలా ముక్కు, ఆ ముక్కు చూస్తేనే నాకు నవ్వొచ్చేది. ఆమె అంత నల్లగా వుండికూడా మృదువుగా అద్భుతంగా కనబడుతోంది. ఆమె కూడా యేడుస్తూనే వుంది. ఆమె యేడుపు అదొక విధంగా వుండి అమ్మ యేడుపుకి వెనక పాటలా వినడానికి ఇంపుగానే వుంది. ఆమె వొళ్ళు అంతా వణికిపోతూనే నన్ను నాన్న దగ్గరకి నెట్టుతూంది. నేను మాత్రం ముందుకు రాకుండా ఆమె గాగ వెనక దాగుకున్నాను. నాకు భయంవేసి యేమిటోలా వుంది……………………….

 

 

   

 

Meeru Sreelu (36 Principles for Achieving Success in Telugu)

 

విభాగం-1

వదిలించుకోవలసినవి
“ఉద్ధరేద్ ఆత్మనాఆత్మానం నాత్మానం అవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ||”
(శ్రీమద్భగవద్గీత – అధ్యాయం-6 శ్లోకం -5)

భావం: మనం మనల్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి మనల్ని మనమే దిగజార్చు కోకూడదు – (ఎందుకంటే) మన ఆత్మే మనకు మిత్రుడు, (కావచ్చు, అదే
మన ఆత్మ మనకు శత్రువు (గా మారవచ్చు)
మన ఆత్మ (అంటే మన మనస్సు), మన ఆలోచనలు, మన అలవాట్లు – ఇవే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. మన మనస్సు మనకు మిత్రుడిగా ఉండాలంటే చెడు అలవాట్లను వదలాలి. అలా వదలకపోతే, ఈ చెడు అలవాట్లు మన ఎదుగుదలకు ప్రధాన అడ్డంకిగా మారతాయి.
మనం నాజూగ్గా కనపడాలంటే, మన శరీరంలో ఉన్న అధిక కొవ్వును వదిలించుకోవాలి. అలాగే, చురుగ్గా తయారవ్వాలంటే, భయాన్ని, పిరికితనాన్ని, ఆత్మన్యూనతను, అభద్రతా భావాన్ని, ఒత్తిడిని, జాలిని మరియు కొన్ని అపోహలను వదిలించుకోవాలి.
ఈ విభాగం మనల్ని మనం ఎలా మార్చుకోవాలో, ఎలా మలచుకోవాలో చూపిస్తుంది. మన లోపాలను గుర్తించి, వాటిని ఎలా అధిగమించాలో కూడా తెలియజేస్తుంది…………

Meeru Sreelu (36 Principles for Achieving Success in Telugu)

200.00

 

 

 

 

 

   

 

Meeru Sreelu (36 Principles for Achieving Success in Telugu)

 

విభాగం-1

వదిలించుకోవలసినవి
“ఉద్ధరేద్ ఆత్మనాఆత్మానం నాత్మానం అవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ||”
(శ్రీమద్భగవద్గీత – అధ్యాయం-6 శ్లోకం -5)

భావం: మనం మనల్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి మనల్ని మనమే దిగజార్చు కోకూడదు – (ఎందుకంటే) మన ఆత్మే మనకు మిత్రుడు, (కావచ్చు, అదే
మన ఆత్మ మనకు శత్రువు (గా మారవచ్చు)
మన ఆత్మ (అంటే మన మనస్సు), మన ఆలోచనలు, మన అలవాట్లు – ఇవే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. మన మనస్సు మనకు మిత్రుడిగా ఉండాలంటే చెడు అలవాట్లను వదలాలి. అలా వదలకపోతే, ఈ చెడు అలవాట్లు మన ఎదుగుదలకు ప్రధాన అడ్డంకిగా మారతాయి.
మనం నాజూగ్గా కనపడాలంటే, మన శరీరంలో ఉన్న అధిక కొవ్వును వదిలించుకోవాలి. అలాగే, చురుగ్గా తయారవ్వాలంటే, భయాన్ని, పిరికితనాన్ని, ఆత్మన్యూనతను, అభద్రతా భావాన్ని, ఒత్తిడిని, జాలిని మరియు కొన్ని అపోహలను వదిలించుకోవాలి.
ఈ విభాగం మనల్ని మనం ఎలా మార్చుకోవాలో, ఎలా మలచుకోవాలో చూపిస్తుంది. మన లోపాలను గుర్తించి, వాటిని ఎలా అధిగమించాలో కూడా తెలియజేస్తుంది…………

