Showing all 11 resultsSorted by latest

Amma (Maxim Gorki)

300.00

“గోర్కిని నేను వ్యక్తిగతంగా ఎరుగుదను. యూరోపియన్ రచయితల్లో ప్రజ్ఞావంతుడైనట్టి, ఘనుడైనట్టి రచయితగానే కాకుండా బుద్ధిశాలి, దయాళుడు, సానుభూతిపరుడైన మానవుడిగా కూడా నేనతన్ని అభిమానిస్తాను”.

– లియో టాల్ స్టాయ్ డైరీ నుండి.

“గోర్కి ప్రతిభా భాండారానికి ఒకటే పేరు – సత్యం”

– సైఫాన్ జ్వైగ్.

“నూతన సారస్వత పతాకపైన చిత్రించి వుంది – గోర్కి హృదయం. మరి ఈ హృదయంలో వుంది – సర్వ ప్రపంచ శాంతి.”

– కృష్ణచంద్ర

విశ్వ విఖ్యాత రష్యన్ రచయిత, సుప్రసిద్ధ రచనా విజ్ఞానవేత్త మక్సీమ్ గోర్కి (1868 – 1936) నవల “అమ్మ” తెలుగు పాఠకుల అపారాభిమానాన్ని చూరగొంది. ఈ నవలను చదివి కమ్యునిస్టులైన వాళ్ళు ఎంతోమంది వున్నారు. ఈ అభిమానాన్ని పురస్కరించుకొని తిరిగి ఈ నవలను వెలువరించారు.

– రచయిత గురించి 

Rich Dad Poor Dad

170.03

Est numquam harum aut ut. Pariatur cum blanditiis est delectus accusamus eveniet. Quis fugiat eligendi magni eos dignissimos numquam.

The Story of Success

50.89

Autem natus sed vero accusamus officiis cumque. Est nobis nihil cumque omnis iusto quia. Est quia qui necessitatibus quo ut.

Tulasi Dalam – తులసి దళం

100.00

‘ముగ్గు మధ్యలో కాద్రా కూర్చుని ఉన్నాడు. అతడి ప్రక్కన పాత్రలో మైదాపిండి ఉంది. తులసి చేతి కర్చీఫ్‌ ఉంది. తులసి తొక్కిన కాలిమట్టి ఉంది.

ముగ్గుకి ఎనిమిది వైపులా చిన్న చిన్న గొబ్బిళ్ళలాంటి మాంసపు ముద్దలు ఉన్నాయి…..

ముగ్గు మధ్యలో హ్రీం-క్రీం అన్న అక్షరాలు వ్రాయబడి ఉన్నాయి. సాంబ్రాణి పొగ దట్టంగా అలుముకొని వుంది. అతడు మైదాపిండితో బొమ్మను తయారు చేశాడు. తులసి తాలూకు చేతి గుడ్డ దానికి కట్టేడు. తులసి తొక్కిన మట్టిని ఆ బొమ్మ కాలికి అద్దేడు. బొమ్మ నెదురుగా పెట్టుకొని మంత్రం చదవటం మొదలుపెట్టాడు. అతడి పెదవులు కదులుతున్నాయి….”

తులసి అనే పదేళ్ళ చిన్నారిని చంపటానికి ముగ్గురు కిరాతకులు కాద్రా అనే మహామాంత్రికుడిని ఆశ్రయించారు. ‘కాష్మోరా’ అనే అతిభయంకరమైన క్షుద్రదేవతను ప్రయోగించి 21 రోజుల్లో పాపని చంపుతానని వాగ్దానం చేశాడు కాద్రా. రోజు రోజుకి తులసి క్షీణించిపోసాగింది. ఒక హిప్నటిస్టు, ఒక డాక్టరు కలసి ఆ చిన్నారిని కాపాడటానికి రంగంలో దిగారు.

1981లో వెలువడిన ఈ నవల – తెలుగు పాపులర్‌ నవలా సాహిత్యాన్ని ఒక మలుపు తిప్పింది. సంచలనం సృష్టించింది. అనేక వాద వివాదాలకు కేంద్రబిందువయింది. అఖిలాంధ్ర పాఠకలోకాన్ని అలరించిన ఈ నవల ఇప్పటికీ బెస్ట్‌ సెల్లర్స్‌లో ఒకటిగా నిలిచింది.

