YOU MAY ALSO LIKE…
-
Asamardhuni Jeeva Yatra
₹120.00
-
Amrutham Kurisina Ratri
₹120.00
-
Tribasha Nigantuvu (Hindi- English- Telugu)
₹300.00
-
Vidhi
₹150.00
Showing 205–216 of 860 resultsSorted by latest
Nalugukalla Mandapam
₹290.00నరేంద్ర కథావస్తువులు, ఇతివృత్త నిర్వహణ పైపైకి సరళంగా కనిపిస్తాయి. కానీ లోలోపలి పొరల్లోకి తొంగి చుస్తే అవి సంక్లిష్టమైనవి. చాల సంబద్దమైనవి. కొన్ని అసంబద్దమైనవి. సమకాలీన భారతదేశభాష సామజిక సంస్కృతులు, చరిత్ర అంత సంకీర్ణమైనవి.
-కేతు విశ్వనాథరెడ్డి.
Kathalu Ilaa Kooda Rastaru
₹349.00చాలామంది ఏం చేస్తారంటే ‘నాడా’ దొరికిందని గుర్రాన్ని వెతుకుతారు. కొందరు ‘గుర్రం’ ఉందని నాడాను వెతుకుతారు. ఈ రెండూ ఉన్నా సరే కథ కాదు. ఈ రెండూ కలిసి ‘నాడా ఉన్న గుర్రం’ కావాలి. దానికో రౌతు కావాలి. ప్రయాణించడానికి గమ్యం కావాలి. ప్రయాణానికి ఉద్దేశం ఉండాలి. ప్రయాణంలో సంఘర్షణ ఉండాలి. ప్రయాణానికి ఫలితం ఉండాలి. అప్పుడు కథ.
ఈ పుస్తకంలో…
– కథలేవారు రాస్తారు?, కథలు దేంతో రాస్తారు?, కథలకు ముందు ఏం రాస్తారు?
– కథలెందుకు రాస్తారు?, కథలేప్పుడు రాస్తారు?, థీమ్ అంటే… ఫ్లాట్ అంటే…
– మంచి ప్రారంభాలూ… గొప్ప ముగింపులూ….
– పుస్తకం ఎప్పుడు వేయాలి?, పుస్తకం ఎలా వేయాలి?, పరిచయాలు కోరే ప్రాణత్యాగం…. మొదలగు విషయాలు కలవు……
The Show Must Run
₹170.00బంగారు వడ్లగింజలు
సుమారు ఇరవై ఏళ్ళక్రితం ఒకే కవరులో ‘భట్టిప్రోలు కథలు’ అనే పేరుతో నవ్య వీక్లీ కార్యాలయానికి వచ్చాయి, విజయరామరాజుగారి కథలు. భట్టిప్రోలు మావూరు దగ్గరే. అది గొప్ప బౌద్ధక్షేత్రం. వాన కురవంగానే అక్కడున్న దిబ్బలమీద బంగారు వడ్లగింజలు దొరుకుతాయని స్థానిక ప్రజల నమ్మకం. ఇప్పటికీ వాన పడ్డప్పుడు జనం అక్కడ వెతుకుతూనే వుంటారు.
డాక్టరుగారి కథలన్నీ భట్టిప్రోలు బంగారు వడ్లగింజల వంటివేనని నేను భావిస్తాను. పల్లెటూరియాసలో గొప్ప ఇతివృత్తాలతో రచించిన గొప్ప కథలు! దేనికదే బావున్నాయి.
‘ద షో మస్ట్ రన్’ కథాసంపుటిలో పల్లెటూరు, బస్తీ రెండింటినీ పట్టుకున్నారు.
సురభి నాటకాల గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం. ఒక్క టిక్కెట్టు తెగకపోయినా, ఒక్క ప్రేక్షకుడు రాకపోయినా సరే, అనుకున్న టైంకి తెరలేస్తుంది. అదీ వారి ప్రత్యేకత.