SRIKANAKADURGAMMA CHARITAMU

252.00

SRIKANAKADURGAMMA CHARITAMU

కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మావారుని గురించి తపస్సు చేసి, ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసురమర్ధిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనక దుర్గ అయింది. ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. కనుక ఈ ప్రాంతం విజయవాడ అయింది.

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.

రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు

Sri Varaha Maha Puranam

700.00

Sri Varaha Maha Puranam

భారతీయ వాజ్మయంలో పురాణాలు అత్యంత విశిష్టమైనవి. అవి లోకానికి మిత్రులవలె హితాన్ని ఉపదేశిస్తాయి. కాబట్టి “మిత్రసమ్మితములు” గా ప్రఖ్యాతి వహించాయి. పురాణాలు ప్రాచీనమైనవైనా ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ప్రకాశిస్తూ ఉంటాయి. అవి మన పురాతన విజ్ఞాన సర్వస్వాలు ( Encyclopaedias ) అటువంటి పదునెనిమిది పురాణాల్లో అగ్రగణ్యమైనది “శ్రీ వరాహ మహాపురణం”.

 

శ్రీ మహావిష్ణువు వరాహరూపమును ధరించి పాతాళ లోకము నుంచి భూమిని ఉద్దరించిన వృత్తాంతము ముఖ్య సంబంధము కలది, అయినందున ఈ పురాణమునకు వరాహపురాణము అనే పేరు వచ్చింది.

 

వరాహ పురాణానికి సౌకర పురాణం అని, ఆదివరాహ పురాణం అని పేర్లు కూడా ఉన్నాయి. శ్రీ మహావిష్ణు అవతారపు పేర్లతో ఉన్న మత్స్య, కూర్మ, వరాహ, వామన పురాణాలలో ఇది మూడవది. పురాణపురుషుడగు శ్రీ మహా విష్ణువు యొక్క ‘ఎడమ చీలమండలం’ గా ఈ పురాణం తెలుపబడినది. ఈ పురాణంలో విష్ణు సంబంధమైన అనేక వ్రతాలు, వాని మహత్యం, వివరణ కూడా లభ్యమవుతున్నది.

SREE DATTATREYA GURUCHARITRA

300.00

SREE DATTATREYA GURUCHARITRA

శ్రీ దత్తాత్రేయ మహాత్మ్యమ్ అనే పేరుతో సుమారు అయిదువేల శ్లోకాల గ్రంథం శకాబ్దం 1818 లో అంటే క్రీ. శ. 1896 లో ముద్రితమయ్యింది. అప్పటినుంచీ భారతదేశంలో అనేక కుటుంబాలవారికి ఇది పారాయణ గ్రంథమయ్యింది. దీని ముగింపులో – “ఇదం పుస్తకం బెళగాంవాఖ్యపుర్యాo సావంతోపాహ్యయేన అబాజీరామచంద్ర ఇత్యనేన స్వకీయ ‘శ్రీరామతత్త్వప్రకాశాఖ్య’ ముద్రణాలయే ముద్రయిత్వా ప్రకాశ్యం నీతమ్’ – అని పెద్ద అక్షరాల్లో ఉంది. తాళపత్రగ్రంథాల పద్ధతిలో అడ్డంగా అచ్చోత్తించిన గ్రంథమిది. దీనిలో అక్కడక్కడా కొన్ని శ్లోకాలకు లఘుటీకకూడా ఉంది. పుటలో పైన క్రిందా ఈ టీకను సన్నటి అక్షరాల్లో ముద్రించారు.
– ఆచార్య బేతవోలు రామబ్రహ్మం