Abhayaranyam – అభయారణ్యo

120.00

అతుకు

”ఎంతైనా అతుకు అతుకే” మనసులో అనుకోబోయి పైకే అనేసింది సుమతి.

హిందూ పేపర్ని దీక్షగా చదువుతున్న భాస్కర్రావు తలెత్తి సుమతి వంక చూస్తూ ”ఏంటి అన్నావ్‌” అన్నాడు.

”ఏం లేదండీ. కాంపౌండ్‌వాల్‌ ఆ మూల మళ్ళీ బీటలిచ్చింది. ఇప్పటికే రెండుసార్లు సిమెంటు చేయించాం. ఎందుకు బీటలిచ్చింది అంటే ‘అబ్బే ఏం లేదండి ఏదో గాలి పగులు’ అంటారు. మళ్ళీ చూడండి అదే చోట ఎట్లా బీటలిచ్చిందో” సుమతి గోడ వంకే పరీక్షగా చూస్తూ అంది.

‘నువ్వన్నది గోడ గురించా’ మనసులో అనుకుని ”ఇంకోసారి సిమెంటు చేయిస్తే సరిపోతుంది. మేస్త్రీకి ఒకసారి రమ్మని కబురు చేద్దాం. అనిక్కి ఓసారి గుర్తుచెయ్‌” మళ్ళీ పేపర్లో తల దూరుస్తూ అన్నాడు భాస్కర్రావు.

అంతలో అతనికి ఆదివారం ప్రొద్దున్నే అంతసేపు పేపరు చదవటం సుమతికి ఇష్టం ఉండదని గుర్తొచ్చింది. వెంటనే పేపరు మడిచి టీపాయ్‌ మీద పెట్టి ”ఇవాళేంటి ప్రోగ్రాం? ఎటన్నా వెళ్దామా?” అన్నాడు. ఆదివారం పొద్దున్నే కాఫీ తాగుతూ వరండాలో కూర్చునో, మొక్కల్లో తిరుగుతూనో పిచ్చాపాటీ మాట్లాడడం అంటే సుమతికి ఇష్టం. భాస్కర్రావుకి పేపర్ల పిచ్చి. రోజూ వచ్చే రెండు పేపర్లు కాక ఆదివారం అదనంగా ఇంకో రెండు పేపర్లు కొంటాడు. మొత్తం నాలుగు పేపర్లు ఆదివారం అనుబంధంతో సహా అయిపోయే వరకూ వరండాలో అరుగుమీద బాసింపట్టు వేసుకూర్చుని కదలడు. మధ్యలో రెండు టీలు….

”అభయారణ్యం” కథల సంపుటిలో అతుకు, తోడు, అలక, జీవన చిత్రం, భయం, థర్డ్‌ ఆప్షన్‌, డిలీట్‌, అభయారణ్యం, పెళ్ళంటే, ఓ సిల్లీ కథ, దు:ఖావరణం, హోమం, అద్దం, అదృశ్యం, కళాకారుడు, నాలుగో తరం, పరుసవేది, అమ్మా వాళ్ళ ఇల్లు, సుమిత్ర, రూట్‌ కెనాల్‌ అనే 20 కథలు వున్నాయి.

పేజీలు : 140

Krishna Sastry Sahityam – 5 Vyasaavali – Vyasaalu – కృష్ణశాస్త్రి సాహిత్యం – 5 వ్యాసావళి – వ్యాసాలు