భమిడిపాటి కామేశ్వరరావుగారు అనేవారు, “నువ్వు రాసిన రచని పదమూడేళ్ళు ఊరబెట్టి అలానే వుంచు. తర్వాతే పత్రికలకు ఇవ్వు” అని. దేనికైనా కాలం గీటురాయి. అందుకే భట్టిప్రోలు కథలను తలచుకుంటున్నారు. ఇప్పటికీ ఇంకా కూడా తలచుకుంటారు. వాటిలో ‘చూరుకుట్టు బద్ద’, ‘నత్తముక్కల గోంగూర’ నాకు బాగా నచ్చిన కథలు……………..
బంగారు వడ్లగింజలు
సుమారు ఇరవై ఏళ్ళక్రితం ఒకే కవరులో ‘భట్టిప్రోలు కథలు’ అనే పేరుతో నవ్య వీక్లీ కార్యాలయానికి వచ్చాయి, విజయరామరాజుగారి కథలు. భట్టిప్రోలు మావూరు దగ్గరే. అది గొప్ప బౌద్ధక్షేత్రం. వాన కురవంగానే అక్కడున్న దిబ్బలమీద బంగారు వడ్లగింజలు దొరుకుతాయని స్థానిక ప్రజల నమ్మకం. ఇప్పటికీ వాన పడ్డప్పుడు జనం అక్కడ వెతుకుతూనే వుంటారు.
డాక్టరుగారి కథలన్నీ భట్టిప్రోలు బంగారు వడ్లగింజల వంటివేనని నేను భావిస్తాను. పల్లెటూరియాసలో గొప్ప ఇతివృత్తాలతో రచించిన గొప్ప కథలు! దేనికదే బావున్నాయి.
‘ద షో మస్ట్ రన్’ కథాసంపుటిలో పల్లెటూరు, బస్తీ రెండింటినీ పట్టుకున్నారు.
సురభి నాటకాల గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం. ఒక్క టిక్కెట్టు తెగకపోయినా, ఒక్క ప్రేక్షకుడు రాకపోయినా సరే, అనుకున్న టైంకి తెరలేస్తుంది. అదీ వారి ప్రత్యేకత.
భమిడిపాటి కామేశ్వరరావుగారు అనేవారు, “నువ్వు రాసిన రచని పదమూడేళ్ళు ఊరబెట్టి అలానే వుంచు. తర్వాతే పత్రికలకు ఇవ్వు” అని. దేనికైనా కాలం గీటురాయి. అందుకే భట్టిప్రోలు కథలను తలచుకుంటున్నారు. ఇప్పటికీ ఇంకా కూడా తలచుకుంటారు. వాటిలో ‘చూరుకుట్టు బద్ద’, ‘నత్తముక్కల గోంగూర’ నాకు బాగా నచ్చిన కథలు……………..
Sankellu Tenchukuntu. . . .
₹300.00మా ఊరు.. ఆ రోజులు
అధ్యాయం – 1.
మా ఊరు.. ఆ రోజులు
ఇది నన్ను తీర్చిదిద్దిన వ్యక్తులు, అధికారులు, వారితో ముడిపడిన ఘటనలకు సంబంధించిన యథార్థ జీవితం.
నేను జన్మించాను. ‘ప్రాంతంలో’ అని ఎందుకు అన్నానంటే నా తల్లిదండ్రులు లేదా తాత, అవ్వలు నేను ఏ రోజున పుట్టానో రాసిపెట్ట లేదు. ఓ నడివేసవిలో మిట్ట మధ్యాహ్నం పూట నేను పుట్టానని అమ్మ చెప్పేది. అది ఏప్రిల్ కావచ్చు లేదా మే నెల కావచ్చు. గ్రామాల్లో నివసించే ఓ చదువురాని దళిత మహిళ సంవత్సరం, నెల, తేదీ ఎలా గుర్తుపెట్టుకుంటుంది? అమ్మలాగే నాన్నకూ చదువు అక్షరం ముక్కరాదు. నేను 1962లో ఐఏఎస్లో చేరిన తర్వాతనే వారు మాతృభాషలో అక్షరాభ్యాసం చేశారు.
