Showing 1–12 of 38 resultsSorted by latest

Meeru Sreelu (36 Principles for Achieving Success in Telugu)

200.00

 

 

 

 

 

   

 

Meeru Sreelu (36 Principles for Achieving Success in Telugu)

 

విభాగం-1

వదిలించుకోవలసినవి
“ఉద్ధరేద్ ఆత్మనాఆత్మానం నాత్మానం అవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ||”
(శ్రీమద్భగవద్గీత – అధ్యాయం-6 శ్లోకం -5)

భావం: మనం మనల్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి మనల్ని మనమే దిగజార్చు కోకూడదు – (ఎందుకంటే) మన ఆత్మే మనకు మిత్రుడు, (కావచ్చు, అదే
మన ఆత్మ మనకు శత్రువు (గా మారవచ్చు)
మన ఆత్మ (అంటే మన మనస్సు), మన ఆలోచనలు, మన అలవాట్లు – ఇవే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. మన మనస్సు మనకు మిత్రుడిగా ఉండాలంటే చెడు అలవాట్లను వదలాలి. అలా వదలకపోతే, ఈ చెడు అలవాట్లు మన ఎదుగుదలకు ప్రధాన అడ్డంకిగా మారతాయి.
మనం నాజూగ్గా కనపడాలంటే, మన శరీరంలో ఉన్న అధిక కొవ్వును వదిలించుకోవాలి. అలాగే, చురుగ్గా తయారవ్వాలంటే, భయాన్ని, పిరికితనాన్ని, ఆత్మన్యూనతను, అభద్రతా భావాన్ని, ఒత్తిడిని, జాలిని మరియు కొన్ని అపోహలను వదిలించుకోవాలి.
ఈ విభాగం మనల్ని మనం ఎలా మార్చుకోవాలో, ఎలా మలచుకోవాలో చూపిస్తుంది. మన లోపాలను గుర్తించి, వాటిని ఎలా అధిగమించాలో కూడా తెలియజేస్తుంది…………

SRIKANAKADURGAMMA CHARITAMU

252.00

SRIKANAKADURGAMMA CHARITAMU

కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మావారుని గురించి తపస్సు చేసి, ప్రత్యక్షం చేసుకుని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసురమర్ధిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనక దుర్గ అయింది. ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. కనుక ఈ ప్రాంతం విజయవాడ అయింది.

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గా దేవి స్వయంభువుగా (తనకు తానుగా) వెలసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది. ఆది శంకరాచార్యులవారు తమ పర్యటనలలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేసారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలమంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొంటారు.

రాక్షసుల బాధ భరించ లేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా, ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి (ఇంద్రకీలుడి కొండ) పై కొలువుతీరింది. అర్జునుడు ఈ కొండ పై శివుని గురించి తపస్సు చేసాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు

Sri Varaha Maha Puranam

700.00

Sri Varaha Maha Puranam

భారతీయ వాజ్మయంలో పురాణాలు అత్యంత విశిష్టమైనవి. అవి లోకానికి మిత్రులవలె హితాన్ని ఉపదేశిస్తాయి. కాబట్టి “మిత్రసమ్మితములు” గా ప్రఖ్యాతి వహించాయి. పురాణాలు ప్రాచీనమైనవైనా ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ప్రకాశిస్తూ ఉంటాయి. అవి మన పురాతన విజ్ఞాన సర్వస్వాలు ( Encyclopaedias ) అటువంటి పదునెనిమిది పురాణాల్లో అగ్రగణ్యమైనది “శ్రీ వరాహ మహాపురణం”.

 

శ్రీ మహావిష్ణువు వరాహరూపమును ధరించి పాతాళ లోకము నుంచి భూమిని ఉద్దరించిన వృత్తాంతము ముఖ్య సంబంధము కలది, అయినందున ఈ పురాణమునకు వరాహపురాణము అనే పేరు వచ్చింది.

 

వరాహ పురాణానికి సౌకర పురాణం అని, ఆదివరాహ పురాణం అని పేర్లు కూడా ఉన్నాయి. శ్రీ మహావిష్ణు అవతారపు పేర్లతో ఉన్న మత్స్య, కూర్మ, వరాహ, వామన పురాణాలలో ఇది మూడవది. పురాణపురుషుడగు శ్రీ మహా విష్ణువు యొక్క ‘ఎడమ చీలమండలం’ గా ఈ పురాణం తెలుపబడినది. ఈ పురాణంలో విష్ణు సంబంధమైన అనేక వ్రతాలు, వాని మహత్యం, వివరణ కూడా లభ్యమవుతున్నది.

SREE DATTATREYA GURUCHARITRA

300.00

SREE DATTATREYA GURUCHARITRA

శ్రీ దత్తాత్రేయ మహాత్మ్యమ్ అనే పేరుతో సుమారు అయిదువేల శ్లోకాల గ్రంథం శకాబ్దం 1818 లో అంటే క్రీ. శ. 1896 లో ముద్రితమయ్యింది. అప్పటినుంచీ భారతదేశంలో అనేక కుటుంబాలవారికి ఇది పారాయణ గ్రంథమయ్యింది. దీని ముగింపులో – “ఇదం పుస్తకం బెళగాంవాఖ్యపుర్యాo సావంతోపాహ్యయేన అబాజీరామచంద్ర ఇత్యనేన స్వకీయ ‘శ్రీరామతత్త్వప్రకాశాఖ్య’ ముద్రణాలయే ముద్రయిత్వా ప్రకాశ్యం నీతమ్’ – అని పెద్ద అక్షరాల్లో ఉంది. తాళపత్రగ్రంథాల పద్ధతిలో అడ్డంగా అచ్చోత్తించిన గ్రంథమిది. దీనిలో అక్కడక్కడా కొన్ని శ్లోకాలకు లఘుటీకకూడా ఉంది. పుటలో పైన క్రిందా ఈ టీకను సన్నటి అక్షరాల్లో ముద్రించారు.
– ఆచార్య బేతవోలు రామబ్రహ్మం

Nalugu Devi Navarathrulu

295.00

Nalugu Devi Navarathrulu

దేవీ నవరాత్రుల విశిష్టత, పూజా విధానం, అమ్మవారి అవతారాల వివరాలతో కూడిన “నాలూగు దేవీ నవరాత్రులు” పుస్తకం, మల్లంపల్లి దుర్గా మల్లిఖార్జున ప్రసాద్ శాస్త్రి రచించినది అందుబాటులో ఉంది. ఈ పుస్తకం ప్యాపర్‌బ్యాక్ వెర్షన్‌లో లభిస్తుంది మరియు నవరాత్రుల సమయంలో చేయాల్సిన ప్రత్యేక పూజల గురించి వివరిస్తుంది.

Mooka Pancha Sathi Telugu

250.00

 

Mooka Pancha Sathi Telugu

మూకపంచశతి (Mooka Pancha Sathi)

కాంచీపుర కామాక్షి దేవిపై మూక కవి రచించిన అద్భుతమైన 500 సంస్కృత శ్లోకాల కృతి. ఇది తెలుగులో తాత్పర్యాలతో (దోర్బల విశ్వనాథ శర్మ, కోటేశ్వర రావు వంటి వారి అనువాదాలు) లభిస్తుంది. కాటాక్ష, ఆర్య, పాదారవింద, స్తుతి, మందస్మిత శతకాలుగా విభజించబడిన ఈ పుస్తకం, దేవి కరుణను, సౌందర్యాన్ని వర్ణిస్తుంది.