225.00

‘ఆధునికాంధ్ర సాహిత్యంలో అసాధారణ ప్రతిభావంతుడైన రచయిత శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి. అట్టివారి రచనలు లోకానికి త్వరగా సమగ్రంగా అందాలి. ఆ ప్రయత్నంలో సంకీర్ణ వ్యాసాలు, సాహిత్య ప్రసంగాలు, యక్షగానాలు, శ్రవ్యనాటికలు, గేయాలు, ఖండకావ్యాలు క్రమంగా ప్రకటితం కావడం ఆంధ్ర సాహిత్య ప్రియులకు ఎంతైనా హర్షదాయకమనుకుంటాను” అన్నారు శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి 1-10-65న  విశ్వోదయ ప్రచురణలకు ‘రెండుమాటలు’ వ్రాస్తూ. ఆనాటి ఆయన ఆశయం నేడు కార్యరూపం ధరిస్తున్నది. అందులో భాగంగా విడుదలయింది కృష్ణశాస్త్రి సాహిత్యం – 5 వ్యాసావళి – వ్యాసాలు. ఇందులో – కవిపరంపర – కవితా ప్రశస్తి – మహా వ్యక్తులు – అప్పుడు పుట్టి ఉంటే – పుష్పలాలికలు – బహుకాల దర్శనం – అమూల్యాభిప్రాయాలు ప్రకరణలున్నాయి. ఇందులో మొదటి ప్రకరణం ‘కవిపరంపర’ విడివిడికవుల కవితా విశిష్ట లక్షణాలను వివరించేది.
తొలిచి చూసి, లోపల దాగి ఉన్న సౌందర్యాన్ని పెల్లగించి చూచే కృష్ణశాస్త్రి గారి కవిచూపు సునిశితమైన సాహిత్య విమర్శకుని చూపు కూడా అని ఈ ‘కవిపరంపర’లోని దిగువ ఉదాహరించిన వాక్యాలు స్పష్టం చేస్తున్నాయి.
”నన్నయ వైకుంఠాన్ని భూలోకంలో అవతరింపజేస్తాడు, తిక్కన్న భూలోకాన్ని స్వర్గం దగ్గరకు ఎత్తడానికి ప్రయత్నిస్తాడు.”
”శబ్ధం పలకడమే కాదు, పాడుతుంది”.
”ఏడెనెమిది వందల ఏళ్ళ నుండి పల్లెల్లో, పట్టణాల్లో, ఇళ్ళల్లో, రచ్చ చావళ్ళలో ఈ భారతం చదువుకుని పురాణంగా చెప్పి తెనుగు వారు తమ జీవితంలో కలిపేసుకున్నారు. తిక్కన్న రచనలో అంత జీవచ్ఛక్తి, చైతన్యం ఉన్నాయి”.
”వారు (తిరుపతి వేంకట కవులు) గొప్ప కవులు, అయితే పద్యకవిత్వం కన్నా వారి వచనం గొప్పదని నా నమ్మకం”.
కవిగా, వక్తగా, భావకవిత్వోద్యమ జయస్తంభంగా, భక్త కవిగా, సినీ కవిగా శ్రీ కృష్ణశాస్త్రిని గుర్తించినంతగా సాహిత్య విమర్శకుడిగా ఆయన్ను లోకం గుర్తించినట్టు లేదు. దేశంలో నవ్య సాహిత్యోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లోనే ఆయన చేసిన రేడియో ప్రసంగాలు ఇంతవరకూ గ్రంథరూపం దాల్చకపోవడమే ఇందుకు కారణం. ఇదిగో – ఇపుడీ సంపుటం ఆ లోపాన్ని పూరిస్తుంది.

Jeevanayanam – జీవనయానం

250.00

నది జీవితం వంటిది. నది బిందువుగా మొదలవుతంది. జీవితం కూడా బిందువులా మొదలవుతుంది. నదిలో ఉపనదులు కలుస్తాయి. అది విశాలం అవుతుంది. జీవితంలో అనుభవాలు కలుస్తాయి. ఇది విశాలం అవుతుంది. నది ప్రశాంతంగా ప్రవహిస్తుంది. అయినా కదలిక కనిపించదు. జీవితం ప్రశాంతంగా ఉన్నంత కాలం ప్రవహిస్తుంది. అయినా కదలిక కనిపించదు. కొండలు కోనలు ఎదురవుతాయి. నది జలపాతం అవుతుంది. హోరును సృష్టిస్తుంది. జీవితంలో ఆపదలు ఎదురవుతాయి. అప్పుడే జీవితనాదం వినిపిస్తుంది. జీవితం వికసిస్తుంది. ఇంద్రధనుస్సులు సృష్టిస్తుంది. చిక్కుల్లోనే మనిషి ఎదుగుతాడు! ఆపదల్లోనే ఉన్నతుడు అవుతాడు. మనిషి అయినా జాతి అయినా అంతే. ఇది చరిత్ర చెప్పిన సత్యం!