తన కడుపులో ఉన్నది ఓ మగబిడ్డ అని, అతడు ఏదో ఒకరోజు ఆంధ్రప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనే ఉన్నతపదవి చేపడతాడని ఏ సోదెమ్మ అమ్మకు చెప్పలేదు? ఊళ్లో ఉండే అందరు ఇతర మహిళల్లాగే అమ్మ కూడా ఎలాంటి వైద్య సదుపాయం లేకుండా నాకు జన్మనిచ్చేందుకు మరణం అంచులదాకా వెళ్లి తిరిగివచ్చింది.
నన్ను నన్నుగా తీర్చిదిద్దడంలో అతి ముఖ్యపాత్ర పోషించిన ఇద్దరు వ్యక్తులు ఎవరంటే అమ్మ శ్రీమతి కాకి మాణిక్యమ్మ, నాన్న శ్రీ కాకి శోభనాద్రి అని చెప్పకుండా ఎలా ఉండగలను? నా తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాల్లో కూలినాలి చేసుకుని జీవనం గడిపే కోట్లాది మంది లాగే కడుపేదలు. ఆ రోజుల్లో వ్యవసాయం ఊళ్లోని కూలీలందరికీ ఏడాదికి 150 రోజుల దాకా, కొందరికైతే 200 రోజుల దాకా పని కల్పించేది. నిరంతరాయంగా కొనసాగే దయనీయమైన ఉపాధికి ఇంత కన్నా మంచి ఉదాహరణ ఉండదు. కొందరు మరికొన్ని వారాల పాటు పని వెతుక్కుంటూ పొరుగూళ్లకు వెళ్లేవారు. మా నాన్న తన జీవితమంతా ఓ భూస్వామి దగ్గర పాలేరుగా పనిచేశారు. పాలేరు అంటే ఓ ఏడాది పాటు పనికి కుదుర్చుకోవడం. ఏడాది తర్వాత ఆ ఏర్పాటు కొనసాగనూ వచ్చు లేదా ఎవరిదారి వారు చూసుకోవచ్చు.
అంతా నోటిమాట మీదే నడుస్తుంది. ఎలాంటి రాతకోతలు ఉండవు. 75 కిలోల ధాన్యపు బస్తాల రూపంలో జీతాలు ఇచ్చేవారు. మామూలుగా అయితే ఓ 15 బస్తాల………………………
Samkshipta Brahmana Charitra
₹250.00తెలుగు బ్రాహ్మణుల విస్తృతి, వైవిద్యం జగద్విదితం.
మూలాలన్ని ఒక్కటే అయినా వీరిలో శాఖలు అనేకం.
బ్రాహ్మణుల శాఖలు, గోత్రాలు, ప్రవరలు,ఋషులు
గోత్రపురుషుల గాధలు వీటన్నిటి సంక్షిప్త రూపం – ఈ పుస్తకం.
అక్షరక్రమంలో
గోత్రాలు, ప్రవరల పట్టిక, ఈపుస్తకంలో ఒక అనుబంధం.
బ్రాహ్మణులందరికీ ఇది అవస్యపటనీయం.
Mugdha
₹140.00ముగ్ధ
జీవితం కొందరికి విశాలమైన ఆకాశం. మరికొందరికి ఉరకల, పరుగుల, విలాసమైన సముద్రం. జీవితం కొందరికి లేత బుగ్గమీద కన్నీటి చుక్క మరికొందరికి పున్నమి వెలుగుల్లో పూలమొక్క జీవితం కొందరికి కనబడని కంటి కాటుక. మరికొందరికి సప్తస్వరాల్ని కాళ్ళకు కట్టుకున్న బంగారు పట్టీల సంజె వెలుగు.
పురుషుడికైనా, స్త్రీకయినా బతుకు నిండుసున్నా దగ్గరే ప్రారంభమవు తుంది. బాల్యం, అస్పష్టపు జ్ఞాపకాలు, పెరుగుదల, మరచిపోలేని వాతావరణం, యౌవనం, కలలు, ఆశలు, ఆకాంక్షలు, జడివానలా ముంచెత్తి, ఉక్కిరి బిక్కిరి చేసే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ఒక అధ్యాయమైతే, పెళ్ళయిన తర్వాత మరో అధ్యాయం ప్రారంభమవుతుంది… వ్యామోహం, పిల్లలు, అస్పష్టపు దారిని సరైన దారిగా మార్చుకోడానికి చేసే విశ్వ ప్రయత్నం… ఆ ప్రయత్నంలో సఫలాలు, విఫలాలు, భోగాలు, త్యాగాలు, యోగాలు, చివరికి రోగాలు, మనిషిని చివరి వరకూ అంటి పెట్టుకునే వుంటాయి. ఎన్నెన్నో మలుపులు, ఎన్నెన్నో మజిలీలు, ఎన్నెన్నో మెరుపులు, ఎన్నెన్నో మలు……………..
