Thank you for visiting, save on your next order with the code
WELCOME20
TELUGU BOOK STORE ONLINE SHOPPING
ప్రముఖ కవి, రచయిత నందిని సిధారెడ్డి (Nandini Sidhareddy)కి ప్రతిష్టాత్మ కమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయన రచించిన అనిమేష కవితా సంపుటికి ఈ పురస్కారాన్ని ప్రకటిస్తున్నట్లు అకాడమి తెలిపింది. కరోనా (Corona) కాలంలో నెలకొన్న కష్టాలను, సామాజిక స్థితిగతులను, ప్రజల జీవనాన్ని అనిమేషలో సిధారెడ్డి కంటికి కట్టినట్టుగా కవిత్వీకరించారు. తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమి తొలి ఛైర్మన్ (Chairman)గా సిధారెడ్డి వ్యవహరించారు. అంతకుముందు మంజీరా రచయితల సంఘాన్ని (Manjira Writers Association) స్థాపించి తెలుగు సాహిత్యాభివృద్దికి కృషి చేశారు. తన రచనల ద్వారా తెలంగాణ సంస్కృతిని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. ఆధునిక తెలుగు కవిత్వంపై ఆయన ఎన్నో పరిశోధనలు చేశారు. సిధారెడ్డికి అత్యున్నత పురస్కారం లభించడం పట్ల రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు సాహితీవేత్తలు, రాజకీయ నాయకులు హర్షం ప్రకటించారు.