Amrutham Kurisina Ratri

200.00

తిలక్ కవిత అభ్యుదయ కవిత్వ కొన్ని పాళ్ళు, భావకవిత్వం కొన్ని పాళ్ళు, కలసిన మిశ్రమరూపం. “నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు; నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు” అని తిలక్ చెప్పుకున్నాడు. ఇందులో అతని భావమేదైనా, మొదటిది తన వస్తువును గురించీ, రెండవది తన శైలిని గురించీ చెప్పుకున్నట్లు నేనర్థం చేసుకున్నాను. తిలక్ అభ్యుదయ భావనకు అందమైన శైలిని సమకూర్చి; అభ్యుదయ కవితా కాలంలో ఉన్న దోషాన్ని తొలగించడానికి ప్రయత్నించాడని చెప్పుకోవచ్చు.

             భావకవులు శబ్ద సౌందర్యానికి, శైలీ రమ్యతకూ ప్రాధాన్యం ఇచ్చారు. అభ్యుదయ కవులు ప్రగతి కారకమయిన వస్తువుకు ఈ రెండింటిలో మంచిని ఒకచోట చేర్చుకునే ప్రయత్నంలో తప్పేమీలేదు. భావన ఎంత అభ్యుదయకరమయినదయినా సుందరంగా వ్యంగ్య విలసితంగా చెప్పలేకపోతే రాణించాడు. అభ్యుదయ కవిత్వాన్ని కూడా పేలవంగా కాకుండా అందంగా చెప్పుదాం అన్నదే – తిలక్, ఆచరణ ద్వారా చేసిన సూచన.   

                                                      – కుందుర్తి    

Andhra Pradesh Prajatheerpu

300.00

ఎన్నికలకు సంబంధించి పుస్తకాలు రాయడం అన్నది అంత తేలికైన విషయం కాదు. 1952 లో జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికలు మొదలు 2019 వరకు జరిగిన శాసనసభ, లోక్ సభ ఎన్నికల ఫలితాల వివరాలు, గెలిచినవారికి సంబందించిన విశేషాలు, వారికీ ఉండే రాజకీయ నేపథ్యం, పూర్వాపరాలు, గెలిచినవారి విశిష్టతలు మొదలైనవాటిని క్రోడీకరించి పుస్తకం తయారు చేయడం అంటే ఎంతో క్లిష్టమైన పని. అయినా రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తితో పాతికేళ్ల క్రితం ఈ పుస్తక రచనకు శ్రీకారం చుట్టడం జరిగింది.

                                                                                            – కొమ్మినేని శ్రీనివాసరావు

Ghantaaravam – ఘంటారావం

290.00

హెమింగ్వే రచనల్లో సుదీర్ఘమైన నవల ”ఫర్‌ హూమ్‌ ది బెల్‌ టోల్స్‌”. స్పెయిన్‌లో ఫాసిస్టులకూ, కమ్యూనిస్టులకూ జరిగిన సంఘర్షణ ఇందులోని వృత్తాంతం. నాలుగు దినాలలో నడిచిన ఘటనలు నాలుగువందల ముప్ఫైఅయిదు పుటలలో చిత్రించాడు. ఒక గుహలో కొద్దిమంది స్త్రీ పురుషులతో కథ నడిచినప్పటికీ మొత్తం ఉద్యమమంతా మన కళ్ళముందు కదులుతున్నట్లనిపిస్తుంది. ఫాసిస్టుల కిరాతక చర్యలతోపాటుగా, విప్లవకారుల అమానుష కృత్యాలు వర్ణించటంలో హెమింగ్వే ప్రదర్శించిన నిష్పాక్షిక నిర్లిప్తదృష్టి ఉత్తమ రచయితలకే సాధ్యమౌతుంది.