Heart Prints
₹200.00హార్ట్ ప్రింట్స్
దయగల చూపు
అమెరికన్ కథ
జాన్ అప్ డైక్ ఆ వసంతంలో అకస్మాత్తుగా సుత్తితో కొట్టే చప్పుడు వినిపించసాగింది. ఓ అరడజనుసార్లు సుత్తితో కొట్టాక బండ గొంతు లోంచి వచ్చే బాణీ కాని, శృతి కాని లేని శబ్దం పాటలా వినిపించసాగింది.
బేర లో సౌకర్యంగా ఉన్న, కాంతివంతమైన ఆ గదిలోని కొందరు సైనికులు ఆ శబ్దానికి చెవులు మూసుకున్నారు. అక్కడికి వచ్చిన ఓ యువకుడు ఓ రాజశాసన పత్రాన్ని వాళ్ళకి చూపించాడు.
“నువ్వేనా? ఆ కూనిరాగం తీసేవాడి దగ్గరకి వెళ్ళు.” దాన్ని చదివిన అధికారి సూచించాడు.
“నువ్వు రాజు గారి సైన్యంలో కొత్తగా చేరావు. నిన్నో ఉద్యోగానికి ఎంపిక చేసారని విన్నాను. డీషియస్ ఎస్కులస్ పేరు ఎప్పుడైనా విన్నావా?” అతను ప్రశ్నించాడు.
“నిపుణుడు అని పిలిచేది అతన్నే అని విన్నాను. అతని గురించేనా మీరు అడిగేది?” ఆ యువకుడు అడిగాడు……….
God Gift
₹220.00గాడ్ గిఫ్
అది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని నెక్కల్లు గ్రామం. ఆ గ్రామ సరిహద్దుల్లోని సమాన ఉపరితల ‘పొలాలు. ఒకచోట జీప్ ఆపి దిగాడు అజాతశతృ.
ఎదురుగా స్వీడెన్ దేశపు ఒక పాత ఓల్వో బస్. ‘ఇరవై ఆరేళ్ళ బలిష్టమైన యువకుడు అజాతశతృ. స్పురద్రూపి. జీప్ దిగిన అజాతశతృ బస్ డోర్ తెరుచుకుని
ఓల్వో బస్లో ప్రవేశించాడు. నిజానికి ప్రస్తుతం అది బస్ కాదు. ‘అజాతశతృ నివసించే గృహం. ఇరవై అడుగుల పొడవు పన్నెండు ‘అడుగుల వెడల్పు ఉన్న ఆ బస్లో సీట్లన్నీ పీకేసి తన లివింగ్ హెూమ్ గా మార్చుకున్నాడు. కిచెన్, పడగ్గది, లివింగ్ రూం యిలా కంఫర్టబుల్ గా మార్చుకున్నాడు……………..
Gali Poralu
₹250.00నివురుగప్పుకున్న (కథలు) నిప్పులు మధురాంతకం నరేంద్ర
చలికాలపు తెల్లవారుజాముల్లో మంచు కురుస్తున్నప్పటి మసక వెలుతుర్లూ, నిద్రకూ మెలకువకూ మధ్యలో వుండే సుషుప్త సమయాలూ, నిన్న కాసిన యెండ జ్ఞాపకాలూ, చావుకూ బతుక్కూ మధ్య వేలాడే సన్నటి తెరలూ, రాత్రి తలలో తురుముకున్న మల్లెల వాసనల్ని మోసుకొచ్చే వుదయాలూ, చలిలో నానిన నిద్రలేని ముఖాలూ, దుప్పటి మడతల మధ్య లోయలోకి జారిన నక్షత్రాల్లా మినుకుమినుకుమనే ముక్కు పుల్లలూ, నిద్రమత్తులో వుంటే చెవుల్లోకి దూరీదూరని మాటలూ, గాలిలోకి తెరుచుకునే కళ్ళపైన కమ్ముకునే నీడలూ, వులిక్కిపడేలా నిద్రలోంచి లేపేసే కలవరింతలూ, మోటారు వాహనాల రొదల్లోంచీ ముక్కలై విరిగిపడే సంభాషణలూ, చెమటకు తడిసి కనిపించీ కనిపించకుండా మిగిలే బొట్లూ, మసక వెలుతుర్లో తేరిపారజూస్తేగాని కనిపించని మనుషులూ, పొద్దువాలే సంధ్యాసమయాల్లో దాగిపోయే నవ్వులూ, సగం తెరిచిన తలుపుల వెనక తారట్లాడే చీకట్లు, కూలినగోడలూ పిచ్చిమొక్కల వెనక దాక్కునే పురాతన మహిడీలూ వెరసి అజయ్ ప్రసాద్ కథలనిండా నిప్పుల్ని దాచేసే నివురులే దోబూచులాడుతూవుంటాయ్.
తెల్లగా కప్పేసిన బూడిదకింద యెర్రెర్రని నిప్పుకణికలు మండుతూనే వున్నాయని తెలుసుకోవడం కష్టం. సనసన్నగా పలచగా వస్తున్న పొగల్ని చూసి అక్కడ నిప్పు ఆరిపోయిందని భ్రమలో పడిపోతాం. చేతనకూ, అచేతనకూ మధ్య వెంట్రుక కంటే సన్నగావుండే వుపచేతనే మనిషి వ్యక్తిత్వాన్ని నిర్దేశించినట్టుగానే నిప్పును కప్పిన…………
Dooram
₹230.00రచయితది హైద్రాబాద్. అభిమాన పాఠకురాలిది వైజాగ్.
వ్యక్తిగత సమాచార మార్పిడికి ఉత్తరాలే ప్రధాన ఆధారమైన సంవత్సరం అది. 1976.
అభిమాని, రచయితల మధ్య ఆరంభమైన ఉత్తరాలు చివరికి వారి పెళ్ళికి ఎలా దారి తీసాయి? ఆ ఉత్తరాల్లో ఏం రాసుకున్నారు?
ఒకరితో మరొకరికి ముఖపరిచయం కూడా లేని వారి సంబంధం పెళ్ళి దాకా ఎలా వెళ్ళింది?.
ఈ ప్రేమ నవలంతా కేవలం ఉత్తరాల ద్వారానే నడవడం విశేషం.
ఆంధ్రభూమి వీక్లీకి మీ అభిమాన రచయిత మల్లాది తొలుత రాసిన ఈ రొమాంటిక్ సస్పెన్స్ సీరియల్ ద్వారా పాఠకులని ఆకట్టుకుని తర్వాత ధర్మయుద్ధం, ఈ గంట గడిస్తే చాలు లాంటి ఎన్నో నవలలని అందించారు.
షరా : ఇతరుల ఉత్తరాలు చదవడంలోని ఆనందం, వాటికి సమాధానాలు ఇవ్వనవసరం లేదు.
ఈ నవలతో పాటు మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ఒకటి ఒంటరి అంకె అనే నవల కూడా ఉంది.
చదవండి! చదివించండి!!
25 Va Ganta! !
₹150.00స్వీయ అస్తిత్వ ఆవిష్కరణ నుంచి మూలాల అన్వేషణ వరకు
పాఠకుల పఠనానుభవం రచయిత రచనానుభవం కలిసే ఉమ్మడి క్షేత్రం వొకటి సాహిత్యతలంలో వుంటుంది. అక్కడ రచయితా పఠితా వొకరికొకరు సన్నిహితమౌతారు. సామీప్యాన్ని అనుభూతి చెందుతారు. భావాలు వినిమయం చేసుకుంటారు. దృక్పథాల్ని పంచుకుంటారు. ఒకరి మనస్సుని మరొకరు స్పృశిస్తారు. రచన మాధ్యమంగా వొక సంభాషణకు పూను కుంటారు. ఒక చైతన్యధార వొకరి నుంచి మరొకరికి ప్రవహిస్తుంది. నిజానికి రచన యేదైనా రచయిత తన పాఠకులతో యెదురెదురుగా కూర్చుని చేసే సంభాషణే. కాల్పనిక సాహిత్యంలో ఆ సంభాషణ సంవాదంగానో ప్రవచనం గానో మారకుండా దాన్ని కళాత్మక వ్యక్తీకరణగా రూపొందించటంలో రచయిత అనేక వ్యూహాలతో ముందుకు రావడం చూస్తాం. అదే ఆ రచనలో శిల్పంగా భాసిస్తుంది. ఆ యా స్థల కాలాలకు లోబడి పాఠకులకు చేరువ కావడానికి రచయిత యెంచుకుని నిర్మించుకునే సాధనం అది. నిర్దిష్ట జీవిత అనుభవాల్ని సాధారణీకరించడం ద్వారా వాస్తవాన్ని కాల్పనీకరించడం ద్వారా పాఠకుల్ని రచనలో తాదాత్మ్యం చేసే రసవిద్య అది. దాని రహస్యం. తెలుసుకోడానికి చేసే ప్రయత్నం నిరంతరం జరుగుతూనే వుంటుంది. “మీ టూ” కథాసంకలనంలో ఉమా నూతక్కి ‘మిట్టమధ్యాహ్నం నీడ’ కథ వచ్చినప్పుడు దాని నిర్మాణంలో చూపిన నైపుణ్యంతోపాటు వ్యక్తీకరణలో……………
9 Gantalu
₹250.00ప్రారంభానికి ముందు రాజమండ్రి సెంట్రల్ జైలు.
ఆ సాయంత్రం జైలు ఆవరణలో ఖైదీలకి సిటీస్ ఎం.ఎం. ప్రొజెక్టర్, నర్తనశాల సినిమాని చూపిస్తున్నారు.
అంతా సినిమాని ఆసక్తిగా చూస్తున్నా ఇద్దరు మాత్రం ఆ సినిమాని చూడటంలేదు. పక్క పక్కనే కూర్చుని రహస్యంగా ఒకరితో మరొకరు గుసగుసలాడుకుంటున్నారు.
ఇద్దరిలో ఎక్కువ వయసున్న వ్యక్తి పేరు అంబాజీరావు. బేంక్ దోపిడీ నేరంమీద ఆయన శిక్షని అనుభవిస్తున్నాడు.
రెండో వ్యక్తి పేరు మునిస్వామి. అతను అమలాపురం నించి బయలుదేరిన ఓ లారీని తణుకు దగ్గర ఆపి అందులోని డ్రైవర్, క్లీనర్లని కొట్టి, కట్టేసి లారీలోని సరుకుని దోచుకున్న నేరానికి శిక్షపడి వచ్చి నాలుగు రోజులే ఐంది.
అంతకుమునుపు మునిస్వామి, అంబాజీరావు కలసి అదే జైల్లో రెండు, మూడుసార్లు శిక్ష అనుభవించారు. ఆ ముఖపరిచయంతో ఒకరికొకరు దగ్గరయ్యారు.
“ఇంపీరియల్ బేంక్ లో దొంగతనం చేయడం అంత తేలికా?” అంబాజీరావు అడిగాడు.
“అవును. అశోక్ నగర్ బ్రాంచ్ గురించి, అక్కడి ఉద్యోగస్తుల గురించి చాలా సమాచారం సేకరించాను. బేంక్ లో పనిచేసే ఉద్యోగస్తుల తల్లితండ్రులు, బంధువులు ఎవరు ఎక్కడెక్కడున్నారో వివరాలు నా దగ్గర ఉన్నాయి. మనం దొంగతనం చేద్దామనుకున్న రోజు బేంక్స్టాఫ్ తక్కువ మంది ఉండటానికి అనువుగా, ముందురోజు ముగ్గురు, నలుగురు |……..